రెవాడి: ఢిల్లీలో నిర్భయ ఉదంతం ఇంకా కళ్లముందు కదలాడుతుండగానే.. శుక్రవారం అదే తరహాలో హర్యానాలోని లోహానా గ్రామంలో ఒక 20 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం జరిగింది. బుధవారం ఆ యువతి పాఠశాలకు వెళుతుండగా... ముగ్గురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అనంతరం కారులో తిప్పుతూ ముగ్గురూ వరుసగా అత్యాచారం చేసి.. మహేందర్గఢ్ జిల్లాలోని కనినా ప్రాంతంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.