bhanu priya
-
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
భానుప్రియ గారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ..
-
భర్త మరణం తర్వాత.. మెమరీ లాస్తో బాధపడుతున్న భానుప్రియ
సీనియర్ హీరోయిన్ భానుప్రియ అనగానే.. కలువ పువ్వులాంటి ఆమె కళ్లు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్లముందు ప్రతిబింబిస్తుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ దాదాపు అందరు అగ్రహీరోలతో జతకట్టింది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా వారు చనిపోయిన తర్వాత నుంచి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. డ్యాన్స్కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను. మొన్నా మధ్య ఓ తమిళ మూవీ షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మర్చిపోయా. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లండన్లో చదువుకుంటుందని, ఆమెకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా 1998లో భానుప్రియ ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ను పెళ్లాడారు. ఆయన 2018లో గుండెపోటుతో కన్నుమూశారు. -
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భానుప్రియ చెల్లెలు
తమిళసినిమా: నటి నిశాంతి గుర్తుందా? భానుప్రియ సోదరి శాంతి ప్రియనే ఈ నిశాంతి. 1990 ప్రాంతంలో కోలీవుడ్లో కథానాయకిగా ఒక వెలుగు వెలిగిన నటి నిశాంతి. తన నటన, పాత్రధారణలతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఎంగ ఊరు పాటకారన్, నేరం నల్లా ఇరుక్కు, రైలుక్కు నేరమాచ్చు, సిగరెట్టు, తాళి వంటి పలు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించినా తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు. కాగా వివాహానంతరం నటనకు దూరమై, సంసార జీవితంపై దృష్టి సారించిన నిశాంతి చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు సునిల్శెట్టికి చెల్లెలిగా పొన్నమ్మ పాత్రలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వెబ్సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని నిశాంతి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సరోజిని నాయుడు ది అన్ సాంగ్ ప్రీడమ్ ఫైటర్ అనే చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇకపై తమిళం, తెలుగు భాషల్లో వరుసగా చిత్రాల్లో నటించనున్నట్లు వెల్లడించారు. -
Red Rice: ఎర్ర బియ్యం అమ్మాయి
ఆన్లైన్ క్లాసులు పూర్తయ్యాక ఆ అమ్మాయి చేనులో అడుగుపెట్టేది. ముప్పావు ఎకరా చేను. తండ్రి కూరగాయలు పండించేవాడు. ‘కొత్తగా ఎర్రబియ్యం పండిద్దామా’ అన్నాడు. ‘సరే నాన్నా’ అందా ఎనిమిదో క్లాసు చదివే కూతురు. ‘రక్తశాలి’ రకం ఎర్రబియ్యంలో ఆరోగ్య విలువలు ఎక్కువ. వాటిని పండించేవాళ్లు కూడా అరుదు. కాని ఆ కూతురు తండ్రితో కలిసి 300 కేజీల దిగుబడి సాధించింది. ఈ మార్చికి ఆ అమ్మాయి తొమ్మిదికి వస్తుంది. ‘పరీక్షలు రాసి ఈసారి బాసుమతి పండిస్తా’ అని చెబుతోంది. హోమ్వర్క్ చేయడమే పెద్ద పనిగా భావించే పిల్లలకు బదులు ఏకంగా పంటనే పండిస్తున్న టీన్ రైతు బానుప్రియ. ఈ కేరళ కథ చదవండి. ‘ఎప్పుడైతే పొలంలోకి అడుగుపెట్టిందో నా కూతురు సీతాకోక చిలుకలా ఎగిరింది’ అన్నాడు దయత్మజి తన కుమార్తె భానుప్రియను చూస్తూ. వాళ్లది కేరళ అలెప్పి సమీపంలో ఉన్న కల్లాపురం గ్రామం. వారికి అక్కడ ముప్పావు ఎకరా పొలం ఉంది. దయత్మజి కొబ్బరి పీచు వ్యాపారం చేస్తూనే పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు. అదే ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న భానుప్రియ పెద్ద కూతురు. ‘2021 వేసవిలో లాక్డౌన్ విధించాక నా ఇద్దరు పిల్లలు బోర్ ఫీలయ్యారు. ఆన్లైన్ క్లాసులు కాసేపే కావడంతో మిగిలిన టైమ్ కంప్యూటర్, ఫోన్ ముందు గడపసాగారు. భాను బాగా బోర్ ఫీలయ్యింది. అలాగే వదిలితే పిల్లల మానసిక ఆరోగ్యం పాడవుతుందని భావించాను. మనం బియ్యం పండిద్దాం.. అదీ ఎర్ర బియ్యం అని భానుకు చెప్పాను. అదేదో కొత్తగా ఉందని తనూ ఉత్సాహం తెచ్చుకుంది’ అంటాడు దయత్మజి. తండ్రి ఎర్రబియ్యం పండిద్దాం అని చెప్పాక భాను పెద్ద సైంటిస్ట్ అవతారమే ఎత్తింది. నెట్లో ఆ పంట గురించి చదివి వివరాలు తెలుసుకుంది. వ్యవసాయ శాఖ వారికి కూడా ఫోన్లు కొట్టి రకరకాల ప్రశ్నలు వేసింది. రైతు అవతారం ఎత్తుతున్నట్టు తన ఫ్రెండ్స్కు చెప్పింది. తండ్రి దయత్మజితో భానుప్రియ ‘నాన్న ఎర్రబియ్యం పండిద్దామన్నాడు. అప్పటి వరకూ మేము బెండ, దోస, పెసల వంటివి పండించే వాళ్లం. నేను పెద్దగా పొలానికి వెళ్లేదాన్ని కాదు. ఇప్పుడు ఎర్రబియ్యం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా మా ఊళ్లో ఆ బియ్యం పండిస్తున్నది మేమే మొదట. దానిని రక్తశాలి రకం అంటారు. ఇది అంతరించి పోతున్న వరి వంగడం. సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఈ బియ్యంలో ఉండేంత పోషకాలు మరే బియ్యంలో ఉండవు. జింక్, మినరల్స్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ ఉంటాయి. కాని మిగిలిన వరి వంగడాలతో పోలిస్తే లాభం పెద్దగా ఉండదని చాలా మంది వేయరు. కాని మేం వేద్దామనుకున్నాం’ అంటుంది భానుప్రియ. ట్రాక్టర్ తెప్పించి పొలం దున్నడం మినహా మిగిలిన పనులన్నీ తండ్రీ కూతుళ్లే చూశారు. ‘నారు పోయడం, తడి ఎంత అవసరమో చూసుకోవడం, సేంద్రియ ఎరువులు చల్లడం... ఇవన్నీ భానుయే చూసుకుంది’ అన్నాడు దయత్మజి.‘మేము మేలో పంట వేశాము. అయితే ఆ వెంటనే వచ్చిన వానలతో అందరి చేలతో పాటు మా చేనూ మునిగిపోయింది. వేసిన నారు వృధా అయిపోయింది. అయినా సరే మళ్లీ ఇదే పంట వేద్దామనుకున్నాం. వేశాం. నాలుగు నెలల పంట ఇది. సెప్టెంబర్ నాటికి మా పొలం కోతకు సిద్ధమైంది’ అంది భానుప్రియ. ఈ తండ్రీకూతుళ్లు పండిస్తున్న ఎర్రబియ్యం వార్త చుట్టుపక్కలకు వ్యాపించింది. కోత సమయంలో కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ స్వయంగా హాజరయ్యాడు. పంట చేతికి వచ్చాక తూకం వేస్తే 300 కిలోల బియ్యం వచ్చాయి. ఇది మంచి దిగుబడి కింద లెక్క. ‘కొన్ని బియ్యం బంధువులకు, ఫ్రెండ్స్కు ఇచ్చాం. మిగిలినవి వాట్సప్ గ్రూప్లలో ప్రచారం జరిగి క్షణాల్లో అమ్ముడుపోయాయి. ఇప్పుడు మా ఇంట్లో ఎర్ర బియ్యమే వండుతున్నాం’ అంది భానుప్రియ. ఆమె చేసిన కృషికి వ్యవసాయ శాఖ, ఆ ఊరి పంచాయతీ కలిసి ‘బాల రైతు’ బిరుదు ఇచ్చి గౌరవించాయి. భానుప్రియకు ఇంకా ఎనిమిదవ తరగతి పూర్తి కాలేదు. ఇప్పుడు తన పొలంలో మళ్లీ కూరగాయలు వేస్తున్నారు. పరీక్షలు రాసే సమయానికి నారుకాలం వస్తుంది. ‘ఈసారి నేను బాస్మతి పండించాలని అనుకుంటున్నా’ అంది భాను. -
నటి భానుప్రియపై చెన్నైలో కేసు
తమిళనాడు,పెరంబూరు: నటి భానుప్రియపై బాల కార్మికుల నేరం కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సామర్లకోట పోలీసులు భానుప్రియపై నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో ఒక ఫ్లాట్లో నివశిస్తున్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ బాలికలను నియమించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తన ఇంట్లో పనిపిల్ల చోరీకి పాల్పడిందంటూ గత జనవరి 19న స్థానిక పాండిబజార్ పోలీస్స్టేషన్లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు. ఇంటి పనిపిల్లే చోరీకి పాల్పడి ఉంటుందని, ఆ అమ్మాయిపై కేసు నమోదు చేయాలని భానుప్రియ పేర్కొంది. అయితే పనిపిల్ల తల్లి ప్రభావతి సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణన్లపై ఫిర్యాదు చేసింది. అందులో తన కూతుర్ని ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేస్తున్నారని, తన కూతురిని రక్షించమని కోరింది. దీంతో సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి నటి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. అలాంటిది తాజాగా సామర్లకోట పోలీసులు నటి భానుప్రియ కేసును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటి పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
భానుప్రియ మెడకు బాలకార్మిక కేసు..?
చెన్నై : సినీనటి భానుప్రియ మెడకు బాలకార్మిక చట్టం కేసు చుట్టుకునేట్టు కనిపిస్తోంది. మైనర్ బాలికను పనికి నియమించుకోవడం పట్ల బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో మూడు రోజుల కిందట భానుప్రియను అరెస్ట్ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. చదువుకోవాల్సిన బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భానుప్రియపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. ఇలా పెట్టుకున్నట్లు రుజువైతే కోర్టు భానుప్రియకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం భానుప్రియ తన ఇంట్లో పనికి పెట్టుకుంది. ఇటీవల కాలంలో తన కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి చోరీ వస్తువులు అడిగినందుకు ఇలా కేసు పెట్టి బెదిరిస్తున్నారని భానుప్రియ ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భానుప్రియ ఇంట్లో పని చేసే బాలిక తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని, తల్లి చెప్పడంతోనే దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకుంది. దాంతో దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే భానుప్రియ కుటుంబంపై ఈ ఆరోపణలు చేసినట్లు గుర్తించిన పాండీబజార్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. -
నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కేసులో ట్విస్ట్
-
భానుప్రియకు సమస్యలు తప్పవా?
చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో సమస్యలను ఎదుర్కోకతప్పదా? ఇప్పుడు కోలీవుడ్లో జరుగుతున్న చర్చ ఇదే. భానుప్రియ ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న విషయం వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పనిమనిషిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లి సామర్లకోట పోలీస్స్టేషన్లో భానుప్రియపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన భానుప్రియ పనిమనిషి తమ ఇంట్లో రూ.లక్షన్నర విలువ చేసే 30 కాసుల బంగారాన్ని దొంగిలించిందని, వాళ్ల అమ్మ వాటిని తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పుడు తమపైనే ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చారు. ఈ చోరీ వ్యవహారం, వేధింపుల విషయం ఎలా ఉన్నా బాలికను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. ఇది బాలకార్మిక చట్టం ప్రకారం అలాంటి వారిపై 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని చెప్పారు. దీన్ని పోలీసులు, బాల కార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుందా? ప్రస్తుతం పనిమనిషిని నటి భానుప్రియ ఇంటి నుంచి పోలీసులు విడిపించి బాలల సంరక్షణ విభాగానికి అప్పగించారు. అనంతరం ఆ బాలిక వాంగ్మూలం తీసుకుని తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. నటి భానుప్రియ ఈ సమస్య నుంచి బయట పడతారా? లేక జరిమానాకు గురవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
నాకు ఆమె డబ్బింగా!
సాక్షి సినిమా: నా పాత్రకు ఆ నటి డబ్బింగ్ చెప్పారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించిన చిత్రాలు వేరు, తాజాగా నటించిన నడిగైయార్ తిలగం చిత్రం వేరు. ఈ చిత్రం కీర్తీసురేశ్కు ప్రత్యేకం అన్న మాట చాలా చిన్నదే అవుతుంది. మహానటి సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడం అంత సులభం కాదు. ఆమెలా నటించడం సాధారణ విషయం కాదు. సావిత్రి జీవిత చిరిత్రతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మహానటి పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో సమంత, దుల్కర్సల్మాన్, మోహన్బాబు, విజయ్దేవరకొండ ఇలా పలువురు నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కీర్తీసురేశ్ పాత్రకు సీనియర్ నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంసామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి స్పందించిన కీర్తిసురేశ్ తన పాత్రకు నటి భానుప్రియ డబ్బింగ్ చెప్పారనే ప్రచారంలో నిజం లేదన్నారు. రెండుభాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, ఇప్పటికే తెలుగు వెర్షన్కు డబ్బింగ్ పూర్తి చేశానని, నడిగైయార్ తిలగం తమిళ వెర్షన్కు ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నానని పేర్కొన్నారు. నటి భానుప్రియ ఈ చిత్రంలో నటించారన్నారు. మొత్తం మీద ఈ ద్విభాషా చిత్రంలో నటి భానుప్రియ కూడా నటించారన్న విషయాన్ని కీర్తీసురేశ్ వెల్లడించారు. అయితే అది ఏ పాత్ర అన్నది ఆసక్తిగా మారిందిప్పుడు. ఇదిలా ఉండగా నటి కీర్తీసురేశ్ తాజాగా తన పేరుతో ఒక వెబ్సైట్ను ప్రారంభించారట. అందులో తన చిత్రాలవివరాలను అభిమానులు తెలుసుకునేఅవకాశం ఉంటుందన్నమాట. -
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
పదం పలికింది – పాట నిలిచింది సినిమాలో ఒక పాత్ర వ్యక్తిత్వాన్ని పాటలో పట్టుకోవడం, అదీ కవితాత్మకంగా మలవగలగడం గీతరచయితకు ఒక సవాలు. దాన్ని విజయవంతంగా ‘స్వర్ణకమలం’ కోసం ఛేదించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. భానుప్రియ పోషించిన మీనాక్షి పాత్ర స్వభావాన్నీ, ఆమె జీవితంలో వచ్చిన పరిణామాలనూ ప్రకృతికి అన్వయిస్తూ ‘కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి/ మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటునున్న కన్నె మల్లికి’ పాట రాశారు. ఇందులోని ఈ పాదాలు మరింత శ్రేష్ఠమైనవి: ‘వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధుర గానకేళి’ ‘కొండదారి మార్చింది కొంటెవాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటినీరు’. దీనికి సంగీతం ఇళయరాజా. పాడినవారు ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1988లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కె.విశ్వనాథ్. వెంకటేష్ నాయకుడు. -
భానుప్రియ మాజీ భర్త మృతి
ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణవార్త తెలిసిన వెంటనే భానుప్రియ అమెరికాకు బయలుదేరినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న భానుప్రియ 1998లో ఆదర్శ్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ జంటకు అభినయ అనే కుమార్తె ఉంది. అయితే మనస్పర్థల కారణంగా 2005లో భర్తతో విడాకులు తీసుకున్న భానుప్రియ తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం కుమార్తెతో పాటు ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. కొంత విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆమె సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తున్నారు. దాంతో పాటు కూచిపూడి, భరతనాట్యం లలో చాలామందికి భానుప్రియ శిక్షణ ఇస్తున్నారు. -
భానుప్రియ కల నెరవేరింది
జైపూర్ : అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఓ యువతి కల ఎట్టకేలకు నెరవేరింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో దిగొచ్చిన అమెరికా రాయబార కార్యాలయం ఆ యువతికి వీసా మంజూరు చేసింది. జలల్పూర్ గ్రామానికి చెందిన భానుప్రియ హరిట్వాల్ 2015- పదో తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంకర్. భాను తండ్రి సోహన్ లాల్ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తున్నాడు. హిందీ మాధ్యమంలోనే ఆమె ఈ ఘనత సాధించటం విశేషం. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం భానుతోసహా టాప్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు కోటి రూపాయల స్కాలర్ షిప్ ప్రకటించింది. ఇటీవలె 12వ తరగతి పూర్తి చేసిన భానుప్రియ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఉత్తీర్ణ పరీక్షల్లో(SAT మరియు IELTS) మంచి స్కోర్తోపాటు స్కాలర్ షిప్కు అర్హత కూడా సాధించింది. కానీ, ఆమె వీసా దరఖాస్తును మాత్రం యూఎస్ ఎంబసీ రెండుసార్లు తిరస్కరించింది. దీంతో ఆమె తండ్రితో కలిసి సికర్ నియోజకవర్గ ఎంపీ స్వామి సుమేధానంద్ ను ఆశ్రయించింది. ఆయన భానుప్రియను వెంటపెట్టుకుని కొద్దిరోజుల క్రితం సుష్మా దగ్గరకు తీసుకెళ్లి మొత్తం వివరించారు. ప్రతిభ ఉన్న విద్యార్థిని కావటంతో సుష్మా సానుకూలంగా స్పందించారు. వెంటనే అమెరికా రాయబార కార్యాలయం అధికారులతో సుష్మా ఫోన్లో మాట్లాడారు. భానుప్రియకు శుక్రవారం వీసా మంజూరు అయినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు సుష్మాకు, ఎంపీ సుమేధానంద్కు భాను కుటుంబం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - భాను ప్రియ
-
భానుప్రియ బర్త్డే స్పెషల్
-
చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. తరచూ ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆక స్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. వారం చివరిలో ప్రయాణాలు. తగాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలలో పురోగతి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఇంటిలో విందువినోదాలు. వారం మధ్యలో చికాకులు. రుణ ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు. సినీ, టీవీనటులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశకు గురిచేస్తాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనలాభం. కుటుంబసౌఖ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. బంధువర్గం నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. వారం చివరిలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కళాకారులకు సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి విషయాలలో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో వాహనయోగం. పరపతి పెరుగుతుంది. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆశయాల సాధనలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఖరీదైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు లేదా స్నేహితులు మీ దరికి చేరతారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. ద్వితీయార్థంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... భానుప్రియ, నటి పుట్టినరోజు: జనవరి 15 -
గీత స్మరణం
పల్లవి : పపగ పపగ పపగ పపగ... పపగ పస... పపగ పస... ఎదలో లయ ఎగసే లయ ససమా నినిరీ... ససమా నినిరీ... గగగ మమమ ససస ససస ససస ఎదలో లయ ఎగసే లయ ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా చరణం : 1 గాగా ఆ... ఆ... దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం శోధనే నా జీవనం సాధనేలే జీవితం జతలే శ్రుతులై పలికే ఆలాపన వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ నాలో నేడే విరులవాన ॥ చరణం : 2 కోకిలగీతం... తుమ్మెదనాదం... (2) జలజల పారే సెలగానం ఘుమఘుమలాడే సుమరాగం అరెరె... ఆ... ఆ... ఆ... కొండ కోన... ఎండ వాన... ఏకమైన ప్రేమగీతం... ఔనా... మైనా... నీవే... నేనా శుకపికముల కలరవముల స్వర లహరులలో పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ సససస.... దదదద...పపపప...రిరిరిరి....నినినిని... సససస రిరిరిరి....నినినిని... సససస పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ ॥ సససస... సససస... చరణం : 3 విహంగమా... సంగీతమా... (2) సంగీతమే విహంగమై చరించగా స్వరాలతో వసంతమే జ్వలించగా ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో ॥ చిత్రం : అన్వేషణ (1985), రచన : వేటూరి సంగీతం : ఇళయురాజా, గానం : ఎస్.జానకి - నిర్వహణ: నాగేశ్