న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 80 శాతం శారీరకంగా దెబ్బతిన్న బాధితుడికి రూ.69 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వాహన ప్రమాదాల పరిష్కార సంస్థ గురువారం ఆదేశించింది. ఈ మేరకు ప్రమాదం చేసిన ట్రక్కుకు ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు రూ.69 లక్షలను బాధితుడు మనోజ్ జైన్కు చెల్లించాలని ఆదేశించింది. 2008, డిసెంబర్ 20న లజపత్ నగర్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మనోజ్ జైన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్కు 80 శాతం గాయాలయ్యాయి. ఈ కేసులో నంబర్ 1 గా ఉన్న ట్రక్కు డ్రైవర్ దే బాధ్యతని ట్రిబ్యునల్ పేర్కొంది.దీనికి గాను ట్రక్కు వచ్చే మొత్తం ఇన్సూరెన్స్ ను బాధితుడికి చెల్లించాలని తెలిపింది.