లక్నో: ఉత్తరప్రదేశ్లోని బాందాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు బుధవారం అర్థరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... పలువురు గాయపడ్డారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.