న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు క్రైమ్బ్రాంచి నుంచి తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ అయింది. దర్యాప్తులో అంతరాయం ఉండకుండా ఉండేందుకు ఈ కేసును తిరిగి దక్షిణ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసినట్లు శనివారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే, దక్షిణ ఢిల్లీ పోలీసులు నమోదు చేసుకున్న ఈ కేసును తొలుత క్రైమ్బ్రాంచ్కు ఎందుకు అప్పగించారన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం కరువైంది.