రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మృతి | sangareddy people killed in Karnataka road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మృతి

Published Wed, Aug 7 2013 10:30 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందినవారు దుర్మరణం చెందారు.

హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందినవారు దుర్మరణం చెందారు. భాగల్ కోట్ కొల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగిన ఈ దుర్ఘటనలో అయిదుగురు  సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇండికా కారు (AP 13 S 5405) అదుపు తప్పి గ్రానైట్ రాళ్ల లోడ్తో వెళుతున్న లారీని ఢీకొంది. దాంతో వారు అక్కడకక్కడే చనిపోయారు.

మృతులు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శశి భూషణ్, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాబిన్, శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. వీరంతా గోవా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలకు బీజాపూర్లోని అల్ అమీల్ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి మృతదేహాలను బంధువులు సంగారెడ్డికి తీసుకురానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement