Tribunal
-
అనుసంధానం అడుగు పడేదెలా?
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక నదిలో మిగులు జలాలను లభ్యత తక్కువగా ఉన్న మరో నదికి మళ్లించడానికి.. ఆ నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన ఉన్న రాష్ట్రాలు అదనంగా నీటిని కేటాయించాలంటూ పట్టుబడుతున్నాయి. ఇందుకు గోదావరి, మహానది ట్రిబ్యునళ్ల అవార్డులను అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.దీంతో నదుల అనుసంధానం సాధ్యం కావడంలేదు. ఇది సాకారం కావాలంటే న్యాయపరంగా అడ్డంకులను తొలగించుకోవడంతోపాటు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. ఇదే పెద్ద సవాల్. గోదావరి నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గోదావరి ట్రిబ్యునల్.. ఇందుకు బదులుగా కృష్ణా బేసిన్లో ఎగువన ఉన్న మహారాష్ట్రకు 14, కర్ణాటకకు 21, సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకొనే వెసులుబాటు కల్పించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలన ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే కృష్ణా బేసిన్లో అదనపు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. ఈ నీటి వాడకానికి మహారాష్ట్ర, కర్ణాటక తొమ్మిదేళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించాయి. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను విభజనానంతరం రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం అప్పగించింది. గోదావరి – కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కృష్ణా నది మీదుగా ఈ అనుసంధానం చేపడుతున్నందున, కృష్ణా జలాల్లో తమకు అదనంగా కేటాయింపులు చేయాలని మహారాష్ట్ర, కర్ణాటక పట్టుబడుతున్నాయి. కావేరి బేసిన్కు గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో కావేరి జలాల్లో అదనపు కోటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ పట్టుబడుతున్నాయి. దీన్ని కృష్ణా, కావేరి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో గోదావరి– కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయ సాధన సవాల్గా మారింది. ఇదొక్కటే కాదు.. ద్వీపకల్ప భారతదేశంలో ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన 15 అనుసంధానాలపై ఏకాభిప్రాయ సాధన సాధ్యమయ్యే అవకాశమే లేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడం కోసం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కొత్తగా విధి విధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్) జారీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించారని గుర్తు చేస్తూ.. మళ్లీ కొత్తగా విధి విధానాలు జారీ చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయంగా, అక్రమంగా కొత్తగా జారీ చేసిన విధి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని.. దాని ద్వారా న్యాయబద్ధంగా హక్కుగా రాష్ట్రానికి దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటికే ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1976లో 811 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగా 2015 జూలై 18–19న ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ చేసిన తాత్కాలిక సర్దుబాటుపై రెండు రాష్ట్రాల సీఎస్లు సంతకాలు చేశారు. కృష్ణా నది జలాలను పంపిణీ చేయడానికి 2004లో ఏర్పాటైన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి నివేదిక, 2013లో తుది నివేదిక కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ఆ రెండు నివేదికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీలు దాఖలు చేయడంతో వాటిపై స్టే ఇచ్చింది. దాంతో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రం నోటిఫై చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే కేంద్రం కట్టబెడుతూ దాని గడువును పొడిగించింది. విభజన చట్టంలో సెక్షన్–89లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాలలో ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే నియమావళిని రూపొందించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం విధి విధానాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకే నీటి పంపిణీపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2016 నుంచి విచారణ జరుపుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ కృషి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీటిని వదులుకోబోమని, అన్యాయంగా చుక్క నీటిని వాడుకోబోమని తేల్చి చెప్పారు. సెక్షన్–3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి శాఖకు 2021లో లేఖ రాయగానే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చట్టబద్ధంగా ట్రిబ్యునల్ కేటాయించిన జలాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు కొత్త విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఈ నెల 4న ఆమోదం తెలపడం అశాస్త్రీయమని, దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల తదుపరి చర్యలను నిలిపేసి రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే రోజున ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్షాతో సమావేశమై ఇదే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధి విధానాలను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ తప్పుడురాతలు అచ్చేస్తున్నారు. వారి విషపురాతలను ప్రజలు నమ్మరు. టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోరు. పవన్ కళ్యాణ్, లోకేశ్ పొలిటికల్ బఫూన్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయా పార్టీల వారికే తెలియక జట్టు పీక్కుంటున్నారు. పెడనలో ఎన్డీయే నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్.. ముదినేపల్లికి వచ్చే సరికి మాట మార్చారు. జైలులో చంద్రబాబును ములాఖత్లో కలిసి బయటకొచ్చాక.. చంద్రబాబు అవినీతిని ఇంటింటా ప్రచారం చేస్తానని లోకే‹శ్ ప్రకటించారు. అందుకే వారిద్దరినీ పొలిటికల్ బఫూన్లుగా ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపితమైంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉన్న చంద్రబాబును కలిశాక టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారంటే.. ఆయన అవినీతిలో ఈయనకు వాటా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బలహీనపడ్డ టీడీపీ తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి చతికిలపడింది. అవనిగడ్డ, పెడన, ముదినేపల్లిలలో పవన్ సభలు అట్టర్ ఫ్లాప్ కావడమే అందుకు నిదర్శనం. టీడీపీతో పొత్తు ప్రజలెవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన బలహీన పడిందన్న వాస్తవాన్ని పవన్ తెలుసుకోవాలి. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్కు జి.భూపాల్రెడ్డి చైర్మన్గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
రూ.2 కోట్ల భారీ నష్టపరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ గౌతమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీలోని రోహిణి మార్గ్లో 2019 మే 31న రోడ్డు పక్కన నడుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ మర్నాడు జూన్ 1న మరణించారు. అయితే బాధితుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన వాదనలను ట్రిబ్యునల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు 2 కోట్ల 50 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ సర్కారు పదే పదే తొండాట ఆడుతోంది. పరిష్కారమైన అంశాన్ని, అవాస్తవాలను వల్లె వేస్తూ వివాదాన్ని రాజేస్తోందని నీటి పారదుల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) కేటాయిస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం చేసింది. ఆనాటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ సమక్షంలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను మళ్లీ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే కేంద్రం అప్పగించింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకు ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో సర్వ సభ్య సమావేశంలో చర్చించి తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం చెప్పింది. అయితే, తాత్కాలిక సర్దుబాటు ఒప్పందానికి అంగీకరించిన తెలంగాణ ఆ తర్వాత ప్రతి నీటి సంవత్సరం ప్రారంభంలో కృష్ణా జలాల్లో సగ భాగం కావాలంటూ వివాదాన్ని రాజేస్తోంది. బుధవారం జరిగిన కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశంలోనూ అదే డిమాండ్ను తెరపైకి తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీవి విచారిస్తున్న క్రమంలో మార్చి 24న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం కృష్ణా జలాల పంపిణీలో తమ పరిధి పరిమితమని చెప్పింది. నిర్దిష్టంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల జోలికి వెళ్లబోమని సంకేతాలిచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించింది. తద్వారా నీటి లభ్యత 75 శాతం ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను మినహాయించి, 65 శాతం లభ్యత ఆధారంగా తాము అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపైనే విచారిస్తామని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్ను ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?
సాక్షి, అమరావతి: ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) రద్దు తరువాత అక్కడి ఉద్యోగులు డిప్యుటేషన్పై హైకోర్టులో పనిచేస్తుండగా, తమను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. హైకోర్టులో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఏటీ ఉద్యోగులను ఇతర శాఖలకు పంపాలనుకోవడం సరైన చర్యకాదని అభిప్రాయపడింది. వారు గతంలో కొద్దికాలం తమ వద్ద పనిచేశారని, కాబట్టి వారు తమ వద్దే పనిచేయడం సబబని తెలిపింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. హైకోర్టును సంప్రదించకుండా ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ విషయంలో లేఖ రాయడం తప్పేనన్నారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఆ లేఖను ఇప్పటికే ఉపసంహరించుకున్నామని ఆయన కోర్టుకు నివేదించారు. అయితే, ఏపీఏటీ ఉద్యోగులు హైకోర్టులో పనిచేయడానికి నిబంధనలు అంగీకరించవని, ఈ విషయంలో హైకోర్టుతో ప్రభుత్వాధికారులు చర్చలు జరుపుతున్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. కోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగుల బదిలీ ప్రక్రియను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సిబ్బంది లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యం హైకోర్టులో పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులను వివిధ శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల హైకోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయంటూ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. హైకోర్టులో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఏపీఏటీ ఉద్యోగులు తమను ఇతర శాఖల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి నేరుగా లేఖ రాయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది క్రమశిక్షణారాహిత్యమేనని తెలిపింది. మరోవైపు.. హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్కు డిప్యుటేషన్పై వెళ్లిన ఓ ఉద్యోగి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, ఆమె అక్కడే కొనసాగించేందుకు దయతో అనుమతినివ్వాలన్న ఆ ఉద్యోగిని తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తాము దయతో కాకుండా కేసులో ఉన్న దమ్మును బట్టి ఉత్తర్వులిస్తామంది. హైకోర్టులో చాలామంది ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ వెళ్తున్నారని, జడ్జీలు కూడా వెళ్తున్నారని, ఇలా అందరూ హైదరాబాద్కు వెళ్తే విజయవాడలో ఎవరుంటారని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. (చదవండి: ‘ఆపద్బాంధవి’ మరింత బలోపేతం.. మరిన్ని 108 అంబులెన్స్లు) -
ఎలక్ట్రిక్ వాహనాలు: హీరో మోటోకు భారీ ఊరట
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్స్కు భారీ ఊరట లభించింది. హీరో ట్రేడ్ మార్క్ వివాదంపై విజయం సాధించింది. తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'హీరో' ట్రేడ్మార్క్ను ఉపయోగించుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తుది పరిశీలన చేసిన తర్వాత ట్రైబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించిందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈమేరకు హీరో గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా సమాచారమిచ్చింది. ట్రేడ్ మార్క్ వినియోగానికి సంబంధించి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా, ఇందర్మీత్ కౌర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ అనుకూలంగా తీర్పునిచ్చిందని హీరో మోటో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏథెర్ ఎనర్జీ వ్యాపారంపై హీరో మోటో కార్ప్ 400 కోట్ల పెట్టుబడులు, గత 10 ఏళ్లలో హీరో బ్రాండ్ గుడ్ విల్, రిపుటేషన్ బిల్డింగ్పై దాదాపు రూ. 7వేల కోట్ల వెచ్చించిన విషయాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించిందని కంపెనీ పేర్కొంది. అయితే హీరో ఎలక్ట్రిక్ ప్రమోషన్ కోసం నవీన్ ముంజాల్ గ్రూప్ రూ.65 కోట్లు పెట్టుబడి పెట్టిందట. 'హీరో' బ్రాండ్పై తమకే ప్రత్యేక యాజమాన్య హక్కులు ఉన్నాయని పేర్కొంటూ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్తో న్యాయ పోరాటం చేస్తున్నారు నవీన్ ముంజాల్. ఈ క్రమంలోనే హీరో బ్రాండ్ నేమ్తో హీరో మోటో కార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ హీరో ఎలక్ట్రిక్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. నవీన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. కాగా జూలైలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాలనుక్ను హీరో మోటో కార్ప్ ఈ సంవత్సరం పండుగ సీజన్కు దీన్ని వాయిదా వేసింది. -
కర్నూలులో వద్దని ఏ చట్టంలోనైనా ఉందా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ను ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని వక్ఫ్బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. జీవో 16ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్బాబు వాదనలు వినిపిస్తూ, సీఎం ఆదేశాల మేరకే కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పా టు జీవో వచ్చిందన్నారు. ఇది మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధమని చెప్పారు. దీనిని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నా రు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ, కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయన్నారు. అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు. ఇందులో ముఖ్యమంత్రి పేరు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ వివరాలతో చిన్న అఫిడవిట్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. -
సహారాకి షాక్ ! సెబీకి రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయండి!
న్యూఢిల్లీ: రెగ్యులేటరీ నిబంధనావళిని ఉల్లంఘించి దాదాపు రూ.14,000 కోట్ల వసూలు కేసులో సహారా గ్రూప్ సంస్థ, ఆ సంస్థ డైరెక్టర్లకు శాట్లోనూ పూర్తి ఊరట లభించలేదు. మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఎస్క్రో అకౌంట్లో రూ.2,000 కోట్లు డిపాజిట్ చేయాలని సహారా గ్రూప్ సంస్థ– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ (ఎస్ఐసీసీఎల్), ఆ సంస్థ మాజీ డైరెక్టర్లను సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. ఇందుకు నాలుగువారాల గడువు మంజూరు చేసింది. ఈ నిధుల డిపాజిట్ తర్వాతే గ్రూప్ కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా సెబీ రికవరీ ఆఫీసర్ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. శాట్ ఆదేశాలు జారీ చేసిన డైరెక్టర్లలో గ్రూప్ చైర్మన్ సుబ్రతారాయ్ కూడా ఉన్నారు. ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టీకరణ ఆస్తులు, తదితర వివరాలు కూడా సెబీకి సుబ్రతారాయ్ అఫిడవిట్ రూపంలో అందజేయాలని శాట్ ఆదేశించింది. ‘‘భారతదేశం, అలాగే విదేశాలలో ఉన్న అన్ని ఆస్తులు, అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాల పూర్తి జాబితాను, మ్యూచువల్ ఫండ్స్/షేర్లు/సెక్యూరిటీలను (భౌతికంగా లేదా డీమ్యాట్ రూపంలో) సెబీకి నాలుగు వారాల్లోగా అందజేయాలని మేము మొదటి అప్పీలుదారు– సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్, రెండవ అప్పీలుదారు– సహారా ఇండియాలను ఆదేశిస్తున్నాము’’అని శాట్ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. ఇరువురికి ఊరట... కాగా, వృద్ధాప్యం, అత్యవసర వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అప్పటి డైరెక్టర్లు ఇరువురు– ఏఎస్ రావు, రనోజ్ దాస్ గుప్తాలకు వ్యతిరేకంగా జారీ అయిన జప్తు ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని సెబీ రికవరీ ఆఫీసర్ను శాట్ ఆదేశించింది. కేసు వివరాలు ఇవీ... ఎటువంటి రెగ్యులేటరీ నిబంధనలు పాటించకుండా దాదాపు 2 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి ఐచ్ఛిక పూర్తి కన్వర్టబుల్ డిబెంచర్ల (ఆప్షనల్లీ ఫుల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లు) ద్వారా 1998 నుంచి 2009 మధ్య ఎస్ఐసీసీఎల్ ఈ నిధులు సమీకరించిందన్నది ఈ కేసులో సహారా గ్రూప్ సంస్థ, కంపెనీ అప్పటి డైరెక్టర్లపై ఆరోపణ. కంపెనీ వసూలు చేసిన రూ.14,000 కోట్లను 15 శాతం వార్షిక వడ్డీతోసహా రిఫండ్ చేయాలని ఎస్ఐసీసీఎల్, ఆ కంపెనీ ఒకప్పటి డైరెక్టర్లను 2018 అక్టోబర్లో సెబీ ఆదేశించింది. అలాగే ఇతర సంస్థలతో భాగస్వామ్యాల నుంచి కూడా ఎస్ఐసీసీఎల్ను, ఆ సంస్థ డైరెక్టర్లను సెబీ నిషేధించింది. ఈ కేసుకు సంబంధించి 2021 ఏప్రిల్లో సెబీ రికవరీ ఆఫీసర్ ఎస్ఐసీసీఎల్కు, కంపెనీ అప్పటి డైరెక్టర్లకు డిమాండ్ నోటీస్ జారీ చేశారు. రూ.14,106 కోట్లు 15 రోజుల్లో డిపాజిట్ చేయకపోతే రికవరీ ప్రక్రియ తప్పదని స్పష్టం చేశారు. డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్ 2021న జప్తు ఉత్తర్వులుజారీ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, డీమ్యాట్ అకౌంట్లు తదితర వారి ఆస్తుల అన్నింటి జప్తునకు బ్యాంకులు తత్సబంధ అధికారులకు జప్తు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సహారా శాట్ను ఆశ్రయించింది. చదవండి: రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ! -
కేంద్రం దృష్టికి కొత్త ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయిన నేపథ్యం లో కొత్త ట్రిబ్యునల్ను త్వరితగతిన ఏర్పాటు చేసి, రాష్ట్రానికి న్యాయమైన నీటి హక్కులు దక్కేలా చూడాలని విన్నవించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందులో మరోమారు ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా 2014లోనే లేఖ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను వివరిం చింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటా యింపులు ఏమాత్రం సరిపోవు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లో పరివాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్కు 512.04 టీఎం సీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో పేర్కొంది. స్పందించని కేంద్రం రాష్ట్రం చేసిన అభ్యర్థనపై చట్ట ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుండగా గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్చే విచారణ చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణ డిమాండ్ను అంగీకరిస్తామంటూనే... సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం.. కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్టే పిటిషన్ను వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ మేరకు రిట్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు నాలుగు నెలల కిందట ప్రభుత్వం పిటిషన్ పెట్టుకుంది. సుప్రీం ఓకే చెప్పడంతో.. సుప్రీంకోర్టు బుధవారం ఉపసంహరణకు ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్రం నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితితో తుదితీర్పు వెలువడేలా చూడాలని లేఖలో కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయింపులు 500 టీఎంసీలకు పెరగాల్సి ఉందన్న విషయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. చదవండి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు తుది అంకానికి చేరింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ట్రిబ్యునల్ను కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వక్ఫ్ భూముల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి ఏపీకి వాటాగా రావాల్సిన సిబ్బందిని కేటాయించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో హైదరాబాద్ ట్రిబ్యునల్లో పనిచేస్తున్నవారిలో తెలంగాణకు 60 శాతం, ఏపీకి 40 శాతం చొప్పున కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ మరో 15 రోజుల్లో కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే జిల్లా జడ్జిని న్యాయాధికారి (ప్రిసైడింగ్ ఆఫీసర్)గా నియమించడం ద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది. ఇదంతా పూర్తి కావడానికి నెల నుంచి రెండు నెలలు పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వక్ఫ్ భూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం.. వక్ఫ్ భూములు, వాటి వివాదాలను త్వరితగతిన విచారించి పరిష్కరించడంలో ట్రిబ్యునల్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. చంద్రబాబు తన పాలనలో ఈ అంశంపై పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా హైదరాబాద్లోని వక్ఫ్ ట్రిబ్యునల్కే ఏపీ కేసులనూ పంపిస్తున్నారు. అయితే అక్కడ విచారణ వేగంగా జరగడం లేదు. ఫలితంగా ఏపీకి చెందిన వక్ఫ్ భూముల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 450 కేసుల వరకు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇందుకు అవసరమైన చర్యలను మైనార్టీ సంక్షేమ శాఖ వేగవంతం చేసింది. -
అమెజాన్-ఫ్యూచర్-రిలయన్స్ కేసు! విచారణ వాయిదా ఎందుకంటే..
