ముంబై హై అలర్ట్ | Mumbai on high alert after intelligence input about terror attack | Sakshi
Sakshi News home page

ముంబై హై అలర్ట్

Published Thu, Jan 22 2015 4:37 PM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

ముంబై హై అలర్ట్ - Sakshi

ముంబై హై అలర్ట్

ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.

ముంబై: ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ అలయంతోపాటు దేశంలోని పలు లక్ష్యాలపై జనవరి 28వ తేదీలోగా దాడులు జరిపేందుకు పాకిస్థాన్‌కు చెందిన జమాత్ ఉద్ దవా, లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమ్మద్, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ టైస్టు సంస్థలు భారత్‌కు నాలుగు వేర్వేరు బృందాలను పంపించాయంటూ భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహారాష్ట్ర పోలీసులతోపాటు ముంబై పోలీసులను అప్రమత్తం చేశాయి.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ సమాచారంతో ఉలిక్కి పడిన భారత్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయమే ఉగ్రవాదుల ప్రధాన టార్గెట్ అని తెల్సినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement