Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Warn Kutami Govt Favour Police at Papireddypalli1
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్‌ జగన్‌

సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్‌ సిక్స్‌ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

Minimum Security Drought For Ys Jagan Tour In Sri Sathya Sai District2
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్‌ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్‌ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. జగన్‌ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్‌ జగన్‌ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

IPL 2025: KKR VS LSG Live Updates And Highlights3
KKR VS LSG Updates: ఉత్కంఠ‌పోరులో కేకేఆర్ ఓట‌మి..

ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఓట‌మి..ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన ఉత్కంఠ పోరులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై 4 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. 239 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది.ర‌స‌వ‌త్త‌రంగా కేకేఆర్‌-ల‌క్నో మ్యాచ్‌ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో-కేకేఆర్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. కేకేఆర్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్‌(24), హ‌ర్షిత్ రానా(5) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్‌..వెంక‌టేశ్ అయ్య‌ర్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 45 ప‌రుగులు చేసిన అయ్య‌ర్‌.. ఆకాష్‌దీప్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వ‌చ్చాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 185/6గా ఉంది. ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌త్వరగా లక్ష్యాన్ని చేరుకుందామనే తొందరలో కేకేఆర్‌ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 173 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి రఘువంశీ (5) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 173/5గా ఉంది. నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌13.6వ ఓవర్‌- 166 పరుగుల వద్ద రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి రమన్‌దీప్‌ సింగ్‌ (1) ఔటయ్యాడు.మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో వరుసగా ఐదు వైడ్లు వేసిన శార్దూల్‌ ఠాకూర్‌ ఆ ఓవర్‌ చివరి బంతికి అతి కీలకమైన రహానే (61) వికెట్‌ తీశాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 162/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలవాలంటే 42 బంతుల్లో మరో 77 పరుగులు మాత్రమే చేయాలి. వాతావరణ​ం బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. బంతి అస్సలు నియంత్రణలో ఉండటం లేదు. టార్గెట్‌ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్‌239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్‌ అయ్యర్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌6.2వ ఓవర్‌- పవర్‌ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్‌ (90/1) ఆతర్వాతి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. దిగ్వేష​్‌ రాఠీ సునీల్‌ నరైన్‌ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్‌ అయ్యర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. టార్గెట్‌ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్‌ బ్యాటర్లుభారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్‌ వికెట్‌ కోల్పోయినప్పటికీ.. సునీల్‌ నరైన్‌ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్‌ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది. టార్గెట్‌ 239.. తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌2.3వ ఓవర్‌- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 37 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. తొలి ఓవర్‌లో 16 పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్‌ అద్భుతంగా కమ్‌బ్యాక్‌ ఇచ్చి డికాక్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్‌ నరైన్‌కు (15) జతగా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు.మార్ష్‌, పూరన్‌ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో భారీ స్కోర్‌ చేసింది. మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్‌ (36 బంతుల్లో 87 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్‌ బౌలర్లలో హర్షిత్‌ రాణా 2, రసెల్‌ ఓ వికెట​్‌ తీశారు. 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన పూరన్‌పూరన్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 192/2గా ఉంది. పూరన్‌తో పాటు అబ్దుల్‌ సమద్‌ (2) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో.. మార్ష్‌ ఔట్‌15.2వ ఓవర్‌- 81 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ ఔటయ్యాడు. రసెల్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.సెంచరీకి చేరువవుతున్న మార్ష్‌15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్‌ 170/1గా ఉంది. మార్ష్‌ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్‌ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్‌ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. దంచి కొడుతున్న మార్ష్‌హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక మార్ష్‌ మరింత స్పీడ్‌ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 138/1గా ఉంది. మార్ష్‌ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్‌ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు. తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్‌- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్‌ ఔటయ్యాడు. హర్షిత్‌ రాణా మార్క్రమ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మిచెల్‌ మార్ష్‌ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్‌ మార్చారు. మార్క్రమ్‌ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (23 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్‌ 72/0గా ఉంది. గేర్‌ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్‌ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో గేర్‌ మార్చాడు. ఆ ఓవర్‌లో అతను 2 బౌండరీలు, సిక్సర్‌ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 43/0గా ఉంది. మార్క్రమ్‌తో పాటు (28) మార్ష్‌ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్‌ మార్క్రమ్‌ (9), మిచెల్‌ మార్ష్‌ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 20/0గా ఉంది. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 8) కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. నేటి మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఓ మార్పు చేసింది. మొయిన్‌ అలీ స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్‌, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్‌ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్‌: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్‌ జాన్సన్‌, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్‌ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి

Pawan kalyan Press Meet on Singapore School Son Mark Shankar Incident4
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌, సాక్షి: సింగపూర్‌లో తన చిన్నకొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌(Mark Shankar Pawanovich) ప్రమాదానికి గురి కావడంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) స్పందించారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని.. తన కొడుకుకు గాయాలైన మాట వాస్తవమేనని ధృవీకరించారాయన. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.ఉదయం అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్‌ వచ్చింది. సింగపూర్‌ హైకమిషనర్‌ సమాచారం అందించారు. నా కొడుకు మార్క్‌ శంకర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగింది. మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నా. కానీ, ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు. 30 మంది పిల్లలు సమ్మర్‌ క్యాంప్‌లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ పసిబిడ్డ చనిపోయింది. నా కుమారుడు మార్క్‌ శంకర్‌కు చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులోకి పొగ వెళ్లినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ఫోన్‌​ చేసి విషయం తెలుసుకున్నారు. నా పెద్దకొడుకు అకీరా పుట్టినరోజే చిన్నకొడుక్కి ఇలా జరగడం బాధాకరం’’ అని పవన్‌ అన్నారు. సింగపూర్‌లో నా కుమారుడి అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ(PM Modi)కి ధన్యవాదాలు. అలాగే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ సహా అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పవన్‌ అన్నారు.ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో సింగపూర్‌(Singapore) రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించిన ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. పవన్‌-అన్నాలెజినోవాలకు కూతురు పోలేనా అంజనా పవనోవా, కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ సంతానం.

India keeps Chinas BYD at red signal amid efforts to attract Tesla investments5
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలు మనదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో చైనీస్ కంపెనీ 'బీవైడీ' ఉంది. తాజాగా ఈ జాబితాలో ఎలాన్ మస్క్ టెస్లా కూడా చేరింది.బీవైడీ కంపెనీ దేశంలో ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్నప్పుడు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ వైఖరికి కారణాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి 'పియూష్ గోయల్' ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో వెల్లడించారు.రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే చైనా పెట్టుబడులను కాదన్నట్లు వెల్లడించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థకు కూడా ఈ కారణాల చేతనే అనుమతి ఇవ్వలేదని పియూష్ గోయల్ వివరించారు.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?అమెరికా, భారత్ సంబంధాల దృష్ట్యా.. టెస్లాను ఇండియా ఆహ్వానిస్తోంది. త్వరలోనే టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. యూఎస్ కంపెనీ తన అమ్మకాల గురించి వెల్లడించింది.. కానీ స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. టెస్లా ఇండియాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే.. భారతదేశం ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.టెస్లా మోడల్ వైటెస్లా (Tesla) కంపెనీ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది. దీని రేటు రూ. 21 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

Family of victim Saurabh Responds On Muskans baby6
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం

మీరట్: గత నెలలో యూపీలో సంచలన సృష్టించిన భర్త హత్య కేసులో నిందితురాలిగా మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్ గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ లో రావడంతో పుట్టబోయే బేబీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. భర్తను ప్రియుడితో సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్న ముస్కాన్ గురించి కనీసం ఆమె కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు. ముస్కాన్ గర్భం దాల్చింది అన్న తర్వాత ఆమె కుటుంబం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భర్తను హత్య చేసిన తర్వాతే ఆమెను పట్టించుకోవడం మానేసిన కుటుంబ సభ్యులు.. ఈ విషయం గురించి కూడా ఎటువంటి ఆసక్తి చూపలేదు.ఈ విషయంపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు. సౌరబ్ రాజ్ పుత్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘ ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు.ముస్కాన్ గర్భవతి అని తెలిసినా..ముస్కాన్ గర్భవతి అని తెలిసినప్పటికీ ఆమె కుటుంబ నుంచి ఎవరూ కూడా జైలుకు వచ్చి చూడలేదు. కాకపోతే ఆమె ప్రియుడు సాహిల్ కుటుంబ సభ్యులు మాత్రం సోమవారం జైలుకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లారు. సాహిల్ నాన‍్నమ్మ జైలుకు వచ్చి మనవడితో మాట్లాడి వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముస్కాన్‌, సాహిల్‌లు ఇద్దరూ మీరట్‌ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్‌ ఇవ్వమని డిమాండ్‌ చేసినా జైలు రూల్స్‌ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్‌ రూమ్‌లే కేటాయించారు అధికారులు.

Upasana Konidela: Everyone Involved in Klin Kaara Raising7
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన

ఉపాసన కొణిదెల (Upasana Konidela).. రామ్‌చరణ్‌ సతీమణిగా ఇంటిని చక్కదిద్దడమే కాకుండా అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఉపాసన మాట్లాడుతూ.. పెళ్లయిన కొత్తలోనే రామ్‌చరణ్‌, నేను ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తను నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తాడు. నేనేదైనా చేయాలనుకుంటే అందుకు సహకరిస్తాడు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా నా వెంటే ఉన్నాడు.మా బంధం బలంగా ఉండటానికి అదే కారణంఅలాగే తను కష్టనష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను తనవైపు నిల్చున్నాను. మా బంధం ధృడంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అలాగే మా ఇరు కుటుంబాలు కూడా మా వెన్నంటే ఉన్నాయి. వైవాహిక బంధంలో.. ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయం కేటాయించడం తప్పనిసరి. వారానికి ఒకసారైనా డేట్‌ నైట్‌కు వెళ్లమని అమ్మ చెప్తూ ఉండేది. మాకు వీలైనంతవరకు దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. వారంలో ఒకరోజుకాకపోతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆ రోజంతా గడుపుతాం. ఆ రోజు టీవీ, ఫోన్లకు దూరంగా ఉంటాం. మా మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాట్లాడుకుంటేనే కదా ఏదైనా తెలిసేది, పరిష్కరించుకోగలిగేది. పెళ్లిళ్లు వర్కవుట్‌ కావాలంటే ఇవన్నీ చేస్తుండాలి. ఎప్పటికప్పుడు రిలేషన్‌ను బలపర్చుకుంటూ ఉండాలి. మావల్ల కాదని వదిలేస్తే కష్టం అని పేర్కొంది.ఉపాసన కచ్చితంగా వాళ్ల మధ్యే పెరగాలికుటుంబ విలువల గురించి మాట్లాడుతూ.. మా అమ్మ నా బెస్ట్‌ఫ్రెండ్‌. నేను మా గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గరే పెరిగాను. నా కూతురు కూడా నాలాగే నానమ్మ-తాతయ్యల దగ్గర పెరగాలని కోరుకుంటున్నాను. గ్రాండ్‌ పేరెంట్స్‌ చేతుల్లో పెరగడమనేది అందమైన అనుభవం. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం లేదు. నాకు మాత్రం మా అత్త-మామలతో కలిసి ఉండటమే ఇష్టం. మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండటమే నాకు నచ్చుతుంది.అదే నా ధీమాఅప్పుడే నా కూతురు వారి దగ్గరి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటుంది. మా అత్త, మామయ్య తనను జాగ్రత్తగా పెంచుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు తను మంచి చేతుల్లోనే ఉందన్న ధీమా ఉంటుంది. మా అమ్మానాన్న కూడా అంతే ప్రేమ, కేర్‌ చూపిస్తారు. ఇలా నా కుటుంబసభ్యులందరూ క్లీంకార ఎదుగుదలలో భాగమవుతున్నారు అని ఉపాసన చెప్పుకొచ్చింది.చదవండి: తోడుగా, నీడగా.. ఐకాన్‌ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్‌

American company sacks 700 In Donation Scam8
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!

ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిట‌బుల్ డొనేష‌న్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చిన‌ట్లు ప‌త్రాలు సృష్టించి...దానికి స‌మాన‌మైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

RK Roja Reacts On Pawan Kalyan Son Singapore Incident9
గెట్‌ వెల్‌ సూన్‌ చిన్నబాబు‌.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన

తిరుపతి, సాక్షి: పవన్‌ కల్యాణ్‌ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్‌ శంకర్‌(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్‌ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్‌ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్‌ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్‌ వ్యాలీ రోడ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తనయుడు మార్క్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్‌ అయ్యింది. పవన్‌-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం.

Bill Gates Said Weight Loss Medicines More Effective Than Lifestyle Changes10
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?

ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌​ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్‌ప్రెన్యూర్‌ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్‌లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్‌పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్‌. కాగా, ఈ డయాబెటిక్‌ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్‌ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్‌ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement