రండి.. చేరండి: భారత్‌లో ఐసిస్‌ కలకలం! | Posters inviting youth to join ISIS surface in Bihar | Sakshi

రండి.. చేరండి: భారత్‌లో ఐసిస్‌ కలకలం!

Mar 19 2017 11:39 AM | Updated on Sep 5 2017 6:31 AM

రండి.. చేరండి: భారత్‌లో ఐసిస్‌ కలకలం!

రండి.. చేరండి: భారత్‌లో ఐసిస్‌ కలకలం!

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌‌)లో చేరాలని యువతను ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది.

సహస్ర (బిహార్‌): అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌‌)లో చేరాలని బిహార్‌ యువతను ఆహ్వానిస్తూ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. బిహార్‌ సహస్రా జిల్లాలోని నౌహట్టా ప్రాంతంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ముఖాలకు మాస్క్‌ పెట్టుకున్న ఐసిస్‌ ఉగ్రవాదుల ఫొటోలు ఈ పోస్టర్లలో ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నౌహట్టాలోని కరెంటు స్తంభాలకు దాదాపు అంటించిన దాదాపు మూడు పోస్టర్లను పోలీసులు గుర్తించారు.

బిహార్‌ యువతను ఆహ్వానిస్తూ ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఈ పోస్టర్లలో ఐసిస్‌ పేరు, జెండా కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భద్రతపరమైన అలర్ట్‌ జారీచేశామని, పోస్టర్లు ఎవరు అంటించారనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ పోస్టర్ల గురించి స్థానిక గ్రామస్తులు సమాచారం ఇచ్చారని, వీటిని తాము స్వాధీనం చేసుకున్నామని, కరుడుగట్టిన నేరగాళ్ల హస్తం ఈ పోస్టర్ల వెనుక ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ లక్నోలో ఇద్దరు ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement