నా హాజరు శాతాన్ని వక్రీకరించారు | My attendance rate has been distorted, MP Jithender reddy anger over English news paper | Sakshi
Sakshi News home page

నా హాజరు శాతాన్ని వక్రీకరించారు

Published Sat, Mar 25 2017 3:43 AM | Last Updated on Thu, Aug 9 2018 8:30 PM

నా హాజరు శాతాన్ని వక్రీకరించారు - Sakshi

నా హాజరు శాతాన్ని వక్రీకరించారు

ఆంగ్ల పత్రికపై ఎంపీ జితేందర్‌ రెడ్డి ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన హాజరు శాతాన్ని వక్రీకరించి ప్రచురించిందంటూ ఓ ఆంగ్ల పత్రికపై టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత జితేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీల హాజరు శాతానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ ఓ ఆంగ్ల పత్రిక శుక్రవా రం ఎడిషన్‌లో వార్తను ప్రచురించింది. అందులో అత్యల్పంగా 9% మాత్రమే తాను సభకు హాజరైనట్టు పేర్కొందంటూ జితేందర్‌ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.

తన హాజరు శాతం సదరు పత్రిక పేర్కొన్న దానికంటే అత్యధి కంగా ఉందని, ఈ విషయంలో నిజాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు..సదరు పత్రిక బహి రంగ క్షమాపణ చెప్పి.. తన హాజరు శాతాన్ని పక్కాగా తిరిగి ప్రచురించాలని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో కూడా జితేందర్‌రెడ్డి ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. సదరు పత్రిక ఎడిటర్, పబ్లిషర్లకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement