
‘అద్వానీపై ప్రధాని మోదీ కుట్ర’
అద్వానీపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు.
‘సీబీఐ.. ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించింది. ఈసారి అద్వానీ రాష్ట్రపతి అవుతారని ప్రచారం జరుగుతోంది. అద్వానీ అవకాశాలకు ప్రధాని మోదీ గండికొట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలర’ని లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
2002 గుజరాత్ అలర్ల సమయంలో తనను అద్వానీ కాపాడారన్న విశ్వాసం కూడా మోదీకి లేదని ఆక్షేపించారు. ‘గుజరాత్ లో అల్లర్లు జరినప్పుడు మోదీని అద్వానీ కాపాడారు. ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజపేయి కోరినా అద్వానీ అడ్డుపడ్డార’ని లాలూ చెప్పారు.