బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్‌! | six rebel Trinamool MLAs to join bjp | Sakshi

బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్‌!

Aug 7 2017 2:25 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్‌! - Sakshi

బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్‌!

కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ పాగా వేయబోతున్నది.

అగర్తలా: కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ పాగా వేయబోతున్నది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరబోతున్నారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓటు వేయడంతో ఇప్పటికే ఈ ఆరుగురిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకత్వం వేటు వేసింది. గతంలో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన వీరు.. అనంతరం తృణమూల్‌లోకి జంప్‌ కొట్టారు.

బీజేపీ 'ఆపరేషన్‌ త్రిపుర'ను కూడా ప్రారంభించినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో కాషాయదళం ఎన్నడూ ఒక్క సీటును గెలువలేదు. ఇక్కడ గత కొన్నాళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల కూటమి రాష్ట్రంలోని 60 స్థానాలకు 51 స్థానాలు గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు కమలదళంలో చేరడం.. ఆ పార్టీకి కొత్త ఊపునిచ్చేదే. ఈ చేరికలతో త్రిపురలో బోణీ కొట్టాలని, రాజకీయంగా గట్టి పునాది ఏర్పరుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ నేతృత్వంలోని తృణమూల్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సోమవారం లాంఛనంగా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వీరు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement