విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు | Kingfisher Airlines in talks with an investor, says Vijay Mallya | Sakshi
Sakshi News home page

విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు

Published Wed, Sep 25 2013 2:40 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు - Sakshi

విదేశీ ఇన్వెస్టర్‌తో కింగ్‌ఫిషర్ చర్చలు

బెంగళూరు: రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూతపడ్డ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌లో వాటాను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ చైర్మన్ విజయ్ మాల్యా మంగళవారం చెప్పారు. ఇందుకు వీలుగా ఓ విదేశీ ఇన్వెస్టర్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్ పేరు వెల్లడించలేదు. రానున్న మూడు నెలల్లో ఈ అంశం ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు. యూబీ గ్రూప్ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా మాల్యా ఈ విషయాలను వెల్లడించారు. వాటా విక్రయ విషయమై గతంలోనూ కొన్ని కంపెనీలతో చర్చలు జరిపినప్పటికీ సఫలంకాలేదని చెప్పారు.

కాగా, మరోవైపు 100 మంది కింగ్‌ఫిషర్ ఉద్యోగులు బుధవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. గత 14 నెలలుగా జీతాలు చెల్లించకపోగా, ఈ విషయంపై యాజమాన్యం తగిన రీతిలో స్పందించడంలేదని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. తలకు మించిన రుణాలు, నష్టాల భారంతో గతేడాది అక్టోబర్‌లో కంపెనీ మూతపడ్డ విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement