న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత హర్షవర్ధన్ను బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వ్యతిరేకించినా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు హడావుడిగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ చాలాకాలంగా సీఎం అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని నెలలుగా బీజేపీ నాయకత్వం ఈ అంశంలో డోలాయమానంలో కొనసాగింది. చివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్
Published Thu, Oct 24 2013 2:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement