
స్వయంగా ఆర్జించిన జాబితాలో నలుగురు భారత మహిళలకు చోటు

నేహా నార్ఖడే: నేహా 520 మిలియన్ డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు. గతంలో లింక్డ్ఇన్లో పనిచేశారు.

కీలకమైన అపాచీ కఫాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో లింక్డ్ఇన్ను వీడి, ఇద్దరు సహోద్యోగులతో కలిసి కాన్ఫ్లూయెంట్ను స్థాపించారు.

జయశ్రీ ఉల్లాల్: 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానంలో ఉన్నారు.జయశ్రీ 2008 నుంచి ఆరిస్టా నెట్వర్క్ ప్రెసిడెంట్, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నీర్జా సేథీ: సింటెల్ సహ వ్యవస్థాపకురాలిగా 990 మిలియన్ డాలర్ల సంపదతో నీర్జా జాబితాలో 25వ స్థానంలో కొనసాగుతున్నారు. 1980లో భర్త భరత్ దేశాయ్తో కలిసి నీర్జా సింటెల్ను స్థాపించారు.

ఇంద్రా నూయీ: 350 మిలియన్ డాలర్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు. 2019లో ఆమె పెప్సికో నుంచి పదవీ విరమణ చేశారు.

24 ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ.. పెప్సికో ఆదాయాన్ని పెంచారు.

2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి అమెజాన్లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

ఇక ఈ జాబితాలో ఏబీసీ సప్లై సహ వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఆమె ఈ ఘనత సాధించడం వరుసగా ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్ డాలర్లు.