Arivazhagan
-
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.The thrill has a new face! 🎬🔥#Sabdham trailer is out now!🎧Link: https://t.co/FsVROFuRUnGet ready for a #SoundThriller ❤️🔥From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28Starring @AadhiOfficialAn @dirarivazhagan FilmA @MusicThaman Musical pic.twitter.com/FTt0HZ814g— Aadhi🎭 (@AadhiOfficial) February 19, 2025 -
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్సైట్పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్లో చూపించనున్నారట. ఈ సిరీస్కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
నయన ఆయనకు హ్యాండిచ్చిందా
తమిళసినిమా: అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. సూపర్స్టార్ నుంచి, యువ స్టార్స్ వరకూ పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్న ఈ బ్యూటీ మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ లేడీసూపర్స్టార్గా పేరు తెచ్చుకుంది. తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార చాలా నెలల క్రితం దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన ఈ సంచలన నటి కోసం ఒక మంచి పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు చిత్ర వివరాలను వెల్లడించవద్దని నయనతార దర్శకుడితో చెప్పినట్లు టాక్. దీంతో ఆ తరువాత అరివళగన్ చిత్రానికి సంబంధించిన వివరాలేవీ మీడియాల్లో ప్రచారం కావడం లేదు. నయనతార కూడా ఆ చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ఆ చిత్రాన్ని పెండింగ్లో పెట్టి ఇతర చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అరివళగన్ చిత్రంలో నటించడానికి నయనతార నిరాకరించినట్లు ప్రసారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే తను ఎందుకు ఈ చిత్రాన్ని దూరంగా పెట్టిందన్న విషయం తెలియలేదు. సుమారు ఏడాదికి పైగా దర్శకుడు అరివళగన్ను వెయిటింగ్లో పెట్టి ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందన్నది కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్త అధికారికంగా చిత్ర వర్గాలు వెల్లడించలేదన్నది గమనార్హం. -
ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..
చెన్నై: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భార్య తనకు దూరమవుతుందని భావించిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నాడు. అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఎస్ఐగా పనిచేస్తోంది. వీరిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని అరివఝగన్ చెప్పాడు. వీరిద్దరూ ఒకే బ్యాచ్కు చెందినవారని, స్నేహితులుగా ఉంటున్న వీరు పరిధి దాటి సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడించాడు. వీరిద్దరి అసహజ సంబంధం గురించి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని చెప్పాడు. వీరిద్దరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు. కాగా అరివఝగన్ తనను దూషించాడని మహిళ ఎస్ఐ ఉన్నతాధికారుల వద్ద ఆరోపించింది.