bhogapuram air port
-
ఎల్అండ్టీకి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డరు దక్కించుకున్నట్లు లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి విమానాశ్రయ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (ఈపీసీ) కాంట్రాక్టు తమ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కి లభించినట్లు వివరించింది. అయితే, కాంట్రాక్టు విలువ మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల శ్రేణిలోని కాంట్రాక్టులను కంపెనీ భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ప్రాథమికంగా ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల (ఎంపీఏ) హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని, తర్వాత ఇది 12 ఎంపీఏకి పెరుగుతుందని సంస్థ తెలిపింది. కాంట్రాక్టు ప్రకారం ఏటీసీ టవర్, ఎయిర్ఫీల్డ్ అభివృద్ధి (3,800 మీటర్ల దక్షిణ రన్వే, ట్యాక్సీవే, యాప్రాన్, ఎయిర్ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్) మొదలైన పనులు చేయాల్సి ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భారీ విమానాశ్రయాల్లో నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. -
చంద్రబాబు నోరు.. రామోజీ రాతలు ఒక్కటే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్ పోర్ట్కు సీఎం జగన్ శంకుస్థాపన చేయగానే టీడీపీ, రామోజీరావు అక్కసు వెళ్లగక్కారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామోజీరావు కడుపుమంటను బయట పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 12 వేల ఎకరాలు భూసేకరణ చేయాలని ఆనాడు చంద్రబాబు చెప్ప లేదా?. మీ పత్రికల్లో వార్తలు రాయలేదా? అంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘అంత అవసరం లేదని ఆరోజు జగన్ చెప్పారు.. కాబట్టే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భూసేకరణను భారీగా తగ్గించేశాం. రైతులను సంతృప్తి చేశాకనే శంకుస్థాపన చేశాం. విభజన చట్టంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఉంది. ఆ నిజాన్ని రామోజీరావు ఎందుకు చెప్పటం లేదు?. బాధిత రైతులతో చర్చించాకనే ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు అంత బాధ?. రాష్ట్ర ప్రయోజనాల కోసం భోగాపురం ఎయిర్ పోర్టు మూలస్తంభంలాగ పని చేస్తోంది. నిన్న జరిగిన శంకుస్థాపన పండుగని చూసి జనం సంతోష పడుతున్నారు. కోర్టులలో రకరకాల కేసులు వేస్తుంటే అన్నిటినీ ఎదుర్కొని ఆటంకాలు లేకుండా చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు. ‘‘తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు, రామోజీరావు అడ్డుకుంటున్నారు. 12 వేల ఎకరాలు తీసుకోకుండా మేము అడ్డుకున్నాం. 2,300 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నాం. ఒకరిద్దరికి కోర్టు వివాదాల కారణంగా పరిహారం అందలేదు. వారికి కూడా మేము న్యాయం చేస్తున్నాం. చంద్రబాబు చేసినవన్నీ రాజకీయ శంకుస్థాపనలే. జగన్ చేస్తున్న శంకుస్థాపనలు రాష్ట్ర ప్రయోజనాలకే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కేసులు వేశారని చంద్రబాబు అంటున్నారు. మరి అప్పుడు చంద్రబాబు గడ్డి పీకుతున్నారా?. ఆరోపణలు చేయగానే సరికాదు. అసలు ఒక మండలం అంతా లేపేయాలని చంద్రబాబు చూశారు. దాంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎయిర్ పోర్టు రావాలని ఇప్పుడు జనం కోరుతున్నారు’’ అని మంత్రి అన్నారు. చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ ‘‘చంద్రబాబు నోరు, రామోజీరావు రాత ఒకటే. రాజధాని కేసులపై సిట్ విచారణ చేస్తుంది. తప్పు జరిగతే జరిగిందని తెలుస్తుంది, లేకపోతే లేదని తెలుస్తుంది. చంద్రబాబు మీద ఆరోపణలు వస్తే ఎందుకు నిజాయతీని నిరూపించుకోలేదు?. కోర్టులకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకున్నారు?. మేము సిట్ ద్వారా చేసే విచారణ ఏదీ అరెస్టుల కోసం కాదు. జరిగిన తప్పులను ప్రజలకు వివరించటానికే. రాజధాని అక్రమాలపై సిట్ విచారణ చేస్తుంది. చంద్రబాబు తప్పు చేశారా? నారాయణ చేశారా? ఇంకెవరు చేశారో తేలుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో చంద్రబాబు గబ్బు నోటితో మాట్లాడవద్దు. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. అనవసరంగా న్యూసెన్స్ చేసుకోవద్దు. రామోజీరావు రాతలన్నిటికీ నేను సమాధానం చెప్తాను’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు అందరికీ న్యాయం చేయటానికే మేమున్నాం. ఏ పార్టీ అయినా, ప్రజలైనా సమస్య చెప్తే అది విని, పరిష్కరిస్తున్నాం. ఎవరూ బాధ పడకూడదని, అందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది. అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటనష్టం అంచనాలను రూపొందిస్తున్నాం. సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రాత్రి వర్షం పడగానే పొద్దున్నే పరిహారం ఇవ్వాలంటే ఎలా?. చంద్రబాబు చేసే రాజకీయాలను పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
విశాఖ.. వైభోగం
సాక్షి, విశాఖపట్నం: గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన, డేటా సెంటర్కు భూమి పూజ చేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ నగరాన్ని అభివృద్ధిలో మరో మెట్టు ఎక్కించారు. ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్నా.. ప్రధాన నగరాలతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. ద్వితీయ శ్రేణి నగరంగానే మిగిలిపోయిన విశాఖను.. టైర్–1 సిటీల సరసన నిలబెట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రగతి పరుగును ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనతో మురిసిన ఉత్తరాంధ్ర.. ఇకపై తమ ప్రాంతాన్ని వలసల ప్రాంతమని కాకుండా, విప్లవాత్మక అభివృద్ధి కేంద్రంగా పిలవాలంటూ నినదించింది. సెపె్టంబర్ నుంచి ఇక్కడే పరిపాలన ప్రారంభిస్తానంటూ సీఎం పునరుద్ఘాటించడంతో ఇక్కడి ప్రజల్లో ఉత్సాహం మరింత జోరందుకుంది. ప్రపంచంలో ఏ నగరం చూసుకున్నా కనెక్టివిటీతోనే అభివృద్ధి చెందింది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా భారత నౌకాదళంతో అనుసంధానమై ఉంది. దీంతో విదేశాలకు విమానాలు ఎగిరే అవకాశాలు తక్కువగా ఉండటంతో అభివృద్ధిలో అంతంతమాత్రంగానే మిగిలిపోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఇకపై ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెరగనుంది. తద్వారా ఉత్తరాంధ్ర, సరిహద్దు జిల్లాలు అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనున్నాయి. ఎయిర్పోర్టు రాకతో ఈ ప్రాంత ఎకానమీ మారనుంది. భోగాపురం ఎయిర్పోర్టు నుంచి 2026 నాటికి తొలి విమానం ఎగరనుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో.. ఉత్తరాంధ్రకు మంచిరోజులొచ్చాయని ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ ఎయిర్పోర్టును రూ.4,592 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ–భోగాపురం.. ఆరు లైన్ల రాదారి పేరుకే భోగాపురం విమానాశ్రయం అయినప్పటికీ.. వైజాగ్ ఎయిర్పోర్టుగానే వ్యవహరించనున్నారు. ఎందుకంటే విశాఖపట్నం నుంచే ఎక్కువగా రాకపోకలు సాగనున్నాయి. అందుకే మహా నగరాన్ని భోగాపురంతో అనుసంధానించేందుకు ఆరులైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం కూడా జరగనుంది. మరో నాలుగు నెలల్లో దీనికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఆరులైన్ల ఎక్స్ప్రెస్ హైవేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. హైవే రాకతో బీచ్రోడ్డుతో పాటు భీమిలి నుంచి భోగాపురం వరకు ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందనున్నాయి. ఆసియా డేటా సెంటర్ రాజధానిగా విశాఖ మధురవాడలోని ఐటీ హిల్–4లో డిజిటల్ విప్లవం మొదలుకానుంది. ఇది కేవలం విశాఖకే పరిమితం కాదు. యావత్ ఆసియా దేశాలకు పెద్దన్నగా మారనుంది. డేటా సెంటర్, టెక్నాలజీ బిజినెస్ సెంటర్లను 190 ఎకరాల్లో రూ.21,844 కోట్లతో అదానీ సంస్థ నిర్మిస్తోంది. ఏడేళ్లలోపు పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు రానున్నాయి. సాంకేతికత రాజ్యమేలుతున్న నేపథ్యంలో.. విశాఖ నగరం డిజిటల్ రంగంలో ఆసియాకు రాజధానిగా భాసిల్లనుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 2030 నాటికి 1 గిగావాట్ డేటా సెంటర్గా ఇది దశలవారీగా అభివృద్ధి చెందనుంది. డేటా స్టోరేజ్ పెంచడంతో పాటు కృత్రిమ మేధ ఆవశ్యకత తెలిపేలా డిజిటలైజేషన్ విస్తరించడం, డేటా వేగం పెరగడం.. ఇలా విభిన్నమైన ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ పరిశ్రమలు విశాఖకు క్యూ కట్టనున్నాయి. ఫలితంగా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు రానున్నాయి. సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్ను తీసుకొస్తూ.. డేటాసెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ మరింత పెరగనుంది. దీని ద్వారా పరిశ్రమలకే కాకుండా.. ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు వరంలా మారనుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధిని ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయడం తమ అభిమతం కాదనీ.. ఒక ప్రాజెక్ట్ ఏర్పాటైతే.. ఆ ప్రాంతంతో పాటు దాని పరిసరాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్న కాన్సెప్్టతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే ప్రథమ శ్రేణి నగరంగా.. దక్షిణ భారత దేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా.. ఫిన్టెక్ హబ్గా.. ఇలా విభిన్న రంగాల్లో దూసుకుపోతున్న విశాఖ.. ఇంకా ద్వితీయ శ్రేణి నగరంగానే ముద్రపడిపోయింది. అందుకే వైజాగ్ను ప్రథమ శ్రేణి నగరాల సరసన చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. అలాగే సెపె్టంబర్ నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగిస్తామంటూ ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. -
అభివృద్ధికి చిరునామా
నాలుగేళ్లుగా మీకు ఇంతగా మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఏ మంచీ చేయని పెద్దమనిషి మరో వైపు.. పేదవారి ప్రభుత్వం ఒకవైపు.. పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీ, దానికి మద్దతు ఇచ్చే వారు మరో వైపు.. పేద వారికి ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని తపనపడే మనం ఒకవైపు.. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు అక్కర్లేదని చెప్పే పెత్తందారులు మరోవైపు.. పేద వారికి, నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని వివక్ష, లంచాలు లేకుండా నేరుగా బటన్ నొక్కే మీ జగన్ ఒకవైపు.. వీరికి మంచి జరగకూడదని, ఇంటి పట్టాలు ఇవ్వకూడదని ఏకంగా సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టుకు వెళ్లి అడ్డుకునే వారందరూ మరో వైపు.. నేను నమ్ముకున్నది ధర్మాన్ని, సత్యాన్ని. దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులనే. అదే చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను, ఎల్లో టీవీలను. వారి పునాది అబద్ధం, మోసం. – సీఎం వైఎస్ జగన్ భోగాపురం నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఉత్తరాంధ్ర ప్రాంతం అభ్యుదయానికే కాదు.. అభివృద్ధికీ చిరునామా. శ్రీకాకుళం జిల్లాలో కొద్దిరోజుల క్రితం శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమైతే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కిరీటం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి రానున్న 30 నెలల కాలంలో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్ర వైభవానికీ కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన రూ.5 వేల కోట్లతో నిర్మించనున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావుతో కలిసి విమానాశ్రయ నమూనాను పరిశీలించారు. అనంతరం విజయనగరం జిల్లాలో 49 గ్రామాలకు తాగు నీరు, 30 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు భోగాపురం విమానాశ్రయానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.195 కోట్ల అంచనా వ్యయంతో తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పనులకు భూమి పూజ చేశారు. రూ.26 కోట్లతో ఫిష్ హ్యాండ్లింగ్ సెంటర్కు.. విశాఖలో అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి నాలుగు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. అదానీ డేటా సెంటర్తో విశాఖ టైర్–1 సిటీగా అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుశా దేశంలోనే అతిపెద్ద.. 300 మెగావాట్ల డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుండటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉపాధి కోసం ఇక ఇక్కడికే వలసలు ► మంచి మనసుతో చేస్తున్న మన కార్యక్రమాలను వరుణ దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చాలనే సంకల్పంతో మనసా, వాచా, కర్మణా అడుగులు ముందుకు వేస్తున్నాం. సంస్కృతికి, సంప్రదాయానికి, కవిత్వానికి, ఉద్యమాలకు కూడా చిరునామా ఈ గడ్డ. కళింగాంధ్ర భావాల విప్లవానికి గజ్జెకట్టిన నేల కూడా ఇదే. అభ్యుదయానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం ఇక మీదట అభివృద్ధికి కూడా చిరునామాగా నిలవనుంది. ► ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో శంకుస్థాపన చేసిన మూలపేట పోర్టు రాబోయే రోజుల్లో తలరాతలు మార్చే పోర్టు. మరో 24 నెలల్లో ఇక్కడికి షిప్లు రానున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సమాన దూరంలో రాబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు.. మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా నిలవబోతోందని చెప్పడానికి సంతోషంగా ఉంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ ద్వారా వచ్చే సబ్మెరైన్ కేబుల్స్తో మన రాష్ట్ర ఐటీ ముఖచిత్రం మారుతుంది. ► ఈ మూడు బృహత్తర కార్యక్రమాలతో రానున్న రోజుల్లో స్థానికంగా విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంతానికే వలస వచ్చే పరిస్థితులు రానున్నాయి. టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుంది. 2026లో ఎయిర్పోర్టును నేనే ప్రారంభిస్తా.. ► మరో మూడేళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే 2026 నాటికి ఇక్కడి నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి రానుంది. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్లీ మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడకు వచ్చి.. ఇదే ప్రాంగణం నుంచి ప్రారంభోత్సవం కూడా చేస్తాడని నమ్మకంగా చెబుతున్నా. దేవుని ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో అది జరుగుతుంది. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరు. – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేస్తున్నామంటే జీర్ణించుకోలేని వ్యక్తులందరూ ఎలా మాట్లాడుతున్నారో టీవీల్లో, పేపర్లలో చూశాం. ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే వాళ్ల హయాంలోనే ఈ స్థాయి ఉండి ఉంటే.. అప్పుడే ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదలలేదు? ► సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసుల దగ్గరి నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసుల వరకు అనేక కేసులను పరిష్కరించుకుంటూ వచ్చాం. కేంద్రం నుంచి అనేక అనుమతులు తీసుకొచ్చాం. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి.. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ► ఎన్నికలకు 2 – 3 నెలల ముందు వాళ్లు ఇక్కడ టెంకాయ కొట్టి, వెళ్లిపోయారు. మళ్లీ నిస్సిగ్గుగా గతంలోనే మేం శంకుస్థాపన చేశామని చెబుతున్నారు. నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు. ట్రాఫిక్కు తగ్గట్లుగా డిజైన్ ► దాదాపుగా రూ.5 వేల కోట్లతో 2026 నాటికి ఏకంగా రెండు రన్వేలతో ఈ ప్రాజెక్టు టేకాఫ్ కానుంది. 7 ఏరో బ్రిడ్జిలతో, ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, విమానాల మరమ్మతు యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ఎనిమల్ క్వారంటైన్ తదితర సదుపాయాలతో పూర్తవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఏకంగా 4 కోట్ల జనాభాకు కూడా సరిపోయేలా డిజైన్ చేశారు. ► ఈ విమానాశ్రయంతో భారీ విమానం.. ఏ–380 కూడా (డబుల్ డెక్కర్ ఫ్లైట్.. ప్రపంచంలోనే అతి పెద్ద విమానం) సునాయాసంగా ల్యాండ్ అయ్యేలా 3.8 కిలోమీటర్ల పొడవైన రెండు రన్వేలు నిర్మాణం అవుతున్నాయి. ఎయిర్పోర్టు పక్కనే మరో 500 ఎకరాల్లో ఏరోసిటీని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ► ఇదే విమానాశ్రయానికి విశాఖ నుంచి 6 లేన్ల రహదారికి రూ.6,300 కోట్లతో మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాను. పోర్టు, ఎయిర్పోర్టులతో.. ఇక్కడే ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రాబోతున్నాయి. 24 నెలల్లో పూర్తి చేయాలని కోరాను ► ఈ రోజు ఎయిర్పోర్టు పనులు మొదలు పెట్టేందుకు జీఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మల్లికార్జునరావు వచ్చారు. ఆయన ఈ ప్రాంతం వాసి. 36 నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును, అన్నా.. ఏమైనా ముందుకు జరపవచ్చా.. 24 నెలల్లో ఏమైనా చేయగలుగుతారా.. అని అడిగాను. ‘ఇక్కడే పుట్టా. ఇది నాకు కూడా చాలా ఆత్మీయతతో కూడిన ప్రాజెక్టు. శాయశక్తులా కృషి చేసి 30 నెలల్లో పూర్తి చేస్తా’ అని చెప్పారు. 24–30 నెలల్లో ఇక్కడ నుంచి విమానాలు తిరుగుతాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసిన ఫ్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ధన్యవాదాలు. ► ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన ప్రతీ రైతన్నకు గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన వారిని పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం దాదాపుగా 50 ఎకరాల్లో సుమారు రూ.80 కోట్లతో 2 గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించాం. చంద్రబాబు మీకు మొహం చూపించగలరా! ► మేనిఫెస్టో అంటే చంద్రబాబు హయాంలో మాదిరిగా 600 పేజీల బుక్కులు వేసి ఎన్నికలు అయిపోయాక చెత్తబుట్టలో వేసేది కాదు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాము కాబట్టే అలా చేశాం. ఇదే మాదిరిగా చంద్రబాబు అడగగలడా? మీకు మొహం చూపించగలడా? (జనం రెండు చేతులు పైకెత్తి చూపలేరని చెప్పారు) ఇలా అడిగే అర్హత, నైతికత చంద్రబాబుకు ఉందా? ► 1995లో అధికారం కోసం కూతురిని ఇచ్చిన సొంత మామకు వెన్నుపోటు పొడిచి.. అధికారంలో ఉన్నన్నాళ్లూ చేసిన మంచి పనులంటూ ఏవీ లేవు. 2019లో సీఎం అయిన మీ బిడ్డ జగన్ వల్ల మీకు, మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటని ఏ ఇంటి తలుపుతట్టినా ఇలా.. మంచి చేశాడని చెప్పే పరిస్థితి ఉంది. ► ఏ మంచి చేయని చంద్రబాబుకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరికి తోడుగా ఒక దత్తపుత్రుడు ఉన్నారు. గతంలో ఇదే చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో మొదలుపెట్టి ఒక ఈనాడుకు ఇంత.. ఆంధ్రజ్యోతికి ఇంత... దత్తపుత్రుడికి ఇంత అని.. దాచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అని ఈ గజదొంగల ముఠా రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని దోచేసింది. అందుకే ఏ మంచీ చేయని చంద్రబాబుకు ఇంతగా తోడుగా ఉన్నారు. మారుతున్న గ్రామాల రూపురేఖలు ► ఈ రోజు గ్రామాలు మారాయి. ఏ గ్రామంలో చూసినా సచివాలయంతో పాటు 50 మందికో వలంటీర్ కనిపిస్తున్నారు. సచివాలయ వ్యవస్థలో మన పిల్లలే చక్కగా చిరునవ్వుతో లంచాలు తీసుకోకుండా మంచి పనులు చేస్తున్నారు. మరో నాలుగడుగులు వేస్తే నాడు–నేడుతో రూపురేఖలు మారిన ఇంగ్లిష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటికే డాక్టర్ను తీసుకొచ్చిన విలేజీ క్లినిక్.. రైతన్నలను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే కనిపిస్తుంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో ఇంటి వద్ద నుంచే పనిచేసే డిజిటల్ లైబ్రరీల వ్యవస్థ ఏర్పాటు కానుంది. ► ఈ మార్పు మన కళ్లెదుటే కనిపిస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ ఇదే బడ్జెట్.. ఇదే రాష్ట్రం. అప్పులు కూడా చంద్రబాబు చేసిన దానికంటే తక్కువ. అయినా ఇవన్నీ చేస్తున్నాం. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడని ఆలోచించండి. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రతీ ఇంటికీ తీసుకెళ్లండి. మీ బిడ్డకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని మరోసారి కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో జీఎంఆర్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు, అదానీ గ్రూప్ ఎండీ, సీఈవోలు రాజేష్ అదానీ, కరణ్ అదానీ, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, కలెక్టర్లు మల్లికార్జున, నాగలక్ష్మీ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి ► ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మనందరి ప్రభుత్వం వేస్తున్న అడుగులను మీకందరికీ గుర్తు చేస్తున్నా. ఉత్తరాంధ్ర అంటే బ్రిటీషర్లను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి జన్మించిన పౌరుషాల గడ్డ. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేశాం. మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రను మరింత మెరుగు పరుస్తూ.. ముగ్గురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లు సరిపోరని.. 6 జిల్లాలుగా చేశాం. ► కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే తపన, తాపత్రయంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను మొదలుపెట్టి పూర్తి చేశాం. ఈ జూన్లో దానిని జాతికి అంకితం చేయబోతున్నాం. ఇచ్చాపురం, పలాస ప్రాంతాలకు తాగునీటిని పైపుల ద్వారా తరలించేందుకు రూ.700 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి ఈ జూన్లో పూర్తి చేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గానికి మంచి చేస్తూ.. అదే రోజు అక్కడే మరో రూ. 265 కోట్లతో ఇదే తాగునీటి ప్రాజెక్టును విస్తరించే పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నాం. ► కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ పనులు, పాడేరు ట్రైబల్ మెడికల్ కాలేజీ పనులు.. పాతపట్నం, నర్సీపట్నం, విజయనగరంలో మెడికల్ కాలేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయనగరం మెడికల్ కాలేజీని ఈ ఆగస్టు–సెప్టెంబర్లో నేనే వచ్చి ప్రారంభిస్తాను. ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలను కడుతున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. సాలూరులో గిరిజన యూనివర్సిటీకి ఈ జూన్–జూలైలో శంకుస్థాపన చేయబోతున్నాం. దానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేశాం. ► విజయనగరంలో జేఎన్టీయూ గురజాడ యూనివర్సిటీ ఇప్పటికే నెలకొల్పాం. దశాబ్దాల కల నెరవేరుస్తూ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశాం. మరో 24 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం చేయబోతున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖనగరం నుంచి అనుసంధానంగా 6 లేన్ల రహదారికి మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయబోతున్నాం. ► వీటన్నింటికి మించి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకే కాకుండా రాజధాని స్థాయికి కూడా తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో అతిపెద్దది, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖలో మీ బిడ్డ కాపురం ఉండబోతున్నారని చెప్పేందుకు సంతోష పడుతున్నా. నిజాయితీగా ప్రతి తలుపూ తడుతున్నాం పేదలకు మంచి జరగాలని.. పేదలు, మధ్యతరగతికి అండగా నిలవాలని అడుగులు వేస్తున్నాం. మీ బిడ్డ పాలనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడటం లేదు. కాబట్టే 47 నెలల కాలంలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రూ.2.10 లక్షల కోట్లు.. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వేశారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. గతానికి, ఇప్పటికి.. చంద్రబాబుకు, మీ జగన్కు మధ్య తేడా మీరే చూడండి. మనందరి ప్రభుత్వంలో మీకు ఇవి అందాయా అంటూ.. రాష్ట్రంలో కోటి 50 లక్షల కుటుంబాలను ప్రేమగా, ఆప్యాయంగా అడుగుతున్నాం. చంద్రబాబు అన్ని ఏళ్ల పాలనలో కన్నా.. మన ప్రభుత్వంలో పథకాలు అందితేనే, మీకు మంచి జరిగిందని భావిస్తేనే నన్ను ఆశీర్వదించండని రైతన్నలు, బడులకు పోయే పిల్లలు, నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు.. అన్నదమ్ములను నిజాయితీగా, చిత్తశుద్ధితో అడుగుతున్నాం. -
ఉత్తరాంధ్ర కల.. భోగాపురం ఎయిర్పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన (ఫొటోలు)
-
విజయనగరం భోగాపురం బహిరంగ సభకు భారీగా తరలి వస్తున్న జనం (ఫొటోలు)
-
విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
సీఎం జగన్ పర్యటన.. లైవ్ అప్డేట్స్ ► ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్ ►విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది ►విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరం, డేటా సెంటర్తో 39 వేల మందికి ఉద్యోగాలు ►దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదు ►డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్నకు కృతజ్ఞతలు ►డేటా సెంటర్తో ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది, డేటా సెంటర్తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది ► గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు. ► దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం ► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారనుంది. ► చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. ► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ► మొదటి ఫేజ్లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. ► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను జాతికి అంకితం చేస్తాం. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం. ► భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ► విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రీడీ మోడల్ను పరిశీలించిన సీఎం జగన్. కాసేపట్లో ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. ► సీఎం జగన్ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేస్తారు. ► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు ► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్.. జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్పార్క్ లిమిటెడ్కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ► అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భోగాపురం ఎయిర్పోర్టు .. శంకుస్థాపనకు సర్వం సిద్ధం
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మే 3వ తేదీన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరిగే ఎయిర్ఫోర్టు శంకుస్థాపనా కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ శంకుస్థాపన, ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు అధికార యంత్రాంగం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. ముందుగా కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలీప్యాడ్, భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లతో పాటు పటిష్ట బందోబస్తు నిర్వహించా లని సూచించారు. సభకు అధికసంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉందని, రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో ఆరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు, ఎస్పీ దీపిక, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భోగాపురం : 3న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
భోగాపురం: భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి వచ్చే నెల మే 3వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ న్రెడ్డి చేతులమీదుగా జరగనున్న శంకుస్థాపనకు, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సభాస్థలి ప్రదేశం ఖరారైంది. భోగాపురం మండలం ఎ.రావివలస, సవరవిల్లి గ్రామాల వద్ద విమానాశ్రయ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నా రు. అనంతరం అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే రూ.194 కోట్లతో తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులకు, చింతపల్లి జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక పాటిల్ పరిశీలించారు. సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, పైలాన్, వాహ నాలకు పార్కింగ్ తదితర అంశాలపై చర్చించి స్థలాలను ఖరారు చేశారు. -
ఎయిర్పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన బిడ్డర్లు
భోగాపురం : విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రాంతాన్ని సోమవారం బిడ్డర్లు పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి పోటీలో ఉన్న జీఎంఆర్, జీవీకే, టాటా, అదానీ తదితర 8 సంస్థల ప్రతినిధులు కంచేరు, గూడెపు వలస, కవులవాడ రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రాంతాన్ని, అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. అనంతరం ఈ సంస్థల ప్రతినిధులు స్థానిక సన్రే రిసార్ట్సులో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టు అథారిటీ, సర్వే సంస్థల అధికారులు బిడ్డర్లకు అవసరమైన సమాచారం అందించటంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు. -
ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలు
-
ప్రభుత్వానివి దిక్కుమాలిన ఆలోచనలు: వైఎస్ జగన్
విజయనగరం : విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వానిది దిక్కుమాలిన ఆలోచనలు అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ విమానాశ్రయం కోసం ల్యాండ్ పూలింగ్ పేరుతో 15వేల ఎకరాల సేకరణ ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. విశాఖలో ప్రస్తుతం ఉన్న 350 ఎకరాలు చాలకుంటే వెయ్యి ఎకరాల వరకూ అక్కడే స్థల సేకరణ పరిశీలిస్తే బాగుంటుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా భోగాపురంలో 15వేల ఎకరాలు సేకరించి రైతుల పొట్ట కొట్టడం ఎంతవరకూ న్యాయమన్నారు. విశాఖ సమీపంగా ఉన్న భోగాపురంలో ఎకరా రూ.2కోట్ల ధర పలుకుతోందని, భూములు సేకరించి 1000 లేదా 1500 గజాల స్థలం ఇస్తే వారంతా ఎక్కడికి వెళతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను అస్తవ్యస్థ పరిస్థితు్లోకి నెట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు.