ఇన్సులిన్ ఇచ్చి.. ఇద్దరిని చంపేసిన నర్సు! | nurse kills two patients with insulin | Sakshi
Sakshi News home page

ఇన్సులిన్ ఇచ్చి.. ఇద్దరిని చంపేసిన నర్సు!

Published Mon, May 18 2015 8:16 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

ఇన్సులిన్ ఇచ్చి.. ఇద్దరిని చంపేసిన నర్సు! - Sakshi

ఇన్సులిన్ ఇచ్చి.. ఇద్దరిని చంపేసిన నర్సు!

బ్రిటన్లోని ఓ ఆస్పత్రిలో ఇద్దరు రోగులను ఇన్సులిన్ ఇచ్చి చంపేసిన కేసులో నర్సుపై నేరం రుజువైంది. ఈ ఘటన 2011లో జరిగింది. విక్టోరినో చువా అనే మగ నర్సు కావాలనే ఈ హత్య చేసినట్లు కోర్టులో రుజువైంది. లండన్కు 200 మైళ్ల దూరంలో ఉన్న స్టాక్పోర్ట్ నగరంలోగల స్టెప్పింగ్ హిల్ ఆస్పత్రిలో పనిచేసేటప్పుడు సెలైన్ బ్యాగులలోకి, యాంపిల్స్లోకి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసి ఈ హత్యలకు పాల్పడ్డాడు.

ఇతర నర్సులకు అతడు ఇలా చేసిన విషయం తెలియకపోవడంతో వాళ్లు కూడా ఇన్సులిన్ ఇచ్చేవారు. దాంతో దాని డోస్ ఎక్కువైపోయి.. ఇద్దరు రోగులు మరణించారు. ''నాలో రాక్షసుడున్నాడు. ఓ దేవుడు దెయ్యంగా మారాడు'' అంటూ అతడు రాసుకున్న నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దాన్ని సాక్ష్యంగా పరిగణించిన కోర్టు.. అతడిపై నేరం రుజువైనట్లు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement