Tripura
-
'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!
నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ. త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్ సైట్ హోదా సొంతమైన చరిత్ర.ఈశాన్య రాష్ట్రాల టూర్లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. జనపద కథనం...శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది. పెద్ద శివుడు ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డులుంటాయి. ఏఎస్ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్ జారీ చేసే లోపు చూసివద్దాం.ఉనకోటి ఎక్కడ ఉంది!త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. ఎలా వెళ్లాలంటే... సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. సమీప రైల్వేస్టేషన్ కుమార్ఘాట్లో ఉంది. ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.ఎప్పుడు వెళ్లవచ్చు!ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్ నుంచి మే నెల మధ్యవాతావరణం అనువుగా ఉంటుంది. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: భావోద్వేగాల 'కిజిక్ తివాచీ'..!) -
జైస్వాల్ సొంత అన్న.. తొలి హాఫ్ సెంచరీ! టీమిండియా ఓపెనర్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్లో జన్మించిన యశస్వి జైస్వాల్కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.ఇటీవలే అరంగేట్రంయశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.అంతేకాదు.. ఈ మ్యాచ్లో ఒక వికెట్ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.డ్రాగా ముగిసిన మ్యాచ్కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఒకే ఒక్క విజయంకాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.టీమిండియా ఓపెనర్గా పాతుకుపోయిన యశస్విఅనంతరం.. ముంబైతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్గా పాతుకుపోయాడు.ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్! -
AITA: అనిల్ జైన్పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)లో అనూహ్య పరిణామం... అధ్యక్షుడు అనిల్ జైన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన టెన్నిస్ సంఘాలు శనివారం ఢిల్లీలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేశాయి. చిత్రంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించతలపెట్టిన రోజే ఈజీఎం ఏర్పాటు చేశారు. ఓవైపు ఎన్నికల కోసం ఏజీఎం నిర్వహించాల్సి ఉండగా... కోర్టు మార్గదర్శకాల మేరకు ఫలితాలను సీల్డ్ కవర్లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.కారణం ఇదే..మరోవైపు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాజ్యసభ ఎంపీ అనిల్ జైన్ తన కుటుంబంతో సహా చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జైన్ మాట్లాడుతూ ఉన్నపళంగా ఈజీఎం నిర్వహణ నియమావళికి విరుద్ధమన్నారు.ఇదంతా కుట్ర!ఇది నిర్వహించాలంటే కనీసం మూడు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని, ‘ఐటా’ నియమావళిలోని 15వ క్లాజ్ ప్రకారం ఇలాంటి సమావేశాలు చట్ట విరుద్ధం. ఈ నెల 23న నోటీసు ఇచ్చి అంతలోనే 28న ఈజీఎం నిర్వహించాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘ఇదంతా కుట్ర! నేను ఐటా, రాష్ట్రాల సంఘాల్లో స్పోర్ట్స్ కోడ్ను అమలు చేయాలని కోరినందుకే వారంతా కక్ష గట్టి నాపై బదులు తీర్చుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదుమరోవైపు.. రాష్ట్ర సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదన్నారు. ‘కోడ్కు ఎవరూ వ్యతిరేకంగా లేరు. కేంద్ర క్రీడాశాఖ ప్రకారం అమలు చేయాల్సిందే. అనిల్ జైన్ చెబుతున్నట్లు ఇదే సమస్య అయితే గత నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఎందుకు మాట్లాడలేదు? ఏజీఎం, ఎన్నికల ప్రక్రియను ప్రకటించినపుడు ఎందుకు చర్చించలేదు’ అని రాష్ట్ర సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఈసారి ‘ఐటా’ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, క్రీడాకారులకు మద్దతుగా ఇవ్వాలనుకుంటున్నామని తద్వారా భారత టెన్నిస్ ముఖచిత్రాన్ని మార్చుతామని ఆయన తెలిపారు. అయితే, అనిల్ జైన్పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకున్నట్లు తాజా సమాచారం. ఏఐటీఏ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో ఈ విషయాన్ని పంచుకున్నాయి. చదవండి: Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’! -
భారత్లోకి చొరబాటు.. త్రిపురలో ఐదుగురి బంగ్లాదేశీయులు అరెస్ట్
అగర్తల: బంగ్లాదేశ్కు చెందిన ఐదుగురిని త్రిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.సరిహద్దు గుండా భారత్లోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీయులను ఆదివారం త్రిపురా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు.‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ ప్రారంభించాం. వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు. అరెస్ట్ అయిన ఐదుగురు బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లోని చపాయ్ నవాబ్గంజ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లా పౌరులు భారత్లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి. -
త్రిపురను ముంచెత్తిన వరదలు.. రూ. 15 వేల కోట్ల నష్టం
త్రిపురను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాకు తెలిపారు. వరదల కారణంగా 24 మంది మృతిచెందినట్లు తెలిపారు. 1.28 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు.అఖిలపక్ష సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ఏర్పడిన నష్టం రూ.15 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. క్లిష్ట సమయాల్లో కలిసికట్టుగా పని చేస్తామని అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పంపిణీ చేసేందుకు సరిపడా ఆహార ధాన్యాలు, ఇంధనం నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మార్కెట్లపై నిఘా సారిస్తుందని అన్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం త్రిపురలో వరద పరిస్థితులు నెమ్మదించాయి. పలు నదులు ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తున్నాయి. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారి కోసం వైమానిక దళం హెలికాప్టర్ల నుండి నాలుగు వేలకు పైగా ఆహార ప్యాకెట్లను జారవిడిచింది. ఇదిలావుండగా బంగ్లాదేశ్లో వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. ఆ దేశంలోని 11 జిల్లాల్లో వరదలకు దాదాపు 49 లక్షల మంది ప్రభావితులయ్యారు. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ తమ దేశానికి సహాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కోరుతున్నారు. -
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్కు చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్కప్లో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్కు ఆడిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
త్రిపుర: ‘మా ఇళ్లు దగ్ధమౌతుంటే మీరెక్కడున్నారు?’
త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు. STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.READ: https://t.co/qbcXkrArtBVIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024 -
రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్లో సెల్ఫీ ఉందని తెలుసా..!
స్మార్ట్ఫోన్ యుగం వచ్చాక ఎక్కడికైన వెళ్లినా..ఏదైన వింత చోటు కనిపించినా.. వెంటనే ఫోన్కి పనిచెప్పేస్తారు. సెల్ఫీలు దిగేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం చేస్తోంది నేటి యువత. ఒకప్పటిలా కెమెరామెన్తో ఫోటోలు తీయించుకునే పనే లేదు. నచ్చిన యాంగిల్స్లో మనకు మనమే ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలు మోజు నేటిది మాత్రం కాదు. వందేళ్ల ఏళ్ల క్రితమే దీనికి క్రేజ్ ఉంది. పైగా నాటి కాలంలోనే వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు కూడా. ప్రపంచంలోనే తొలి సెల్ఫీని అక్టోబర్ 1839లో రాబర్ట్ కార్నెలియస్ తీశారు. ఆయన డాగ్యురోటైప్ టెక్నిక్ని ఉపయోగించారు. ఇది అయోడిన్-సెన్సిటైజ్డ్ సిల్వర్ ప్లేట్, పాదరసం ఆవిరిని ఉపయోగించే ప్రారంభ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. ఆయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తన ఇంటి పెరట్లో తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగేందుకు దాదాపు మూడు నుంచి 15 నిమిషాల వ్యవధి తీసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ ఫోటో వెనుక సవివరంగా వివరించాడు కూడా. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. అయితే మన ఇండియాలో తొలి సెల్ఫీ దిగింది రాజకుటుంబానికి చెందిన ఓ జంట. రాచరికపాలన సాగే త్రిపుర రాష్ట్రంలో సెల్ఫీ ఫోటోగ్రాఫ్ 1880లో దిగడం జరిగింది. మహారాజా బీర్ చంద్ర మాణిక్య అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహినీ దేవి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాజు మంచి ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు. అతను అనేక ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. అంతేగాదు ఆయన చనిపోయేంత వరకు ఫోటోగ్రాఫిక్ సోసైటీలో సభ్యుడు కూడా.రాజు కారణంగా ఆ కళపై మహారాణి కూడా మక్కువ పెంచుకుంది. అలా ఆమె కూడా ఫోటోగ్రాఫర్గా మారడం జరిగింది. చెప్పాలంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కళలో ప్రావీణ్యం పొందిన తొలి భారతీయ మహిళ ఆమెనే కావడం విశేషం. కాగా, త్రిపుర మహారాజు తీసుకున్న సెల్ఫీలో మహారాణితో కౌగిలించుకుని దిగినట్లుగా ఫోటో కనిపిస్తుంది. అంతేగాదు ఈ ఫోటోనే భారతదేశంలోని తొలి సెల్ఫీగా నిలిచింది కూడా.(చదవండి: దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!) -
త్రిపుర: సీపీఐ నేత హత్య.. వ్యాపార సంస్థలు బంద్
అగర్తల: దక్షిణ త్రిపురలోని రాజ్నగర్లో సీపీఐ నేత బాదల్ షీల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ హత్య సంచలనంగా మారింది. జిల్లా పరిషత్ అభ్యర్థి షిల్ను బీజేపీ మద్దతు కలిగిన గూండాలు హత్య చేశారని త్రిపుర ప్రతిపక్ష సీపీఐ (ఎం) ఆరోపించింది. ఈ హత్యకు నిరసనగా నేడు (ఆదివారం) 12 గంటల రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది.ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని రాష్ట్ర బీజేపీ తెలిపింది. దక్షిణ త్రిపుర ఎస్పీ అశోక్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేత షీల్పై కొందరు దాడి చేశారని, నిందితులను ఇంకా గుర్తించలేదన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారన్నారు. తాము ఈ కేసును సుమోటోగా తీసుకున్నామన్నారు.రాజ్నగర్ మార్కెట్లో షీల్పై కత్తులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అగర్తలలోని ప్రభుత్వ జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షీల్ మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు షీల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ ఇది బాదల్షీల్ హత్య కాదని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఈ దారుణ హత్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చామన్నారు. బంద్ ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గొత్తికోయల ‘అరణ్య’ రోదన
వాళ్లకు గూడూ లేదు, నీడా లేదు... భూములూ లేవు, భుక్తీ లేదు... హక్కులు లేవు, అసలు గుర్తింపే లేదు. ఏ పేరుతోనైతే వాళ్లను పిలుస్తున్నామో అది వాళ్ల పేరే కాదు. పక్క రాష్ట్రం నుంచి పొరపాటునో గ్రహపాటునో తెలుగు నేలకు వలస వచ్చి దీనస్థితిలో జీవనపోరాటం సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన హక్కుల కోసం చేయిచాచి ఆర్ద్రతగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆ వ్యధాభరిత ఆదివాసీలే ‘గొత్తికోయలు’. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా వీరు ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా పొందలేక పోతున్నారు. ఈ అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా దక్కుతాయి.దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతం మధ్యప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు 1980వ దశకం నుంచీ వామపక్ష తిరుగుబాటు ఉద్యమాలు ఊపందుకున్నాయి. అడవులపై నక్సలైట్ల ఆధిపత్యం పెరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల పునర్విభజనలో ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లో భాగమైంది. నక్సలైట్లకు వ్యతిరేకంగా మహేంద్ర కర్మ అనే కాంగ్రెస్ నాయకుడు 2005లో సల్వా జుడుమ్ (గోండి భాషలో ‘పవిత్ర వేట’) పేరుతో ఆదివాసులతో సాయుధ పోరాటం మొదలుపెట్టారు. రెండువైపుల తుపాకి గర్జనల మధ్య ఆదివాసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఐతే సల్వా జుడుమ్ శిబిరాలలో తలదాచుకోవాలి, లేదంటే నక్సలైట్ల వేధింపులను భరించలేక ఊరొదిలి పారిపోవాలి.అలా వేలాది మంది ఆదివాసులు ప్రాణాలు అరచేత పట్టుకొని దండకారణ్యంలోని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషాలకు వలసపోయారు. తెలుగు రాష్ట్రాలలో వారిని గొత్తికోయలు అని పిలవడం మొదలుపెట్టారు. వాస్తవానికి గొత్తికోయలు అనే పేరు ఏ ఆదివాసీ తెగలకూ లేదు. గొత్తి అంటే కొండలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అటవీ ప్రాంతంతో పోలిస్తే దండకారణ్యంలోని బీజాపూర్, సుకుమా, దంతేవాడ సముద్రమట్టం నుంచి ఎక్కువ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కారణంగా వారిని గొత్తికోయలు అని వ్యవహరించడం మొదలుపెట్టారు. వారిలో ఎక్కువ శాతం గోండులలో ఉపజాతులైన మురియా తెగకు, మిగతావారు దొర్ల తెగకు చెందినవారు. 1980వ దశకం నుంచీ వలసలు సాగినప్పటికీ 2005 నుంచి 2011 మధ్య సల్వా జుడుమ్ కాలంలోనే అధిక శాతం ఆదివాసులు చెల్లాచెదురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఉన్నచోటి నుంచి దేశంలో మరో ప్రాంతానికి వలసపోయి, ఎటువంటి ఆదరువూ లేనివారిని స్వదేశ విస్థాపితులుగా (ఇంటెర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్–ఐడీపీస్) వ్యవహరిస్తారు. బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జనాభాకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన సమాచారం లేదు. ఆదివాసుల బాగు కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో 60 వేల మంది దాకా గొత్తికోయలు ఉన్నారు. అడవి మధ్యలో పోడు చేసుకొని పొట్టపోసుకోవడం తప్ప వారికి మరో ఉపాధి మార్గం తెలియదు. దేశీయంగా విస్థాపితులైన ఆదివాసుల గుర్తింపునకు, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్– ఆర్ఓఎఫ్ఆర్) తీసుకువచ్చింది. 2008లో కొద్దిమంది స్థానిక గిరిజనులకు భూమిపై హక్కు కల్పించి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినవారిని పక్కనపెట్టారు. ఆ చట్టం నిబంధనల ప్రకారం 2005 డిసెంబర్ 13కు ముందు వలస వచ్చి మూడు తరాలుగా 75 ఏళ్లపాటు సాగు చేసుకుంటున్న వాళ్లకే భూములపై హక్కు దఖలు పడుతుంది. అందులోనూ ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల వరకు భూమిపై హక్కు కల్పిస్తారు. అయితే, ప్రస్తుతం భూమి హక్కుల కోసం ఎదురుచూస్తున్న గొత్తికోయలు 2016 తర్వాత వలస వచ్చారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అంతకు ముందటి ఉపగ్రహ చిత్రాలను తమ వాదనకు మద్దతుగా చూపుతున్నారు. అయితే, నిర్దిష్ట ప్రదేశానికి పరిమితం కాకుండా దట్టమైన అడవులలో పోడు చేసుకుంటూ జీవనం సాగించే ఆదివాసుల అచూకీని ఉపగ్రహాలు ఎలా నిర్ధారిస్తాయన్న వాదనను అధికారులు పట్టించుకోవడం లేదు.రెండు రాష్ట్రాలలోని 28 జిల్లాల నుంచి దాదాపు 13 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కు కోసం నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. 2006 నుంచి ఇటీవలి కాలం వరకు వీటిలో అధిక శాతం దరఖాస్తులను తిరస్కరించారు. దరఖాస్తుదారులలో మైదానప్రాంత గిరిజనేతరులు ఉన్నారనీ, అక్రమంగా అటవీ భూములు సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ అధికారులు వాదిస్తున్నారు. దరఖాస్తుల తిరస్కారాలకే పరిమితమైన అధికారులు నామమాత్రంగానైనా అర్హులకు పట్టాలు అందించడం లేదు.భూమి హక్కుతో సంబంధం లేకుండా అడవి బిడ్డలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తే కనీసం రాజ్యాంగం ప్రసాదించిన విద్యా ఉద్యోగ ప్రయోజనాలైనా వీరికి దక్కి ఉండేవి. రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పలు ప్రాథమిక హక్కులను కూడా వారు పొందలేకపోతున్నారు. వాళ్ల పిల్లలకు విద్య ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. గొత్తికోయలు అడవి మధ్యలో ఉండటం వల్ల సుదూర మైదాన ప్రాంతాల్లోని పాఠశాలలకు వెళ్లలేరు. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు బ్రిడ్జ్ స్కూళ్లను ప్రారంభించినప్పటికీ, ప్రాథమిక విద్య తర్వాత ముందుకు సాగడం లేదు. బాలికలు తమ ఇళ్లలో పనులకు, చిన్న పిల్లలను చూసుకోవడం వరకే పరిమితమవుతున్నారు. బాలురు అతికష్టంగా హైస్కూలు దాకా వచ్చి అర్ధాంతరంగా ఆపేసి కూలీలుగా మారిపోతున్నారు. షెడ్యూల్డ్ తెగలుగా గుర్తింపు లేకపోవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రవేశం పొందలేకపోతున్నారు. చదువులే ఇలా ఉన్నాయంటే, ప్రజారోగ్యం మరీ దయనీయంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అడవి బిడ్డలకు అందని చందమామలు. అప్పుడప్పుడు నర్సులు రావడం, గర్భిణులను సమీప ఆరోగ్య కేంద్రాలకు తీసుకుపోవడం మినహా మిగతావాళ్లకు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందడం లేదు. హక్కులు దక్కకపోవడమే కాకుండా పుండు మీద కారం చల్లినట్లు పోలీసు కేసులు గొత్తికోయలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా గూడేలలో వయసుతో నిమిత్తం లేకుండా పురుషులు సమీప పోలీసు స్టేషన్లకు వెళ్లి హాజరు వేసి రావలసి ఉంటుంది. అలా వెళ్లినవారితో చాకిరీ చేయిస్తుంటారు. అప్పుడప్పుడు తప్పుడు కేసులతో నిరుత్సాహ పరుస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు గిరిజన గూడేలను రెవెన్యూ గ్రామాలుగా గానీ, అటవీ గ్రామాలుగా గానీ గుర్తించరు. కాబట్టి, ప్రభుత్వ లెక్కల ప్రకారం గొత్తికోయల ఆవాసాలు మనుగడలో ఉండవు. తరచుగా అటవీ అధికారులు వారిని ఖాళీ చేయించడం, వారు మరో చోట గూడు చూసుకోవడం పరిపాటిగా మారింది. గొత్తికోయలకు గుర్తింపు ఇవ్వాలనే విషయంలో రెండు రాష్ట్రాలలోని పాలక, ప్రతిపక్షాలకు అభ్యంతరాలు లేవు. కానీ తగిన చొరవ కరవైనందున సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి కాడువడిన అడవిబిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందించాలి. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికులు, స్పందించే మనసున్న వ్యక్తులు కూడా దగాపడిన అడవి బిడ్డలకు ఊతమివ్వాలి. విద్య, వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి.త్రిపురలో దశాబ్దాలుగా నలుగుతున్న ఇలాంటి సమస్యను కేంద్ర ప్రభుత్వం ఇటీవల పరిష్కరించింది. 1990వ దశకంలో మిజోరంలో జాతుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. బ్రూ– రియాంగ్ తెగకు చెందిన ఆదివాసులు పెద్దఎత్తున త్రిపురకు వలస వెళ్లారు. మన గొత్తికోయల మాదిరిగానే వాళ్లు కూడా స్వదేశంలో శరణార్థులై గుర్తింపు, హక్కులు లేకుండా రెండు దశాబ్దాలు దయనీయమైన పరిస్థితుల్లో జీవించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించింది. వలస వచ్చిన 43 వేల మంది బ్రూ– రియాంగ్ ఆదివాసులకు త్రిపురలో పునరావాసం కల్పించింది. వాళ్లకు గుర్తింపునిచ్చి ఇళ్లు కట్టించింది. వాళ్ల జీవితాలలో వెలుగు నింపేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల గొత్తికోయలు కూడా సరిగ్గా బ్రూ– రియాంగ్ ఆదివాసుల మాదిరిగానే ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలు సత్వరం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
అంతలోనే ఎంత విషాదం : మాజీ మిస్ ఇండియా కన్నుమూత
మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా కన్నుమూసింది. కేన్సర్తో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆమె 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 22న ఆసుపత్రి చేరిన రింకీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస తీసుకుంది. రింకీ చక్మా మరణాన్ని సోషల్మీడియా ద్వారా ప్రకటించిన మిస్ఇండియా ఆర్గనైజేషన్ సంతాపాన్ని తెలిపింది. 2022 నుండి రింకీ రొమ్ము కేన్సర్తో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో తగ్గినట్టే తగ్గి, మహమ్మారి మళ్లీ విజృంభించింది. ఊపిరితిత్తులు, తలకు బాగా వ్యాపించింది. ఫలితంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సంబంధిత ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి, సెలవంటూ వెళ్లిపోయింది. View this post on Instagram A post shared by Rinky Chakma (@rinkychakma_official) గత నెలలో, రింకీ తన ఇన్స్టాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. “నాకు మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్ (2022లో బ్రెస్ట్ క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపరేషన్ అది నా ఊపిరితిత్తులలోకి , ఇప్పుడు నా తలలో (మెదడు కణితి) చేరింది. ఇపుడు బ్రైన్ సర్జరీ ఇంకా పెండింగ్లో ఉంది, ఇప్పటికే ఇది బాడీలో చాలావరకు వ్యాపించింది. 30శాతం ఆశలే ఉన్నాయి’’ ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స నడుస్తోందంటూ తన బాధను ఫ్యాన్స్తో పంచుకుంది. అంతేకాదు రెండేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం.. దాచుకున్న సొమ్మంతా కరిగిపోయింది. డొనేషన్స్ తీసుకుంటున్నాఅంటూ ఆర్థిక సహాయాన్ని అర్థించారు. కానీ అంతలోనే వి ఆమె కన్నుమూయడం విషాదం. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. -
Tripura: అక్బర్, సీత సింహాలు.. త్రిపుర సర్కారు కీలక నిర్ణయం
అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్పీ కోర్టుకు వెళ్లింది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు -
రికార్డు ఛేజింగ్..90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
రంజీ ట్రోఫీలో రైల్వేస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రైల్వేస్ రికార్డులెక్కింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్ జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర పేరిట ఉండేది. 2019-20 సీజన్లో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 372 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఛేజ్ చేసింది. తాజా మ్యాచ్తో సౌరాష్ట్ర ఆల్టైమ్ రికార్డును రైల్వేస్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రిథమ్ సింగ్(169 నాటౌట్),మహ్మద్ సైఫ్(106) అద్బుత సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు త్రిపురా రెండో ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా తొలి తొలి ఇన్నింగ్స్లో త్రిపురా 149 పరుగులకు ఆలౌట్ కాగా.. రైల్వేస్ సైతం 105 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్న రైల్వేస్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
సింగరేణి మనుగడ కేసీఆర్తోనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్ ఉండాలి..కేసీఆర్ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో ఆదివారం ఆయన రోడ్షో, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ సింగరేణి ప్రైవేటీకరణకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటికి అందకుండా సింగరేణిని మింగేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ ఎంపీలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా పార్లమెంట్లో నోరుమెదపలేదని విమర్శించారు. త్వరలోనే ‘సీతారామ’పూర్తి చేస్తాం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బీఆర్ఎస్కు సరైన ఆదరణ లేదని, కానీ ఈసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు, అలకలు ఉంటే అన్నీ పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాల పంపిణీ తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు. దరిద్రానికి నేస్తం ‘హస్తం’ కాంగ్రెస్ వారు ఒక్క అవకాశం ఇవ్వండని అడుగుతున్నారని, ప్రజలు ఇప్పటికే 11 సార్లు అవకాశం ఇచ్చారని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని కేటీఆర్ ఎద్దేశా చేశారు. రేవంత్రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని, రాష్ట్రంలో ఎంత మంది రైతులకు 10 హెచ్పీ మోటార్లు ఉన్నాయని ప్రశ్నించారు. దరిద్రానికి నేస్తంగా హస్తం మారిందని ఆయన ఆరోపించారు. నా పేరే తారక రామారావు: మూడోసారి అధికా రం చేపట్టగానే యాదాద్రి కంటే మిన్నగా భద్రా చలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా మని హామీ ఇచ్చారు. కేటీఆర్ మధ్యాహ్నం భద్రా చలం చేరుకునేసరికి అప్పటికే ఆలయం తలుపులు మూసేయగా దర్శనం సాధ్యం కాలేదు. దీనిపై కేటీఆర్ వివరణ ఇస్తూ ‘నా పేరే తారక రామారా వు’నాకు రాముడిపై భక్తి లేకుండా ఎలా ఉంటుంది’అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట బీఆర్ఎస్ అభ్యర్థులు బానోత్ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
26న త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. -
బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియామకమయ్యారు. అలాగే, ఒడిశా గవర్నర్గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. ఆయన హైదరాబాద్లోని మలక్పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘుబర్ దాస్ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్ -
త్రిపురలో బీజేపీ విజయం.. కేరళలో కాంగ్రెస్..
-
ఇండియా కూటమికి తొలి సవాల్
లక్నో/అగర్తలా: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిపక్ష ఇండియా కూటమికి తొలి పరీక్షగా నిలిచాయి. ఇండియా కూటమి కొన్ని చోట్ల ఉమ్మడిగా పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల పరస్పరం పోటీపడుతున్నాయి. యూపీలోని ఘోసి, జార్ఖండ్లోని డుమ్రి, త్రిపురంలోని ధన్పూర్, బొక్సానగర్, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను బరిలోకి దించింది. పశి్చమబెంగాల్లోని ధుప్గురి, కేరళలోని పుత్తుపల్లిల్లో ఇవే కూటమి పారీ్టలు పరస్పరం తలపడుతుండటం గమనార్హం. ధుప్గురిలో టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న ఉటుంది. -
త్రిపుర అసెంబ్లీలో నిరసనలు.. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి..
అగర్తలా: త్రిపుర అసెంబ్లీలో నిరసనల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో అశ్లీల వీడియోల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే జడాబ్ లాల్ దేబ్నాథ్ను సస్పెండ్ చేయాలని త్రిపుర మోత పార్టీ(టీఎంపీ), సీపీఐ-ఎమ్, కాంగ్రెస్లు డిమాండ్ చేశాయి. అశ్లీల వీడియో అంశంపై చర్చిండానికి ప్రతిపక్ష నేత అనిమేష్ డెబ్బర్మ వేసిన వాయిదా తీర్మాణాన్ని స్పీకర్ తిరస్కరించగా.. సభలో నిరసనలు మొదలయ్యాయి. అయితే.. మరికాపేటికే ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయంపై స్పీకర్ వెనక్కి తగ్గారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రణజిత్ సింఘా రాయ్ 2023-2024 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. ప్రతిపక్షాలు నిరసనలు ప్రారంభించాయి. ప్రతిపక్ష నేతలు పోడియంలోకి ప్రవేశించారు. నినాదాలు చేస్తూ.. ఒకరికొకరు చేతులు కలుపుతూ గొలుసు మాదిరిగా ఏర్పడ్డారు. మరికొందరు నేతలు బల్లాల మీదకు ఎక్కారు. Tripura Assembly Speaker Suspends 5 Opposition MLAs Amid Uproar https://t.co/cFQVBTYbOo pic.twitter.com/96efmlsSRf — NDTV (@ndtv) July 7, 2023 దీంతో స్పీకర్ బిశ్వ బిందు సేన్ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదిప్ రాయ్ బర్మన్, నాయన్ సర్కార్, బ్రిషకేతు డెబ్బర్మ, నందితా రియాంగ్, రంజిత్ డెబ్బర్మలు సస్పెన్షన్ లిస్ట్లో ఉన్నారు. దేబ్నాథ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మళ్లీ అదే రోజు ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయాన్ని స్పీకర్ వెనక్కి తీసుకున్నారు. అయితే.. ఈ ఏడాది ఆరంభంలో సభ జరుగుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యే దేబ్నాథ్ అశ్లీల వీడియో చూస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై దేబ్నాథ్ స్పందిస్తూ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసే క్రమంలో ఆ సైట్ అకస్మాత్తుగా ఓపెన్ అయిందని, వెంటనే క్లోజ్ కూడా చేశానని అప్పట్లోనే సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు -
త్రిపురలో విషాదం.. రథానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో
త్రిపురలో విషాదం చోటు చేసుకుంది. ఉనకోటి జిల్లాలోని కుమార్ఘాట్ వద్ద ఇనుముతో చేసిన జగాన్నథ రథం ఓవర్హెడ్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో కరెంట్ షాక్కు గురై రథంపైనున్న ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఉనకోటి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రథానికి విద్యుత్ తీగ ఎలా తగిలిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రథయాత్ర పండగ జూన్ 20న ప్రారంభమవ్వగా.. ఉత్సవాల ముగింపులో భాగమైన ‘ఉల్టా రథ్’ ఊరేగింపులో జగన్నాథ బారి ఆలయానికి వస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. మృతులకు సంతాపం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించడానికి అగర్తల నుంచి కుమార్ఘాట్కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. -
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..!
అగర్తల: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ జరుగుతుండగా ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు చూసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి అసెంబ్లీలో ఇలాంటి పనులు చేయడమేంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాదవ్ లాల్ నాథ్ బాగ్బస్సా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఫోన్లో వీడియోలు చూస్తూ కన్పించారు. ఈ క్రమంలోనే ఓ ఆశ్లీల వీడియోను చూస్తున్న సమయంలో వెనకాల ఉన్న సభ్యులెవరో రికార్డు చేశారు. అది బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని జాదవ్కు సమన్లు పంపింది. అయితే ఆయన మాత్రం ఇంకా వీటిపై స్పందించలేదు. అసెంబ్లీ సెషన్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూడటం ఇది తొలిసారేం కాదు. 2012లో కూడా కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్.. అశ్లీల వీడియోలు చూస్తూ కన్పించారు. అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే బీజేపీ దీనిపై విచారణ జరిపి వారు తప్పుచేయలేదని నిర్ధరించుకున్న తర్వాత తిరిగి మంత్రి పదువులు ఇచ్చింది. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
పార్లమెంటరీ విచారణ బృందంపై దాడి.. వాహనాలు ధ్వంసం
త్రిపురలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై విచారణ చేపట్టేందుకు వెళ్లిన పార్లమెంటరీ బృందంపై దాడి జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎవరికీ ఏం కాలేదు. అయితే మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పార్లమెంటరీ బృందం తన షెడ్యూల్లో మార్పులు చేసుకుంది. అయితే.. ఇది బీజేపీ పనేనంటూ కాంగ్రెస్, సీపీఎంలు ఆరోపణలకు దిగాయి. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఎనిమిది జిల్లాల్లో హింస చెలరేగింది. మార్చి 2వ తేదీ నుంచి ఇప్పటిదాకా వెయ్యి దాడులు చోటు చేసుకోగా.. 200 మందికిపైగా గాయపడ్డారు. ఈ హింసలో ముగ్గురి ప్రాణాలు పోయాయి కూడా. ఈ నేపథ్యంలో.. నలుగురు లోక్సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కూడిన పార్లమెంటరీ బృందం ఒకటి ఆ హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు త్రిపుర వెళ్లింది. మూడు బృందాలుగా విడిపోయి.. శుక్ర, శనివారాల్లో వెస్ట్ త్రిపుర, సెపహిజల, గోమతి జిల్లాల్లో పర్యటనకు సిద్ధం అయ్యాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం బిసల్ఘడ్లోని నేహల్చంద్ర నగర్ బజార్లో పార్లమెంటరీ బృందం పర్యటించగా.. కొందరు నినాదాలు చేస్తూ వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, కొందరు నేతలు కూడా అక్కడ ఉన్నారు. అయితే.. పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఎంపీల బృందాన్ని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఎవరికీ గాయలు కాలేదని, వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు.. అలాగే మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. దాడి యత్నాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఖండించారు. బిలాస్ఘడ్తో పాటు మోహన్పూర్లోనూ కాంగ్రెస్ నేతల బృందంపై బీజేపీ గూండాలు దాడి చేశారని, పోలీసులు అక్కడే ఉండి కూడా ఏం చేయలేకపోయారని విమర్శించారాయన. అంతేకాదు ఈ ప్రాంతంలోనే బీజేపీ ఎన్నికల విక్టరీ ర్యాలీకి ప్లాన్ చేసిందని, కాబట్టి ఇది బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగిన దాడి అంటూ ఆరోపించారాయన. మరోవైపు సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి జితేంద్ర చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. దాడి నేపథ్యంలో పార్లమెంటరీ బృందం తన కార్యక్రమాలను నిలిపివేసిందని, షెడ్యూల్లో మార్పు చేసుకుందని చెప్పారు. A delegation of Congress leaders was attacked by BJP goons today in Bishalgarh & Mohanpur in Tripura. Police accompanying the delegation did NOTHING. And tomorrow BJP is having a victory rally there. Victory of party-sponsored violence. pic.twitter.com/gZfBm4qEWB — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2023 -
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్ కేబినెట్లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. తిప్రా మోతా చీఫ్తో షా భేటీ ‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్ అటానమస్ కౌన్సిల్కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే. -
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. కిందటి ఏడాది.. విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్ సాహాను తెర మీదకు తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య ఆయన పని చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే. 2016లో ఆయన కాంగ్రెస్ను వీడి.. బీజేపీలో చేరారు. గతంలో.. త్రిపుర క్రికెట్ అసోషియేషన్కు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. Prime Minister Narendra Modi arrives at Swami Vivekananda Maidan in Agartala for the swearing-in ceremony of Tripura CM-designate Manik Saha. (Source: DD) pic.twitter.com/5QrhWbl0fp — ANI (@ANI) March 8, 2023 సాహా డెంటల్ డాక్టర్. రాజకీయాల్లోకి రాకమునుపు.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పారు కూడా. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 'ఉన్నత త్రిపుర', 'శ్రేష్ట త్రిపుర' నిర్మించేందుకు అన్ని సంక్షేమ వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తాం అని మాణిక్ సాహా పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అధికారం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో తిప్ర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. (చదవండి: బైక్ ట్యాక్సీ నడుపుతున్న విదేశీయుడు.. ఆటో డ్రైవర్ సీరియస్ వార్నింగ్) -
ఆదివాసీల హక్కులపై బీజేపీతో చర్చకు సిద్ధం
అగర్తలా: తిప్రాసా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధ పరిష్కారం కనుగొనేందుకు బీజేపీతో ముఖాముఖి చర్చలకు సిద్ధమని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేవ్ వర్మన్ చెప్పారు. తిప్రా మోథా డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం చేసిన ప్రకటనపై దేవ్ స్పందించారు. ‘ఆర్థికంగా, రాజకీయంగా, భాషాపరంగా మాకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిపై గౌరవప్రదంగా చర్చలకు పిలిస్తే వెళ్తాం. స్థానిక ఆదివాసీల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి మేం సిద్ధం. అయితే, ఈ చర్చలు కేబినెట్ పోస్టు కోసమో, వ్యక్తిగత లబ్ధి కోసమో మాత్రం కాదు’ అని స్పష్టంచేశారు. ఇటీవలి ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన తిప్రా మోథా మొత్తం 13 ఎస్టీ రిజర్వుడు స్థానాలనూ గెలుచుకుంది. -
త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్!
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బిప్లవ్ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే. మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు. -
ఈశాన్యంలో కమల వికాసం
అగర్తలా/షిల్లాంగ్/కోహిమా: ‘మిషన్ నార్త్ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్మేకర్గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్: మోదీ ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. త్రిపురలో కాషాయం రెపరెపలు త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్ కిశోర్ దేవ్వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశి‹Ùకుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మిస్టర్ క్లీన్కే మళ్లీ కిరీటం! త్రిపురలో మిస్టర్ క్లీన్గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్ దేవ్ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. నాగాలాండ్లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. మేఘాలయలో హంగ్! మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్ రాయ్ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీ గా అవతరించింది. మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు. -
కొండల్లో కాషాయ రాగం
‘ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు... వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు!’ ఇది ఓ హిట్ సినిమాలో ఫైట్ చేసిన హీరోను ఉద్దేశించి ఓ ఛోటా విలన్ పాపులర్ డైలాగ్. సమయం, సందర్భం వేరైనా... గురువారం నాడు వెలువడ్డ మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయాలకు ఇదే డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. త్రిపుర అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా గెలిచి, బీజేపీ ఆ రాష్ట్రాన్ని స్వీప్ చేసింది. నాగాలాండ్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీపీపీ కూటమి అధిక స్థానాలు సాధించి, సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మిగిలిన మేఘా లయలో ఎన్పీపీ అధిక స్థానాలు దక్కించుకున్నా, అక్కడా ప్రస్తుత సీఎం కన్రాడ్ సంగ్మా చూపు నిన్నటి దాకా తమ ప్రభుత్వంలో భాగమైన బీజేపీని మళ్ళీ కలుపుకోవడం మీదే ఉంది. వెరసి, ముచ్చటగా మూడు రాష్ట్రాలూ బీజేపీ జేబులోనే! అదీకాక అటు సీపీఎం, ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితరుల్ని కనుమరుగు చేసి, కాషాయం రెపరెపలాడడం విశేషం. కొన్నేళ్ళ క్రితం ఈశాన్యంలో సీట్ల బలమే కాదు... ఓటర్ల బలగం కూడా లేని కాషాయ పార్టీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ను తోసిపుచ్చి, తిరుగులేని శక్తిగా నిలవడం ఆషామాషీ కాదు. అందుకు ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహం, ఎన్నికల లెక్కల్లో స్థానిక పొత్తులు వగైరా అనేకం ఉన్నాయి. గిరిజన జనాభా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ స్వరం మార్చింది. మతపరమైన అంశాలు, గొడ్డుమాంసంపై నిషేధం లాంటి ప్రస్తావనలే తేకుండా తెలివిగా వ్యవహ రించింది. మైనారిటీల అభద్రతనూ, సెంటిమెంట్లనూ రెచ్చగొట్టే తెలివితక్కువ పనికి దిగలేదు. పైగా, కేంద్రంలోని అధికారపక్షంతో స్నేహంగా సాగాలని భావించే అభివృద్ధి ఆధారిత ప్రజాస్వా మ్యాన్ని ఈ సుదూర పర్వతప్రాంత రాష్ట్రాలు నమ్మడం సాధారణం. అందుకు తగ్గట్లే పొరుగునే బీజేపీ పాలిత అస్సామ్లోని అభివృద్ధి నమూనాను చూపి, ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకొంది. త్రిపురలో కాంగ్రెస్, టీఎంసీ, కొత్తగా వచ్చిన ‘టిప్రా మోటా పార్టీ’లతో త్రిముఖ పోటీని ఎదుర్కొన్న కమలనాథులు వరుసగా రెండోసారీ గద్దెనెక్కడం విశేషం. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విప్లవ్దేవ్ను సరైన సమయంలో సీఎంగా పక్కకు తప్పించి, మాణిక్ సాహాకు కిరీటం పెట్టడమూ బీజేపీకి వ్యూహాత్మకంగా ఫలించింది. గతంలో వరుసగా 7 సార్లు త్రిపురను పాలించి, శాసించిన సీపీఎంకు ఆ రాష్ట్రంలో ఇది వరుసగా రెండో పరాజయం. పైగా ఓట్లు 42 శాతం నుంచి 24 శాతానికి పడిపోవడం ఆ పార్టీకి ప్రమాదఘంటిక. ‘టిప్రా’ కింగ్మేకర్గా ఆవిర్భవించకున్నా, కలసి బరిలోకి దిగిన సీపీఎం – కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసింది. బెంగాలీ ఓటర్లపై టీఎంసీ పెట్టుకొన్న ఆశ అడియాసైంది. 2018తో పోలిస్తే బీజేపీ కూటమికి 11 శాతం ఓట్లు తగ్గినా, కమల నాథులే సొంతంగా సర్కారు ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం ప్రతిపక్షాల అనైక్యతకు ప్రతిఫలం! శుభవార్త ఏమంటే, అరవై ఏళ్ళ నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా మహిళలు ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం! పితృస్వామ్య భావజాలం ప్రబలంగా ఉండే ఈ గడ్డపై గతంలో పట్టణ మునిసిపల్ ఎన్నికల్లో స్త్రీల రంగప్రవేశానికి ప్రయత్నం జరిగినా, హింస రేగి పోటీ నుంచి తప్పుకోవాల్సొచ్చింది. కానీ ఈసారి ఏకంగా ఇద్దరు మహిళలు గెలవడం గమనార్హం. ఇది మార్పు పవనాలకు ప్రతీక. ఇక, వివిధ రాష్ట్రాల పార్టీలు (జేడీ–యూ, లోక్జనశక్తి, శరద్ పవార్ ఎన్సీపీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) నాగాలాండ్ బరిలో దిగడం చిత్రం. ఆరు సీట్లలో ఎన్సీపీ గెలవడం, పశ్చిమాన మహారాష్ట్ర నుంచి వచ్చి తూర్పున నాగాలాండ్లో సత్తా చాటి, పెద్ద ప్రతిపక్షంగా అవతరించడం విచిత్రం. ఈశాన్య రాష్ట్రాల్లో అంచనాలకు అల్లంత దూరంలో ఆగిన కాంగ్రెస్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన 6 ఉప ఎన్నికల్లో మాత్రం 3 చోట్ల విజయాలు సాధించింది. తమిళనాట ఈరోడ్ (ఈస్ట్), మహారాష్ట్రలోని కస్బాపేట్, బెంగాల్లో టీఎంసీ నుంచి చేజిక్కించుకున్న సాగర్దిఘీ స్థానాలు హస్తానికి కొంత ఊరట. ఈరోడ్ గెలుపు వెనుక అధికార డీఎంకెతో పొత్తు, కస్బాలో విజయానికి మహా వికాస్ ఆఘాడీ కూటమి మద్దతు, 2021 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన బెంగాల్లో ఈసారి సీపీఎం అండ కాంగేయులకు కలిసొచ్చింది నిజమే. అయితే, 32 ఏళ్ళుగా కంచుకోటైన పుణేలోని కస్బాపేట్లో బీజేపీ ఓటమి ఆలోచన రేపుతోంది. అదే సమయంలో మిగతా 3 ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, అందులోనూ రామ్గఢ్ను కైవసం చేసుకోవడం విస్మరించలేం. ఒకరకంగా ఈ ఫలితాలు ప్రతిపక్షాలకు ఆత్మశోధన అవకాశం. ఏ మాటకా మాట – ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలను బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఏ మేరకు సీరియస్గా తీసుకున్నాయన్నది అనుమానమే. ప్రధాని, కేంద్ర హోమ్మంత్రి సహా పలువురు పదేపదే ఈశాన్యంలో పర్యటించారు. ప్రతిపక్షాలపై ప్రచారదాడి చేశారు. స్థానిక స్థితిగతులకు అనుగుణంగా వ్యాఖ్యలు, వ్యూహాలు మార్చుకున్నారు. ప్రతిపక్షాల్లో గెలిచితీరాలనే ఆ పట్టుదల, ఎన్నికల చాణక్యం కొరవ డ్డాయి. మరి రెండు నెలల్లో కర్ణాటక, ఆ వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ – ఇలా అనేక రాష్ట్రాల్లో ఎన్ని కలు రానున్న వేళ ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు ఓ మేలుకొలుపు. ఐక్యత, ఐడియాలజీ ఏదీ లేకుండా ఒక్క మోదీ వ్యతిరేక మంత్రమే ఫలిస్తుందనుకుంటే పొరపాటు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యూహాలు, అజెండాలు లేకుండా సవాలు చేస్తే శృంగభంగం తప్పదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మేలుకుంటే... కోలుకుంటాయి. లేదంటే, ఎన్నికలు ఏవైనా ఫలితాలు కాస్త అటూ ఇటుగా ఇలాగే ఉంటాయి. -
త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ ఘన విజయం.. మేఘాలయలో షాక్..
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచింది. దీంతో, రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. - త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. - ఇక, కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. As per ECI, BJP leading on 33 seats out of 60 Assembly seats; Counting of votes underway#TripuraAssemblyElections2023 pic.twitter.com/uKPKZ0nzgP — ANI (@ANI) March 2, 2023 - నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. - ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. మేఘాలయలో హంగ్... మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. రెండు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. నాగాలాండ్లో అసలు ఖాతా తెరవలేకపోయింది. -
Election Results: మేఘాలయలో హంగ్.. బీజేపీ బిగ్ ప్లాన్!
► ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్లో మెజార్టీతో మరోసారి అధికారంలోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే బీజేపీ పూర్తి ఆధిక్యం కనబరిచి రెండు రాష్ట్రాల్లో వికర్టీని అందుకుంది. త్రిపురలో 60 స్థానాలకు గానూ 33 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోవడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్, లెప్ట్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. కొత్త పార్టీ టిప్రా మోథా 13 స్థానాల్లో జయభేరి మోగించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చింది. ► నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. 60 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది ఎన్పీఎఫ్ రెండు స్థానాలు కైవసం చేసుంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఇతరులు 21 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి ► మరోవైపు.. మేఘాలయలో హంగ్ వచ్చింది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 25 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 31ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్ ఐదు, బీజేపీ 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి. ఇతరులు 25 స్థానాల్లో గెలుపొందారు. అయితే కాన్రాడ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే మేఘాలయ ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగం కానుంది. ఫలితంగా మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు అవుతుంది. ► తమిళనాడులోని ఈరోడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఈవీకేఎస్ ఎలన్గోవన్ ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్కు మద్దతిచ్చింది. ఈ విజయం సీఎం ఎంకే స్టాలిన్ వల్లే సాధ్యమైందని ఎలన్గోవన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలను 80శాతం నెరవేర్చినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 40కి 40 ఎంపీ స్థానాలు డీఎంకే కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. Credit of this victory goes to CM MK Stalin. He did 80% of the things that were promised by DMK in election manifesto. I feel proud to be a part of the Legislative Assembly which is headed by MK Stalin: DMK-backed Congress candidate EVKS Elangovan on his lead in #ErodeEastResults pic.twitter.com/J9XkJE70tT — ANI (@ANI) March 2, 2023 ► ఈశాన్య భారతంలో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ.. త్రిపురలో రెండో సారి అధికారంలోకి రాగా.. నాగాలాండ్లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ► ఇక, మేఘాలయలో ఎన్పీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ► రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మూడు రాష్ట్రాల విక్టరీ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ► మహారాష్ట్రలోని పుణే జిల్లా కస్బా స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో, కాంగ్రెస్ శ్రేణులు, మహా వికాస్ అగాడీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. #WATCH | Maharashtra: Maha Vikas Aghadi (MVA) workers celebrate in Pune as official EC trends show Congress candidate Dhangekar Ravindra Hemraj leading in Kasba Peth assembly by-election. pic.twitter.com/Duxyvm9K15 — ANI (@ANI) March 2, 2023 ► త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సాహా.. సీపీఎం అభ్యర్థి ఆశిష్కుమార్ సాహాపై విజయం సాధించారు. ► మేఘాలయలో హంగ్ దిశగా పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది. సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. #MeghalayaElections | As per official EC trends, CM Conrad Sangma's National People's Party leading on 17 of the total 59 seats so far. Counting of votes still underway, trends on 47 seats known. pic.twitter.com/GsLOUPGgSd — ANI (@ANI) March 2, 2023 ► తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. కాగా, ఉప ఎన్నికల్లో అధికార డీఎంకే కాంగ్రెస్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. Tamil Nadu | E.V.K.S.Elangovan of Congress leading in Erode East by-election pic.twitter.com/IQ08d1Tv4L — ANI (@ANI) March 2, 2023 ► పూణేలోని చించావద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ లీడింగ్ కొనసాగుతోంది. Pune, Maharashtra | Counting of votes underway for Kasba Peth by-elections pic.twitter.com/CUp88aRSL3 — ANI (@ANI) March 2, 2023 ► పశ్చిమ బెంగాల్లోని సాగర్డిగీ ఉప ఎన్నికల్లో ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్, టీఎంసీ మధ్య హోరాహోరి కొనసాగుతోంది. ► మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా వెళ్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ కనపించడం లేదు. ► నాగాలాండ్లో బీజేపీ, ఎన్డీపీపీ కూటమి భారీ ఆధిక్యంతో 50 స్థానాల్లో దూసుకుపోతోంది. ► త్రిపురలో 60 స్థానాలకు గానూ దాదాపు 39 స్థానాల్లో బీజేపీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేయడంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ► మేఘాలయలో ఎన్పీపీ 28, బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యం ► నాగాలాండ్లో బీజేపీ 21, ఎన్పీఎఫ్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ► త్రిపురలో బీజేపీ 24 స్థానాల్లో, ట్రిపా 10 స్థానాల్లో, లెఫ్ట్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ► అరుణాచల్ ప్రదేశ్లోని లూమ్లా, జార్ఖండ్లోని రామ్ఘర్, తమిళనాడులోని ఈరోడ్, పశ్చిమ బెంగాల్లోని సాగర్డిగి అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం Counting of votes for Tripura, Nagaland & Meghalaya elections begins Counting for by-elections for Lumla assembly seat of Arunachal Pradesh, Ramgarh (Jharkhand), Erode East (Tamil Nadu), Sagardighi (West Bengal) & Kasba Peth, Chinchwad assembly seats of Maharashtra also begins pic.twitter.com/mMlLV3ryfV — ANI (@ANI) March 2, 2023 ► మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం ► ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మేఘాలయలోని తూర్పు పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ 144 సెక్షన్ విధించారు. Meghalaya | Section 144 imposed in Eastern West Khasi Hills district by the District Magistrate pic.twitter.com/JY8t1wHCp9 — ANI (@ANI) March 2, 2023 ► ముఖ్యంగా త్రిపుర అసెంబ్లీ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్మేకర్గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ► నాగాలాండ్, మేఘాలయలో కూడా ఫలితాలపై చర్చ నడుస్తోంది. Nagaland | The counting of votes for the #NagalandAssemblyElections2023 will begin at 8 am; Visuals from counting centre at Deputy Commissioner's office in Kohima pic.twitter.com/XdT0sWc4e9 — ANI (@ANI) March 2, 2023 న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. కాగా, మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. -
‘ఈశాన్య’ ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈశాన్యాన మరింతగా విస్తరించాలన్న అధికార బీజేపీ ఆశలు ఏ మేరకు నెరవేరాయన్నది ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ఈసారి అందరి దృష్టీ ప్రధానంగా త్రిపురపైనే నెలకొంది. అక్కడ పాతికేళ్ల వామపక్ష పాలనకు తెర దించుతూ అభివృద్ధి నినాదంతో బీజేపీ 2018లో సొంతంగా అధికారంలోకి రావడం తెలిసిందే. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా నిలువరించేందుకు చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి మరీ లెఫ్ట్, కాంగ్రెస్ జట్టు కట్టి బరిలో దిగాయి. ఇక నాగాలాండ్, మేఘాలయల్లో కూడా బీజేపీ అధికార సంకీర్ణంలో భాగస్వామిగా ఉంది. అయితే మేఘాలయలో ఎన్నికల ముందు అధికార నేషనల్ పీపుల్స్ పార్టీతో బంధం తెంచుకుని సంకీర్ణం నుంచి బయటికొచ్చింది. అంతేగాక తొలిసారిగా మొత్తం 60 స్థానాలకూ పోటీ చేసింది! నాగాలాండ్లో మరోసారి ఎన్డీపీపీతో కలిసి బరిలో దిగింది. అక్కడ బీజేపీ అధికారం నిలుపుకుంటుందని, త్రిపురలో ఏకైక పెద్ద పార్టీగా మెజారిటీకి చేరువగా వస్తుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం తెలిసిందే. ఇక త్రిపురలో హంగ్ తప్పకపోవచ్చని అంచనా వేశాయి. కొత్తగా తెరపైకి వచ్చిన టిప్రా మోతా కనీసం 15 స్థానాలకు పైగా గెలుచుకుని కింగ్మేకర్గా మారొచ్చని జోస్యం చెప్పాయి. -
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ హవా.. మేఘాలయలో మాత్రం!
న్యూఢిల్లీ: ఈశాన్యాన మళ్లీ కమల వికాసమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో నాగాలాండ్, త్రిపురల్లో మళ్లీ బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని, మేఘాలయలో హంగ్ తప్పదని జోస్యం చెప్పాయి. అక్కడ అధికార ఎన్పీపీ మరోసారి ఏకైక పెద్ద పార్టీగా నిలుస్తుందని చెప్పాయి. త్రిపురలో ఎన్నో ఆశలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కొత్త పార్టీ టిప్రా మోర్చా గట్టి దెబ్బ కొట్టనుంది. అధికార బీజేపీ జైత్రయాత్రకూ అది కాస్త అడ్డుకట్ట వేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో సోమవారం పోలింగ్ పూర్తయింది. మేఘాలయ రాష్ట్రంలో ఈసారి హంగ్ తప్పకపోవచ్చని అన్ని ఎగ్జిట్ పోల్సూ చెప్పడం విశేషం! అధికార ఎన్పీపీకి 18 నుంచి 26 సీట్లకు మించకపోవచ్చని అవి పేర్కొన్నాయి. ఇక బీజేపీకి దక్కుతున్నది 4 నుంచి గరిష్టంగా 11 స్థానాలే. కాంగ్రెస్దీ అదే పరిస్థితి కాగా తృణమూల్కు మాత్రం ఎగ్జిట్ పోల్స్ 5 నుంచి 13 స్థానాల దాకా ఇచ్చాయి. యూడీపీకి ఇండియాటుడే, టైమ్స్ నౌ రెండూ 8 నుంచి 14 సీట్లిచ్చాయి. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్డీపీపీ–బీజేపీ కూటమి అధికారాన్ని నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఎన్డీపీపీకి 28–34 సీట్లు, బీజేపీకి 10 నుంచి 14 వస్తాయని ఇండియాటుడే అంచనా వేసింది. ఎన్పీఎఫ్కు 3 నుంచి 8 సీట్లు వస్తుండగా కాంగ్రెస్ 2 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. టైమ్స్ నౌ కూడా ఎన్డీపీపీకి 27–33 సీట్లు, బీజేపీకి 12–16 ఇవ్వగా ఎన్పీఎఫ్కు 6 సీట్లతో సరిపెట్టింది. త్రిపుర పాతికేళ్ల సీపీఎం కూటమి జైత్రయాత్రకు అడ్డుకట్ట వేస్తూ 2018లో బీజేపీ ఏకంగా 36 సీట్లతో మెజారిటీ సాధించి ఆశ్చర్యపరిచింది. దాంతో ఈసారి బీజేపీని ఎలాగైనా అడ్డుకునేందుకు సీపీఎం కూటమి తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కానీ వాటి అవకాశాలకు కొత్తగా వచ్చిన టిప్రా మోతా భారీగా గండి కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మోతా 9 నుంచి 16 సీట్లు దాకా గెలుచుకుంటుందని అంచనా వేశాయి. బీజేపీ మళ్లీ మెజారిటీ సాధిస్తుందని ఇండియాటుడే, జీ న్యూస్ అభిప్రాయపడగా 24 సీట్లకు పరిమితం కావచ్చని టైమ్స్ నౌ పేర్కొంది. కాంగ్రెస్–సీపీఎం కూటమికి ఏ ఎగ్జిట్ పోల్లోనూ గరిష్టంగా 21 సీట్లు దాటలేదు. బీజేపీకి 45 శాతం ఓట్లు రావచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. లెఫ్ట్–కాంగ్రెస్ కూటమికి 32 శాతం, టిప్రా మోతాకు 20 శాతం వస్తాయని పేర్కొంది. హంగ్ నెలకొనే పక్షంలో ప్రత్యేక టిప్రా లాండ్ డిమాండ్కు జైకొట్టే పార్టీకే మద్దతిస్తామని టిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దేవ్ బర్మ ఇప్పటికే ప్రకటించారు. నాగాలాండ్లో 83%, మేఘాలయలో 75% ఓటింగ్ షిల్లాంగ్/కోహిమా: నాగాలాండ్లో ఓటర్లు పోటెత్తారు. దాంతో సోమవారం జరిగిన పోలింగ్లో మధ్యాహ్నం మూడింటికే 83.63% ఓటింగ్ నమోదైంది! ఇక మేఘాలయలో సాయంత్రం ఐదింటికల్లా 75% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు ఉండటంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం మరింత పెరగనుంది. రెండు అసెంబ్లీల్లోనూ 60 స్థానాలకు గాను 59 సీట్లకు పోలింగ్ జరిగింది. కొన్ని బూత్ల్లో ఈవీఎంలతో సమస్య తలెత్తినా అధికారులు వెంటనే పరిష్కరించారు. -
త్రిపురలో ముగిసిన పోలింగ్.. 70 శాతం నమోదు
Live Updates: ► త్రిపురలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో 69.96 శాతం పోలింగ్ నమోదు. Time: 02.15PM త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.4 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. Time: 1.00PM ►బీజేపీ నాయకులు పలు చోట్ల ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ నిర్భయంగా ఓటు వేయకుండా ఆపుతున్నారు. సీపీఎం నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. అయితే బీజేపీ బెదిరింపులుకు గురిచేసిన జనం ఓట్లు వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. Time: 11.00 ►త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 31.23% పోలింగ్ నమోదైంది. ► మాజీ సీఎం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు బిప్లబ్ కుమార్ దేబ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఎన్నికలను పెద్దవి, చిన్నవిగా చూడమని అన్నారు. ప్రజలే తమకు అత్యున్నతమని.. వారిని గౌరవించడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘2018లో ప్రజలు అధికారం అందించారు. కోవిడ్ ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించాం.. ఇది ప్రజలకు తెలుసు’ అని అన్నారు. Gomati | BJP MP CM Biplab Deb cast his vote for #TripuraElection2023 today. He says, "We don't see any election as big or small. Public is supreme & it's our duty to respect them. They gave us power in 2018 & despite COVID, we worked in all sectors of state. People know this." pic.twitter.com/PtGMl2LcPG — ANI (@ANI) February 16, 2023 Time: 10.00 ► త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ఉదయం 9 గంటల వరకు 13.23% ఓటింగ్ నమోదైంది. ►త్రిపుర సీఎం మాణిక్ సాహా ఓటుహక్కు వినియోగించుకున్నారు. బోర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహారాణి తులసుబాతి బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓటు వేయడం ఆనందంగా ఉందని.. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ‘ శాంతియుత ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నా. నా ముందున్న సవాలు ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్- వామపక్షాలు కలిసి పోటీలోకి రావడమే సవాల్.’ అని తెలిపారు. #WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r — ANI (@ANI) February 16, 2023 Time: 9.00 ►త్రిపురలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని త్రిపుర ప్రజలను కోరుతున్నాను. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను’ మోదీ ట్వీట్ చేశారు. కాగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేసిన చేసిన విషయం తెలిసిందే. Urging the people of Tripura to vote in record numbers and strengthen the festival of democracy. I specially call upon the youth to exercise their franchise. — Narendra Modi (@narendramodi) February 16, 2023 అగర్తలా: రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, పరస్పర విమర్శనాస్త్రాల పర్వం ముగిశాక పోలింగ్ క్రతువుకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అనిఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) గిట్టే కిరణ్కుమార్ దినకరో చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండగా 28 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమి, సీపీఐ(ఎం)–కాంగ్రెస్ కూటమి, తిప్రా మోతాల మధ్యే అసలు పోరు ఆవిష్కృతంకానుంది. 13.53 లక్షల మహిళాఓటర్లుసహా మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి రెండో తేదీన ఓట్లు లెక్కిస్తారు. ‘ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి మొత్తంగా 31వేల పోలింగ్ సిబ్బంది, 25వేల కేంద్ర భద్రతా బలగాలు, 31వేల రాష్ట్ర పోలీసు బలగాలు విధుల్లో కొనసాగనున్నాయి’ అని సీఈఓ చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా 17వ తేదీ ఉదయందాకా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చాం. అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసేశాం’ అని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. 55 చోట్ల బీజేపీ, 42 చోట్ల తిప్రామోతా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా ఈసారి బర్దోవాలీ నుంచి బరిలో నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సాబ్రూమ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తిప్రా మోతా చైర్మన్ ప్రద్యోత్ దేబ్ బర్మన్ ఈసారి పోటీచేయడంలేదు. బీజేపీ 55 చోట్ల తన అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ కూటమి పార్టీ ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీచేస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒక స్థానంలో స్నేహపూర్వక పోటీకి సిద్దమయ్యాయి. సీపీఎం 47 చోట్ల, కాంగ్రెస్ 13 చోట్ల, తిప్రా మోతా 42 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయి. గత ఐదేళ్లపాలనలో తాము చేసిన అభివృద్ధినే ఎన్నికల అజెండాగా బీజేపీ ప్రచారంచేయగా, దుష్ప్రరిపాలన అంటూ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్లు విమర్శిస్తూ ప్రచారంచేయడం తెల్సిందే. గ్రేటర్ తిప్రాల్యాండ్ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ తిప్రా మోతా ఎన్నికల పర్వంలో మునిగిపోవడం విదితమే. -
కేరళలో కుస్తీ.. త్రిపురలో దోస్తీ
రాధాకిషోర్పూర్/అంబాసా(త్రిపుర): త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్–సీపీఎం పార్టీల కూటమిని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం కేరళలో పోటాపోటీగా కుస్తీ పడుతూ, అవే పార్టీలు ఉమ్మడిగా ఓటర్లను మోసంచేసేందుకు త్రిపురలో దోస్తీ చేస్తున్నాయని మోదీ విమర్శించారు. టిప్రా మోతాకి మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘ఈ విపక్ష కూటమికి ఇంకొన్ని ఇతర పార్టీలు బయటి నుంచి మద్దతు తెలుపుతున్నాయి. ఈ కూటమికి పడే ప్రతీ ఓటు త్రిపురను కొన్నేళ్లు వెనుకడుగు వేసేలా చేస్తుంది’ అని అన్నారు. శనివారం గోమతి జిల్లాలోని రాధాకిషోర్పూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ గతంలో అధ్వానంగా పాలించిన పార్టీలు మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం బయల్దేరాయి. అవి కేరళలో కుస్తీ పడతాయి. త్రిపురలో దోస్తీ కడతాయి’ అని అన్నారు. ‘ ఓట్లు చీల్చేందుకు విపక్షం యత్నిస్తోంది. ఇంకొన్ని చిన్న ‘ఓట్లు చీల్చే’ పార్టీలుంటాయి. విజయవంతంగా ఓట్లు చీలిస్తే ఫలితాలొచ్చాక అందుకు ‘ప్రతిఫలం’ పొందుతాయి. ఇంకొందరు తమకు తామే గెలుపుగుర్రాలుగా భావించి గెలిచాక ఇంట్లోనే గడియపెట్టుకుని కూర్చుంటారు’ అని మోదీ విమర్శించారు. రెండంచుల కత్తితో జాగ్రత్త ‘గత లెఫ్ట్, కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనులను విభజించి పాలించాయి. మేం మాత్రం మిజోరం నుంచి వలసవచ్చిన వేలాది బ్రూస్ కుటుంబాలుసహా అన్ని గిరిజన తెగల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. గిరిజన భాష కోక్బోరోక్ను మా ప్రభుత్వమే ఉన్నత విద్యలో ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్లోనూ గిరిజనప్రాంతాల అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాం’ అని అన్నారు. ‘ కాంగ్రెస్–సీపీఎం డబుల్ ఎడ్జ్(రెండు అంచుల) కత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబుల్ ఎడ్జ్ ప్రభుత్వమొస్తే ప్రజలకు లబ్ధిచేకూరే అన్ని పథకాలను తెగ్గోసి పడేస్తుంది. మా డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి ఈ ఈశాన్య రాష్ట్రంలో అభివృద్ధి గతిని సుస్థిరం చేయండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ధలాయ్ జిల్లాలోని అంబాసాలోనూ మోదీ ప్రచార సభలో ప్రసంగించారు. దక్షిణాసియా ముఖద్వారంగా త్రిపుర ‘ఈ రెండు పార్టీలు పేదప్రజల కష్టాలు తీరుస్తామని అలుపెరగకుండా వాగ్దానాలు చేస్తారుగానీ పేదల బాధ, కష్టాలను ఎప్పటికీ అర్ధంచేసుకోరు. రాష్ట్రంలో తొలి దంతవైద్య కళాశాల బీజేపీ హయాంలోనే సాకారమైంది. గతంలో పోలీస్స్టేషన్లపై సీపీఎం శ్రేణులు ఆధిపత్యానికి దుస్సాహసం చేసేవి. మేమొచ్చాక శాంతిభద్రతలు నెలకొల్పాం. గతంలో రాష్ట్రంలోని యువత జీవనోపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. మా హయాంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. యాక్ట్ ఈస్ట్ విధానంతో రాష్ట్రం పురోగమిస్తోంది. త్వరలోనే అభివృద్ధి ఆసియా ముఖద్వారంగా త్రిపుర మారనుంది’ అని మోదీ అభిలషించారు. -
Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్ కేసులు
అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్ కూడా అయిన మాణిక్ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. -
త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్!
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వేడెక్కుతోంది. ఒకప్పుడు త్రిపురని ఏలిన మాణిక్య వంశానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య డెబ్బార్మాన్కు చెందిన టిప్రా మోతా పార్టీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్న సంస్థలన్నీ కలిసి టిప్రా ఇండీజెనస్ ప్రోగ్రసివ్ రీజనల్ అలయెన్స్ (టిప్రా మోతా)గా ఏకతాటిపైకి వచ్చారు. ఇన్నాళ్లూ సామాజిక సంస్థగా ఉన్న ఈ కూటమి, రాజకీయ పార్టీగా రూపొంతరం చెందింది. అధికారంలోకి వస్తే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని ప్రద్యోత్ తేల్చి చెబుతూ అధికార బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న గిరిజనులు, స్థానిక తెగల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకి మద్దతుగా ఉంటూ గత రెండేళ్లలోనే ఢిల్లీ వేదికగా ప్రద్యోత్ ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేశారు. గత వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాతో ప్రద్యోత్ నేతృత్వంలోని టిప్రా మోతా ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి చేసిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రద్యోత్ తాము ఒంటరిపోరాటానికి సిద్ధమై 35 నుంచి 40 సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం అంశం అత్యంత ప్రభావం చూపించబోతోంది. ఏమిటీ గ్రేటర్ టిప్రాల్యాండ్ ? 1949లో త్రిపురభారత దేశంలో విలీనం అవడానికి అంగీకరించింది. అప్పటికే తూర్పు బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి భారీగా బెంగాలీల తాకిడి మొదలైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధం సమయంలో కూడా బెంగాలీ శరణార్థులు భారీగా వచ్చి చేరారు. ఫలితంగా స్థానికంగా నివసించే గిరిజనులు మైనార్టీలో పడిపోయారు. 1881లో 63.77శాతం ఉండే గిరిజనుల జనాభా 2011 నాటికి 31.80శాతానికి పడిపోయింది. 2011 నాటి భాషాపరమైన జనాభా లెక్కల ప్రకారం త్రిపుర మొత్తం జనాభా 36.74 లక్షలైతే, వారిలో బెంగాలీ మాతృభాష కలిగిన వారి సంఖ్య ఏకంగా 24.14 లక్షలు. స్థానిక ఆదివాసీల మాతృభాష కొక్»ొరాక్ మాట్లాడేవారు 8.87 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే బయట నుంచి వలస వచి్చన బెంగాలీలే వీరి కంటే మూడు రెట్లు ఎక్కువ. దాంతో స్థానికంగా ఉండేవారి హక్కులు, సంస్కృతి సంప్రదాయాలు, భూమిపై హక్కులు ప్రమాదంలో పడ్డాయి. దాంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పుట్టింది. ఏయే ప్రాంతాలతో ప్రత్యేక రాష్ట్రం త్రిపురలో గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటితో 1985లో త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డి్రస్టిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఏర్పాటైంది. రాష్ట్ర వైశాల్యంలో మూడింట రెండువంతుల్లో విస్తరించింది. గిరిజన తెగల హక్కులు, సంస్కృతి కాపాడడం కోసం ఏర్పాటైన టీటీఏడీసీకి శాసన, కార్యనిర్వాహక అధికారాలున్నాయి. టీటీఏఏడీసీ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న డిమాండ్ ఉంది. ఎప్పట్నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్? 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) పార్టీ తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై గళమెత్తింది. రెండేళ్ల తర్వాత ఐపీఎఫ్టీ గిరిజనుల మరో పార్టీ త్రిపుర ఉపజాతి జ్యూబా సమితి(టీయూజేఎస్)లో విలీనమై నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా (ఐఎన్పీటీ)గా ఆవిర్భవించింది. వేర్పాటు వాద నాయకుడు బిజోయ్ కుమార్ హరంగ్ఖ్వల్ నేతృత్వం వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెద్దగా ముందుకు వెళ్లకపోవడంతో 2009లో ఎన్సీ డెబ్రామా ఆధ్వర్యంలో మళ్లీ ఐపీఎఫ్టీను పునరుద్ధరించారు. ˘ ఎన్నికల్లో ప్రభావం ఎంత? మొత్తం 60 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఆశిస్తున్న ఆదివాసీలు 20 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. ఇప్పటివరకు ఐపీఎఫ్టీయే ఈ నియోజకవర్గాల్లో అత్యంత కీలకంగా ఉంది. త్రిపురలో అద్భుతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని రెండు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వివిధ స్థానిక పార్టీలతో జత కలిసింది. దీంతో ఈ ప్రాంతంలోని 20 స్థానాలకు గాను బీజేపీ 10సీట్లు, ఐపీటీఎఫ్ 8 ,, సీపీఐ(ఎం) రెండు స్థానాల్లోనూ గెలుపొందింది. మాణిక్ సర్కార్ ఓటమికి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణంగా మారింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్రం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన ఐపీటీఎఫ్ ఎన్నికల తర్వాత అధికార బీజేపీలో చేరింది. ఆ పార్టీ నాయకుడు ఎన్సీ డెబర్మా మంత్రిగా కూడా పని చేసి 2022 జనవరి 1న కన్నుమూశారు. గిరిజన హక్కుల మండలి (టీటీఏఏడీసీ)కి 2021 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో టిప్రా మోతా పార్టీ 28 స్థానాల్లో పోటీ చేస్తే 18 నెగ్గింది. ప్రస్తుత అసెంబ్లీలో 36 స్థానాలతో ఉన్న అధికార బీజేపీ, 16 స్థానాలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సీపీఐ(ఎం) ఉంటే, ఐపీటీఎఫ్ ఎనిమిది స్థానాలను నెగ్గింది. టిప్రా మోతా ఒంటరిపోరాటానికి సిద్ధమై అధికార బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్య రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్నట్లు అమిత్ షా తెలిపారు. గురువారం త్రిపురలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రామ మందిర నిర్మాణ కేసును కాంగ్రెస్ కోర్టుల్లో అడ్డుకుంటూ వస్తోంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై సుప్రీం కోర్టు అనుమతితో నిర్మాణం ప్రారంభమైంది' అని అమిత్ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత నవంబర్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ కల్లా రామమందిర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. కాగా, మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్కు తెల్ల రాయి వాడుతున్నారు. మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. చదవండి: (యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు) -
త్రిపురలో హైటెన్షన్.. బీజేపీ మాజీ సీఎం టార్గెట్గా దాడులు!
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఒక్కసారిగా త్రిపురలో ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఉదయ్పూర్లోని జామ్జూరి ప్రాంతంలోని రాజ్నగర్లోని బిప్లబ్దేవ్ పూర్వీకుల ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. మొత్తం ఇంటిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు.. బిప్లవ్ దేవ్ తండ్రి హిరుధన్ దేవ్ స్మారకార్థం బుధవారం కావడం కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇలా జరగడం త్రిపురలో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ దాడిపై బీజేపీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు. ఈ దాడికి సీపీఎం మద్దతుదారులే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా.. దాడి చేసిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి మంగళవారం సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి ఘటన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని భద్రత ఏర్పాటు చేశారు. Former Tripura CM Biplab Deb’s ancestral house set on fire by LEFT workers. pic.twitter.com/1WxXakn3Mh — News Arena India (@NewsArenaIndia) January 3, 2023 -
త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి కన్నుమూత.. సీఎం సంతాపం
అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) చీఫ్ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్ వల్లభ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్టీ. 2018లో ఐపీఎఫ్టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ. ఇదీ చదవండి: షాకింగ్: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి! -
ఎలక్షన్ ఇయర్ 2023
-
జీతం అడిగినందుకు ఉద్యోగిపై యజమాని దాడి
అగర్తలా: తనకు రావాల్సిన జీతం డబ్బులు ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ సాలరీ ఇవ్వమన్నందుకు ఇనుప రాడ్డు, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలా నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సూరజిత్ త్రిపుర అనే వ్యక్తి మఫ్టీ అనే బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ దుకాణం యజమాని సాహా.. గత అక్టోబర్కు సంబంధించి సూరజిత్కు జీతం ఇవ్వలేదు. ఈ క్రమంలో తనకు పెండింగ్ సాలరీ ఇవ్వాలని సూరజిత్ డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సాహా.. అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్పై ఇనుప రాడ్, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. బాధితుడు సూరజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పశ్చిమ అగర్తలా పోలీసులు. ఈ వీడియోను ట్రైబల్ పార్టీ టిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ మానిక్యా ట్విటర్లో షేర్ చేశారు. దుకాణం యజమాని తీరుపై మండిపడ్డారు. యజమానికిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదీ చదవండి: రోడ్డుపై నిలిచిపోయిన బస్సు.. కారు దిగొచ్చి వెనక్కి నెట్టిన కేంద్ర మంత్రి -
క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు
అగర్తల: క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. సొంతవారినే పొట్టనబెట్టుకుంటున్నారు. తల్లి, సోదరి సహా మొత్తం నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ 17ఏళ్ల రాక్షసుడు. ఆ తర్వాత వారి మృతదేహాలను బావిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ధలాయ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగింది. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంట్లో నిద్రపోతోంది. ఈ క్రమంలో తాత, తల్లి, సోదరి, అత్తమ్మలను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు బాలుడు. నిందితుడిని ఆదివారం ఉదయం మార్కెట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ‘ఓ మైనర్ బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. నేరానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడి తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడ చూసినా రక్తంతో నిండిపోయి కనిపించింది. మృతదేహాలు సమీపంలోని బావిలో పడేశాడు.’ అని త్రిపుర పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీవీకి బానిసయ్యాడని, తరుచూ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ షోలు చూస్తుంటాడని స్థానికులు తెలిపారు. గతంలో సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ హత్యలు చేస్తున్నప్పుడు ఇంట్లో సౌండ్ పెంచి మ్యూజిక్ ప్లే చేసినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: యాక్సిడెంట్గా చిత్రీకరించి మర్డర్కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీర్ మృతి -
తిలక్ వర్మ జోరు.. హైదరాబాద్కు హ్యాట్రిక్ విజయం
జైపూర్: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. త్రిపుర జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ నాలుగో లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ వరుసగా నాలుగో మ్యాచ్లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. త్రిపుర నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 67 పరుగులు చేశాడు. మికిల్ జైస్వాల్ (21 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్లు), తనయ్ త్యాగరాజన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడి హైదరాబాద్ విజయానికి బాటలు వేశారు. అంతకుముందు త్రిపుర 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. రవితేజ, తనయ్ త్యాగరాజన్ రెండేసి వికెట్లు తీశారు. -
కార్మికులతో రాష్ట్రపతి ముర్ము.. ‘ఇక్కడ ఉన్న మీ ముఖ్యమంత్రిని గుర్తు పడతారా?’
త్రిపుర: రెండు రోజుల త్రిపుర పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నార్సింగర్లో ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. అంతకుముందు రాజధాని అగర్తలా విమానాశ్రయంలో సీఎం మాణిక్ సాహా, గవర్నర్ సత్య నారాయన్ ఆర్యా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టులో త్రిపుర స్టేట్ రైఫిల్స్ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా నార్సింగర్కు వెళ్లి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెతోపాటు సీఎం సాహా, కేంద్రమంత్రి రతన్లాల్ నాథ్, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మోహన్పూర్లోని దుర్గాబరి టీ ఎస్టేట్ను సందర్శించారు. అక్కడ పనిచేసే టీ గార్డెన్ కార్మికులతో ముచ్చటించారు. ఈక్రమంలో ముర్ము వారితో ఓ ఆసక్తికర సంభాషణ సాగించారు. మహిళా కార్మికులతో మాట్లాడిన రాష్ట్రపతి వారి బాగోగులు కనుకున్నారు. ‘పిల్లలను బడికి పంపిస్తున్నారా? క్రమం తప్పకుండా పిల్లలను బడికి పంపించండి. ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అష్టమి ముండా అనే మహిళను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) మరో మహిళతో ఆమె మాట్లాడుతూ.. నాతోపాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు కదా? వారిలో మీ ముఖ్యమంత్రి మాణిక్ సాహాను, స్థానిక ఎమ్మెల్యే కృష్ణధన్దాస్ను గుర్తు పడతారా? అని అడిగారు. అందుకు వారు ఔను అనే సమాధానం ఇచ్చారు. స్థానిక నేతలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా? ఏదైనా డిమాండ్ ఉన్నా వారితో మాట్లాడండి అని రాష్ట్రపతి భరోసానిచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్ము టీ ఎస్టేట్ను సందర్శించడం.. కార్మికులతో మమేకమవడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్పై కుప్పకూలిన శివుడి వేషధారి.. వైరల్ వీడియో) -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్
అగర్తలా: దేశవ్యాప్తంగా పాలిటిక్స్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ఉద్ధండులు తాము ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించి, గుర్తింపు తెచ్చుకుని ఉన్నఫలానా గుడ్ బై చెబుతున్నారు. తాజాగా త్రిపురలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. టీఎంసీకి ఆ పార్టీ సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. వివరాల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్ఛార్జ్కు అందించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో.. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే, టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్ని తొలగించిన కొద్ది రోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్ భౌమిక్ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగించడంపై పార్టీ అధిష్టానం ఎటువంటి కారణం చెప్పకుండానే బాధత్యల నుంచి తొలగించింది. మరోవైపు.. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. The vice-president of the #Tripura unit of TMC, Abdul Basit Khan, resigned from the party. (@RittickMondal)https://t.co/rYeBLZiYWp — IndiaToday (@IndiaToday) August 28, 2022 -
త్రిపుర టీఎంసీ అధ్యక్షుడికి మమత షాక్.. పదవి నుంచి తొలగింపు..
అగర్తల: త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు సుబల్ భౌమిక్కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. ఆయనను పదవి నుంచి తప్పించారు. టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతా బుధవరం ఉదయం ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అయితే సుబల్ భౌమిక్ను అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నూతన అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇకపై త్రిపురలో టీఎంసీ కార్యకలాపాలను రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ బెనర్జీ, పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ చూసుకోనున్నారు. అయితే త్రిపుర టీఎంసీ రాష్ట్ర కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ సభ్యులు తమ పదవుల్లో యథావిధిగా కొనసాగుతారని టీఎంసీ ప్రకటన పేర్కొంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన సుబల్ భౌమిక్ గతేడాది జులైలో టీఎంసీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆయను త్రిపుర టీఎంసీ అధ్యక్షుడిగా నియమించారు మమతా బెనర్జీ. మూడు నెలలకే ఆయనను పదవి నుంచి ఎందుకు తప్పించారనే విషయం చర్చనీయాంశమైంది. అయితే సుబల్ భౌమిక్ బీజేపీలో చేరుతారాని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఆయన ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. మొదట బీజేపీలోనే ఉన్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్, గతేడాది టీఎంసీలోకి మారారు. మళ్లీ సొంత గూటికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను మమత అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చదవండి: మరో ఐదారేళ్లలో బీజేపీ ఖేల్ ఖతం.. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే జోస్యం -
స్వతంత్ర భారతి: మూడు రాష్ట్రాల అవతరణ
మణిపుర్, త్రిపుర, మేఘాలయలు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. 1947లో మణిపుర్ స్వతంత్ర రాజ్యమయ్యింది. మణిపుర్ రాజు మహారాజా ప్రబోధచంద్ర మణిపుర్ రాజ్యాంగాన్ని ఏర్పరచి, ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికారు. 1949లో మణిపుర్ రాజ్యం భారతదేశంలో విలీనం అయింది. 1956 నుండి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న మణిపుర్ 1972లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. త్రిపుర కూడా భారతదేశ స్వాతంత్య్రానికి ముందు ఒక రాజ్యంగా ఉండేది. 1949 లో భారత్లో విలీనమయ్యే వరకు గిరిజన రాజులు త్రిపురను శతాబ్దాలుగా పరిపాలిస్తూ వచ్చారు. చదవండి: చైతన్య భారతి: డిగ్రీ లేని మేధావి రాచరిక పాలనకు వ్యతిరేకంగా గణముక్తి పరిషద్ ఉద్యమం ప్రారంభమైనది. ఈ ఉద్యమ ఫలితమే త్రిపుర భారతదేశంలో విలీనం అవడం. దేశ విభజన తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రంలో ఇప్పుడు బెంగాలీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయం పొందినవారే), స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనం సాగిస్తున్నారు. త్రిపుర 1972లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. మేఘాలయ 1972 ముందు వరకు అస్సాంలో భాగంగా ఉండేది. మణిపుర్, త్రిపురలతో పాటు ప్రభుత్వం 1972 జనవరి 21 మేఘాలయకు రాష్ట్ర ప్రతిపత్తిని ఇచ్చింది. -
కాంగ్రెస్ నేతపై దాడి.. ఆరోగ్య పరిస్థితి విషమం
ఉప ఎన్నికల వేళ త్రిపురలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన త్రిపురలో రాజధాని అగర్తాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుదీప్ బర్మాన్.. ఆదివారం రాత్రి ఉజన్ అభోయ్నగర్లో తన మద్దతుదారులను కలిశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. అనంతరం కారు, కాంగ్రెస్ పార్టీ జెండాలను ధ్వంసం చేశారు. కాగా, ఈ దాడికి అధికార బీజేపీ పార్టీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకునే ఇలా దాడి చేశారని విమర్శించారు. అంతకుముందు కూడా సుదీప్ రాయ్.. భద్రతా సిబ్బంది, డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా.. సుదీప్ రాయ్ బర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సర్కార్ పాలనలో ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ అధిష్టానం మంత్రి పదవి నుంచి తొలగించింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో బర్మాన్ బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 26న ఓట్ల లెక్కింపు జరగనుంది. Tripura Bypoll Violene - BJP Gundas attack Agaratala - 6 congress Candidate sudip Roy Barman. pic.twitter.com/ZiREN9gWNz — With Congress (@WithCongress) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
త్రిపుర జట్టుకు మెంటార్గా వృద్ధిమాన్ సాహా..!
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా.. త్రిపుర జట్టుకు ప్లేయర్ కమ్ మెంటార్గా సేవలు అందించాడనికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఏడాది శ్రీలంకతో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్కు సాహాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బ్యాకప్ వికెట్ కీపర్గా కెఎస్ భరత్ను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. అప్పటి నుంచి సాహాను సెలక్టర్లు పక్కన పెట్టారు. తాజాగా ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు కూడా సాహాను ఎంపిక చేయలేదు. కాగా జట్టు నుంచి ఉద్వాసన తర్వాత ఐపీఎల్, దేశవాళీ క్రికెట్పై దృష్టి సారిస్తాని గతంలో సాహా తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన షా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన అతడు 317 పరుగులు చేశాడు. ఇక త్రిపుర తరపున షా ఆడాలనుకుంటే 'క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్' నుంచి ఖఛ్చితంగా నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి.ఘీపై ఈ విషయాన్ని త్రిపుర క్రికెట్ అసోసియేషన్తో బీసీసీఐ చర్చిస్తుంది. "వృద్ధిమాన్ సాహా త్రిపురకు ప్లేయర్-కమ్-మెంటర్గా వ్యవహరించాలని అనుకుంటున్నాడు. అతడు త్రిపుర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఏమీ ఖరారు కాలేదు" అని ఎన్డీటీవీతో బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..! -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మాణిక్ సాహా
అగర్తల: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలోని రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఎస్.ఎన్. ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేంతవరకూ సాహా.. త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్నారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో బీజేపీలో చేరిన మానిక్ సాహా అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరో ఆరునెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. బిప్లవ్ దేవ్తో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్ఠానం మానిక్ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. -
త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర కొత్త సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా(69)ను బీజేపీ అధిష్టానం ఖరారుచేసింది. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్ బాధ్యతలతో పాటుగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా, ఆయన 2016లో బీజేపీలో చేరారు. ఇక, రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అంతకు ముందు సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ అధిష్టానం ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చైనా అధ్యక్ష పదవికి జిన్పింగ్ రాజీనామా.. ఆయనకు పగ్గాలు..? -
త్రిపుర సీఎం బిప్లవ్దేవ్ రాజీనామా
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, బిప్లవ్దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు.. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాక్ -
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కొందరు మహిళలు అతడిని అడవిలో..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని(46) కొంత మంది మహిళలు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. సదరు వ్యక్తి ఓ హత్య కేసులో ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలవడం గమనార్హం. వివరాల ప్రకారం.. త్రిపురలోని ధలై జిల్లాలోని గండెచెర్ర పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారీగా మహిళలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలికను పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక కేకలు వేయగా.. నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే స్థానికులు బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం సదరు బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గండెచెర్ర-అమర్పూర్ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలోనే నిందితుడిని కొందరు వ్యక్తులు పట్టుకున్నారన్న విషయం తెలియడంతో అక్కడికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకున్నారు. అనంతరం అతడిని చెట్టుకు కట్టేసి మహిళందరూ తీవ్రంగా కొట్టారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
తిపురలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా
అగర్తల: త్రిపురలో పాలక బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీప్రాయ్ బర్మన్, ఆశిష్ సాహా సోమవారం గుడ్బై చెప్పారు. శాసనసభ్యత్వంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. వాళ్లు మంగళవారం కాంగ్రెస్లో చేరతారని భావిస్తున్నారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని సర్కారు జనం ఆకాంక్షలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైంది’’ అని విమర్శించారు. మరెందరో ఎమ్మెల్యేలు బీజేపీని వీడనున్నారని, త్వరలో ప్రభుత్వం మైనారిటీలో పడటం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే వారి రాజీనామాలతో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ మాణిక్ సాహ అన్నారు. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో రాజీనామాల తర్వాత బీజేపీ బలం 33కు తగ్గింది. -
‘గోవా, త్రిపుర కాదు.. బెంగాల్పై దృష్టి పెట్టండి’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అధికార తృణమూళ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటనపై విరుచుకపడ్డారు. టీఎంసీ త్రిపురలో ఏం చేయలేదని, అభిషేక్ బేనర్జీ అక్కడి వెళ్లడం దండగని ఎద్దేవా చేశారు. టీఎంసీ త్రిపురలో తన ఉనికిని నిలుపుకోలేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తారని తెలిపారు. బెంగాల్ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని మండిపడ్డారు. టీఎంసీ త్రిపుర, గోవాల రాష్ట్రాల వైపు చూడటం కాదని, ముందుగా బెంగాల్ అభివృద్దిపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. గోవా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మంగా భావించే.. 'దువారే సర్కార్' పథకం ప్రారంభం కావాల్సింది కాస్త నిధుల కొరత కారణంగా రద్దయిందని ఆరోపించారు. ప్రణాళికలు, నిధుల కొరత వల్ల ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని విమర్శించారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దిలీప్ ఘోష్ పరిశీలించాలని అన్నారు. -
‘యశ్’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి..
Yash Thakur: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో విదర్భ జట్టు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో విదర్భ 34 పరుగులతో త్రిపురపై నెగ్గింది. విదర్భ 50 ఓవర్లలో 7 వికెట్లకు 258 పరుగులు చేయగా... త్రిపుర జట్టు 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ పేసర్ యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యశ్ రాథోడ్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో రాజస్తాన్పై కర్ణాటక... మధ్యప్రదేశ్పై ఉత్తరప్రదేశ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. స్కోర్లు: విదర్భ: 258/7 (50) త్రిపుర: 224 (49.3) చదవండి: IND Vs SA: ఓవర్లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! Rishabh Pant: రిషభ్పంత్కు లక్కీ ఛాన్స్.. ఫోన్ చేసి చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి DO NOT MISS: Yash Thakur's match-winning 4/45 👏 👏 The pacer was the pick of the Vidarbha bowlers and guided his team to a victory over Tripura. 👍 👍 #VIDvTPA #PQF1 #VijayHazareTrophy Watch his 4⃣-wicket haul 🎥 🔽https://t.co/b1aNytDoRW pic.twitter.com/DDwK8aMQI6 — BCCI Domestic (@BCCIdomestic) December 19, 2021 -
త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్స్వీప్
అగర్తలా: త్రిపుర స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్థానిక సంస్థల్లోని మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లోని మొత్తం 51 స్థానాలతోపాటు రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ఏఎంసీలో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీలు అనూహ్యంగా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్ నగర్, అమర్పూర్నగర్ తదితర పంచాయత్లలో బీజేపీ క్లీన్స్వీప్ చేసిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నవంబర్ 25వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. మతకలహాలు, ఘర్షణలు, కోర్టు కేసులు.. ఎన్నికలను ప్రశాంతంగా జరపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా, బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్థానిక సంస్థలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. సుపరిపాలనకే త్రిపుర ప్రజలు మొగ్గు: ప్రధాని త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో కూడిన రాజకీయాలకే త్రిపుర ప్రజలు మొగ్గు చూపారని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
పోలీస్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురిని చంపేశాడు!
అగర్తలా: మానసికంగా కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురిని ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. ఈ ఘటన త్రిపురలోని ఖొవాయ్ జిల్లాలో శనివారం జరిగింది. ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్ దేవ్రాయ్ శనివారం ఉదయం అకస్మాత్తుగా తన ఇంట్లోనే భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు సోదరుడిని ఐరన్ రాడ్తో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఘటనలో కూతుళ్లు, సోదరుడు మరణించారు. తర్వాత అటుగా వెళ్తున్న ఆటోను అడ్డగించి, డ్రైవర్, అతడి కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ చనిపోయాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సత్యజిత్ మల్లిక్ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రదీప్ను నిలువరించేందుకు యత్నించారు. కానీ, తెలియని ఆవేశంతో ఉన్న ప్రదీప్.. ఇన్స్పెక్టర్ సత్యజిత్పై కూడా ఇనుప రాడ్తో దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. -
ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి
న్యూఢిల్లీ/అగర్తలా: అసోం పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని తక్షణమే విడుదల చేయాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్(ఐడబ్ల్యూపీసీ) డిమాండ్ చేసింది. బాధిత జర్నలిస్టులు సమద్ధి సకునియా, స్వర్ణ ఝాకు సంఘీభావం ప్రకటించింది. హెచ్డబ్ల్యూ న్యూస్ నెట్వర్క్లో పనిచేస్తున్న వీరిద్దరూ త్రిపురలో ఇటీవల చెలరేగిన మతపరమైన అల్లర్లను కవర్ చేశారు. త్రిపురలో కేసు.. అసోంలో అరెస్ట్ అయితే త్రిపుర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలింగించారంటూ ఫాటిక్రోయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మత విద్వేషాల్ని ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కాంచన్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో ప్రార్థనా మందిరం ధ్వంసమయినట్టు అసత్య ప్రచారం చేశారని మహిళా జర్నలిస్టులపై వీహెచ్పీ ఫిర్యాదు చేసింది. దీంతో వీరిని అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గోమతిలోని కక్రాబన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైనట్టు త్రిపుర డీజీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించారు త్రిపురలో జరిగిన మత పరమైన అల్లర్ల ప్రభావం మహారాష్ట్రపై పడి, నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే త్రిపురలో ప్రార్థనా మందిరం ధ్వంసం అయిందన్న ఆరోపణల్ని కేంద్ర హోంశాఖ తోసిపుచ్చింది. ‘త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో మసీదును ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నకిలీవి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించాయి’ అని స్పష్టం చేసింది. చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారు కాగా, సిల్చార్కు వెళ్లాల్సిన తమ జర్నలిస్టులను అసోం పోలీసులు చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారని హెచ్డబ్ల్యూ న్యూస్ నెట్వర్క్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆరోపించింది. అసోంలో తమ సిబ్బందిపై ఎటువంటి కేసు లేనప్పటికీ త్రిపుర పోలీసుల ఆదేశాల మేరకు వారెంట్ లేకుండా స్వర్ణ, సమృద్ధిలను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. మీడియా గొంతు నొక్కేందుకు త్రిపుర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిరస్తున్నారని విమర్శించింది. కాగా, మహిళా జర్నలిస్టుల అరెస్ట్ను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కాగా, గోమతి జిల్లాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. (చదవండి: ‘రజా అకాడమీ’ని నిషేధించాలి.. వీహెచ్పీ డిమాండ్) -
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
అమరావతిలో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్కమల్ చౌక్తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం -
అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు
అగర్తల: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కార్యాలయంపై దుండగులు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అనంతరం నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా త్రిపుర రాజధాని అగర్తలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం ప్రధాన కార్యాలయం భాను స్మృతి భవన్పై బుధవారం సాయంత్రం కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డాయి. ఆ భవనంతో పాటు పక్కనే ఉన్న దశరథ్ భవన్ను కూడా నిప్పు పెట్టారు. అక్కడ కనిపించిన వాహనాలను కూడా దగ్ధం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది బీజేపీ అని సీపీఎం ఆరోపిస్తోంది. బీజేపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది. అయితే బీజేపీ వాటిని తిప్పికొట్టింది. వారి పార్టీ కార్యాలయాల్లో బాంబులు ఉన్నాయని, అవి పేలడంతో నిప్పు చెలరేగిందిన బీజేపీ ఆరోపిస్తోంది. చదవండి: గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి -
టీఎంసీ నాయకులపై తాలిబన్ల తరహాలో దాడి చేయండి..
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపురలోని బెలోనియా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుణ్ చంద్ర భౌమిక్.. ఇటీవల తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల తరహాలో దాడి చేయాలని తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు టీఎంసీ నాయకులు త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఒంట్లో చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ తాము బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే, త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్ల పాలన తరువాత బిప్లవ్ దేవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తమ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు టీఎంసీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే తమ కార్యాచరణను మొదలుపెట్టాయి. చదవండి: శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా? -
‘టీఎంసీ కార్యకర్తలపై దాడుల వెనక అమిత్ షా’
కోల్కతా: త్రిపురలో బీజేపీ నియంతృత్వ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. త్రిపురలోని అగర్తలలో గాయపడిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో మమతా బెనర్జీ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన సాగుతోందని, ముఖ్యంగా త్రిపుర, అసోం, ఉత్తరప్రదేశ్లో అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఆదివారం త్రిపురలో కొందరు వ్యక్తులు.. సుదీప్, జయ అనే ఇద్దరు బెంగాల్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని మండిపడ్డారు. పోలీసుల ముందే దాడి జరిగినప్పటికీ వారు పట్టించుకోలేదని, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ దాడుల వేనక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని మమతా ఆరోపించారు. అందుకే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని అన్నారు. ఇటీవల టీఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అభిషేక్ బేనర్జీ త్రిపురలోని అగర్తల పట్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్పై కొంతమంది కర్రలతో దాడి చేసి విషయం తెలిసిందే. ఈ దాడుల వెనుక కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారని, వాటికి ఆయన బాధ్యతవహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. -
త్రిపుర సీఎంపై హత్యాయత్నం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వాకింగ్కు వెళ్లినప్పడు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఆయనని ఢీకొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాస్త ఆలస్యంగా ఆ ఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. హత్యాయత్నానికి ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం బిప్లవ్ కుమార్ తన అధికారిక నివాసమైన శ్యామ్ప్రసాద్ ముఖర్జీ లేన్కి సమీపంలో గురువారం ఈవెనింగ్ వాక్కి వెళ్లారు. ఆయన చుట్టూ భద్రతా వలయం ఉన్నప్పటికీ వారి మీదుగా హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చింది. కారు రావడాన్ని గమనించిన బిప్లవ్ పక్కకి జరగడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. ఆ కారుని పట్టుకోవడానికి సీఎం భద్రతా సిబ్బంది విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు గురువారం అర్ధరాత్రి కారుని, అందులో ఉన్న ముగ్గుర్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి వయసు సుమారుగా 20 ఏళ్లు ఉంటుంది. వారు ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో కారణాలు ఇంకా తెలియలేదు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
మమతా బెనర్జీ అల్లుడి కాన్వాయ్పై దాడి
-
మమతా బెనర్జీ మేనల్లుడి కాన్వాయ్పై దాడి
అగర్తల: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగింది. అది కూడా వేరే రాష్ట్రంలో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. డైమండ్ హర్బర్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర అగర్తలలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ ట్విటర్లో ‘‘బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అంటూ తన కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిలో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన.. కొందరు వ్యక్తులు నిలుచుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు. వీరిలో కొందరి చేతిలో బీజేపీ జెండా ఉంది. కాన్వాయ్ అలా ముందుకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి కర్రతో అభిషేక్ బెనర్జీ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశాడు. వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ ఎంపీ కాన్వాయ్పై దాడి చేయడాన్ని టీఎంసీ నాయకులు ఖండించారు. ఈ క్రమంలో టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్పై జరిగిన దాడిని ఖండించడమేకాక ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటిస్తుండటంతో.. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ పోస్టర్లను చించేశారని టీఎంసీ నాయకులు ఆరోపించారు. -
త్రిపురలో ఐప్యాక్ బృందం నిర్బంధం
అగర్తలా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సభ్యులు 23 మందిని త్రిపుర పోలీసులు ఒక హోటల్లో హౌస్ అరెస్టు చేశారు. 2023లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐప్యాక్ బృందం వారం రోజుల కిందట అగర్తలాకు చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి త్రిపుర పోలీసులు వీరిని హోటల్ నుంచి బయటికి రానివ్వడం లేదు. ‘తృణమూల్ ఇంకా త్రిపురలో అడుగుపెట్టకముందే బీజేపీ భయపడుతోంది. 23 మంది ఐప్యాక్ ఉద్యోగులను గృహనిర్భందంలో పెట్టారు. బీజేపీ అరాచక పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే పదేపదే ఖూనీ అవుతోంది’ అని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. బయటినుంచి వచ్చినందున వారికి కరోనా పరీక్షలు చేశామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు. -
అప్పటికింకా మాకు పెళ్లి కాలేదు.. అందుకే అలా: ఐఏఎస్
అగర్తలా: సాధారణంగా పరీక్షలు రాయడం పూర్తి కాగానే విద్యార్థులు ఉపశమనం దొరికినట్లు ఫీలవుతారు. అదే విధంగా.. ఫలితాలు ఎప్పుడు వస్తాయో, పాస్ అవుతామో లేదో అన్న భయాలతో ఒత్తిడికి కూడా గురిఅవుతారు. అటువంటి సమయాల్లో నచ్చిన పని చేస్తూ సేద దీరడం లేదంటే, సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఐఏఎస్ అధికారిణి చాందినీ చంద్రణ్ కూడా ఇందుకు అతీతం కాదు. 2015లో ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఒత్తిడికి లోనైన చాందినీ.. తన ప్రియ మిత్రుడు అరుణ్ సుదర్శన్తో కలిసి సరాదాగా ఔటింగ్కి వెళ్లారు. సరిగ్గా అప్పుడే వర్షం పడింది. ఒకే గొడుగు కింద ఇద్దరూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. అరుణ్ సుదర్శన్ ఆమె భుజంపై ఆత్మీయంగా చేయి వేసి ముందుకు నడిపిస్తుండగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తున్నారు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు కెమెరాను క్లిక్ మనిపించారు. ఇంకేముంది.. తర్వాతి రోజు పత్రికలో.. ‘‘వేసవివి సెలవు.. రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది’’ అంటూ చాందినీ చంద్రణ్, అరుణ్ సుదర్శన్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను ఇందుకు జతచేసి పబ్లిష్ చేశారు. అయితే, కాకతాళీయంగా అదే రోజు సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో ఆ యేడు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ఫొటోలతో పాటు మరో పేజీలో చాందినీ చంద్రణ్(ఆమె అప్పుడు ఉత్తీర్ణురాలు కాలేదు) ఫొటో కూడా పబ్లిష్ కావడం గమనార్హం. దీంతో.. అరుణ్ సుదర్శన్... సదరు పత్రికా సంస్థకు ఫోన్ చేసి, తమ ఫొటో ఎందుకు వేశారని నిలదీశారు. సదరు ఫొటోగ్రాఫర్తో మాట్లాడి ఇలాంటి ఫొటోలు అనుమతి లేకుండా పబ్లిష్ చేయవద్దని హితవు పలికారు. ఈ విషయాన్ని మంగళవారం ట్విటర్ వేదికగా పంచుకున్న ఐఏఎస్ చాందినీ చంద్రణ్ గత జ్ఞాపకాలకు గుర్తు చేసుకున్నారు. అప్పటికి మాకింకా పెళ్లికాలేదు ‘‘ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదు!! కానీ అలాంటి ఫొటోలు ఇంట్లో వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి కదా. ఎందుకంటే.. అప్పటికి మాకింకా పెళ్లి కాలేదు. అయితే, ప్రస్తుతం మేం వివాహం చేసుకున్నాం. ఇటీవలే ఈ ఫొటో గురించి గుర్తుకు రాగా.. అరుణ్ సుదర్శన్ సదరు ఫొటోగ్రాఫర్ను సంప్రదించగా... ఆ ఫొటోకాపీని మాకు పంపించారు. ఇందుకు కేవలం థాంక్స్ అనే మాటతో సరిపెట్టలేను!!’’ అని ఈ స్టోరీని రివీల్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో.. ‘‘అత్తుత్తమ ఫొటోల్లో ఇది ఒకటి!! మధుర జ్ఞాపకాలు. ఏంటో.. ఊహించనవి అలా అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటాయి. పాత ఫొటో అయినా ఇది మీకెంతో ప్రత్యేకం కదా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐఐటీ మద్రాస్లో విద్యనభ్యసించిన చాందినీ చంద్రణ్ 2017లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె.. ఉత్తర త్రిపురలోని కాంచన్పూర్లో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. as we weren't married then 😅.I took it as a sign that my photo was destined to be there in the paper filled with UPSC toppers and that I can happily walk towards any destination with someone holding an umbrella and looking out for me with love unbound when I take each step.(2/3) — Chandni Chandran (@chandni_ias) June 29, 2021 -
కన్నకూతురుపై తండ్రి దారుణం.. అనుమానాస్పద స్థితిలో మృతి
అగర్తల: త్రిపుర నార్త్ జిల్లాలో ఒక వ్యక్తి తన ఇంటికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రెండు రోజుల క్రితం 17 ఏళ్ల కన్నకూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగళవారం సదరు వ్యక్తి తన ఇంటికి కొద్ది దూరంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కాగా వ్యక్తి మృతిపై ప్రాథమిక విచారణ జరుగతుందని.. అది ఆత్మహత్యా.. లేక హత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ భానుపద చక్రవర్తి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మహిళ మెడలో చెప్పుల దండ వేసి.. గుండు కొట్టించి..
అగర్తల : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న కారణంగా ఓ మహిళను దారుణంగా హింసించి, ఘోరంగా అవమానించారు గ్రామస్తులు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. త్రిపుర హైకోర్టు ఈ ఘటనకు సంబంధించిన కేసును సమోటోగా తీసుకున్న మరుసటి రోజే బాధితురాలు ప్రాణాలు తీసుకోవటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. త్రిపురలోని బెతగ గ్రామానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గ్రామస్తులకు తెలిసింది. మంగళవారం ఈ విషయమై పంచాయతీ జరిగింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ వివాహేతర సంబంధానికి చెందిన వీడియోను పెద్ద స్క్రీన్పై ప్రదర్శించారు. వీడియో బహిర్గతం కావటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని, ఇంటికి వెళ్లింది. ఇంటి వద్దకు కూడా వచ్చిన గ్రామస్తులు ఆమెను బయటకు లాగి చెప్పుల దండ మెడలో వేశారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, నగ్నంగా ఊరంతా తిప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సమోటోగా స్వీకరించిన హైకోర్టు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఆ మరుసటి రోజే.. గ్రామస్తుల చర్యతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి : ఈపాస్ల కోసం ఏకంగా ట్రంప్, అమితాబ్లను వాడేశారు.. -
త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం
-
వర్షం కురవాలని పెళ్లి .. వైరల్ వీడియో..
దేశంలో కరోనా కల్లోలం వివాహలపై కూడా పెద్ద ప్రభావాన్నే చూపించింది. బంధువుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లిళ్లను కాస్త.. కొద్దిమంది సమక్షంలో ఏలాంటి సందడి లేకుండా జరుపుకుంటున్నారు. కాగా, త్రిపురలోని ఒక పట్టణంలో జరిగిన పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, అది మనుషుల పెళ్లి కాదండోయ్.. కప్పల పెళ్లి. వివరాలు.. త్రిపురలో వర్షం కురవాలని కప్పల వివాహం జరిపించారు. దీంట్లో ఇద్దరు మహిళలు వారి చేతుల్లో రెండు కప్పలను పట్టుకున్నారు. వాటికి సంప్రదాయ బట్టలను కూడా తొడిగారు. అంతటితో ఆగకుండా అందులో మగకప్పచేత... ఆడకప్పకు బొట్టు పెట్టించారు. అయితే.. దీంట్లో ఇద్దరు మహిళలు మాత్రం సామాజిక దూరాన్ని పాటించలేదు. దీన్ని చూసిన నెటిజన్లు వావ్.. కరోనాలోనూ ఆగని పెళ్లి.. కాస్త సోషల్ డిస్టెన్స్ పాటిస్తే బాగుండేది.. మీ వల్ల కప్పలకు కరోనా సోకే ప్రమాదం ఉంది.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, వర్షం సమృద్ధిగా కురవాలని వానాకాలం వచ్చేముందు చాలా చోట్ల కప్పల పెళ్లిలు జరిపిస్తారనే సంగతి తెలిసిందే. -
కలెక్టర్ వీరంగం : తప్పు చేశా నన్ను క్షమించండి !
అగర్తలా: ఓ పెళ్లి మంటపానికి వెళ్లి వీరంగం సృష్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్ కుమార్ తనను విధుల నుంచి వైదొలగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి రతన్లాల్ నాథ్ మీడియాకు వెల్లడించారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు నిష్పక్షపాతంగాగా జరగాలంటే తనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ శైలేష్ కుమార్ సీఎస్కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు రతన్లాల్ తెలిపారు. త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ శైలేష్కుమార్ యాదవ్ ఏప్రిల్ 26న అగర్తాలాలో ఓ వివాహం జరగాల్సి ఉండగా.. అక్కడకు వెళ్లి వీరంగం సృష్టించారు. వరుడు, వధువు, అతిథులతో పాటు, అక్కడే ఉన్న పురోహితులపై చేయిచేసుకున్నారు. కనిపించిన వారిపై చిర్రుబుర్రులాడారు. కలెక్టర్ చిందులు తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బ్రాహ్మణ సమాజ్ సంఘం నేతలు, వివిధ సామాజిక సంస్థలు, మానవ హక్కుల నేతలు, ప్రముఖ సింగర్ సోను నిగంలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలేష్ కుమార్ యాదవ్ను సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. విచారణకు హాజరు కావాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విచారణకు హాజరైన శైలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినందుకే చర్యలు తీసుకున్నా. చట్టాన్ని అమలు చేయడం నా కర్తవ్యం. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి’’ అంటూ యూటర్న్ తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం త్రిపుర పశ్చిమ జిల్లా కలెక్టర్ గా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డైరెక్టర్ రావెల్ హమేంద్ర కుమార్ డీఎమ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు -
అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు
-
వైరల్: అతిథిలా వచ్చిన కలెక్టర్.. వధూవరులపై కేసు నమోదు
అగర్తల: దేశంలో కరోనా విజృంభిస్తూ వీర విహారం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించడం, సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలకు జరుపుకునే విషయంలో ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలోనే ప్రజలు వేడుకలు జరుపుకోవాలని స్పష్టంగా చేప్తున్నాయి. అయితే ఎవరు ఎంత చెప్తున్నా కొందరు మాత్రం నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా కేసులు పెరగడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఓవైపు సామాన్య ప్రజలు కరోనా మహమ్మారితో హడలిపోతుంటే త్రిపురలోని రెండు కుటుంబాలు వారి పెళ్లి వేడుకలను ఆడంబరంగా, భారీ జనసందోహంతో జరపుకున్నారు. కోవిడ్ నిబంధనలు మరిచి పెళ్లి వేడుకలను చేసుకుంటున్న ఆ జంటలపై వెస్ట్ త్రిపుర కలెక్టర్ అడ్డుకుని వారిపై కేసులను నమోదు చేశారు. ఏ ముహూర్తాన పెళ్లి పెట్టుకున్నారో గానీ.. మండపంలోనే ఆ జంటలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర గేట్ ప్రాంతంలోని ప్యాలెస్ కాంపౌండ్లో గులాబ్ బాగన్, మాణిక్య కోర్టు అనే రెండు వివాహ మండపాల్లో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్.. మొదట తానొక్కడే ఓ అతిథిలా అక్కడికి వెళ్లారు. అక్కడ నిబంధనలకు గాలికి వదిలేసినట్లు కనిపించడంతో సిబ్బంది సాయంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పెళ్లి నిర్వాహకులపైనే కాక వధూవరులు వారి కుటుంబ సభ్యులతో సహా అనేక మందిని అరెస్టు చేయాలని ఆ కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. అంతేకాదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోరా అంటూ పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు కల్యాణ మండపాలపైనా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సంవత్సరానికి పైగా నిషేధం విధించారు. ప్రస్తుతం ఈ కలెక్టర్ చర్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ( చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ ) -
కరోనా బారిన మరో ముఖ్యమంత్రి
అగర్తాల: కరోనా వైరస్ బారిన మరో ముఖ్యమంత్రి పడ్డారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్కు తాజాగా కరోనా వైరస్ సోకింది. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ తేలిందని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్తో అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. ఒక్కరోజే లక్ష 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. చదవండి: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
ఘోరం: ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం
అగర్తల: ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటన త్రిపురలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ పరిణామం బీజేపీలో తీవ్ర విషాదం నింపింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మినీ ట్రక్కులో బీజేపీ కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దక్షిణ త్రిపురలోని నూతన్బజార్కు చేరుకోగానే ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. టక్కు చెట్టును ఢీకొని పల్టీ కొట్టి లోతట్టు ప్రాంతంలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ అధిష్టానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఉనకోటిలో 30 అడుగుల కాలభైరవ విగ్రహం
నేల మీది కైలాసం ఉనకోటి... కోటికి ఒకటి తక్కువ. ఇది లెక్క మాత్రమే కాదు. ఓ ప్రదేశం కూడా. హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంది. త్రిపుర రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రదేశమిది. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్హర’ అనే పట్టణానికి దగ్గరగా ఉంది ఉనకోటి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. పచ్చదనం లోపించిన కొండరాయిలో అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎప్పుడు చెక్కారో, ఎవరు చెక్కారో, ఎలా చెక్కారో? అన్నింటినీ చూడలేం... ఇక్కడి శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. శివుడికి రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నేలలో కూరుకుపోయిన నంది విగ్రహం, మౌనముద్రలో గణేశుడు, ఇంకా పేరు తెలియన అనేక శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డు పెట్టింది. ఇంకా విగ్రహాలున్నయోమోనని అడవిని గాలిస్తోంది. ఇది హెరిటేజ్ సైట్. భవిష్యత్తులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల ప్రామాణిక పట్టికలో చేరి తీరుతుంది. ప్రపంచం గుర్తించేలోపే ఉనకోటిని చూసేశామంటే... ‘వరల్ట్ హెరిటేజ్ సైట్’ అనే ట్యాగ్లైన్ చేరిన రోజు ‘ఎప్పుడో చూసేశాం’ అని మన భుజాన్ని మనమే చరుచుకోవచ్చు. ఎవరు చెక్కారంటే... ‘కల్లు కుమ్హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. అతడు పార్వతి భక్తుడని, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు. క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. రైల్వేస్టేషన్ కుమార్ఘాట్లో ఉంది. కుమార్ఘాట్కు ఉనకోటి 20 కి.మీ.ల దూరాన ఉంది. జనపథ కథనం ఒకానొకప్పుడు శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఆ ప్రయాణంలో ఈ ప్రదేశానికి వచ్చేసరికి సంజెచీకట్లు అలముకున్నాయి. ప్రయాణం కష్టమైంది. దాంతో ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చింది– అని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే అక్కడ శివుడి శిల్పం ఉండకూడదు, కానీ ఇక్కడ శివుడి శిల్పం కూడా ఉంటుంది. పైగా దేశంలోకే అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదేనని కూడా చెబుతారు. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది.