పెట్రోల్ ధర పెరిగింది! | Petrol price to go up by Rs 0.13 per litre, diesel price to go down by Rs 0.12 per litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధర పెరిగింది!

Published Wed, Nov 30 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

పెట్రోల్ ధర పెరిగింది!

పెట్రోల్ ధర పెరిగింది!

దేశంలో పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ ధరలు తగ్గాయి.

కరెన్సీ కష్టాలకు తోడు దేశప్రజలకు మరో చిన్న షాక్. లీటరు పెట్రోల్ ధర 0.13 పైసలు పెరిగింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి నిర్ణయాన్ని వెల్లడించాయి. అదే సమయంలో డీజిల్ ధర 0.12 పైసలు (ఒక లీటరుకు)తగ్గింది. కొత్త ధరలు నేటి(నవంబర్ 30) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

నవంబర్ 15న  లీటరు పెట్రోల్పై రూ.1.46 పైసలు, లీటరు డీజిల్పై రూ.1.53 పైసలు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్ ధరలను సమీక్షించే కంపెనీలు.. చివరిసారిగా నవంబర్ 15న ధరలు తగ్గించాయి. నేటి సమీక్షలో పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు తగ్గిస్తున్నట్టు తెలిపాయి.  కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.66.10, లీటరు డీజిల్ రూ.54.57గా ఉండనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement