Bandari Bhaskar
-
జెడ్పీలో జగడం !
పాలమూరు: జిల్లా అభివృద్ధి పనులను విస్మరిస్తూ.. రాజకీయ విభేదాలకు వేదికగా.. పరస్పర విమర్శలకు తావిస్తూ ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ర సాభాసగా మారింది. ప్రజాసమస్యలను గాలికొదిలి వాదనలు, వాదోపవాదోలతో సభ పక్కదారి పట్టింది. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని, కాంగ్రెస్, ఇతర పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు అభివృద్ధి పనులకోసం నిధులు మంజూరు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎజెండాలోని అంశాలపై చర్చ మొదలుపెట్టారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ తన మండలంలో అభివృద్ధి పనులకోసం నిర్ణయించిన రూ.5లక్షల నిధులు మంజూరు చేయడంలేదని, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీల పట్ల వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు. దీంతో కొద్దిసేపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నిధులు మంజూరు చేయించడం తన బాధ్యత అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొనడంతో గొడవ సద్దుమణిగింది. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎజెండాలో లేని అంశాలు మాత్రమే మాట్లాడుతుండటంతో అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శా రు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడటానికే సరిపోతోందని, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇది జెడ్పీచైర్మన్కు తగదు తనపేరు చెబితే పింఛన్ కట్ చేస్తానని లబ్ధిదారులను హెచ్చరించడం జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్కు తగదని, ప్రజాప్రతినిధుల పట్ల ఆయన నిర్లక్ష్యంగా నడుచుకోవడం సమంజసం కాదని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. తాను కూడా గద్వాల నియోజకవర్గం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రనిధిని అన్న విషయాన్ని జెడ్పీ చైర్మన్ గుర్తించాలని పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు టీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం లేదని, ప్రజల సొమ్మునే ప్రభుత్వ ఖజానాలోనుంచి పేదలకు అందజేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. తనపేరు చెప్పిన వారి పింఛన్ కట్ చేస్తామనడం, ప్రజల్లో తన గౌరవానికి భంగం కలిగేవిధంగా ఆయన మాట్లాడటం సరికాదని డీకే అరుణ హెచ్చరించడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ.. దళిత ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని ఆయా పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, మల్దకల్ జెడ్పీటీసీ సభ్యుడికి నిధులు మంజూరు చేయకుండా వివక్షం చూపడం తగదని పేర్కొనడంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడంతో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశమందిరంలోని మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లాలని జెడ్పీ చైర్మ న్ బండారి భాస్కర్, కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొనడంతో పత్రికలు, టీవీ చానళ్లకు సంబంధించిన విలేకరులు పలువురు తమను రమ్మని కబురు పంపి.. ఇప్పుడు వెళ్లమనడం అవమానకరమన్నారు. వీరజవాన్ మృతికి సంతాపం కోయిలకొండ మండలం సంగినోనిపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రెడ్డిగారి గోవర్ధన్రెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శినితో పాటు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందడం బాధాకరమని, వారి కుటుంబానికి తమ తరఫున సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరం గా ఆదుకుంటామని, పోలీసు శాఖ తరఫున లాంఛనంగా అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. -
విఐపి రిపోర్టర్ - జెడ్పి ఛైర్మన్ బండారి భాస్కర్
-
ప్రజలకు అందుబాటులో ఉంటా
జెడ్పీసెంటర్: ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉంటూ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్మన్ బండారిభాస్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో తన కు కేటాయించిన అధికార నివాసాన్ని బు ధవారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా అవసరమైన మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించా రు. తనను కలిసేందుకు వచ్చే వారికి ఎ లాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, మంచినీటి వసతికి ఇబ్బంది లేకుం డా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేడు బాధ్యతలు స్వీకరణ..? జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు బాధ్యలు చేపట్టలేదని సమాచారం. గురువారం జిల్లా పరిషత్లో జరిగే మన ఊరు-మన ప్రాణాళిక కార్యక్రమానికి టీఆర్ఎస్ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నారుు. కాగా ఇప్పటికే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జెడ్పీ చైర్మన్ ఇప్పటివరకు అధికారింగా బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం. అభివృద్ధిలో పాలుపంచుకుందాం మహబూబ్నగర్ రూరల్: తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకోవడంతోనే సరిపోదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటేనే పోరాటం ఫలించినట్లవుతుందని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్నగర్ మండలంలోని జమిస్తాపూర్, కోడూరు, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొట్టమొదట కోడూరు గ్రామంలో రూ.4.25కోట్ల పీఎంజీఎస్వై నిధులతో నిర్మించే బీటీరోడ్డుకు జెడ్పీచైర్మన్తో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీచైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ..జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వానికి చేయూతనిచ్చే విధంగా అందరు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ముఖ్యభూమిక పోషించారని గుర్తుచేశారు. అన్నిశాఖల ఉద్యోగులు వారివారి స్థాయిలో అభివృద్ధికోసం వంతుగా కృషిచేయాలని కోరారు. ఐదేళ్లప్రణాళికను రూపొందించి..అధికారులు, ప్రజాప్రతిధులు కలిసి పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీదేవి, ఎంపీపీ సావిత్రి, ఆయా గ్రామాల సర్పంచ్లు నాగయ్య, బాలమణి, హన్మానాయక్, రామకిష్టమ్మతో పాటు ఎంపీటీసీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
చైర్మన్ పీఠంపై పేదింటి బిడ్డ
గద్వాల: పదిమంది ఉన్న ఆ కుటుంబ పోషణకు ఆయన సంపాదనా ఓ ఆధారం.. పెద్దకొడుకుగా తన బాధ్యతలను నెరవేర్చేందుకు హమాలీగా బస్తాలు మోశాడు.. కూలీగా బరువులు ఎత్తాడు. సర్పంచ్గా గ్రామంలో మంచిపేరు సంపాదించాడు. అదృష్టం వరించడంతో మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించాడు ఓ పేదింటి బిడ్డ బండారి భాస్కర్. గద్వాల మండలం కాకులారం గ్రామానికి చెందిన బండారి నారాయణ, దేవమ్మలకు ఎనిమిదిమంది సంతానంలో భాస్కర్ మొదటివాడు. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆయన ఇంటికి పెద్దకొడుకు కావడంతో కుటుంబ పోషణ కోసం కర్నూలులో రైల్వేవ్యాగన్ హమాలీగా కొన్నాళ్ల పాటు పనిచేశారు. సర్పంచ్గా పనిచేసిన తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తాను కూడా ఒక దఫా సర్పంచ్గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్లో చురుకైన నాయకుడిగా ఎదిగి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గద్వాల జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య నేడు జెడ్పీ చైర్మన్ పదవి వరించింది.