Amazon-Future-Reliance Case ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించనుంది. న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్-అమెజాన్ కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు గురువారం ఈ వివాదం విచారణకు వచ్చింది. అయితే ఇదే కేసుపై జూలై 12న నుంచీ సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ జరపనుందని, ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి ఫ్యూచర్స్ తరఫు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయంలో తనకూ అభ్యంతరం ఏదీ లేదని అమెరికా ఈ కామర్స్ దిగ్గజం– అమెజాన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియన్ కూడా పేర్కొనడంతో కేసు తదుపరి విచారణను 20కి వాయిదావేస్తూ బెంచ్ నిర్ణయం తీసుకుంది. వివాదంలో రూ.24,713 కోట్ల డీల్.. రిలయన్స్కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ నుంచి అమెజాన్కు వ్యతిరేక రూలింగ్స్ వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును అమెజాన్ ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఇదే కేసు సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) కూడా విచారించనుంది. -
కొత్త ట్రిబ్యునల్పై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్కుమార్కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. -
డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (2016 నవంబర్లో డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన గృహిణులకు సంబంధించి ఎటువంటి పరిశీలన అవసరం లేదని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ ఏటీ) ఆగ్రా బెంచ్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని అసెస్సీ ఆదాయంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఇదే మాదిరి అన్ని కేసులకూ వర్తిస్తుందని తేల్చింది. గ్వాలియర్కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016–17 ఏడాదికి రూ.1,30,810 ఆదాయంగా పేర్కొం టూ ఐటీ రిటర్ను దాఖలు చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత రూ.2,11,500 పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. దీంతో ఈ కేసును పరిశీలన కోసం ఆదాయపన్ను శాఖ తీసుకుంది. భర్త, పిల్లలు, బంధువులు ఇవ్వగా పొదుపు చేసుకున్న మొత్తం ఇదంటూ ఆమె ఆదాయపన్ను శాఖ పరిశీలన అధికారికి వివరించారు. కానీ, దీన్ని ఆదాయపన్ను శాఖ అంగీకరించలేదు. వివరణలేని ధనంగా తేల్చింది. దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆమె ఆశ్రయించారు. చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?! -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
-
జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: భూవివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూవివాదాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యుడిగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయిలో మూడంచెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 16 వేల కేసులు పరిష్కారమయ్యే వరకు ఈ ట్రిబ్యునళ్లు పనిచేయనున్నాయి. ఆ తర్వాత అవసరాల మేరకు వీటి కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్పుస్తకాల చట్టం–2020 తీసుకొచ్చింది. ఇనామ్తో పాటు రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం–1971 రద్దయిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 16,137 కేసులను ప్రభుత్వం అప్పట్లో సీసీఎల్ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్)కు బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లకు అప్పగించింది. బదిలీ చేసిన నెల రోజుల్లోగా అన్ని కేసులను పరిష్కరించాలని ట్రిబ్యునళ్లకు గడువు విధించింది. అదనపు కలెక్టర్(రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ట్రిబ్యునల్ సభ్యుడిగా.. ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సమయంలో డీఆర్వో సభ్యుడి గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. చివరకు కలెక్టర్లకే బాధ్యతలు రిటైర్డ్ జిల్లా జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరైన ఐఏఎస్లతో ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకున్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. ఇలా కొంతమంది అధికారుల జాబితాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. చివరకు జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునళ్ల ప్రత్యేకతలు.. జిల్లా కేంద్రంలోనే కాకుండా అవసరమైతే రెవెన్యూ డివిజనల్, మండల కేంద్రాల్లో కేసుల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ సమావేశం కావచ్చు. ట్రిబ్యునళ్ల కోసం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాలి. ప్రతి కేసుకు సంబంధించిన తీర్పులను కంప్యూటరైజ్డ్ చేయాలి. కేసు పురోగతిని ట్రాక్ చేసి పరిష్కరించేందుకు వీలుగా కేసుకు సంబంధించిన మెటా డేటాను జాగ్రత్తపర్చాలి. సిస్టం ద్వారా ప్రతి కేసుకు నంబర్ కేటాయించాలి. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్పుస్తకం చట్టం–2020లోని సెక్షన్ 13లో పేర్కొన్న అధికారాలన్నీ ట్రిబ్యునల్కు సంక్రమిస్తాయి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులన్నీ ట్రిబ్యునల్కు బదలాయించాలి. చట్టం మేరకు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలవుతాయి. కేసుల పరిష్కారం అనంతరం వీటికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టరేట్లో నిబంధనల ప్రకారం భద్రపర్చాలి. -
ట్రిబ్యునల్కు భూ పంచాయితీలు
ఎస్.శ్రీనివాస్ అనే వ్యక్తి సిరిసిల్ల నివాసి. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో 1.24 ఎకరాలు ఉందని, రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండానే మరొకరి పేరిట పట్టాచేశారని ఫిర్యాదు చేశాడు. ఆర్డీవో కోర్టులో ఏడాదికి పైగా కేసు నడుస్తోంది. ఇరువర్గాల వాదనలు ఆర్డీవో విన్నారు. హియరింగ్ ముగిసింది. తీర్పు వస్తుందనే దశలో కరోనా లాక్డౌన్ వచ్చింది. కేసు వాయిదా పడింది. లాక్డౌన్ అనంతరం భూ వివాదం పరిష్కారం అవుతుందని ఇరువర్గాలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ కేసు ఆర్డీవో కోర్టులో అలాగే ఉంది. ఇలాంటి కేసులు జిల్లాలో దాదాపు 736వరకు ఉన్నాయి. వీటిల్లో జేసీకోర్టులో ఇటీవలే తీర్పులు వచ్చి హైకోర్టుకు వెళ్లిన కేసులు 20వరకు ఉన్నాయి. హియరింగ్లో 56 కేసులు ఉన్నాయి. ముస్తాబాద్(సిరిసిల్ల): ఏళ్లుగా కొనసాగుతున్న భూ పంచాయితీల సత్వర పరిష్కారానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రెవెన్యూకోర్టులో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తోంది. భూముల ధరలు పెరగడం, భూ పంచాయితీ సమస్యలతో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరగకుండా ట్రిబ్యునల్ దోహదపడేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కోర్టుల్లో 736కేసులు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా హియరింగ్ జరగడం, వాయిదాల దశలో ఉన్నాయి. కొన్ని తుదితీర్పు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా రెవెన్యూ చట్టం తీసుకురావడం, అందులో భాగంగా భూ పంచాయితీలకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు తప్పనున్న పనిభారం ప్రోటోకాల్ అమలు, రెవెన్యూ సంబంధ పనులు, ఇతర బాధ్యతలతో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లు(ప్రస్తుత అడిషనల్ కలెక్టర్లు) బీజీగా ఉంటారు. భూ సేకరణ, మంత్రులు, అధికారుల పర్యటనలు, సమావేశాలతో ఒత్తిళ్లమధ్య విధులు నిర్వహిస్తుంటారు. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వారికి సరైన సమయం, విచారణ చేసే అవకాశాలు తక్కువ. ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందని కక్షిదారులు ఆశిస్తున్నారు. రిటైర్డుజడ్జి ద్వారా ట్రిబ్యునల్ జిల్లాలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ట్రిబ్యునల్కు బదలాయింపు చేస్తారు. నూతన రెవెన్యూ చట్టం ప్రకారం రిటైర్డు జడ్జిని నియమించి కేసుల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ప్రతి వెయ్యి భూ పంచాయితీలకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కానుంది. ఈ లెక్కన జిల్లాలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఫిర్యాదులు లేని భూ వివాదాలు జిల్లాలో ఫిర్యాదులు లేని భూ సమస్యలు చాలానే ఉన్నాయి. అన్నదమ్ముల భూ పంపిణీ వివాదాలు, సరిహద్దు పంచాయితీలు, ఒకరి పేరిటా ఉన్న భూమిని మరొకరి పేరుతో పట్టా చేయడం, ఆన్లైన్లో తప్పులు, రికార్డుల్లో తక్కువ భూమి నమోదు, సర్వే నంబర్లలో తప్పులు, 1బీ రికార్డుల్లో పేరు మార్పిడి, మ్యూటేషన్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొన్ని రెవెన్యూ కోర్టుల వరకు వెళ్తే.. ఊర్లో పెద్ద మనుషుల ద్వారా మరిన్ని పంచాయితీలు నడిచేవి ఉన్నాయి. వీటన్నింటికి ట్రిబ్యునల్ పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభ జీరో అవర్లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల్లో తలెత్తే వివాదాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 323 (ఏ) కింద ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ బెంచ్ ఏర్పాటు జరుగుతుందని విజయసాయి రెడ్డి చెప్పారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో క్యాట్ ఏర్పాటు జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 50 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. అందులో 60 శాతం మంది విశాఖపట్నంలోనే పని చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో క్యాట్ బెంచ్ లేనందున పిటిషనర్లు తమ వివాదాల పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్కు ప్రయాణం చే వస్తోంది. వ్యయ ప్రయాసలతో కూడిన ప్రయాణాల వలన ఉద్యోగులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. (భూ దోపిడీపై నిగ్గు తేల్చండి) విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్, కస్టమ్స్, పోర్టు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రైల్వేస్, ఎయిర్పోర్ట్, హెచ్పీసీఎల్, ఎల్ఐసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందువలన ఉద్యోగుల సౌలభ్యం కోసం చైర్మన్, సభ్యులతో కూడిన క్యాట్ బెంచ్ను విశాఖపట్నంలో నెలకొల్పవలసిందిగా విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. (రాజ్యసభలో విశాఖ వాణి) విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలి అత్యధిక జనాభా కలిగి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలని రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఏయూలో తాత్కాలిక భవనాల్లో పనిచేస్తున్న ఐఐఎంకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. -
‘నేరడి’పై ట్రిబ్యునల్ కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసే దిశగా వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా జనవరి 10, 2020న ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా ఆదేశాలను రెండు నెలలపాటు నిలుపుదల చేయాలని ఒడిశా చేసిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది. వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుంద శర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం గతేడాది డిసెంబర్ 22 నుంచి 29 మధ్య శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా గతంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న వంశధార ట్రిబ్యునల్.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి.. మ్యాపులు తయారీ చేసి జూన్ 30లోగా ఇవ్వాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్లో ముంపునకు గురయ్యే భూములను సర్వే చేయడానికి రూ. 15.68 లక్షలు, ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించే పనులకు రూ. 5.91 లక్షల వ్యయంతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచింది. కానీ, ఒడిశా సర్కార్ సంయుక్త సర్వేకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సోమవారం ఏపీ సర్కార్ వంశధార ట్రిబ్యునల్కు వివరించింది. దాంతో.. వరదలు తగ్గాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి ఆరు వారాల్లోగా సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది రాజగోపాల్, రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ విచారణకు హాజరయ్యారు. -
ధర్మాధికారి నిర్ణయంపై అప్పీల్కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ కేఎం ధర్మాధికారి కమిషన్ తీసుకునే నిర్ణయం సరైంది కాదని భావిస్తే అప్పీల్కు రావచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఆప్షన్లు స్వీకరించి, వారి అభీష్టం మేరకే కేటాయింపులు జరపాలన్న ధర్మాధికారి కమిషన్ మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఏపీ స్థానికత గల 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను 2015 జూన్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేశాయి. అయితే రిలీవైన వారిని స్వీకరించడానికి ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంతో ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు గతంలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏకసభ్య కమిషన్ నిర్ణయమే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తాజాగా సుప్రీంకోర్టు అనుమతించడంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఊరట లభించింది. వివాదానికి కారణమైన 1,157 మంది ఉద్యోగులకే పరిమితం చేయకుండా, మొత్తం విద్యుత్ ఉద్యోగుల విభజనను మళ్లీ జరపాలని ధర్మాధికారి ఇటీవల మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర కేడర్ విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని రెండు రాష్ట్రాలను కోరారు. విద్యుత్ ఉద్యోగుల విభజనను రిలీవైన 1,157 మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలా? అందరూ ఉద్యోగులకు వర్తింపజేయాలా? అన్న అంశంపై తెలంగాణ విద్యుత్ సంస్థలు స్పష్టత కోరుతూ పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు పైవిధంగా తీర్పు వెల్లడించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిషన్ ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఆ లోగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని అధికార వర్గాలు తెలిపాయి. -
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు. జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్సీఎల్ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్సీఎల్ఏటీని ఆర్కామ్ ఆశ్రయించింది. -
పుంజులాయిడ్ దివాలాకు ఎన్సీఎల్టీ ఓకే!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్లాయిడ్కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎన్సీఎల్టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్లాయిడ్ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ ఢిల్లీ బెంచ్ అనుమతించింది. ఎన్సీఎల్టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్లాయిడ్ స్టాక్ ఎక్ఛ్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్లోనే పుంజ్లాయిడ్కు వ్యతిరేకంగా ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్ను వ్యతిరేకించారు. పుంజ్లాయిడ్కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు. -
అమరావతిలో ఎన్సీఎల్టీ బెంచ్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంచ్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేసుల భారం ప్రత్యేకించి ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ) 2016 కింద వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో కేంద్రం తెలిపింది. ఈ బెంచ్ల ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ వివాదాలు అమరావతి బెంచ్ న్యాయపరిధిలోకి వస్తుండగా, మధ్యప్రదేశ్లోని దివాలా అంశాల న్యాయపరిధి ఇండోర్ బెంచ్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వివాదాలు హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ పరిధిలోకి వెళుతుండగా, మధ్యప్రదేశ్కు సంబంధించి దివాలా వివాదాలు అహ్మదాబాద్ బెంచ్ పరిధిలోకి వస్తున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధాన బెంచ్ సహా దేశంలో ప్రస్తుతం 14 ఎన్సీఎల్టీ బెంచ్లు ఉన్నాయి. -
ఎస్సార్స్టీల్ ఇక ఆర్సెలర్ మిట్టల్దే!
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్ దివాలా కేసు పురోగతిలో అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం తొలగించింది. దీంతో ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ తరఫున దాఖలైన అత్యధిక బిడ్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది. వివరాల్లోకి వెళితే... ఎస్సార్ స్టీల్ కోసం ఆర్సెలర్ మిట్టల్ దాఖలు చేసిన రూ.42,000 కోట్ల అత్యధిక బిడ్డింగ్పై ఈ నెల 11వ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోవాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎస్సీఎల్ఏటీ) ఒక ఉత్తర్వు జారీ చేసింది. అయితే దీనిని 28 మంది ఆపరేషనల్ క్రెడిటార్స్ వ్యతిరేకించారు. ఎస్సీఎల్ఏటీ ఉత్తర్వుకు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్సీఎల్టీ తమ వాదనలు అందరివీ వేర్వేరుగా రోజూవారీ వినేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. అందరూ కలిసి ఒకే రిప్రజెంటేషన్ సమర్పించాలని ఎన్సీఎల్టీ ఆదేశించడం సరికాదని స్పష్టంచేశాయి. అయితే ఆపరేషనల్ క్రెడిటార్స్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేస్తూ, వారి ద్వారా ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లే దివాలా పక్రియను అడ్డుకుంటున్నట్లు పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది. 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటికే 571 రోజులు గడిచిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎన్సీఎల్ఏటీపై ఇక దృష్టి... కాగా ఆర్సెలర్ మిట్టల్ బిడ్డింగ్పై 11వ తేదీలోపు ఎన్సీఎల్టీ తుది నిర్ణయం ఇవ్వాలని లేదంటే 12వ తేదీన తానే ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఎన్సీఎల్ఏటీ గతంలో రూలింగ్ ఇచ్చింది. ఈ గడువు తీరడంతో ఇప్పుడు ఎన్సీఎల్ఏటీ చర్యలపై ఆసక్తి నెలకొంది. -
ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్:గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలనైనా ఇకపై ఎన్నికల ట్రిబ్యునళ్లు పరిష్కరించనున్నాయి. ఈ మేరకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు ఇతరు లు ఎవరైనా వీటి ముందు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే జూనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్గా విచారణ జరుపుతారు. అలాగే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి లేదా అధికారులు కూడా ఎన్నికల ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. 30 రోజుల్లోగా పిటిషన్... గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజులలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 30వ రోజున ట్రిబ్యునల్ తెరచి లేనిపక్షంలో ఆ మరుసటిరోజు పిటిషన్ వేసుకోవచ్చు. పిటిషనర్లు తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్తోపాటు సెక్యూరిటీ డిపాజిట్గా రూ.1,000 జమ చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని పిటిషన్లను ట్రిబ్యునల్ తిరస్కరించొచ్చు. పిటిషన్ కాపీలను ప్రతివాదికి అందజేయడంతోపాటు ట్రిబ్యునల్ నోటీస్ బోర్డులో అతికించాలి. తన ఎదుట దాఖలైన పిటిషన్లపై సీపీసీ నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితి మేరకు ట్రిబ్యునల్ విచారణ జరపాల్సి ఉంటుంది. సాక్షుల విచారణకు, ఆధారాల స్వీకరణకు ట్రిబ్యునల్కు అధికారం ఉంటుంది. సాక్షులు తాము ఎన్నికల్లో ఎవరికి ఓటేశామో తెలియజేయాల్సిన అవసరంలేదు. ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఎన్నికల పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేదు. పిటిషనర్లు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వారందరి అనుమ తితో పిటిషన్ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇతర పార్టీలకు నోటీసు జారీచేసి విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదైనా పిటి షన్ ఉపసంహరణకు అనుమతినిచ్చినప్పుడు ట్రిబ్యునల్ ఆ నిర్ణయాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ అధికారులకు తెలియజేయాలి. ట్రిబ్యునళ్ల విధులు, అధికారాలివీ.. ►పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ►ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, అతడు/ఆమె ఏజెంటు, అతడు/ఆమె ఆమోదం పొందిన ఏ వ్యక్తి అయినా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. వారి ఎన్నికను రద్దు చేయడమే కాకుండా ఆరేళ్లపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. సదరు వ్యక్తిని అంతే కాలానికి ఓటేయడానికి వీలు లేదని ఆదేశించే అధికారం కూడా ట్రిబ్యునల్కు ఉంది. ►గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పక్షంలో ఆ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల్లో అర్హులైనవారిని గెలుపొందినట్టుగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీచేయొచ్చు. -
వంశ‘ధార’ వచ్చేనా?
సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర ప్రజలను హక్కులను పరిరక్షించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి మరో తార్కాణమిది. గతేడాది సెప్టెంబరు 13న వంశధార నదీజలాల పరిష్కార న్యాయస్థానం (వీడబ్ల్యూడీటీ) ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు నింపుతూ ఇచ్చిన తీర్పును అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తనకు సన్నిహిత మిత్రుడని పదేపదే చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా ప్రభుత్వంతో సకాలంలో చర్చించలేదు. ఈ నేపథ్యంలో వంశధార ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. దీంతో వంశధార పరివాహక ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేయాలని నిర్ణయించిన ట్రిబ్యునల్ సోమవారం నుంచి ఈనెల 27 వరకు ఆంధ్రప్రదేశ్లో, 28, 29 తేదీల్లో ఒడిశాలో పర్యటించనుంది. కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ట్రిబ్యునల్కు వివరించగలిగితే ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 115 టీఎంసీలు.. చెరిసగం వంశధారలో 115 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని 1962లో తేల్చిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ 1962 సెప్టెంబరు 30న తీర్పు చెప్పింది. వంశధార జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా.. దేశంలోనే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 1977 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులకు రూ.933.90 కోట్లతో 2005 ఫిబ్రవరి 25న శ్రీకారం చుట్టారు. నేరడి బ్యారేజీపై ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాలకు సహేతుకంగా సమాధానాలు చెబుతూనే ఆయకట్టుకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ (మత్తడి) నిర్మాణపనులు ప్రారంభించారు. సైడ్ వియర్, నేరడి బ్యారేజీ పనులను సమాంతరంగా చేపట్టి.. గొట్టా బ్యారేజీ కింద 2,10,510 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు వరద కాలువ కింద 20 వేలు, హైలెవల్ కెనాల్ కింద ఐదు వేలు, హిర మండలం రిజర్వాయర్ కింద 20 వేలు వెరసి 45 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని నిర్ణయించారు. కాట్రగడ్డ సైడ్ వియర్, నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఒడిశా ప్రభుత్వం 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రం సంప్రదింపులు జరుపుతుండగానే.. వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులను నిలిపేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆరునెలల్లోగా ఈవివాదాన్ని పరిష్కారించాలని సుప్రీంకోర్టు 2009 ఫిబ్రవరి 6న కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం 2010 ఫిబ్రవరి 24న వంశధార ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కాట్రగడ్డ సైడ్ వియర్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2013 డిసెంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది. తీర్పు అమలును పట్టించుకోని సీఎం వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని మరోసారి తేల్చిన ట్రిబ్యునల్ రెండురాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ సర్కార్కు అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. నేరడి బ్యారేజి పూర్తయిన తరువాత కాట్రగడ్డ సైడ్ వియర్ను పూర్తిస్థాయిలో తొలగించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలుకు వంశధార నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీర్పుపై అభ్యంతరాలుంటే మూడునెలల్లో తెలపాలని సూచించింది. ‘దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని. నలభై ఏళ్ల అనుభవం ఉంది.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాకు మిత్రుడు’ అంటూ పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు.. వంశధార ట్రిబ్యునల్ తీర్పు అమలులో చేతులెత్తేశారు. ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పు అమలుకు అంగీకరించేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేదని.. కానీ సీఎం చంద్రబాబు తమ సూచనలను పట్టించుకోకుండా ఒడిశాతో చర్చించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ట్రిబ్యునల్ను ఆశ్రయించిందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడైనా వాదనలు సమర్థంగా వినిపించాలి వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుందశర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం సోమవారం నుంచి ఈనెల 27 వరకు శ్రీకాకుళం జిల్లాలో కాట్రగడ్డ సైడ్ వియర్, నేరడి బ్యారేజీ, హిరమండలం రిజర్వాయర్, గొట్టా బ్యారేజీలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. 28, 29 తేదీల్లో ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనుంది. ఇప్పుడైనా ట్రిబ్యునల్ ముందు వాదనలు సమర్థంగా వినిపిస్తే వంశధార నదీ జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించవచ్చు. -
అంతా హంబక్, ఓ నటన!
సాక్షి, న్యూఢిల్లీ : 1971లో పాక్, భారత్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా ఎం. బవేజా నాయకత్వంలో భారత సైనిక దళం, పాకిస్థాన్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్లోని లడక్ శిబిరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంది. ఇందుకుగాను ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు లభించింది. అయితే ఈ ఆపరేషన్లో ఆయన కాలి వేళ్లను కోల్పోయారు. 2000 సంవత్సరంలో బ్రిగేడియర్గా సైన్యం నుంచి రిటైరైన బవేజాకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఆయనకు 1971లో అప్పగించిన మిషన్ను పూర్తి చేయడానికి కనీసం పది రోజులు కూడా పట్టలేదు. అయితే అంగ వైకల్య పింఛను సాధించేందుకు ఆయనకు 10 ఏళ్లు పట్టింది. పింఛను కోసం కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగిన ఆయన కొత్తగా ఏర్పాటయిన సాయుధ దళాల ట్రిబ్యునల్ను 2007లో ఆశ్రయించారు. 2010లో ట్రిబ్యునల్ అంగ వైకల్య పింఛను మంజూరు చేసింది. పింఛను కూడా తీసుకుంటున్నారు. అయితే అంతటితో ఆయన పింఛను కష్టాలు తీరలేదు. 2015లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పింఛను ఆగిపోయింది. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వం అప్పీల్ కొట్టి వేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిబ్యునల్ ఓకే చేసిన అంగవైకల్య పింఛన్లను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాదాపు 800 అప్పీళ్లను దాఖలు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో సుప్రీం కోర్టు అంతకుముందు ప్రభుత్వం దాఖలు చేసిన వాటితో సహా దాదాపు వెయ్యి అప్పీళ్లను కొట్టి వేసింది. ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. ద్వంద్వ ప్రమాణాలంటే ఇదే మరి సైనికుల అంగవైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ఉపసంహరించుకోవాలని, కొత్తగా అప్పీళ్లకు వెళ్లరాదంటూ 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు అప్పటి బీజేపీ ఉపాధ్యక్షులు స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల ట్రిబ్యునల్ సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రభుత్వం నుంచి అప్పీళ్లు లేకుండా సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. అందుకు కట్టుబడి ఉండకుండా 2017 వరకు అప్పీళ్లు దాఖలు చేస్తూనే వచ్చింది. 2015లో ఉన్నతస్థాయి కమిటీ సైనిక దళాల సమస్యలు, పింఛను వ్యవహారాల పరిష్కారం కోసం 2015లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ రిటైరైన ఉన్నత సైనికాధికారులతో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ 75 సిఫార్సులు చేయగా, అందులో 32 సిఫార్సులను ఆమోదించినట్లు పర్రీకర్ ప్రకటించారు. సైనిక అంగ వైకల్య పింఛన్లపై దాఖలు చేసిన అప్పీళ్లును ఉపసంహరించుకోవడం, కొత్తవి దాఖలు చేయక పోవడం వాటిలో ముఖ్యమైనది. అయినా 2017, జూన్ వరకు అప్పీళ్లు దాఖలవుతూ వచ్చాయి. ఇక అప్పీళ్లను నిలిపి వేస్తున్నట్లు 2017, జూన్ 29వ తేదీతో ‘కేంద్ర సైనిక పింఛనుదారుల సంక్షేమ సంఘం’కు కేంద్ర రక్షణ శాఖ ఓ లేఖ రాసింది. అప్పటి నుంచి కొత్తగా అప్పీళ్లను దాఖలు చేయలేదు. కానీ పెండింగ్లో ఉన్న పిటిషన్లలో ఒక్కదాన్ని కూడా ఉపసంహరించుకోలేదు. వాటిని ఉపసంహరించుకునే ఆలోచన కూడా తమకు లేదని ఈ ఏడాది జనవరి నెలలో ఇప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అప్పీళ్లను కొట్టివేసినా పింఛన్లు హుళక్కే సుప్రీం కోర్టు 2015లో పది అప్పీళ్లను కొట్టివేయగా వాటిలో ఇద్దరు సైనికులకు నేటికి పింఛను అందడం లేదు. వారిలో 53 ఏళ్ల లీలా సింగ్ ఒకరు. పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన లీలా సింగ్ 2002లో నాయక్గా రిటైర్ అయ్యారు. ఆయన 1994లో ఊరి నుంచి తిరిగివస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ఆయనది పాక్షిక అంగవైకల్యంగా గుర్తించిన సైనిక అధికారులు అయనకు అందుకు తగిన విధులనే అప్పగించారు. రిటైరయిన తర్వాత ఆయన అంగవైకల్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా విధుల నిర్వహణలో గాయపడ్డ వారికి మాత్రమే పింఛను వర్తిస్తుందన్న కారణంగా కేంద్రం తిరస్కరించింది. ఆయన 2008లో ట్రిబ్యునల్ను ఆశ్రయించి విజయం సాధించారు. దాన్ని మళ్లీ కేంద్రం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా, 2015లో కొట్టివేసింది. అయినప్పటికీ ఆయనకు ఇప్పటికీ పింఛను రావడం లేదు. 2007లోనే ట్రిబ్యునల్ ఏర్పాటు సైనిక సిబ్బందికి సంబంధించిన కేసుల పరిష్కారం కోసం దిగువ కోర్టుల నుంచి హైకోర్టులు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందన్న కారణంగా ‘సాయుధ దళాల ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేయాలని 1999లో కేంద్రం నిర్ణయించింది. అయితే 2007లో అమల్లోకి వచ్చింది. దేశభక్తి బోగస్... అంతా రాజకీయమే! ‘భారత మాతా కీ జై, జై జవాన్ అంతా హంబక్. జాతీయ గీతం పాడితే నిలబడడం అంతా ఓ నటన. గత ప్రభుత్వాలకు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాలకు ఎలాంటి తేడా లేదు. మమ్మల్ని నిజంగా పట్టించుకుంటున్న వారు ఎవరూ లేరు. ప్రస్తుత ప్రభుత్వానిది పూర్తిగా రాజకీయం’ అని ‘మాజీ సైనికుల ఫిర్యాదుల విభాగం అధ్యక్షుడు రిటైర్డ్ లెఫ్ట్నెంట్ కల్నల్ ఎస్ఎస్ సోహి వ్యాఖ్యానించారు. ‘ఈ మోదీ ప్రభుత్వం జాతీయవాదం గురించి ఉద్బోధ చేస్తోంది. అంగవైకల్య సైనికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సాయుధ దళాల వ్యతిరేక వైఖరే కాకుండా జాతీయవాదానికి కూడా వ్యతిరేకం’ అని ‘మాజీ సైనికుల ఐక్య ఫ్రంట్’ ప్రధాన కార్యదర్శి రిటైర్ట్ లెఫ్ట్నెంట్ కల్నల్ దినేశ్ నైన్ విమర్శించారు. -
సిమెంట్ కంపెనీలకు షాక్..!
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్ఏటీ) సిమెంట్ కంపెనీలకు చుక్కెదురయ్యింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పెనాల్టీని సవాలు చేస్తూ 11 సిమెంట్ సంస్థలు పెట్టుకున్న అభ్యర్ధనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ తీర్పు వెలువడిన తరువాత స్టాక్ మార్కెట్లో సిమెంట్ రంగ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇంట్రాడేలో 14 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ ముగింపు సమయానికి 3 శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఇండియా సిమెంట్స్ 3.29 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.39 శాతం, అంబుజా సిమెంట్స్ 1.50 శాతం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.31 శాతం, జెకె లక్ష్మీ సిమెంట్ 1.26 శాతం, ఏసీసీ 0.28 శాతం నష్టపోయాయి. సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఎమ్ఏ), అల్ట్రాటెక్, ఏసీసీ, రామ్కో, జేకే సిమెంట్, అంబుజా సహా 11 సిమెంట్ సంస్థలు కార్టెల్గా ఏర్పడి ధరలను నియంత్రించాయని పేర్కొంటూ... 2016 అగస్టులో సీసీఐ ఈ సంస్థలపై రూ.6,700 కోట్ల పెనాల్టీని విధించింది. -
ఎయాన్–జేఎస్డబ్ల్యూ స్టీల్ చేతికి మోనెట్ ఇస్పాత్
ముంబై: రుణభారంతో దివాలా తీసిన మోనెట్ ఇస్పాత్ సంస్థను ఎయాన్ ఇన్వెస్ట్మెంట్స్–జేఎస్డబ్ల్యూ స్టీల్ కన్సార్షియం దక్కించుకోనుంది. ఇందుకోసం కన్సార్షియం సమర్పించిన రూ. 2,875 కోట్ల బిడ్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది. మోనెట్ ఇస్పాత్ బ్యాంకులకు ఏకంగా రూ. 11,000 కోట్ల మేర బాకీ పడింది. ఎయాన్–జేఎస్డబ్ల్యూ కన్సార్షియం బిడ్ ద్వారా 26 శాతం మాత్రమే వసూలు కానుండటంతో.. బ్యాంకులు ఏకంగా 74 శాతం మొత్తాన్ని వదులుకోవాల్సి (హెయిర్కట్) రానుంది. దీనికోసం బిడ్ చేసిన ఏకైక బిడ్డరు తమ కన్సార్షియమేనని జేఎస్డబ్ల్యూ తెలిపింది. వాస్తవ బిడ్కు కొన్ని మార్పులతో ఎన్సీఎల్టీ గురువారం మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిందని, పూర్తి ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉందని వివరించింది. అయితే, ఏయే మార్పులను సూచించినదీ వెల్లడించడానికి సంస్థ నిరాకరించింది. మోనెట్లో కన్సార్షియానికి 75 శాతం వాటాలు ఉంటాయని ఎయాన్ వివరించింది. ఇందులో తమకు 70 శాతం, జేఎస్డబ్ల్యూ స్టీల్కి 5 శాతం ఉంటుందని పేర్కొంది. ఛత్తీస్గఢ్లో 1.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యం గల స్పాంజ్ ఐరన్ ప్లాంటుతో మోనెట్ ఇస్పాత్ ఒకప్పుడు ఉక్కు దిగ్గజంగా వెలుగొందింది. అయితే, దానికి కేటాయించిన బొగ్గు గనులను 2014లో సుప్రీం కోర్టు రద్దు చేయడం, ఆ తర్వాత ఉక్కు రేట్లు భారీగా పడిపోవడం తదితర కారణాలతో సంక్షోభంలో కూరుకుపోయింది. -
కీలక ట్రిబ్యునల్కు చైర్మన్గా జస్టిస్ అమితవరాయ్?
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో పదవీవిరమణ పొందననున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్కు అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయి. దేశంలోని అత్యంత కీలకమైన, భారీ ట్రిబ్యునల్కు అమితవ రాయ్ చైర్మన్గా నియమితులవుతారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సంకేతాలిచ్చారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన సుప్రీంకోర్టు బాధ్యతలనుంచి రిటైరవటం బాధాకరం. కానీ ఆయన సేవలను మనం వదులుకోలేం. త్వరలోనే ఓ కీలకమైన ట్రిబ్యునల్లో ముఖ్యమైన బాధ్యతలు అందుకోనున్నారు’ అని కేకే పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాలపై ఒకే ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయనున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు, ఎన్జీటీ చైర్మన్ స్వతంత్రకుమార్ పదవీకాలం కూడా ఇటీవలే ముగిసింది. కాగా, న్యాయమూర్తులందరూ ఐకమత్యంగా ఉండాలని.. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని శక్తులు పన్నుతున్న కుట్రను తిప్పికొట్టాలని వీడ్కోలు సమావేశంలో జస్టిస్ అమితవ కోరారు. -
ఒక దేశం.. ఒక ట్రిబ్యునల్!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్రాం మేఘవాల్ ప్రకటించారు. నదీ జలాల వివాదాలన్నింటినీ ఇదే ట్రిబ్యునల్ పరిధిలోకి తెస్తామన్నారు. మార్చి–ఏప్రిల్లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదిస్తామని వెల్లడించారు. ‘‘ఒక్కో నది పరిధిలో ఒక్కో ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ తీర్పులు వెలువరించాక సైతం కొన్ని రాష్ట్రాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. నదుల వారీగా ట్రిబ్యునల్స్ ఉండడం వల్ల డబ్బు, కాలం వృథా అవుతోంది. దీనికి విరుగుడుగా ఒకే ట్రిబ్యునల్ అవసరం. అన్ని నదీ వివాదాలను దీని పరిధిలోకి తెస్తాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు. ఇప్పటికే ఆయా ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న కేసులన్నింటినీ ఒకే ట్రిబ్యునల్ కిందకు తెచ్చి సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం’’అని మేఘవాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తాజ్ వివాంటా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు జరిగింది. దీనికి తెలంగాణ నుంచి మంత్రి హరీశ్రావు, సీఎస్ ఎస్కే జోషి, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూలు హాజరు కాగా ఏపీ సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు గైర్హాజరయ్యారు. ఏపీ తరఫున అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సలహాదారు రామకృష్ణ, కర్ణాటక, తమిళనాడు తరఫున జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్రావు, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, కేరళ మంత్రి థామస్ మాథ్యూ, కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుందూ, సీడబ్ల్యూసీ చైర్మన్ మాజిద్ హుస్సేన్తో కలసి మేఘవాల్ మీడియాతో మాట్లాడారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల తొలి సమావేశం జయప్రదంగా ముగిసిందన్నారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమా వేశం హైదరాబాద్ డిక్లరేషన్గా పిలవవచ్చన్నారు. తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావేరి మేనేజ్మెంటు బోర్డు, కావేరి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతామని, నా బార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణలో మిషన్ కాకతీ య మాదిరే తమ రాష్ట్రంలోని 1,200 చిన్న, 80 పెద్ద చెరువుల పునరుద్ధరణకు కేంద్రం సహకరించాలని కోరినట్లు పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు తెలిపారు. -
మధ్యంతర ఏర్పాట్లు చేయండి
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ట్రిబ్యునళ్లకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మధ్యంతర ఏర్పాట్లు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని కోరింది. ట్రిబ్యునళ్లలో జడ్జీల నియామకాలు, వారి పదవీకాలం తదితరాలకు సంబంధించిన ఆర్థిక చట్టం–2017 రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ వచ్చిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉన్నందున ప్రస్తుతానికి ట్రిబ్యునళ్లలో న్యాయమూర్తుల నియామకాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేయాలనీ, ఇందుకోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ను ధర్మాసనం కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదావేసింది. -
‘వంశధార’ వివాదానికి ముగింపు
తుది తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు మధ్య నెలకొన్న వివాదానికి వంశధార జలాల వివాద పరిష్కార న్యాయస్థానం(వీడబ్ల్యూడీటీ) ముగింపు పలుకుతూ తుది తీర్పును వెలువరించింది. కాట్రగడ్డ సైడ్ వియర్ (మత్తడి– అడ్డుగోడ), నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ బుధవారం ట్రిబ్యునల్ తీర్పును వెలువరించింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ, జస్టిస్ బి.ఎన్.చతు ర్వేది, జస్టిస్ గులాం మొహమ్మద్ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. వంశధార జలాలు చెరిసగం గొట్టా బ్యారేజ్ వద్ద వంశధారలో అందుబాటులో ఉండే నదీ జలాలు 115 టీఎంసీలుగా ట్రిబ్యునల్ నిర్ధారించింది. రెండు రాష్ట్రాల మధ్య సెప్టెంబరు 30, 1962న కుదిరిన ఒప్పందం మేరకు వంశధార జలాల్లో చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయించింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఆంధ్రప్రదేశ్ సర్కార్కు అప్పగించాలని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. -
ట్రిబ్యునల్ తీర్పులంటే లెక్కలేదా: హైకోర్టు
- తీర్పుని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోండి - ఇరురాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు - ఇల్లందు మున్సిపల్ ఉద్యోగి హోదా తగ్గింపు పిటిషన్పై విచారణ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన తీర్పుని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి సరైన న్యాయపరమైన కారణాలు ఉంటే వేరే విషయమని, అయితే నిర్లక్ష్యం కారణంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవడమే సరైందని హైకోర్టు అభిప్రాయపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో అకౌంటెంట్గా పనిచేసే విజయానంద్ ఇతర సిబ్బందితో కలసి అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో ఆయన హోదాను సీనియర్ అసిస్టెంట్ స్థాయికి తగ్గించడం చెల్లదని ఐదేళ్ల క్రితం ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనిని అధికారులు అమలు చేయకపోవడంతో విజయానంద్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు సీవీ నాగార్జునరెడ్డి, జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపి తెలుగు రాష్ట్రాలకు సూచన చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయని అధికారుల జీతాల నుంచి పిటిషనర్లకు కోర్టు ఖర్చు చెల్లించే ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకపోతే ఈ తరహా వ్యాజ్యాలు దాఖలవుతూనే ఉంటాయని.. కక్షిదారుడు కింది కోర్టులో గెలిచి కూడా కేసు ఓడిపోయిన వాడి మాదిరిగా హైకోర్టుకు రావాల్సిన పరిస్థితులకు బాధ్యులైన అధికారులపై చర్యలు ప్రారంభించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా ఈ కేసులో ట్రిబ్యునల్ అదేశాలను అమలు చేసినట్లు తెలంగాణ పురపాలక శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి కోర్టుకు చెప్పారు. అంతకుముందు ట్రిబ్యునల్ ఆదేశాల సమాచారం తన దృష్టికి రాకపోవడం వల్లే అమలులో జాప్యానికి కారణమని వివరించారు. -
బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ రద్దు!
► కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో అవకాశం ► 70 ఏళ్ల వయసు నిబంధనతో జస్టిస్ బ్రిజేశ్కుమార్కు తప్పని ఉద్వాసన ► అదే జరిగితే కొత్త ట్రిబ్యునల్ ముందుకు కృష్ణా జలాల వివాదం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు–2017 పార్లమెంటు ఆమోదం లభిస్తే కృష్ణా జల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న కృష్ణా వివాదాలపై విచారణ కేంద్రం తెచ్చే కొత్త ట్రిబ్యునల్కు బదిలీ అవుతుంది. ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా... దేశంలో ప్రస్తుతమున్న కృష్టా సహా ఎనిమిది ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర జల జగడాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నా వివాదాలకు పరిష్కారం దొరకట్లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే సవరణ బిల్లును కేంద్రం ఈ నెల 14న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రతిపాదిత చట్టం అమల్లోకి రాగానే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దవుతాయి. వాటి పరిధిలోని వివాదాలన్నీ కొత్త ట్రిబ్యునల్కు బదిలీ అవుతాయి’ అని బిల్లులో స్పష్టంగా ఉంది. దీనికి ఎలాంటి సవరణలు లేనట్లయితే ప్రస్తుతమున్న కృష్ణా సహా కావేరీ, వంశధార, మహదాయి, రావి వంటి ట్రిబ్యునళ్లు రద్దవుతాయి. అలాగే ప్రస్తుత ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల వయసు కొత్త చట్టం వచ్చే నాటికి 70 ఏళ్లు నిండితే వారి పదవీకాలం సైతం మూడు నెలల్లో ముగుస్తుందని బిల్లులో కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన కూడా 70 ఏళ్లు పైబడిన జస్టిస్ బ్రిజేశ్కుమార్కు ఉద్వాసన పలికేలా ఉంది. అయితే ‘ఇప్పటికే అమల్లో ఉన్న ట్రిబ్యునళ్లు నీటి వివాదాలపై విచారణ పూర్తి చేసి కేటాయింపులు జరిపినట్లయితే కొత్త ట్రిబ్యునల్ ఆ వివాదాలను పునర్విచారించదు’ అని బిల్లులో కేంద్రం పొందుపరిచిన మరో నిబంధన గందరగోళానికి తావిచ్చేలా ఉంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పూర్తి చేసినా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడం, ట్రిబ్యునల్ కేటాయింపులపై రాష్ట్రం అప్పీల్ చేయడంతో ఆ కేటాయింపులు అవార్డు కాలేదు. ఈ దృష్ట్యా ఇక్కడ విచారణ పూర్తయినట్లా లేదా కొనసాగుతున్నట్లా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో తమకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును గట్టిగా సమర్థించిన తెలంగాణకు ఇది పెద్ద ఉపశమనమేనని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
-
మిస్త్రీకి మళ్లీ చుక్కెదురు!
పిటిషన్లు చెల్లుబాటు కావన్న కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై: టాటా సన్స్పై న్యాయపోరాటంలో సైరస్ మిస్త్రీకి చుక్కెదురైంది. టాటా సన్స్కు వ్యతిరేకంగా మిస్త్రీ కుటుంబ కంపెనీలు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేయగా... అవి విచారించడానికి అర్హమైనవి కాదని ట్రిబ్యునల్ సోమవారం పేర్కొంది. ట్రిబ్యునల్ను ఆశ్రయించే విషయంలో అర్హత ప్రమాణాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్... టాటాసన్స్ చైర్మన్గా మిస్త్రీ తొలగింపును ట్రిబ్యునల్లో సవాల్ చేయడం తెలిసిందే. మైనారిటీ వాటాదారుల హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించాయి. అయితే, విచారణ సందర్భంగా ఈ పిటిషన్లను టాటా సన్స్ వ్యతిరేకించింది. కంపెనీల చట్టం ప్రకారం మైనారిటీ వాటా కలిగిన పిటిషనర్లు ట్రిబ్యునల్ ముందు సవాల్ చేసే అవకాశం లేదని టాటా సన్స్ వాదించింది. కనీసం 10% వాటా కలిగి ఉండాలన్న అర్హతా ప్రమాణాల విషయంలో విఫలమైనందున ఈ పిటిషన్లు కొనసాగించగలిగినవి కావని ట్రిబ్యునల్ పేర్కొంది. దీనికి మిస్త్రీ కుటుంబ కంపెనీలు స్పందిస్తూ... జారీ మూలధనంలో పిటిషనర్ పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా లేదా మైనారిటీ వాటాదారుల్లో పదింట ఒక వంతు వాటా కలిగి ఉన్నా చట్ట ప్రకారం ఈ నిబంధనను ట్రిబ్యునల్ రద్దు చేయవచ్చని పేర్కొన్నాయి. అయితే, సైరస్ కుటుంబ కంపెనీలు రెండిం టికీ కలిపి మొత్తం జారీ మూలధనంలో 2.17% వాటాయే ఉందని, పిటిషన్లను దాఖలు చేసే సమయంలో అర్హత నిబంధనను రద్దు చేయాలని కోరకుండా, ఈ దశలో అడగలేరని టాటా సన్స్ వాదించింది. ట్రిబ్యునల్ ముందు న్యాయపోరాటానికి కనీసం 10% వాటా నిబంధనను రద్దు చేయాలన్న సైరస్ కంపెనీల అభ్యర్థనపై వాదనలను మంగళవారం వింటామని ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది. -
మరోసారి వాయిదాపడ్డ కృష్ణా ట్రిబ్యునల్ విచారణ
ఈనెల 23న జరగాల్సిన సమావేశం 31కి వాయిదా ఇప్పటికి మూడుసార్లు వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ సమావేశాలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. కృష్ణానీటి పంపకాలపై గత ఏడాది డిసెంబర్ 14న జరగాల్సిన సమావేశాలు తెలుగు రాష్ట్రాల వినతి నేపథ్యంలో జనవరి 23కు వాయిదా పడగా, ప్రస్తుతం మరోమారు జనవరి 31కి వాయిదా పడ్డాయి. కాగా, ఈ తేదీలోగా కృష్ణాజలాల వివాదంపై సుప్రీంకోర్టులో ఉన్న ప్రధాన పిటిషన్ విచారణకు వస్తేనే ట్రిబ్యునల్లో అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–89 పరిధి, విçస్తృతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్లో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలే పంచుకోవాలి... ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటాయింపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్ (ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల వారీ కేటాయింపులు, ఆపరేషన్ ప్రొటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. అయితే ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినందున అఫిడవిట్ సమర్పణకు అదనపు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరడంతో గడువును జనవరి 23కి పెంచింది. అయితే ఈలోగా రాష్ట్రం వేసిన స్పెషల్లీవ్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, దానిని కొట్టివేసింది. అంతకుముందు ఇదే విషయమై తెలంగాణ సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు వేసిన ప్రధాన పిటిషన్ విచారణ యథాతథంగా జరుగుతుందని తెలిపింది. ఈ పిటిషన్ విచారణ సైతం ఈ నెల 18నే జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలతో విచారణకు రాలేదు. దీంతో ట్రిబ్యునల్కు రాష్ట్రం అఫిడవిట్ సమర్పిం చాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తాజాగా మళ్లీ సమావేశాలు వాయిదా పడటంతో రాష్ట్రానికి కొంత ఊరట దక్కినట్లైంది. జనవరి 31కి ముందే సుప్రీంలో ప్రధాన పిటిషన్విచారణకు వచ్చే అవకాశం ఉందని, అందులో సుప్రీం ఇచ్చే ఆదేశాల మేరకు అఫిడవిట్పై నిర్ణయం చేయాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. -
డీజీపీతో సమానంగా వేతనం ఇప్పించండి
క్యాట్ను ఆశ్రయించిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తాను పదవీ విరమణ చేసిన 2016 డిసెంబర్ 31 వరకు డీజీపీ అనురాగ్శర్మతో సమానంగా వేతనం మంజూరు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను క్యాట్ సభ్యుడు జేకే శ్రీవాస్తవ గురువారం విచారించారు. ఐపీఎస్ క్యాడర్లో అనురాగ్శర్మ తనకంటే ఏడాది జూనియర్ అని, ఆయనతో సమానంగా తనకు వేతనం ఇవ్వాలంటూ 2016 నవంబర్లో తాను కేంద్రానికి రాసిన లేఖను తిరస్కరించడం చట్టవిరుద్ధమన్నారు. ఇదే అభ్యర్థనతో గత ఏడాది ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి పదవీ విరమణ వరకూ డీజీపీతో సమానంగా రూ.80వేల వేతన శ్రేణి ప్రకారం వేతనం, పదవీ విరమణ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ పదవికి తనకు అన్ని అర్హతలున్నా, అనేక కారణాలతో అనురాగ్శర్మను డీజీపీగా నియమించారని పేర్కొన్నారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ శ్రీవాస్తవ నోటీసులు జారీచేశారు. -
పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం
-
పట్టిసీమ వినియోగాన్ని పట్టించుకోం
• కృష్ణా జలాల పంపిణీపై తేల్చి చెప్పిన బోర్డు • దాన్ని ట్రిబ్యునల్గానీ, కేంద్రం నియమించిన కమిటీగానీ తేల్చాలని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మళ్లీ ఎదురుదెబ్బే తగిలింది. తొలి నుంచీ ఏపీ చెప్పినట్లుగా తలూపుతున్న కృష్ణా బోర్డు మళ్లీ వారి వాదననే సమర్థించింది. పట్టిసీమ నుంచి ఇప్పటివరకు ఏపీ చేసిన వినియోగాన్ని లెక్కలోకి తీసుకోలేమంది. గోదావరి నుంచి కృష్ణాకు తరలించే జలాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాన్ని కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 గానీ, కేంద్రం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీగానీ తేల్చాలంది. అప్పటివరకూ పట్టిసీమ విని యోగాన్ని పరిగణనలోకి తీసుకోలేమంటూ శుక్రవారం తెలంగాణకు రాసిన లేఖలో పే ర్కొంది. ఇదే జరిగితే ప్రస్తుత లభ్యత జలాల్లో తెలంగాణకు కేటారుుంపులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. 52 టీఎంసీలు హాంఫట్..! ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు నీటి వినియోగంపై తొలి నుంచీ వివామే. ఆ నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకోరాదని ఏపీ వాదిస్తోం టే... దాన్ని లెక్కలోకి తీసుకునే కేటారుుంపు లు చేయాలని తెలంగాణ కోరుతోంది. దీనిపై తెలంగాణ ఇటీవలే కృష్ణా బోర్డుకు స్పష్టత ఇచ్చింది కూడా. ఎక్కడి నుంచి వచ్చి అరుునా కృష్ణాలో కలిశాక అదంతా కృష్ణా నీరే అవుతుందంది. ఒక నది నుంచి మళ్లిస్తూ కృష్ణాలో కలిపిన నీటిని కృష్ణా నీటిగా కాకుండా వేరుగా పరిగణించలేమని పేర్కొంది. పట్టిసీమలో ఏపీ చేసిన 52 టీఎంసీల వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని నీటి కేటారుుంపులు చేయాలని కోరింది. కానీ రాష్ట్ర అభ్యర్థనను కృష్ణా బోర్డు పట్టించుకోలేదు. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు శుక్రవారం ఒక లేఖ రాసింది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం పట్టిసీమ నీటి తరలింపు అంశం కేడబ్ల్యూడీటీ-2 తేల్చాల్సి ఉందని అభిప్రాయపడింది. బోర్డు 5వ సమావేశంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు చూడాలని తెలంగాణ కోరింది. దీనిని కేంద్ర జల వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిపై తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. ఈ దృష్ట్యా పట్టిసీమ ద్వారా తరలించి చేస్తున్న జలాల వినియోగాన్ని మేం పట్టించుకోబోం..’’అని బోర్డు అందులో పేర్కొంది. పట్టిసీమ వినియోగాన్ని లెక్కలోకి తీసుకుంటే ఏపీ వినియోగం 234.84 టీఎంసీలు, తెలంగాణ వినియోగం 74.19 టీఎంసీలు అని... కానీ తాము పట్టిసీమను పక్కన పెడుతున్నందున ఏపీ వినియోగాన్ని 186.31 టీఎంసీలుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీంతో 52 టీఎంసీలు కృష్ణార్పణం అరుుపోరుుంది. ‘మైనర్’లెక్కలు పక్కన పెడితే.. బోర్డు పేర్కొన్న ప్రకారం తెలంగాణ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే... రాష్ట్రానికి 56.30 టీఎంసీల మేర దక్కాల్సి ఉంది. అరుుతే మైనర్ ఇరిగేషన్పై భిన్న వాదనల నేపథ్యంలో వాటిని పూర్తిగా పక్కనపెట్టి వేసిన లెక్కల ప్రకారం తెలంగాణకు 43 టీఎంసీలు ఇస్తామని బోర్డు చెబుతోంది. దీంతో 13 టీఎంసీల మేర కోత పడుతోంది. అరుుతే తమ అభిప్రాయాలపై ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు పరిశీలన జరిపి, తమ ప్రభుత్వాలతో మాట్లాడి... ఓ అభిప్రాయానికి రావాలని కృష్ణా బోర్డు సూచించింది. 13వ తేదీలోగా ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే దానికే తాము మద్దతిస్తామని తెలిపింది. లేదంటే తగిన నిర్ణయాన్ని తామే ప్రకటిస్తామని పేర్కొంది. వివిధ రకాల లెక్కలేసిన బోర్డు ⇔ కృష్ణా బేసిన్లోని మైనర్ ఇరిగేషన్ నీటి విని యోగంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు చేస్తుండటంతో.. బోర్డు ఆ లెక్కలను పరిగణలోకి తీసుకుని పలురకాల లెక్కలను ఇరు రాష్ట్రాల ముందుంచింది. దాని ప్రకారం.. ⇔ ఏపీ చెబుతున్నట్లుగా మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ 89.15 టీఎంసీలు వాడి, పట్టిసీమ లెక్కలను పక్కనపెడితే... ప్రస్తుత లభ్యత నీటిలో ఏపీకి 110.62 టీఎంసీలు, తెలంగాణకు 19.33 టీఎంసీలు దక్కుతారుు. ⇔ ఆవిరి నష్టాలు, ‘మైనర్’కింద సరాసరి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 93.68 టీఎంసీలు, తెలంగాణకు 36.28 టీఎంసీలు దక్కుతారుు. ⇔ ఆవిరి నష్టాలు, ‘మైనర్’కింద తెలంగాణ లెక్కలను పరిగణిస్తే ఏపీకి 73.65 టీఎంసీలు, తెలంగాణకు 56.30 టీఎంసీలు దక్కుతారుు. ⇔ మరో ప్రత్యామ్నాయం కింద ఆవిరి నష్టాలు, ‘మైనర్’వినియోగాన్ని పక్కన పెడితే ఏపీకి 87 టీఎంసీలు, తెలంగాణకు 43 టీఎంసీలు దక్కుతారుు. ⇔ పులిచింతల, జూరాలను సైతం కలుపుకొంటే ఏపీకి 93.33 టీఎంసీలు, తెలంగాణకు 45.65 టీఎంసీలు దక్కుతారుు. ⇔ ప్రస్తుత వాటర్ ఇయర్ సగానికి వచ్చినందున ఆవిరి నష్టాలు, మైనర్ వినియోగం పక్కన పెడుతూ వేసిన లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. వచ్చే ఏడాది మాత్రం ఈ విధానం ఉండదని పేర్కొంది. -
ట్రిబ్యునల్ తీర్పు బేఖాతర్
స్థలం స్వాధీనంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం - టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణం - నోటీసులతో సరిపెట్టే ప్రయత్నం కర్నూలు(అగ్రికల్చర్): ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణం కాగా.. ఆ శాఖ కమిషనర్ ఆగ్రహంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఇప్పుడు కూడా నోటీసులతో సరిపెట్టేందుకు రంగం సిద్ధమయింది.ఽ వివరాల్లోకి వెళితే.. కర్నూలు కిడ్స్ వరల్డ్ సమీపంలోని గోరక్షణ మహా సంఘానికి సర్వే నెంబర్ 171లో 330 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వీఎస్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం 2012లో తీర్పు ఎండోమెంట్కు అనుకూలంగా వచ్చింది. తీర్పు కాపీ అందిన నెల రోజుల్లో స్థలం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే దేవాదాయ శాఖ స్పందించని పరిస్థితి. ప్రస్తుతం అధికార టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఒత్తిళ్లతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు తీర్పు వచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి కర్నూలు తహసీల్దార్ రమేష్, పోలీసు అధికారులతో శనివారం సర్వే నెంబర్ 171లోని స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. వీఎస్ టెక్స్టైల్స్ పేరుతో నిర్వహిస్తున్న దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని యజమాని టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడం.. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. అక్కడి నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే 15 రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని దుకాణం యజమానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. -
మీ వాదనలు సరిగా లేవు
- ఏపీ, తెలంగాణలను ఉద్దేశించి ట్రిబ్యునల్ వ్యాఖ్య - 8వ అంశంపై వాదనలు సమర్థనీయంగా లేవు - తెలంగాణ ప్రయోజనాలు ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదన్న వాదన తిరస్కరణ - చట్టంలో ఆస్తుల విభజనను పలు సెక్షన్లు సూచిస్తున్నాయి - అందుకే నీటి పంపకాలు కూడా రెండు రాష్ట్రాల మధ్యే - కర్ణాటక, మహారాష్ట్ర వాదనల్లో బలం ఉందన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు లేవనెత్తిన అంశాలపై మీ వాదనలు సమర్థనీయంగా లేవు.. మీరు సరిగా వివరించలేకపోయారు’ ఓ సందర్భం లో తెలంగాణ, ఏపీలను ఉద్దేశించి స్వయంగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలివీ! కృష్ణా జలాలను ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు పంచాలంటూ ఇరు రాష్ట్రాలు చేసిన వాదనల్లో ఏ ఒక్కటీ ట్రిబ్యునల్ను మెప్పించలేపోయాయి. ఆ వాదనలేవీ నిలబడలేని తీరుకు 124 పేజీల తీర్పు అద్దం పట్టింది. సెక్షన్-89 పరిధిపై విచారణ జరుగుతున్నప్పుడు అన్ని రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలపై విచారణ జరగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిదో అంశంపై ఏపీ, తెలంగాణలు తాము లేవనెత్తిన అంశంపై సమర్థనీయంగా వాదించలేకపోయాయని ట్రిబ్యునలే తీర్పులో పేర్కొంది. ‘‘ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకే కేటాయింపులు జరి పితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటొకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా’’ అన్న అంశాన్ని ఏపీ, తెలంగాణ లేవనెత్తడంతో దీన్ని 8వ అంశంగా చేర్చా రు. దీనికి ట్రిబ్యునల్ తీర్పులో సమాధానమిస్తూ.. ‘‘వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. అలాగే ఈ అంశానికి మద్దతుగా ఏ వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు’’ అని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంపై కూడా సవివరంగా వాదించకపోవడం అంతిమంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితికి దారితీసింది. ఆస్తుల విభజనే ప్రాతిపదికగా: విచారణ సందర్భంగా ట్రిబ్యునల్... పలుమార్లు ఆస్తులు పంచుకున్న రీతిలోనే నీటిని పంచుకుంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ వచ్చింది. కానీ ఈ వ్యాఖ్యలను నిశితంగా పరిగణనలోకి తీసుకుని ఏపీ, తెలంగాణలు బలమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యాయి. తీర్పు కూడా ఈ వ్యాఖ్యలను బలపరుస్తూ ఆస్తుల మాదిరే నీటిని పంచుకోవాలన్న ప్రస్తావనలతో ఉంది. కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ చేసిన వాదనల్లో బలం కనిపించిందని పేర్కొంది. సెక్షన్ 48 రెండు రాష్ట్రాలు భూములు, వస్తువులను, అలాగే సెక్షన్ 49 నగదు, బ్యాంకు నిల్వలను, సెక్షన్ 51 రుణాలు తదితరాలను, సెక్షన్ 52 పెట్టుబడుల్ని పంచుకోవాలని ఆయన వాదించారు. ఇలా సెక్షన్ 67 వరకు ఇలాంటి నిబంధనలే ఉన్నాయంటూ ఆయన చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ట్రిబ్యునల్ తీర్పులో అవగతమవుతోంది. అలాగే నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటులో ఏపీ, తెలంగాణకే చోటుందని, ఇతర రాష్ట్రాలకు ఇందులో చోటు లేదని మహారాష్ట్ర తరపు సీనియర్ న్యాయవాది చేసిన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. సెక్షన్ 89లో ‘సక్సెసర్ స్టేట్స్’ అన్న ప్రస్తావన ఉందని, దానికి కేవలం కొత్త రాష్ట్రాలని మాత్రమే అర్థమని అంధ్యార్జున చేసిన వాదనలను ప్రస్తావించింది. అలాగే ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు విడిపోయిన రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కేటాయింపులు జరిగాయి తప్ప ఏ ఇతర రాష్ట్రాలను ఆ వివాదంలో చేర్చలేదన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనలను తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణ వెనుకబాటుపై ఏమందంటే వెనకబాటుతనం, నీళ్ల కోసమే రాష్ట్ర ఏర్పాటు, తమ ప్రాంత ప్రయోజనాలను ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్ ముందు వినిపించకపోవడం వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావించిందని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ఇవేవీ సెక్షన్ 89ను అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న వాదనలకు బలం చేకూర్చేలా లేవని స్పష్టం చేసింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రయోజనాలను కూడా వినిపించిందని పేర్కొంది. తెలంగాణలో ఎగువ ప్రాంతానికి 20 టీఎంసీల నీటిని కేటాయించాలని ఉమ్మడి ఏపీ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఈ వాదనలను లోతుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించిందని, ఒకవేళ కొన్ని నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి ఎక్కువగా వచ్చినా, తెలంగాణకు తక్కువగా వచ్చినా.. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చంది. నీటి కోసమే తెలంగాణ ఏర్పడిందన్న వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని బలపరస్తూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ‘కారణాలు, లక్ష్యాలు’ శీర్షిక కింద కూడా కనీస ప్రస్తావన లేదంది. ట్రిబ్యునల్కు ఆ అధికారం ఉంది విచారణకు ముందు అన్ని రాష్ట్రాల సమ్మతితో రూపొందించుకున్న 9 అంశాలతో పాటు విచారణ సందర్భంగా తలెత్తిన మరో అంశంపై కూడా ట్రిబ్యునల్ వివరణ ఇచ్చింది. సెక్షన్ 89 పరిధి ఏంటన్న అంశాన్ని ట్రిబ్యునల్ ఎలా విచారిస్తుందని, కేవలం నీటి వివాదాన్ని మాత్రమే పరిష్కరిస్తుందని చేసిన వాదనలపై తీర్పులో సుదీర్ఘ ప్రస్తావన చేసింది. భవిష్యత్తులో తలెత్తే వివాదాన్ని కూడా పరిష్కరించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని, అందువల్లే ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించేందుకు విచారణ చేపట్టినట్టు పేర్కొంది. -
పాలమూరు, డిండిలకు అడ్డు తొలగినట్లే!
ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాల్లేవన్న కేంద్రం * అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే స్పష్టత * ట్రీబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగానే నీటి వినియోగం * ప్రాజెక్టుల నియంత్రణ అంశం సైతం ఇప్పట్లో లేనట్లే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి ఒక అడ్డు తొలిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన అపెక్స్ కౌన్సిల్ ముందు వీగిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరాలేమీ లేవని.. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసే కేటాయింపులకు అనుగుణంగా నీటి వినియోగానికి కట్టుబడి ఉండాలని కేంద్రం సూచించడం రాష్ట్రానికి ఊరటనిచ్చింది. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ ఎప్పటికి పూర్తి చేస్తుంది, ఏ మేరకు నీటి వాటాను కేటాయిస్తుందన్నది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. కేటాయింపుల మేర వాటా దక్కేనా? బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన మొత్తంగా 2,060 టీఎంసీలను లెక్క తేల్చింది. అందులోంచి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు, మరో 227 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీల నికర జలాలు, 150 టీఎంసీల మిగులు జలాలు దక్కగా.. తెలంగాణకు 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు దక్కాయి. అయితే మొత్తంగా కూడా తెలంగాణ 200 టీఎంసీలకు మించి వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే 120 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపట్టింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు కృష్ణాలో అదనంగా 90 టీఎంసీల వాటా రావాలని స్పష్టం చేస్తోంది. మరోవైపు బ్రిజేష్ ట్రిబ్యునల్ కొత్తగా 65 శాతం నీటి లభ్యత అంచనాలతో కృష్ణాలో 2,578 టీఎంసీల లభ్యత జలాలున్నట్టు తేల్చింది. ఈ లెక్కన మరో 163 టీఎంసీల నికర జలాలు, 285 టీఎంసీల మిగులు జలాలు (మొత్తం 448 టీఎంసీలు) అదనంగా ఉన్నట్లు చూపింది. ఈ అదనపు జలాల్లో కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81, ఏపీకి 190 టీఎంసీలు కేటాయించింది. కానీ బచావత్ తీర్పుకు వ్యతిరేకంగా మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు పంచడమేమిటని.. వాటిని దిగువ రాష్ట్రాలకే పంచాలని ప్రస్తుతం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తోంది. దీనిపై విచారణ ముగిస్తే తెలంగాణకు మిగులు జలాల్లో మరింత వాటా పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తంగా పాలమూరు, డిండిలకు నిర్ణీత నీటిని వాడుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై వాదనలు విన్న కేంద్రం వాటాలు తేల్చే పనిని తిరిగి ట్రిబ్యునల్కే అప్పగించింది. తెలంగాణ వాదనలకు అనుగుణంగా నీటి వాటా పెరిగితే పాలమూరు, డిండికి ఎలాంటి నష్టం ఉండదని.. లేకపోతే ఇబ్బందేనని రాష్ట్ర నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ ఇప్పట్లో లేనట్లే కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా నివేదికను సమర్పించాలని ఇప్పటిదాకా కృష్ణా బోర్డు తొందరపెట్టిందని.. ప్రస్తుతానికి ఆ అంశం మరుగున పడినట్లేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ చెబుతోంది. అపెక్స్ భేటీలో ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని తెలంగాణ వాదించింది. అసలు ప్రాజెక్టుల వారీగాఎవరి వాటా ఎంత, వినియోగం ఏ రీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే ప్రాజెక్టుల నియంత్రణ చేపట్టాలని సూచించింది. ఈ వాదనతో కేంద్రం ఏకీభవించిందని, ఏపీ మౌనం దాల్చిందని పేర్కొంది. -
4 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి
కృష్ణా జలాలపై ట్రిబ్యునల్లో ఏపీ వాదన సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని సెక్షన్-89 పరిధిపై కృష్ణా ట్రిబ్యునల్లో తుది వాదనలు పూర్తయ్యాయి. కృష్ణా నదీజలాల్ని పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలా? లేక రెండు తెలుగు రాష్ట్రాలమధ్యే పంపకాలు చేయాలా? అన్న వివాదంపై గురువారం వాదనలు ముగి శాయి. తీర్పును మూడు వారాల తరువాత ప్రకటిస్తామని జస్టిస్ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పేర్కొంది. ఏపీ విభజన చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఆస్తులు పంచినట్టే.. కృష్ణా జలాల్నీ పంపిణీ చేయాలని కేంద్రం బుధవారం వాదించగా.. ఈ వివాదాన్ని ఏపీ, తెలంగాణలకే పరిమితం చేసే అధికారం కేంద్రానికికానీ, సుప్రీంకోర్టుకు కానీ లేదని, నీటి వివాదాల్లో సర్వాధికారాలు ట్రిబ్యునల్కే ఉన్నాయని తెలుగు రాష్ట్రాలు స్పష్టం చేయడం తెలి సిందే. గురువారం ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నీటి కేటాయింపులను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని పార్లమెంటు భావించి ఉంటే ట్రిబ్యునల్ను ప్రస్తావించకపోయేదన్నారు. రెండేళ్లుగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలోని రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలుండగా.. దిగువ నున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అడుగంటాయన్నారు. ఇవి రెండూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులన్నారు. కర్ణాటక చెబుతున్నట్టుగా కృష్ణాజలాల కేటాయింపుల్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయడం సరికాదని, నాలుగు రాష్ట్రాలమధ్య చేపడితేనే ఏపీ, తెలంగాణలకు న్యాయం జరుగుతుందన్నారు. గోదావరినీ తీసుకుందామా..? కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది నారిమన్ వాదిస్తూ.. ‘‘ఏపీని విభజన చేస్తున్నట్టు 2009లోనే ప్రకటన వెలువడింది. అయితే కృష్ణా నీటికేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్ 2010లో తీర్పు వెలువరిం చింది. తరువాత దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా.. ట్రిబ్యునల్లో తిరిగి వాదనలు ప్రారంభమైనా ఏపీ, తెలంగాణల నుంచి ఏ ఒక్కరూ అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు లేవనెత్తడమేంటి?’’ అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4కు, విభజన చట్టంలోని సెక్షన్-89కు సంబంధం లేదన్నారు. సెక్షన్-89 రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతుందన్నారు. ఏపీ వాదిస్తున్నట్టు ఈ చట్టం ప్రకారం కృష్ణాజలాల్ని నాలుగు రాష్ట్రాలమధ్య పంపిణీ చేయాలంటున్నారు కాబట్టి.. ఇలాగైతే గోదావరి జలాల్నీ ట్రిబ్యునల్ పరిధిలోని తేవాలని, అప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలన్నీ నీటిపంపకాలకోసం ట్రిబ్యునల్ను ఆశ్రయించాలా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో అదనంగా వచ్చే నీటి వాటాలను సాధించుకునేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో అదనపు నీటి వాటాలు కోరేలా వాదనలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రావాల్సిన 90 టీఎంసీల నీటి వాటాను లేవనెత్తనుంది. కృష్ణా బేసిన్ పరిధిలో పర్యటించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు కృష్ణా జల వివాదాలపై ట్రిబ్యునల్ ముందు చేపట్టాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో కర్ణాటకకు 22 టీఎంసీలు, మహారాష్ట్రకు 13 టీఎంసీలతోపాటు తమకు 45 టీఎంసీలు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా మరేదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. ఈ లెక్కన 45 టీఎంసీలతో ఏపీ పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తమకు దక్కాలని వాదిస్తోంది. అంటే మొత్తంగా 90 టీఎంసీల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరుతూ వాటాలకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీకి కృష్ణాలో 512 టీఎంసీల వాటా ఉన్నా కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు 550 టీఎంసీల మేర నీటిని మళ్లిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి వాటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఎ), సెక్షన్ (బి)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని, ఇది తేలాలంటే నాలుగు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరపాలని రాష్ట్రం కోరనుంది. -
ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషి : ఏజేసీ
నల్లగొండ టౌన్ః వృద్ధుల రక్షణ చట్టం అమలు నిమిత్తం రెవెన్యూ డివిజన్ అధికారులతో సంప్రదించి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషిచేస్తామని ఏజేసీ వెంకట్రావ్ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ భవన్లో జరిగిన సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అభినందనీయమన్నారు. వృద్దుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ 2014 నుంచి సుమారు 40 కేసులను పరిష్కరించి వృద్ధులకు రక్షణ కల్పించామన్నారు. ప్రతి మంగళవారం సంతానం నుంచి ఆపదలను ఎదుర్కొంటున్న వారికి అవగాహన కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రతినిధి శ్యాంప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్రెడ్డి, ఎండి.రియాజ్అలి, విద్యాసాగర్, మట్టపల్లి, యాదయ ఎల్లయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు. -
వాటాలు కుదరలేదు
-
కృష్ణా వాటాలు కుదర్లేదు
-
చైనా చారిత్రక హక్కులు చెల్లవు
-
కేజ్రీవాల్ సతీమణి స్వచ్ఛంద పదవీ విరమణ
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత(51) ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖలో ఆమె 22 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీలో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కమిషనర్గా చివరి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది మొదట్లోనే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పుడు అధికారికంగా ఆదేశాలు జారీచేసింది. జులై 15 నుంచి ఈ విరమణ అమలులోకి వస్తుంది. కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదం నేపథ్యంలో బాధితురాల్ని అవుతానన్న భయంతోనే సునీత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. -
చైనా చారిత్రక హక్కులు చెల్లవు
దక్షిణ చైనా సముద్ర వివాదంపై డ్రాగన్కు ట్రిబ్యునల్ షాక్ - చైనా చెప్తున్న చారిత్రక హక్కులకు ఆధారాలు లేవు - ఏవైనా ఉన్నా ఐరాస ఒడంబడికతో చెల్లిపోయాయి: ట్రిబ్యునల్ - ఆ తీర్పు చెల్లదు.. ఆమోదించం.. గుర్తించం: చైనా బీజింగ్/ద హేగ్ : అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరంగా చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయన్న చైనా వాదనను ఐక్యరాజ్యసమితి నియమిత అంతర్జాతీయ ట్రిబ్యునల్ మంగళవారం కొట్టివేసింది. ట్రిబ్యునల్ తీర్పుపై చైనా ఆగ్రహంగా స్పందించింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తిరస్కరించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతానికి పైగా ప్రాంతంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ పట్టుపడుతున్న చైనా వాదనకు ఎటువంటి న్యాయపరమైన ప్రాతిపదికా లేదని ద హేగ్ లోని ట్రిబ్యునల్ కొట్టివేసింది. 1940ల నాటి చైనా మ్యాప్ ఆధారంగా ‘నైన్-డాష్ లైన్’ పరిధిలో గల సముద్ర ప్రాంతంపై, అందులోని వనరులపై తనకు హక్కులు ఉన్నాయని చైనా ఉద్ఘాటిస్తుండగా.. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యూఎన్సీఎల్ఓఎస్)లో పేర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లకు.. చైనా చెప్తున్న హక్కులు విరుద్ధంగా ఉన్నాయని, చైనా చారిత్రక హక్కులేవైనా ఉంటే ఒడంబడిక ద్వారా అవి చెల్లిపోయాయని తీర్పులో స్పష్టంచేసింది. దక్షిణ చైనా సముద్రంలోని దీవులను చైనా, ఇతర దేశాలకు చెందిన నావికులు, మత్స్యకారులు చారిత్రకంగా వినియోగించుకున్నప్పటికీ.. ఆ జలాలపై కానీ, వనరులపై కానీ చైనా చారిత్రకంగా ప్రత్యేక హక్కులను కలిగి ఉన్నట్లు ఎటువంటి ఆధారం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. ఒడంబడికలోని 296వ అధికరణ, అనుబంధం 7లోని 11వ నిబంధన ప్రకారం ఇది తుది తీర్పు అని, చైనా కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. తీర్పు సారాంశాన్ని మీడియాకు విడుదల చేసింది. స్పార్ట్లీ దీవుల వద్ద సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణం, ఇతరత్రా చర్యల వల్ల సముద్ర పర్యావరణాన్ని చైనా దెబ్బతీస్తోందని కూడా ట్రిబ్యునల్ తప్పుపట్టింది. తీర్పు ప్రభావం ఏమీ ఉండదు: చైనా ట్రిబ్యునల్ తీర్పుపై చైనా కఠిన వైఖరి అవలంబించింది. చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారం పైనా, దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రయోజనాల పైనా ఈ తీర్పు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావం చూపబోదని.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ జుంకర్తో సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాలపై చారిత్రక వాస్తవాల ఆధారంగా, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నేరుగా ప్రమేయమున్న దేశాలతో శాంతియుత సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవటానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆ సముద్రగర్భంలో అపార సంపద..! దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఇప్పటివరకూ గుర్తించని చమురు, గ్యాస్, ఖనిజాల నిల్వలు ఉండవచ్చని శాస్త్రవేత్తల విశ్వాసం. అలాగే.. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన నౌకా మార్గాలు ఈ సముద్రం లోంచే వెళతాయి. ఈ సముద్రంలోని దీవులను తమ చక్రవర్తులు శతాబ్దాల కిందట కనుగొన్నారని, చరిత్ర అంతటా ఆ ప్రాంతంపై హక్కులు కలిగివున్నారని చైనా వాదిస్తోంది. అందులో కృత్రిమంగా దీవులు నిర్మించి, వాటిపై సైనిక స్థావరాలనూ ఏర్పాటు చేస్తోంది. చైనా వాదనను ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, బ్రూనై, తైవాన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ 2013లో సమితి శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టుకు ఫిర్యాదు చేయగా.. ఆ కోర్టు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు చెల్లదని, దానిని తాము అంగీకరించేది కానీ, గుర్తించేది కానీ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ బీజింగ్లో ప్రకటించింది. -
కేటాయించాల్సింది ట్రిబ్యునలే
- ‘విభజన’ సెక్షన్ 89పై కేంద్రం వైఖరి సరికాదు - కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్89 ప్రకారం కృష్ణా నదీ జలాల పంపిణీని రెండు కొత్త రాష్ట్రాల మధ్యే చేపట్టాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలియపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. కృష్ణా నదీ జలాల వివాద పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ‘‘కొత్త రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ హక్కులను సాధించుకునేందుకు, మా వాదనలు వినిపించేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. లేకుంటే ప్రస్తుతమున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్లోనే అన్ని రాష్ట్రాల వాదనలు మళ్లీ విని నీటి కేటాయింపులు మళ్లీ జరిపేలా చూడాలన్నాం. అర్జీని పరిష్కరించేందుకు కేంద్రానికి ఏడాది గడువు ఉంది. ఆలోగా పరిష్కరించకుంటే ట్రిబ్యునల్కు నివేదించడమే కేంద్రం విధి. అయితే కేంద్రం ఏడాదిలోగా వివాదాన్ని పరిష్కరించకపోగా.. తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు ఇస్తూ సెక్షన్ 89 కేవలం రెండు నూతన రాష్ట్రాలకే అమలవుతుందని చెప్పింది. ఇది దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా కేంద్రం వ్యవహరించింది. పూర్తిగా బుర్ర పెట్టకుండానే ఈ అభిప్రాయానికి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వానికి నీటి కేటాయింపులు జరిపే అధికారం లేదు. ఆ బాధ్యత నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్దే. అందువల్ల మా నీటి హక్కులను సెక్షన్ 89 ద్వారా లేదా ఇంకేదైనా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం కాలరాయజాలదు’ అని వాదించారు. వాదలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది. విచారణకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్రావు, న్యాయవాదులు రవీందర్రావు, విద్యాసాగర్రావు హాజరయ్యారు. -
’ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే పంచుకోవాలి’
-
తెలంగాణ గోస వినాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదంలో రాష్ట్రానికి ఊరట. జలాల పంపిణీలో తెలంగాణ వాదనలను వినాలని ట్రిబ్యునల్కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గురువారం సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, లేదంటే నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ వినడం గానీ జరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆ అర్జీలో కోరింది. కేంద్రం ఏడాదిలోగా కృష్ణా నదీ జలాల భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఏడాది గడువు ముగిసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో ఈ అర్జీని పరిష్కరించడంలో భాగంగా కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ వాదనలు కూడా వినాలని కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్-2కు కేంద్రం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అర్జీలో ఏముంది? కృష్ణా జలాల పంపిణీలో ఎన్నడూ తమ వాదనలు వినిపించలేకపోయామని, అందువల్ల ఈ నదీ పరివాహకంలోని నాలుగు రాష్ట్రాల వాదనలు మళ్లీ మొదటి నుంచీ వినేలా వీలు కల్పించాలని తెలంగాణ కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా గానీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా గానీ తెలంగాణకు న్యాయం జరగలేదని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో తమ వాదనలు వినిపించుకోలేకపోయామని తెలిపింది. ‘అసలు నీళ్లలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ ప్రాంతం ఏపీ నుంచి విడిపోవాలని కోరుకుంది. ఇప్పుడు విడిపోయిన తరువాత కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా? అన్యాయాన్ని సరిదిద్దేందుకు వీలుగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం గానీ, నాలుగు రాష్ట్రాల వాదనలు తిరిగి వినిపించేందుకు గానీ వీలు కల్పించాలి’ అని కోరింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి అవార్డు ప్రకటించాక వివిధ రాష్ట్రాల అభ్యర్థనలతో సుప్రీంకోర్టు సూచనల మేరకు 2013లో తుది అవార్డు ప్రకటించింది. కానీ దానిని కేంద్రం నోటిఫై చేయలేదు. సుప్రీంకోర్టు దానిపై స్టే విధించడం వల్ల కేంద్రం నోటిఫై చేయలేకపోయింది. తెలంగాణ తమ వాదనలు వినాలని పట్టుబట్టుతుండగా.. మహారాష్ట్ర, కర్ణాటకలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికీ అవార్డును కేంద్రం నోటిఫై చేయలేదని, ఇలా అయితే ఇక ట్రిబ్యునళ్లు ఎందుకని మండిపడుతున్నాయి. ఉమ్మడి ఏపీకి ఏ కేటాయింపులైతే చేశారో.. వాటిని ఏపీ, తెలంగాణ పంచుకోవాలని వాదిస్తున్నాయి. తదుపరి ఏంటి? ఒకవేళ కేంద్ర నిర్ణయంతో తెలంగాణకు మేలు జరిగే పరిస్థితి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటకలు దీనిని న్యాయస్థానంలో వ్యతిరేకించే అవకాశముంది. తాజాగా కేంద్రం చేస్తున్న ఈ సిఫారసును ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటుందా? ఆ మేరకు మళ్లీ మొదటి నుంచి తెలంగాణ వాదనలు విని అవార్డు తయారు చేస్తుందా? లేక సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదున కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణకు అనుగుణంగా నిర్ణయం వెలువడితే ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. -
కృష్ణా జలాలపై తేల్చేదెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలకు సంబంధించి అసలు పాత్రధారి కేంద్ర ప్రభుత్వమేనని, వివాదం సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలాగని కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ పెట్టుకున్న అర్జీపై కేంద్రం వైఖరేమిటని నిలదీసింది. దీనిపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలంటూ విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. మళ్లీ అన్ని రాష్ట్రాల వాదనలు వినాలని లేదా కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి.పంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తొలుత తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ‘‘కృష్ణా పరీవాహక ప్రాంతంలో మా జనాభా 24 శాతం ఉన్నా.. మాకు అందుతున్న నీరు 12.5 శాతమే. సాగునీరు అందుతున్న భూములూ తక్కువే. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు తిరిగి వినేలా చేయాలని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్-3 కింద కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాం. ఆ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం ఏడాదిలోపు చర్చల ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ దాన్ని పరిష్కరించాలి. కానీ కేంద్రం అలా పరిష్కరించనందునే మేం సుప్రీంను ఆశ్రయించాం. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో మేం ఉన్నట్టే గానీ ఒక్క చుక్క నీరూ మాకు దక్కడం లేదు. ఐదు కోట్ల మంది ప్రజల దాహార్తి తీరాల్సి ఉంది. మా రైతుల జీవనాధారం ప్రశ్నార్థకమైపోయింది..’’ అని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్ మిశ్రా.. ‘‘మీ విభేదాలు ఎవరితో?’ అని ప్రశ్నించారు. పరీవాహక ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలతోనూ తమకు విభేదాలున్నాయని వైద్యనాథన్ బదులిచ్చారు. దీంతో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-84 ప్రకారం నదీ జలాల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ వింటుంది కదా?’ అని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. ఆ కౌన్సిల్కు తగిన పరిధి లేదని వైద్యనాథన్ వివరించారు. ‘సెక్షన్-89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్యే వివాదం పరిష్కరించాల్సి ఉంది కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా... ‘‘ప్రాజెక్టు వారీ నిర్దిష్ట కేటాయింపులు జరపాలని సెక్షన్-89 చెబుతోంది. కానీ పైరాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపని పరిస్థితుల్లో కేవలం ఏపీ, తెలంగాణ మధ్యే ఎలా చేస్తారు?’’ అని న్యాయవాది వివరించారు. దీనికి జస్టిస్ మిశ్రా ఏకీభవిస్తూ ‘సెక్షన్ 89 పరిమితంగా ఉంది. మీరు మీరు కొట్లాడుకోండి అన్న రీతిలో ఉంది..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ‘మీరు తెలంగాణకు మద్దతు ఇస్తున్నారా? విభేదిస్తున్నారా?’ అని ఏపీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘మహారాష్ట్ర, కర్ణాటకలతో పోరాడాల్సి వస్తే ఇద్దరం కలిసి పోరాడతాం..’ అని చెప్పారు. నష్టపోతున్నాం.. వైద్యనాథన్ వాదన వినిపిస్తూ.. ‘‘ఐదు కోట్ల మంది దాహార్తి తీరాల్సి ఉంది. మా గొంతుక వినిపించే వేదిక ఇవ్వాలని అడుగుతున్నాం. మహారాష్ట్ర 150 టీఎంసీలను విద్యుదుత్పత్తి కోసం వాడుకుని సముద్రంలోకి వృథాగా వదులుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రాష్ట్రం వాడుతున్న నీళ్లలో 65 శాతందాకా నది బేసిన్లో లేని ప్రాంతాలకు మళ్లిస్తోంది. కర్ణాటక కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మా అవసరాలను గుర్తించలేదు. నీళ్లు, నియామకాల కోసమే రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కూడా మా గొంతుక వినిపించని పక్షంలో మాకు రాష్ట్రం వచ్చి ప్రయోజనమేమిటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలా? ఈ సందర్భంలో జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనపై మీ వైఖరి ఏమిటి?’ అని కేంద్రం తరఫు న్యాయవాది మోహనను ప్రశ్నించారు. దీంతో ‘‘సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. తమ పరిధి ఏమిటని ఆ ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని కూడా అడిగింది. సెక్షన్ 89 ప్రకారం తెలంగాణ, ఏపీల మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరపాల్సి ఉందని కేంద్రం చెప్పింది..’’ అని మోహన వివరించారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు వివాదాన్ని సృష్టించి నిశ్శబ్దంగా ఉంటే ఎలా? అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం-1956లోని సెక్షన్-3 కింద కేంద్రానికి తెలంగాణ పెట్టుకున్న అర్జీపై మీ వైఖరి ఏమిటి?.. మీరే ప్రధాన పాత్రధారి. మీ వైఖరి స్పష్టంగా ఉండాలి..’’ అని పేర్కొన్నారు. దీంతో తదుపరి విచారణలో తగిన అఫిడవిట్ దాఖలు చేస్తామని మోహన బదులిచ్చారు. అనంతరం కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ వాదిస్తూ.. ఈ వివాదం రెండు కొత్త రాష్ట్రాల మధ్యేనని పేర్కొన్నారు. మహారాష్ట్ర తరపు న్యాయవాది అంధ్యార్జున వాదిస్తూ.. ‘‘150 టీఎంసీలు విద్యుదుత్పత్తికి వాడుతున్నారంటూ తెలంగాణ చేసిన వ్యాఖ్యలకు ఈ పిటిషన్కు సంబంధమేంటి?’’ అని ప్రశ్నించారు. దీనికి వైద్యనాథన్ బదులిస్తూ అన్నీ రికార్డుల్లో ఉన్నవే చెప్పానని వివరించారు. రెండు గంటల పాటు వాదనలు జరిగిన అనంతరం ధర్మాసనం విచారణను డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. -
కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు
కృష్ణా జలాలపై రాష్ట్ర అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం ♦ ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరణ ♦ అవార్డులో అన్యాయాన్ని సరిదిద్దండని అడగండి ♦ అంతేగానీ మళ్లీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే ఎలా? ♦ జలాల్లో అన్యాయం వల్లే విడిపోయామన్న తెలంగాణ న్యాయవాది ♦ ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఎలా అని ప్రశ్న ♦ ఉమ్మడి రాష్ట్ర కేటాయింపులను పంచుకోవచ్చు కదా అన్న ధర్మాసనం ♦ విచారణ సెప్టెంబర్ 10కి వాయిదా.. సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు’ అని పేర్కొంది. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కూడా అభిప్రాయపడింది. ఈ దిశగా కేంద్రానికి నోటీసులు ఇవ్వాలన్న తెలంగాణ అభ్యర్థనను తిరస్కరించింది. కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో తమ వాదనను కృష్ణా నదీ జలాల ట్రిబ్యునళ్లు ఏనాడూ వినలేదని, కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార చట్టం-1956లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి ఏడాది కిందటే అర్జీ పెట్టుకుంది. ఈ అభ్యర్థనను కేంద్రం పరిష్కరించకుండా నాన్చింది. దీంతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కిందటి నెల 21న విచారణకు రాగా.. ఇప్పటివరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న 5 పిటిషన్లతోపాటు వింటామని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆ పిటిషన్లు బుధవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతిల ధ ర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. ఇలా అయితే ఎంత దాకా..?: మహారాష్ట్ర మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపిస్తూ.. ఈ వివాదాన్ని లాక్కుం టూ పోతే ఎంతకాలానికి పరిష్కారమవుతుందని ప్రశ్నించారు. ‘‘బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2013లో తుది అవార్డు ఇచ్చింది. దాన్ని ఇంతవరకు కేంద్రం నోటిఫై చేయలేదు. ఎందుకంటే ఆ అవార్డు కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆ అవార్డు నోటిఫై కాకుండా కోర్టు స్టే ఇచ్చింది. ఆ సమస్య అలా ఉండగానే.. 2014లో ఏపీ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణ కూడా మళ్లీ మొదట్నుంచి వాదనలు వినాలంటోంది. పైగా ఇప్పుడు కొత్త ట్రిబ్యునలే ఏర్పాటు చేయాలంటోంది. మరోవైపు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాలను రెండు కొత్త రాష్ట్రాల మధ్యే పంచుకోవాల్సి ఉంది. కానీ దానిపై విచారణ జరగాలని, తెలంగాణ కోరడంతో.. నిబంధనలు రూపకల్పన చేయాల్సిన ప్రక్రియ మొదలైంది. కానీ ఈలోగా ట్రిబ్యునల్లో ఒక సభ్యుడు రాజీనామా చేశారు. దాంతో విచారణ ఆగిపోయింది. ఆర్టికల్ 262 ప్రకారం ట్రిబ్యునల్ తీర్పులపై సుప్రీంకోర్టు సహా ఏ కోర్టూ జోక్యం చేసుకోజాలదు. అందువల్ల బ్రిజేష్కుమార్ అవార్డును కేంద్రం నోటిఫై చేసేలా ఆదేశాలు జారీచేయాలి..’’ అని ఆయన కోరారు. నోటీసులు జారీ చేయలేం.. తెలంగాణ తరఫున వైద్యనాథన్ వాదిస్తూ.. న్యాయం జరగాలన్న తలంపుతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా విచారణ జరుపుతూ కేంద్రానికి నోటీసులు జారీచేయాలని కోరారు. 1956 చట్టంలోని సెక్షన్ 3ను మరోసారి విడమరిచి చెప్పారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ఆ దిశగా నోటీసులు ఇవ్వలేం. సెక్షన్ 89ను మీరు ఇలా అర్థం చేసుకోవచ్చుగా.. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను రెండు రాష్ట్రాలు పంచుకోవచ్చని అనుకోవచ్చుగా..’’ అని పేర్కొన్నారు. దీనిపై వైద్యనాథన్ జవాబిస్తూ ‘‘సంబంధిత నియమావళిని ట్రిబ్యునల్ నిర్దేశించాలి.. కానీ మేమిప్పుడు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం..’’ అని అన్నారు. అందుకు జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదు. మీరు ఏపీ నుంచి పంచుకుంటే సరిపోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో వైద్యనాథన్ మరోసారి రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడారు. అందుకు జస్టిస్ మిశ్రా.. ‘‘ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 20 మైన్లు ఉన్నాయనుకుందాం. వాటిని ఎలా పంచుకుంటారు?’’ అని అడిగారు. అందుకు వైద్యనాథన్ బదులిస్తూ.. ‘‘అసలు బ్రిజేష్కుమార్ అవార్డే నోటిఫై కాలేదు. ఆ అవార్డు ఇచ్చిన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కే సమ్మతం కాలేదు. అలాంటప్పుడు మేం ఉన్నవాటిలో ఎలా పంచుకుంటాం..?’’ అని అన్నారు. దీంతో జస్టిస్ మిశ్రా.. ‘‘అలాంటప్పుడు మీరు కొత్త ట్రిబ్యునల్ కావాలంటూ పట్టుబట్టడం కన్నా.. అవార్డు మీకు సమ్మతం కాదని పిటిషన్ వేయండి. ఒకవేళ ఉమ్మడి ఏపీకి కేటాయింపులు పెరుగుతాయేమో.. అప్పుడు మీకు కూడా పెరుగుతాయి కదా..’’ అన్నారు. అనంతరం ట్రిబ్యునల్లో సభ్యుడి నియామకానికి తీసుకున్న చర్యలేవో చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 10కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జలాల్లో అన్యాయంపైనే మేం విడిపోయాం.. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పైనే ప్రధానంగా విచారణ జరిగింది. విచారణ మొదలుకాగానే జస్టిస్ దీపక్ మిశ్రా తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వైద్యనాథన్ను ఉద్దేశించి.. ‘‘మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిపిన కేటాయింపుల నుంచి పంచుకోవచ్చు కదా.. మీరు ఏపీ కేటాయింపుల నుంచి ఆశించవచ్చు.. సెక్షన్ 89 పరిధిని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకే పెట్టుకుంటే సరిపోతుంది కదా..’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం మేం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. కానీ ఎలాంటి స్పందనా లేదు. ఏడాది దాటిపోయింది. అందువల్లే మీ వద్దకు వచ్చాం. మేం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలనుకున్నదే జలాల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందన్న బాధతో.. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే ఎలా?’’ అని అన్నారు. -
కృష్ణ... కృష్ణా..!
* నదీ జలాల కేటాయింపులో అన్యాయాన్ని పట్టించుకోని కేంద్రం * పంపకాల్లో అసమానతలను సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలు! * లేఖ రాసి ఏడాది అయినా స్పందన శూన్యం * ఫిర్యాదును సంవత్సరంలోపు పరిష్కరించాలని చెబుతున్న చట్టం * కేంద్రం తీరును తప్పుపడుతూ మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలవుతోంది. కృష్ణా నీటిని వినియోగించుకుంటున్న రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నదీ జలాలను మళ్లీ కేటాయించాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏడాది కిందట కేంద్రానికి విన్నవించుకున్నా ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం.. ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా పరిష్కారం చూపాలి. లేని పక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్కు సిఫార్సు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. దీంతో మళ్లీ తెలంగాణ నీటి పారుదల శాఖ తమ వినతులపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది. కేటాయింపుల్లో అన్యాయం ఇదీ.. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే గతేడాది జూలై 14న కేంద్రానికి టీ సర్కార్ లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఈ లేఖలో వివరించిం ది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మొత్తం కేటాయింపుల్లో 35% మాత్రమే ఉన్నాయని తెలిపింది. తెలంగాణ ఆయకట్టు ప్రాంతం 62.5% లెక్కలోకి తీసుకుంటే ఈ కేటాయిం పులు సరిపోవని, ఏపీ పరివాహకం 31.5%, ఆయకట్టు 37.5% ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపినట్లు వివరించింది. మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీటినే కేటాయించారు. పరివాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి కేటాయింపులు జరిపారని, గతంలోని ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశులకు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించారని పేర్కొంది. ట్రిబ్యునల్ ముందు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని తెలిపింది. ఇకనైనా స్పందించండి... రాష్ట్రం చేసిన అభ్యర్థనపై అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం సెక్షన్(4) ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించా ల్సి ఉన్నా.. స్పందన లేకపోవడంతో రెండ్రోజుల కిందట రాష్ట్రప్రభుత్వం మరోసారి ఘాటుగా లేఖ రాసింది. ‘‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టుల నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం సూచన చేయకుంటే ట్రిబ్యునల్ రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తుంది?’’ అని కేంద్రానికి రాసిన లేఖలోనిలదీసింది. ఇప్పటికైనా స్పందన తెలపాలని కోరింది. -
ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లోటీ.సర్కార్కు చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ సర్కార్కు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో చుక్కెదురైంది. కానిస్టేబుళ్ల రీవర్షన్పై ట్రిబ్యునల్ గురువారం స్టే ఇచ్చింది. కాగా కానిస్టేబుళ్ల రీవర్షన్పై తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ జీవోను సవాల్ చేస్తూ కానిస్టేబుళ్లు ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ జీవోపై స్టే విధించింది. -
30న ‘కృష్ణా’ నీటిపై సుప్రీంలో విచారణ
* ఏపీ, కర్ణాటక పిటిషన్లపై వాదనలు * తెలంగాణను ప్రతివాదిగా చేర్చడంతో హాజరుకానున్న రాష్ట్ర అధికారులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)లపై ఈ నెల 30న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కర్ణాటక వేసిన పిటిషన్లో ప్రతివాదులుగా ఏపీతోపాటు తెలంగాణను సైతం చేర్చడంతో రాష్ట్రాధికారులు ఈ వాదనలకు హాజరుకానున్నారు. ఏపీ తన ఎస్ఎల్పీలో బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలుచేస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని...అందువల్ల దాన్ని కొట్టేసి, కొత్తగా తీర్పునిచ్చేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను అభ్యర్థించింది. నాలుగు రాష్ట్రాల వాదనలు విని నీటి పునఃపంపిణీ చేయాలని పిటిషన్లో కోరింది. అంతర్రాష్ట్ర నదీవివాదాల చట్టం ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఆ చట్టంలోని 5 (2) అధికరణ కింద వెలువరించిన తీర్పుపై మూడ్నెల్లలోగా సంబంధిత రాష్ట్రాల వివరణలు కోరి, వీటిపై విచారణ జరిపి తదుపరి నివేదికను 5 (3) అధికరణ కింద ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ తీర్పు, స్పష్టత, వివరణలను కలిపి కేంద్రం 6 (1) అధికరణ ప్రకారం గెజిట్ను ప్రచురించాల్సి ఉంటుంది. అయితే బ్రజేష్ ట్రిబ్యునల్ 5 (2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంను ఆశ్రయించగా, విచారణను కొనసాగించించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పును మాత్రం గెజిట్లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై కర్ణాటక సైతం సుప్రీంను ఆశ్రయించి గెజిట్ను త్వరితగతిన ప్రచురించాలని కోరింది. ప్రస్తుత వివాదం కేవలం ఏపీ, తెలంగాణల మధ్యేనని చెబుతూ వస్తోంది. తుది తీర్పును కలిపి గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఈ రెండు పిటిషన్లపై 30న సుప్రీంకోర్టు విచారించనుంది. కర్ణాటక పిటిషన్లో తెలంగాణను సైతం ప్రతివాదిగా చేర్చినందున వారు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి వాదనలు వినిపంచాలన్న దానిపై మంగళవారం నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. నీటి కరువు పరిస్థితుల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి తమకు నీటిని విడుదల చేయాలని, దిగువ రాష్ట్రమైన ఏపీకి మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు తాము నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలంగాణ పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టుల నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, కనుక అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని ట్రిబ్యునల్ను మళ్లీ కోరాలని అధికారులు నిర్ణయించినట్లు చెబుతున్నారు. కాగా, వచ్చే నెల 3న బాబ్లీ కేసు మరోమారు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షణపై సుప్రీం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో తమకు అవకాశం ఇచ్చి ఏపీని తొలగించాలని తెలంగాణ కోరుతుండగా, తమనూ కొనసాగించాలని ఏపీ కోరుతోంది. -
సహజ న్యాయం.. సమ పంపిణీ
* కృష్ణా ట్రిబ్యునల్ విచారణాంశాలకు ఇదే మూలంగా ఉండాలి * 5న ట్రిబ్యునల్కు అఫిడవిట్లు సమర్పించనున్న తెలంగాణ, ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో సమ న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్ విచారణ పరిధిలో నాలుగు రాష్ట్రాలూ ఉండాల్సిందేనంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్కు ఈ నెల 5న అఫిడవిట్లు సమర్పించాలని నిర్ణయించాయి. సహజ న్యాయం, సమ పంపిణీ ప్రామాణికంగా ట్రిబ్యునల్ విచారణ సాగాలంటే.. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక కూడా ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉండాలని స్పష్టం చేయనున్నాయి. ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీ(ఎన్బ్లాక్) కేటాయింపులు చేసి, దిగువ రాష్ట్రాలు(తెలంగాణ, ఏపీ)కి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని, అలా చేస్తే సమ పంపిణీ జరగదని వాదించనున్నాయి. ట్రిబ్యునల్ ముందుకు తేవాల్సిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజర్ కమిటీ) శనివారం మళ్లీ సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ జనవరి 5లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్.. కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు సూచించిన విషయం విదితమే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు ప్రాజెక్టు నీటి విడుదల ప్రొటోకాల్స్ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొడిగించిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. అయితే ఈ లేఖలను అంగీకరించని ట్రిబ్యునల్.. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం ఇప్పటిదాకా అఫిడవిట్ సమర్పించలేదు. తెలంగాణ కసరత్తు దాదాపు పూర్తి.. కృష్ణా ట్రిబ్యునల్కు సమర్పించాల్సిన అఫిడవిట్పై తెలంగాణ దాదాపు తన కసరత్తు పూర్తి చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణాలో నీటి లోటు ఉన్న సమయాల్లో తెలంగాణ, ఏపీలకు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటోకాల్ను నిర్ధారించడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నిస్తోంది. అలాగే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి, ఎగువనున్న రాష్ట్రాలకు బేసిన్ల వారీగా కేటాయింపులు ఎలా జరుపుతారని అడుగుతోంది. తెలంగాణ, ఏపీలు కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎగువ రాష్ట్రాల అంగీకారం ఉంటుందా అనే వాదనను బలంగా వినిపించనుంది. -
ట్రిబ్యునల్ తీర్పును గౌరవించాల్సిందే: రఘువీరా
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పాదనపై ట్రిబ్యునల్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాల్సిందేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. నదీ జలాల వినియోగ విధానాలలో తాగునీటికే ప్రాధాన్యత ఉందన్న వాస్తవాన్ని కేసీఆర్ గ్రహించాలని రఘువీరా హితవు పలికారు. రాయలసీమలో తాగునీరు లేక ప్రజలు చనిపోయే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. -
కృష్ణా జలాల పంపిణీపై పున: పరిశీలన అవసరమే!
-
ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరి హారం చెల్లించాలని మోటారు వాహనాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) గురువారం న్యూఇండియా బీమా సంస్థను ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలో నివసించే 19 ఏళ్ల సోను అనే యువకుడు 2008లో ఓ బస్సు ఎక్కాడు. అయితే డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడుపుతూ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో అందులోనుంచి కింద పడ్డాడు. దీనిపై అప్పట్లో ఎంఏసీటీలో ఫిర్యాదు దాఖలైంది. దీనిని పరిశీలించిన ఎంఏసీటీ...సోను వాదన బలంగా ఉందని, పోలీసుల విచారణ దీనిని బలపరుస్తోందని ట్రిబ్యునల్ పేర్కొంది. పిటిషనర్కు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారమూ లేదంది. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన కారణంగానే అతడు తీవ్రంగా గాయపడ్డాడనే విషయం తేలిందని ఎంఏసీటీ ప్రిసైడింగ్ అధికారి అజయ్కుమార్జైన్ పేర్కొన్నారు. వైద్యనివేదిక ఆధారంగా పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ఎంఏసీటీ.... సోను ఈ ప్రమాదంలో 51 శాతంమేర గాయపడ్డాడని పేర్కొంది. తాత్కాలిక అంగవైకల్యానికి లోనయ్యాడంది. అయితే దానర్థం అతను శాశ్వత అంగవైకల్యానికి గురికాలేదని కాదంది. సోను దాదాపు ఆరు సంవత్సరాలపాటు వైద్యచికిత్స పొందుతూనే ఉన్నాడంది. ఈ నేపథ్యంలో అతడు శాశ్వత వైకల్యానికి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదంది. ఈ కారణంగా అతడు తన దైనందిన కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడంది. కాగా 2008, డిసెంబర్ 15వ తేదీన సోను బస్సులో ఇంటికి బయల్దేరాడు. బస్సు దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా వేగం పెంచడంతో అందులోనుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఎయిమ్స్కు తరలించారు. మరోవైపు సోను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బస్సు నుంచి కిందపడిపోయాడంటూ డ్రైవర్ చేసిన వాదనను ఎంఏసీటీ కొట్టిపారేసింది. -
ఆ కుర్చీలే కావాలట..!
ఎన్నికలు జరిగాక సొంత జిల్లాకు వస్తున్న తహశీల్దార్లు తమకు పాత చోటే పోస్టింగులివ్వాలని హఠం వేస్తున్నారు. మరో వైపు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సాయంతో కొందరు తమకు నచ్చినచోట కుర్చీలు దక్కించుకున్నారు. దీనితో బదిలీల వ్యవహారం గందరగోళంగా మారింది. ఆర్డర్లు అందుకున్న పలువురు కొలువులో చేరక తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ట్రిబ్యునల్ తలుపు తట్టి కలెక్టర్ ఆదేశాలపై స్టేలు తెచ్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పాఠశాలల ప్రారంభం, కొత్త ప్రభుత్వ లక్ష్యాల అమలు వంటి కీలక సమయంలో ఈ తంతు పాలనపై ప్రభావం చూపుతోంది. ప్రజలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : సాధారణ ఎన్నికల సందర్భంగా బదిలీపై వెళ్లి జిల్లాకు తిరిగి వచ్చిన తహశీ ల్దార్లకు పోస్టింగు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వారి పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బది లీ ఉత్తర్వులు వెలువడి నాలుగు రోజులు కావస్తున్నా ప ది మంది తహశీల్దార్లు కొత్త పోస్టుల్లో నేటికీ చేరడం లే దు. ఎన్నికలకు ముందు తాము పనిచేసిన చోటే తిరిగి పోస్టింగులు ఇవ్వాలంటూ కొందరు ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సొంత జిల్లాలో పనిచేస్తున్న లేదా ఒకే జిల్లాలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న తహశీల్దార్లను ఇ తర జిల్లాలకు బదిలీ చేయాలంటూ ఎన్నికల సంఘం ఆ దేశించింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో 37 మంది తహశీల్దార్లను హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి వీరిని మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ చేశారు. సందట్లో సడేమియా రీతిలో జిల్లాకు పునర్ బదిలీపై వచ్చిన 37 మందితో పాటు మ రో 19 మంది తహశీల్దార్లకు స్థానం కలిగిస్తూ కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 12 తేదీ అర్దరాత్రి బదిలీ ఉత్తర్వులు విడుదల చేయగా, తాము కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకున్న తహశీల్దార్లు 13వ తేదీ ఉదయం విధుల్లో చేరారు. అయితే తమకు అనుకూలంగా లేని చోట పోస్టింగు దక్కలేదంటూ మరో పది మంది తహశీల్దార్లు నేటికీ రిపోర్టు చేయలేదు. జ్యోతి (తాడూరు), గోపాల్నాయక్ (పెద్దకొత్తపల్లి), చంద్రశేఖర్ (మద్దూరు), మంజుల (నారాయణపేట), చెన్నకిష్టప్ప (మాగనూరు), నర్సింగరావు (మానవపాడు), దానప్ప (ఊట్కూరు), రాములు (నాగర్కర్నూలు, ఏఓ), రాజేందర్రెడ్డి (గద్వాల), వెంకటలక్ష్మి (కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్) విధుల్లో చేరని వారిలో ఉన్నారు. తహశీల్దార్ల పోస్టింగుల్లో రాజకీయ ఒత్తిళ్లతో పాటు, పైరవీలకు పెద్ద పీట వేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే మండలాల్లో పోటీ పడి మరీ తహశీల్దార్లు పోస్టింగులు దక్కించుకున్నారు. బదిలీల్లో శాస్త్రీయత పాటించలేదంటూ ఓ ఉద్యోగ సంఘం అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. పాత చోటే పోస్టింగులు గతంలో తాము పనిచేసిన చోటే తిరిగి పోస్టింగులు ఇవ్వాలంటూ కొందరు తహశీల్దార్లు కలెక్టర్పై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీపై వెళ్లి తిరిగి వచ్చిన వారికే పోస్టింగులు ఇవ్వాల్సి వుండగా, జిల్లాలో పనిచేస్తున్న మరో 19 మందిని బదిలీ జాబితాలో చేర్చడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తాము కోరుకున్న తహశీల్దార్లకే కేటాయించాలంటూ ఒత్తిళ్లు చేసి సఫలమైనట్లు బదిలీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. షాద్నగర్, కొత్తకోట, కేశంపేట, వెల్దండ, జడ్చర్ల, అడ్డాకుల, కొత్తకోట తదితర మండలాల్లో తహశీల్లార్ల పోస్టింగులపై ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టరేట్లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి బదిలీల్లో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగునే వున్న రంగారెడ్డి జిల్లాలో స్థానచలనం అంశంపై కొందరు తహశీల్దార్లు ట్రిబ్యునల్ను ఆశ్రయించి కలెక్టర్ ఉత్తర్వులపై స్టే పొందారు. దీంతో జిల్లాకు చెందిన తహశీల్దార్లు కూడా కోరుకున్న చోట పోస్టింగు దక్కక పోవడంతో ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. -
కావేరి రగడ
సాక్షి, చెన్నై: తమిళనాడు - కర్ణాటకల మధ్య వివాదాలకు కొదవ లేదు. ఇందులో ప్రధానమైనది కావేరి జల వివాదం. నదీ జలాల హక్కుల మేరకు తమిళనాడుకు కేటాయించాల్సిన వాటాను కర్ణాటక తుంగలో తొక్కుతోంది. మూడేళ్లుగా నీటి కోసం ఓవైపు కోర్టులో, మరో వైపు రోడ్డెక్కి గళం విప్పాల్సి వస్తున్నది. రెండేళ్ల క్రితం నెలకొన్న పరిస్థితి గత ఏడాది కూడా పునరావృతం అయ్యే అవకాశాలు కన్పించినా, చివరి క్షణంలో రుతు పవనాల కరుణతో జలాశయాలు పొంగి పొర్లాయి. చివరకు తమిళనాడు వైపుగా కావేరిలోకి నీళ్లు విడుదల చేయక తప్పలేదు. అయితే, ఈ ఏడాది రావాల్సిన వాటా ఇంత వరకు కానరాని దృష్ట్యా, మళ్లీ నీటి కోసం సమరం చేయాల్సిన పరిస్థితి రాష్ర్ట ప్రభుత్వానికి ఏర్పడి ఉంది. అదే సమయంలో ట్రిబ్యునల్ తీర్పు మేరకు కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి జల పర్యవేక్షణా కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉన్న విషయం తెలిసిందే. అయితే, యూపీఏ సర్కారు దాట వేత ధోరణిలతో కాలయాపన చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారం మారడంతో, మళ్లీ అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణా కమిటీ నినాదం తెరపైకి వచ్చింది. ఇది కాస్త రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ భగ్గుమనే పరిస్థితులను కల్పిస్తోంది.అప్రమత్తం: పీఎంగా మోడీ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీ వెళ్లి కావేరి వివాదాన్ని మోడీ దృష్టికి తెచ్చి, బోర్డు, కమిటీ ఏర్పాటుకు విన్నవించారు. అందుకు తగ్గ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టినట్టుగా సంకేతాలు వెలువడంతో కర్ణాటక సర్కారు మేల్కొంది. అఖిల పక్షాన్ని వెంట బెట్టుకెళ్లి ప్రధాని మోడీని కలిసింది. బోర్డు, కమిటీకి వ్యతిరేకంగా విజ్ఞప్తులు చేశారు. అదే సమయంలో ఇంత వరకు బోర్డు, కమిటీ ఏర్పాటుకు ఎలాంటి పనులను తాము చేపట్టలేదంటూ కేంద్రం వివరణ ఇచ్చినట్టుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మేల్కొన్నారు. లేఖాస్త్రాలు : బోర్డు, కమిటీ ఏర్పాటులో జాప్యం నెలకొనడం, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను, డెల్టా అన్నదాతల కన్నీటి గోడును వివరిస్తూ, కావేరి జలాల మీద తమకు ఉన్న హక్కులు, తమకు అనుకూలంగా ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆ లేఖలో వివరించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం ఇదే విషయంగా ప్రధాని మోడీకి లేఖాస్త్రం సంధించారు. త్వరితగతిన బోర్డు, కమిటీ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఈ జల వివాదం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆచితూచి.. : బోర్డు, కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, డీఎంకే పట్టుబడుతుంటే, బీజేపీ నేతలు అచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్న ప్రకటనలిస్తున్నారు. కావేరి జలవివాదాన్ని త్వరితగతిన సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్రమోడీని ఆ పార్టీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేషన్లు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. -
మళ్లీ కావేడి
కావేరి నిర్వహణ మండలి ఏర్పాటుకు కేంద్రం కసరత్తు రాష్ట్ర బీజేపీ నేతల్లో కలవరం పాలక కాంగ్రెస్లో ఆందోళన మండలి ఏర్పాటుపై చర్చించేందుకు పీఎంతో భేటీకి సీఎం యత్నం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులకు లేఖ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మళ్లీ కావేరి చిచ్చు రగులుతోంది. కావేరి నదీ జలాలను పరీవాహక రాష్ట్రాలు పంచుకునే విషయమై ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును అమలు చేయడానికి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు రైతుల్లో కల్లోలాన్ని రేపుతున్నాయి. ఈ పరిణామంతో రాష్ట్రంలో పాలక కాంగ్రెస్ ఆందోళన చెందుతుండగా, ఇటీవలే కేంద్రంలో తమ పార్టీకి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చే కానుక ఇదేనా అని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కలవరం చెందుతున్నారు. మొత్తానికి నీటి నిర్వహణా మండలి ఏర్పాటు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని పార్టీలకతీతంగా అందరూ అంగీకరిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని అభినందించిన సందర్భంగా కావేరి జల నిర్వహణా మండలి గురించి ప్రస్తావించారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో దీనిపై ముసాయిదా కేబినెట్ నోట్ కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు వెళ్లినట్లు తెలియవచ్చింది. ఈ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ పార్టీల్లో వణుకు ప్రారంభమైంది. జల నిర్వహణ మండలి అంటే.. కావేరి జలాలను కర్ణాటకతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఒక్కో రాష్ట్ర వాటా ఎంతో తేలుస్తూ ఇదివరకే కావేరి ట్రిబ్యునల్ ఆదేశాలను వెలువరించింది. ఈ ఆదేశాలను కర్ణాటక పాటించడం లేదని తమిళనాడు ఆరోపిస్తోంది. తదనంతర పరిణామాల్లో సుప్రీం కోర్టు కావేరి జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే దీనిపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కావేరి జల నిర్వహణా మండలి ఏర్పాటైతే కావేరి నదితో పాటు ఉప నదులు, జలశయాలు మండలి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం మాట కూడా చెల్లుబాటు కాదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు, జలాశయంలో నీటి నిల్వ తగ్గినప్పుడు ముందుగా ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాకే తమిళనాడుకు నీటిని వదులుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరిమితంగానే తమిళనాడుకు నీరు వెళుతోంది. విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు వాటాను ఎలా వదలగలమని కర్ణాటక ప్రశ్నిస్తోంది. సర్వత్రా వ్యతిరేకత కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కావేరి జల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పుపై అనేక అప్పీళ్లు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మండలిని ఎలా ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. మండలి ఏర్పాటుపై రాష్ట్రం విధానాన్ని తెలియజేయడానికి ఈ నెల 10న ప్రధాని అపాయింట్మెంట్ను కోరినట్లు శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. మండలి ఏర్పాటు విషయమై చర్చించడానికి సోమవారం శాసన సభా పక్షాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడాల్సిందిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు డీవీ. సదానంద గౌడ, అనంత కుమార్, వెంకయ్య నాయుడు, జీఎం. సిద్ధేశ్వర్లకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. కావేరి నీటి నిర్వహణా మండలిని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తింటాయని, బెంగళూరు నగరానికి కేఆర్ఎస్ నుంచి నీటి సరఫరా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో మధ్యంతర అర్జీని దాఖలు చేసిందని ఆయన తెలిపారు. -
బాధితుడికి రూ.69 లక్షల నష్టపరిహారం చెల్లిచండి
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 80 శాతం శారీరకంగా దెబ్బతిన్న బాధితుడికి రూ.69 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వాహన ప్రమాదాల పరిష్కార సంస్థ గురువారం ఆదేశించింది. ఈ మేరకు ప్రమాదం చేసిన ట్రక్కుకు ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు రూ.69 లక్షలను బాధితుడు మనోజ్ జైన్కు చెల్లించాలని ఆదేశించింది. 2008, డిసెంబర్ 20న లజపత్ నగర్లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న మనోజ్ జైన్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్కు 80 శాతం గాయాలయ్యాయి. ఈ కేసులో నంబర్ 1 గా ఉన్న ట్రక్కు డ్రైవర్ దే బాధ్యతని ట్రిబ్యునల్ పేర్కొంది.దీనికి గాను ట్రక్కు వచ్చే మొత్తం ఇన్సూరెన్స్ ను బాధితుడికి చెల్లించాలని తెలిపింది. -
మృతుడి కుటంబానికి రూ.40 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రామేశ్వర్ చౌదరీ (47) కుటుంబానికి 40లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ట్రిబ్యునల్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షి రూపేందర్ సింగ్ చెప్పిన ఆధారాలను ఎమ్ఏసీటీ అధికారి అజయ్ కుమార్ జైన్ సేకరించారు. 2011లో జూలై 12న ద్విచక్రవాహనంపై వెళుతున్న రామేశ్వర్ను వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రామేశ్వర్ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సాక్షి చెప్పిన వివరాలను డ్రైవర్, బస్సు యజమాని కోర్టు ఎదుట ఖండించారు. వీరి వాదనతో ట్రిబ్యునల్ ఏకీభవించలేదు. బస్సుకు చెందాల్సిన భీమా మొత్తాన్ని బాధితుడి కుటుంబానికి ఇవ్వాలని కోర్టు సూచించింది. -
బదిలీలపై ట్రిబ్యునల్ను ఆశ్రయించిన టీచర్లు
ఆదిలాబాద్టౌన్, న్యూస్లైన్ : విద్యాశాఖలో ఈ ఏడాది మే నెలలో సాధారణ ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించారు. మారుమూల మం డలాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు ఈ బదిలీలకు దరఖాస్తు చేసుకొని కో రుకున్న స్థానాలను ఎంచుకున్నారు. ఇంతవర కు బాగానే ఉంది. కానీ బదిలీలు జరిగి ఆ రు నెలలు గడిచినా దాదాపు వంద మంది ఉపాధ్యాయులను విద్యా శాఖ రిలీవ్ చేయలేదు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 50 శాతం ఉపాధ్యాయులను మాత్రమే రిలీవ్ చేశారు. ఈ లెక్కన నలుగురు, ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న చోట ఇద్దరిని రిలీవ్ చేశారు. ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట ఒకరిని మాత్రమే రిలీవ్ చేశారు. దీంతో బెజ్జూర్, దహెగాం, కౌటాల, కోటపల్లి, వేమనపల్లి, భీమిని, వాంకిడి మండలాల్లోని ఉపాధ్యాయులే అధికంగా పాత స్థానాల్లో కొనసాగుతున్నారు. దాదాపు వంద మంది ఉపాధ్యాయులు రిలీవ్ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రిబ్యునల్ ఆశ్రయం బదిలీల కోసం దరఖాస్తు చేసుకొని అందరు ఉపాధ్యాయులు లాగానే తాము కూడా బదిలీ అయినప్పటికీ విద్యా శాఖ అధికారులు తమ ను రిలీవ్ చేయడం లేదని 12 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వారిని వెంటనే రిలీవ్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. రిలీవ్ కోసం ట్రిబ్యునల్ను ఆశ్రయించే ఉపాధ్యాయుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ‘డీఎస్సీ’ వరకు ఎదురుచూపులే..! నిరుద్యోగ యువతతో పాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ ద్వారానైనా పోస్టులు భర్తీ అయితే తమకు రిలీవర్ వచ్చే ఆస్కారం ఉందని భావిస్తున్నారు. మన జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తూ బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులకు రిలీవ్ వచ్చేంత వరకు రిలీవ్ అయ్యే అవకాశం లేదు. అయితే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమంతో డీఎస్సీ ప్రకటన ఆలస్యమవుతోంది. కౌంటర్ దాఖలు చేశాం - అక్రముల్లాఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏకోపాధ్యాయ పాఠశాలలు, విద్యార్థులు అధికంగా ఉన్న చోట రిలీవర్ వచ్చే వరకు వారు జీవో నంబర్ 33 ప్రకారం పాత స్థానాల్లోనే కొనసాగాలి. రిలీవ్ చేస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం కలువచ్చు. కొంత మంది ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ను ఆశ్రయించి రిలీవ్ చేయాలని ట్రిబ్యునల్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీనికి కౌంటర్ ఫైల్ దాఖలు చేశాం. -
'వంశధార' సైడ్ వీయర్ కు ఓకే
శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద ‘అడ్డుగోడ’కు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: వంశధార నదీ జలాల వివాదంలో రాష్ట్రానికి తొలి విజయం దక్కింది. వంశధార రెండోదశ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద (మనవైపు నదికి) సైడ్ వీయర్ (గేట్లతో కూడిన అడ్డుగోడ) నిర్మాణానికి వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) అనుమతి ఇచ్చింది. తమకు నష్టం జరుగుతుందంటూ ఇంతకాలం మోకాలడ్డుతూ వచ్చిన ఒడిశా అభ్యంతరాలు, వాదనలను తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో మరో 8 టీఎంసీల నీటిని వాడుకోవడానికి, తద్వారా మరో 50 వేల ఎకరాలు సాగు చేసేందుకు మన రాష్ట్రానికి అవకాశం చిక్కింది. అయితే సైడ్వీయర్ విషయంలో మున్ముందు వివాదాలు తలెత్తకుండా, నిర్మాణం మొదలుకుని, దాని పనితీరు, నీటిని వాడుకోవడం వరకు అన్నింటినీ పర్యవేక్షించడానికి ట్రిబ్యునల్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది. కాట్రగడ్డ వద్ద సైడ్వీయర్ నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తును ( ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ ) జస్టిస్ ఎం.కె.శర్మ చైర్మన్గా, జస్టిస్ బి.ఎన్.చతుర్వేది, జస్టిస్ గులాం మహమ్మద్ సభ్యులుగా ఉన్న వంశధార ట్రిబ్యునల్ మంగళవారం పరిష్కరించింది. ఈ మేరకు 28 పేజీల మధ్యంతర ఉత్తర్వును ప్రకటించింది. దీంతో సైడ్వీయర్ నిర్మాణానికి ఇప్పటివరకూ ఉన్న ప్రతిబంధకాలన్నీ తొలగినట్టయింది. దీంతో మన రాష్ట్ర ఉన్నతాధికారుల్లో, రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యూరుు. ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే... ఒడిశా దాఖలు చేసిన దరఖాస్తు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సమర్పించిన పత్రాలు, ఇతరత్రా ఆధారాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రెండురాష్ట్రాల వాదనలు ఆలకించిన ట్రిబ్యునల్ గత ఆగస్టులో ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. చివరకు మంగళవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎం.కె.శర్మ ఉత్తర్వులు వెలువరించారు. ‘సైడ్వీయర్ నిర్మాణానికి అనుమతించనట్టయితే... సాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం కోరిన పరిమాణం మేరకు జలాలను వినియోగించుకోవడానికి రాష్ట్రాన్ని నిరాకరించినట్టు అవుతుందని, దానివల్ల తాము దారుణంగా నష్టపోతామని, కోలుకోలేనంతగా దెబ్బతింటామనే వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా చూపగలిగింది. తమ కేసుకు బలమైన ఆధారాలున్నాయని నిరూపించుకోవడంలో ఒడిశా విఫలమైంది. రికార్డుల్లో ఉన్న వాస్తవాలు, పత్రాలు మొగ్గును ఆంధ్రప్రదేశ్కే ఇస్తున్నాయి’’ అని ట్రిబ్యునల్ పేర్కొంది. వాస్తవాలను, కేసు నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించిన మీదట సైడ్వీయర్ నిర్మాణాన్ని ప్రతిపాదిత అనుబంధ పనులతో సహా చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్కు అనుమతిస్తున్నట్లు ట్రిబ్యునల్ తెలిపింది. ఇవీ షరతులు.. సైడ్వీయర్ నిర్మాణం, అనుబంధ పనుల నిమిత్తం ప్రస్తుతమిస్తున్న ఉత్తర్వులు తాత్కాలికమైనవేనని, అవసరమనుకున్న సందర్భంలో తామిచ్చే తదుపరి ఉత్తర్వులకు ఇవి లోబడి ఉంటాయని పేర్కొంది. ట్రిబ్యునల్ మొత్తం పది షరతులను విధించింది. అందులో ముఖ్యమైనవి... సైడ్వీయర్ నిర్మాణం, దాని పనితీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వు అమలును పర్యవేక్షించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయాలి. ‘జల ప్రవాహ నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షక కమిటీ’గా వ్యవహరించే ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. సీడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల తరఫున మొత్తం ముగ్గురికి ఇందులో స్థానమివ్వాలి. సీడబ్ల్యూసీ ప్రతినిధి చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రాజెక్టు ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం, జల వనరులు, పర్యావరణ, అటవీ, గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖల అనుమతులు, చట్టపరంగా అవసరమైన ఇతర అనుమతులు పొందడం తప్పనిసరి. సైడ్వీయర్ పనితీరునంతటినీ, గేట్ల మూసివేతతో సహా, పర్యవేక్షక కమిటీయే చూస్తుంది. కమిటీయే తన కార్యాలయ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ కమిటీకి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్యాలయ నిర్వహణ, పర్యవేక్షణ కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది. సైడ్వీయర్కు ఎగువన ప్రవాహం ఎంత ఉంది, సైడ్వీయర్ నుంచి ఎన్ని నీళ్లు వెళ్తున్నాయనే వివరాల రికార్డును కమిటీ నిర్వహిస్తుంది. వంశధార నదిలో సైడ్వీయర్కు ఎగువన ప్రవాహ జలాలు 4,000 క్యూసెక్కులకు మించి ఉన్నపుడు, దిగువన ప్రవహించే నీళ్లు 4,000 క్యూసెక్కులకు సమానంగా లేక అంతకుమించి ఉన్నపుడే దాని గేట్లను తెరవడానికి కమిటీ అనుమతించాలి. ఏ సంవత్సరంలోనైనా సరే జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్న నెలల్లో సైడ్వీయర్ ద్వారా పక్కకు వెళ్లే మొత్తం జలాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 8 టీఎంసీలకు మించకుండా ఉండేలా కమిటీ చూడాలి. ఈ 8 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే 50 శాతం జలాల్లో భాగమవుతాయి. జూన్ మాసం నుంచి నవంబర్ వరకు సైడ్వీయర్ నుంచి పక్కకు వెళ్లే జలాల మొత్తం ఎప్పుడైతే 8 టీఎంసీలకు చేరుకుంటుందో ఆ వెంటనే సైడ్వీయర్ గేట్లను మూసివేసేలా, మళ్లీ తదుపరి సంవత్సరం వర్షాకాలం వరకు అవి అదే స్థితిలో ఉండేలా కూడా కమిటీ చూస్తుంది. వంశధార నది నుంచి ప్రవహించే మొత్తం జలాలు దిగువకు పారేందుకు, వాటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు వీలుగా డిసెంబర్ 1 నుంచి మే 31 మధ్యకాలంలో సైడ్వీయర్ గేట్లు మూసివుంటాయి. ఇక నేరడిపై దృష్టి..! కాట్రగడ్డ సైడ్వీయర్ నిర్మాణంపై ఒడిశా దరఖాస్తును పరిష్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ట్రిబ్యునల్ నేరడి బ్యారేజీపై దృష్టి పెట్టనుంది. నేరడి వద్ద బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కేసు ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్లో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 22న, ఏప్రిల్ 2న జరుపుతామని ట్రిబ్యునల్ మంగళవారం ప్రకటించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్.వి.రమణమూర్తి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్లో రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాదుల బృందంలో సీనియర్ న్యాయవాదులు సి.ఎస్.వైద్యనాథన్, ఎస్.సత్యనారాయణ ప్రసాద్, ఎ.సత్యప్రసాద్, బాదన భాస్కరరావు, వై.రాజగోపాల్ తదితరులున్నారు. ఇదీ నేపథ్యం... వంశధార నది ఒడిశా-ఆంధ్ర సరిహద్దులో 29 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 82 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సెప్టెంబర్ 30, 1962న ఈ నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచుకోవాలనే ఒప్పందం కుదిరింది. వంశధార ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ, ఎడమ ప్రధాన కాలువలను నిర్మించి 17.841 టీఎంసీల నదీ జలాలను వినియోగిస్తూ 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. రెండవ దశలో 16.048 టీఎంసీలు వినియోగించుకుంటూ 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించింది. నేరడి బ్యారేజి నిర్మాణానికి 106 ఎకరాల భూమి సేకరణకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంలో ఆలస్యం అయినందున రాష్ట్ర ప్రభుత్వం వంశధార రెండవ దశ నిర్మాణాన్ని రెండు విడతలుగా చేపట్టాలని భావించింది. మొదటి దశలో గొట్టా బ్యారేజీ నుంచి కుడి ప్రధాన కాలువ నిర్మించి 0.62 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు మేరకు సైడ్వీయర్ నిర్మాణం ద్వారా మరో 8 టీఎంసీలను వినియోగించుకోవడానికి వీలు చిక్కింది. రెండవ దశ నిర్మాణంలో భాగంగా నేరడి బ్యారేజీ, ఫ్లడ్ఫ్లో కాలువ, హీర రిజర్వాయర్ నిర్మించి 45 వేల ఎకరాలకు సాగులోకి తీసుకురావడంతో పాటు గొట్టా బ్యారేజీ కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆయకట్టు స్థిరీక రణ జరుగుతుంది -
కృష్ణా కష్టాలు
-
ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్ష
-
మిగుల జలాల వాడకంలోనూ అన్యాయం
-
కృష్ణ.. కృష్ణా!
కృష్ణమ్మ బిరబిరా పరుగులు ఆగిపోనున్నాయి.. ఏరువాక వచ్చిందంటే ఆ జీవనది గలగల సవ్వడులు వినిపించేవి. కానీ ఆగస్టు తరువాతే గాని వరదనీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాల్లో ఎగువరాష్ట్రాలకు నీటివాటా కల్పించడం పాలమూరు ప్రాజెక్టులకు నీటిరాక కష్టమే..! ఇప్పటికే కృష్ణానదికి ఆలస్యంగా వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంపు వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే నాటికే ప్రాజెక్టులను నిర్మించకపోవడం, ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం, మిగులు జలాలపై సరైన వాదనలు వినిపించడం వెరసి..జిల్లా ప్రాజెక్టులకు శాపంగా మారింది. బ్రిబ్యునల్ తీర్పు అమలైతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు, ఎంజీఎల్ఐ, ఎస్ఎల్బీసీ, బీమా, డిండి, అమ్రాబాద్, కోయిల్సాగర్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిగండం ఏర్పడనుంది. ఇదే జరిగితే పాలమూరు ఎడారిగా మారడం ఖాయం.. -
ఆశలు ఆవిరి
కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : కృష్ణానది జలాల వివాదాలపై ఏర్పాటు చేసిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పు జిల్లా రైతాంగం పాలిట శరాఘాతంలా మారింది. జలయజ్ఞం ఫలాలపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. మిగులు జలాలపై ఆధారపడి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకమైంది. కేసీ కెనాల్ ఆయకట్టుపై సైతం నీలి నీడలు ప్రసరిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో వైఫల్యం ఫలితమే ఈ తీర్పనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాయలసీమ ఉద్యమ ఫలితంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 38 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడు లక్షల 20 వేల ఎకరాలకు నీరందించాలనేదే లక్ష్యం. వందలాది గ్రామాల దాహార్తిని తీర్చేందుకు కూడా ఈ పథకం ఉద్దేశించబడింది. 1989 చివరిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్లో మార్పులు చేయడంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టును ఏకంగా అటకెక్కించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టు పునరుజ్జీవం పొందింది. తెలంగాణ నేతల అసంబద్ద ఆరోపణలను లెక్కచేయకుండా ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల వరదను ప్రవహింపజేశారు. దీంతో పనులు శరవేగంగా సాగాయి. ఈ ప్రాజెక్టులో అంతర్బాగమైన గండికోట రిజర్వాయర్ 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసుకుంది. మొదటి దశ కింద 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1413.42 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఇప్పటివరకు 1205.32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిత్య కరువు పీడిత ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలో 47.500 ఎకరాలకు నీరందించే గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 712.31 కోట్ల రూపాయలు విడుదల కాగా, ఇప్పటికి 660.80 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 20,750 ఎకరాలకు నీరందించే గండికోట-సీబీఆర్ పథకానికి 1461.355 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికి 1174.40 కోట్లు ఖర్చు చేశారు. ఇక గాలేరు-నగరి రెండవ దశ కింద లక్షా 32 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1000.88 కోట్ల రూపాయలు కేటాయించగా, 147.34 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. జిల్లాకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టు ఉనికి ట్రిబ్యునల్ తీర్పు వల్ల అంధకారంలో పడిపోయింది. ఇటీవలే గండికోట రిజర్వాయర్కు కృష్ణా జలాలను కొద్దిమేర తరలించారు. తమకు పునరావాసం కల్పించనందున ఐదు గ్రామాల ప్రజలు అభ్యంతరాలు తెలుపడంతో నీటి సరఫరా ఆగింది. బహుశా గండికోట రిజర్వాయర్కు నీటి తరలింపు ఇదే మొదటి, ఆఖరుదేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 40 టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఇక వెలిగొండ ప్రాజెక్టు ద్వారా బద్వేలు నియోజకవర్గంలోని కొంత ఆయకట్టుకు నీరందడం దుర్లభంగా మారింది. పురాతన కేసీ కెనాల్ భవితపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నుంచి నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల జిల్లా ఆయకట్టు అవసరాల కోసం కొన్నేళ్లుగా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కరా్ణాటకకు అనుమతి ఇచ్చిన నేపధ్యంలో కృష్ణానీరు సరిపడు స్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్కు చేరుకుంటాయన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో కేసీ ఆయకట్టుకు సైతం గడ్డురోజులు దాపురించనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం: వాసిరెడ్డి పద్మ
-
డోలాయమానంలో ప్రాజెక్టుల పరిస్ధితి
-
సీమ కృష్ణా బేసిన్లోకి రాదట!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలని కర్ణాటక భావిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయానంతర పరిస్థితుల్లో తాము చేసే వాదనను ఇతర ప్రాంతాలవారు పట్టించుకోరనేది ఆ రాష్ట్ర ఎత్తుగడ. అందులో భాగంగా రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రాదంటూ ట్రిబ్యునల్ ముందు కొత్త వాదన విన్పిస్తోంది. రాష్ట్రానికి నీటి కోటాను తగ్గించేలా చేసి తాను అదనపు నీటిని పొందాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కృష్ణానది నీటిపై ఆధారపడిన మన రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బ్రజేశ్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల్ని చేసింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు మిగులు జలాల నుంచి మరో 190 టీఎంసీలు కేటాయించింది. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించిన ట్రిబ్యునల్ కర్ణాటకకు 177, మహారాష్ట్రకు 81 టీఎంసీల చొప్పున కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాబేసిన్లో తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే ఉన్నాయని, వీటికి పాత కేటాయింపులైన 811 టీఎంసీలే ఎక్కువని ఇంతవరకు కర్ణాటక వాదిస్తోంది. తెలుగుగంగకు నీటి కేటాయింపులు చేయడం కృష్ణా బేసిన్లోని ప్రజలకు అన్యాయం చేయడమేనని అంటోంది. ఇదే క్రమంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కరువు పీడిత ప్రాంతం ఎక్కువ అని, అందుకోసం ఎక్కువ నీటిని కేటాయించాలని కోరుతూ మన రాష్ర్టం గతంలో ట్రిబ్యునల్కు ఒక నివేదికను సమర్పించింది. రాష్ర్టంలోని కృష్ణాబేసిన్లో సుమారు 89 వేల చదరపు కిలోమీటర్ల మేర కరువు పీడిత ప్రాంతం ఉందని ఆ మేరకు నీటి కేటాంపులు కావాలని కోరింది. కర్ణాటకలో 52 వేల చదరపు కిలో మీటర్ల మేరకే కరువు పరిస్థితులున్నాయని తెలిపింది. కానీ కర్ణాటక.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అదనుగా భావించి రాయలసీమ ప్రాంతం కృష్ణాబేసిన్ పరిధిలోకి రాదంటూ అడ్డగోలుగా వాదిస్తోంది. రాయలసీమను లక్ష్యంగా చేసుకున్నా మిగతా ప్రాంతాలవారు మాట్లాడే పరిస్థితి లేదని కర్ణాటక భావిస్తోంది. రాయలసీమ కృష్ణా బేసిన్ పరిధిలోకి రానందున ఆంధ్రప్రదేశ్లో కరువు పీడిత ప్రాంతం తమ రాష్ట్రంలో కంటే తక్కువే ఉందని వాదిస్తోంది. ఆ మేరకు మన రాష్ట్రానికి నీటి కేటాయింపులను కుదించాలని కోరుతోంది. ఈ దృష్ట్యా దిగువకు మిగులు జలాలను విడుదల చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నది. ఏపీలోని తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలకు 811 టీఎంసీల నీరు సరిపోతుంద ంటూ మిగులు జలాలపై మనకు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మిగులు జలాల్లో 203 టీఎంసీలు తమకు కేటాయించాలని ఆ రాష్ర్టం డిమాండ్ చేస్తోంది. ఈ వాదనను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంటే...కృష్ణా జలాలపై ఆధారపడ్డ హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. వాస్తవానికి కర్నూలు-కడప (కెసి) కెనాల్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటి సరఫరా ఒప్పందం సుమారు 150 సంవత్సరాల క్రితమే ఉంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసి నీటి కేటాయింపుల్ని చేశారు. అయితే ప్రస్తుతం కర్ణాటక వాదనలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై రాష్ర్ట ప్రభుత్వం తన వాదన లను గురువారం వినిపించనుంది.