Bhubharati program
-
భూభారతి పోర్టల్ ప్రారంభం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటే షన్, నాలా మార్పులు, చేర్పులు, అప్పీల్, రివిజన్ తదితర సమస్యల పరిష్కా రానికి భూభారతి పోర్టల్ వేదిక కానుంది. పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజు మంగళవారం దీనిపై నేలకొండపల్లి తహసీల్లో అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నేలకొండపల్లి మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో రికార్డుల సవరణతో పాటు రైతుల భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ మండలంలో 37,405 ఎకరాల సాగు భూమి ఉండగా, సాదాబైనామా కింద 3,417 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ధరణిలో రిజి స్ట్రేషన్కు సంబంధించి 150 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.వీటిని రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు. పలువురు రైతులు పోర్టల్ వివరాలు తెలుసుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై నేల కొండ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభు త్వం భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.స్లాట్ బుకింగ్ విధానానికి వ్యతిరేకంగా..నేటినుంచి డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచ నను విరమించుకోవాలని తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం విఫలమైందన్నారు. దీన్ని గుర్తించి స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. దస్తావేజులు రాస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, వారంతా రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, ఘట్కేసర్, నారపల్లి, మేడ్చల్, సంగారెడ్డి, రాజేంద్రనగర్, చంపాపేట్, ఎల్బీనగర్, చిక్కడపల్లి, మల్కాజిగిరి, చౌటుప్పల్, సూర్యాపేట, జనగామ సబ్రిజిస్టార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.సర్వే మ్యాప్లు ఇప్పుడే కాదు!రిజిస్ట్రేషన్లతోపాటు సర్వే మ్యాప్ కోసం తర్వాత నోటిఫికేషన్అప్పటివరకు మ్యాప్లు లేకుండానే రిజిస్ట్రేషన్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇప్పటికిప్పుడు సర్వే మ్యాప్లు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమల వుతున్న విధంగానే అవసరమైన డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతా యని వెల్లడించాయి. అయితే, ప్రభుత్వం భూమి మ్యాపింగ్ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తుందని, అప్పుడు లైసెన్సుడ్ సర్వేయర్ల చేత సర్వే చేయించి, భూమి హద్దులను అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా నిర్ధారించి మ్యాప్ ఇస్తారని పేర్కొన్నాయి. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో కచ్చితంగా సర్వే మ్యాప్ అవసరమవుతుందని, అప్పటివరకు మ్యాప్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపా యి. చట్టం మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు మ్యాప్ అవసర మవుతుందని పలు సెక్షన్లలో ప్రస్తావించారు.పోర్టల్లో ఏం మారింది?ధరణి పోర్టల్ స్థానంలో వచ్చిన భూభారతిలో ఏముందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సోమ, మంగళవారాల్లో ఈ పోర్టల్ను దాదాపు 2.20 లక్షల మంది వీక్షించారు. భూభారతి పోర్టల్ వెబ్పేజీపై ఎడమ వైపు సీఎం రేవంత్రెడ్డి, కుడి వైపున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫొటోలు, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, తెలంగాణ తల్లి ఫొటో ఉన్నాయి. ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించే ఈ పోర్టల్ను ఓపెన్ చేయగానే సీఎం రేవంత్రెడ్డి సందేశం కనిపిస్తోంది. ఆ తర్వాత పొంగులేటి సందేశం, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు (లాగిన్), సమాచారం (ప్రజల కోసం), భూధార్, భూమిత్ర, భూపరిపాలన శాఖ, ప్రభుత్వ భూముల రక్షణ, దస్తావేజు రిజిస్ట్రేషన్ మార్గదర్శకాల గురించిన వివరాలు పొందుపరిచారు. భూమిత్ర పేరుతో కొత్తగా చాట్బాట్ ఏర్పాటు చేసినప్పటికీ, అది ఇంకా అందుబాటులోకి రాలేదు.ధరణిలాగే ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలను ఇచ్చారు. భూముల మార్కెట్ విలువ, భూముల వివరాలు, నిషేధిత భూములు, ఈ చలాన్, దరఖాస్తుల పురోగతి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నేతృత్వంలో ఈ పోర్టల్ను తెలుగుతోపాటు ఇంగ్లిషు భాషలో కూడా రూపొందించారు. -
వాటిల్లో నిర్లక్ష్యం సహించం: సీఎం రేవంత్
హైదరాబాద్: భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(సోమవారం) కలెక్టర్లతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలి. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందే. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలి.ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలి. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలి. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలి. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించండి. ఎక్కడా తాగు నీటి సమస్య రాకూడదు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ఏఐ భూమిత్ర
రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. ఏఐ సహకారంతో ఈ పోర్టల్లోని ఒక విభాగాన్ని నిర్వహించనున్నారు. ధరణిలో యూజర్ల సందేహాలను నివృత్తి చేసేలా ముందుగానే రూపొందించిన ప్రశ్నలు, సమాధానాలు అందుబాటులో ఉండేవి.భూ భారతిలో యూజర్ల ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా చాట్ బాట్ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్ కింద ఈ చాట్బాట్ను వినియోగించనున్నారని తెలుస్తోంది. యూజర్ ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానమిచ్చేలా ‘భూమిత్ర’పేరుతో హెల్ప్ డెస్క్ను రూపొందిస్తున్నారు. భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఏఐని వినియోగించనున్నట్టు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, హైదరాబాద్కొత్త పోర్టల్లో పాత రికార్డులే..ధరణి పోర్టల్లో నమోదైన భూ రికార్డులను యథాతథంగా భూభారతి పోర్టల్లోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపా రు. కొత్త రికార్డులేవీ రాయడం లేదని చెబుతున్నారు. ఇప్ప టికే పాత రికార్డుల్లో సరిగ్గా ఉన్న వివరాలు అలాగే ఉంటాయ ని, తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ధరణిలో ఉన్న 35 మాడ్యూళ్ల స్థానంలో 6 మాడ్యూళ్లను మాత్రమే భూభారతిలో అందుబాటులోకి తేనున్నారు. ధరణిలో చాలా మాడ్యూళ్లు ఉండడంతో రైతులకు దేని ద్వారా దరఖాస్తు చేసుకోవాలో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకు నేలా అన్ని సమస్యలను ఆరు మాడ్యూళ్ల ద్వారానే పరిష్కరించే ఏర్పాట్లు చేశామని రెవెన్యూ వర్గాలంటున్నాయి.ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లుధరణి నుంచి భూభారతి పోర్టల్కు మారుతున్న సందర్భంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి యకు ఎలాంటి ఆటంకం ఉండదని, యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతా యని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో ధరణి పోర్టల్ అందుబాటు లోకి తెచ్చే సమయంలో 100 రోజులకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారు. ఇప్పుడు ఓ వైపు క్రయవిక్రయ లావాదేవీలను కొనసాగిస్తూనే మరోవైపు పోర్టల్ను బలోపేతం చేసేలా సాఫ్ట్వేర్ను రూపొందించినట్లు వెల్లడించాయి.ఇప్పటివరకు ప్రైవసీ ఆప్షన్ కింద కొన్ని భూముల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉండకుండా దాచారు. అలా కాకుండా భూభారతిలో రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. భూమి పట్టాదారు ఎవరు? ఎవరి నుంచి, ఎంత భూమిని, ఎవరు కొనుగోలు చేశారు? ఆ భూమిపై హక్కులు ఏ విధంగా సంక్రమించాయి? అనే పూర్తి వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.ప్రస్తుత పోర్టల్ తాత్కాలికమేప్రస్తుతం అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. ధరణి ఆనవాళ్లు లేకుండా కొత్త పోర్టల్ను రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం అవసర మైన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించినట్టు తెలసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ లోగో, డిజైన్పై ఆదివారం తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, నల్లగొండ ఎంపీ కె. రఘువీర్రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివా సులు, సీసీఎల్ఏ నవీన్ మిత్తల్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యే భాషలో భూభారతి వెబ్సైట్ ఉండాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, భూ రికార్డులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ ఫైర్వాల్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త పోర్టల్ను డిజైన్ చేసి నిర్వహించే బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని అన్నారు. కనీసం వందేళ్లపాటు వినియోగంలో ఉండేలా పోర్టల్ను రూపొందించాలని ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం శిల్పారా మంలో జరిగే కార్యక్రమంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమవుతారు. -
ఎన్నికల రెఫరెండమే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే 2029 శాసనసభ ఎన్నికలకు భూభారతి చట్టం, పోర్టల్ను రెఫరెండంగా స్వీకరిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పునరుద్ఘాటించారు. భూములున్న ప్రతి ఒక్కరికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘భూ భారతి’చట్టాన్ని, పోర్టల్ను తెస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్ను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం నుంచే భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఇకపై ధరణి పోర్టల్ ఉండదని తెలిపారు. భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత ధరణి ముసుగులో జరిగిన భూ అక్రమా లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పోర్టల్ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒకేసారి దానిని సందర్శించవద్దని, అలా చేస్తే పోర్టల్ ఆగిపోయే ప్రమాదం ఉందని మంత్రి చెప్పారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా పోర్టల్ను నిలుపుదల చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తొలుత 3 మండలాల్లో భూభారతిభూభారతి చట్టాన్ని, పోర్టల్ను తొలుత మూడు జిల్లాల్లోని మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతు న్నట్లు పొంగులేటి తెలిపారు. ధరణిలో తలెత్తిన సమస్యలు భూభారతిలో రాకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అచ్చుతప్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు, తండ్రి పేరు మార్పు, భూ లావా దేవీల్లో అవకతవకలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ మూడు మండలాల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రమంతా ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ధరణిని తెచ్చిన సమయంలో దాదాపు 4 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని తెలిపారు. పార్ట్ బీలోని భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండగా, భూభారతిలో 6 మాత్రమే ఉంటాయని వెల్లడించారు. భూభారతి అమలు కోసం ఎంపికచేసిన గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. భూభారతిలో ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ఐదు స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి వీలుగా అధికారాల వికేంద్రీకరణ చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే మొదటివారంలో గ్రామ పాలనాధికారులువచ్చేనెల మొదటివారంలో గ్రామాల్లో రెవెన్యూ పాలనా యంత్రాంగాన్ని పునరుద్ధరిస్తామని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తామని మంత్రి ప్రకటించారు. -
పైలెట్గా 3 మండలాల్లో భూ భారతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూ భారతి పోర్టల్ను తొలుత పైలెట్ పద్ధతిలో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా దీనిని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని మూడు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మండలాల్లో అమలు సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేసి, ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో భూ భారతి, హౌసింగ్ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. ప్రజలు, రైతులకు అవగాహన సదస్సులు భూ భారతి ప్రారంబోత్సవం అనంతరం రాష్ట్రంలోని 3 మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఆయా మండలాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యక్తమయ్యే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని సూచించారు.ఈ మండలాల్లో నిర్వహించిన అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ సదస్సులు నిర్వహించాలని, ప్రజల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు పోర్టల్ను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని, అర్హులనే ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని, ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లైతే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
14 నుంచి భూ భారతి
సాక్షి, హైదరాబాద్/ బూర్గంపాడు: నూతనంగా రూపొందించిన భూభారతి చట్టాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. వివిధ మండలాల్లో రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణిని బంగాళాఖాతంలో కలిపి రైతులకు మేలుచేసేలా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భూభారతి చట్టాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చట్టం రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. 14న భూ భారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారని రెవెన్యూశాఖ వర్గాలు కూడా తెలిపాయి. నెలాఖరులోగా ఇల్లు మంజూరు చేస్తా.. మణుగూరు టౌన్: ‘కమ్మటి భోజనం పెట్టావు అక్కయ్యా.. నీ కష్టం నేను చూడలేకపోతున్నా... ఈ నెలాఖరులోగా నీకు ఇల్లు మంజూరు చేస్తా.. మూడు నెలల్లో ఇల్లు కట్టుకోండి.. మళ్లీ వస్తాను’అంటూ వంకా ముకేందర్ కుటుంబ సభ్యులకు మంత్రి పొంగులేటి భరోసా కల్పించారు. మణుగూరు పర్యటన సందర్భంగా కూనవరంలో సన్నబియ్యం లబ్దిదారుడు ముకేందర్ నివాసంలో సన్నబియ్యంతో శుక్రవారం భోజనం చేశారు. ముకేందర్ కుటుంబ సభ్యులకు మంత్రి స్వయంగా వడ్డించారు.ఈ సందర్భంగా ‘మీకు ఏం సాయం కావాలి’అని పొంగులేటి ప్రశ్నించగా.. ఇల్లు, పిల్లలకు ఉద్యోగాలు లేవని, తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని కుటుంబ పెద్ద శివలక్ష్మి కన్నీటి పర్యంతమైంది. అందుకు మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆమె పెద్దకుమారుడికి రాజీవ్ యువ వికాసం ద్వారా కిరాణా షాపు పెట్టించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను ఆదేశించారు. -
భూ భారతి, ధరణిపై అసెంబ్లీలో మాటల యుద్దం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీంతో, సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో నినాదాలు కొనసాగుతున్నాయి.ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ధరణి, భూ భారతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..‘భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందే. కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం. ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుంది. భూస్వాముల చట్టం ధరణి. లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్.రైతుల హక్కులను కాల రాశారు.పల్లా రాజేశ్వర్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. దున్నేవాడితే భూమి కదా సాయుధ పోరాట నినాదం. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి. బంగాళాఖాతంలో ధరణిని వేస్తామని చెప్పాం. బంగాళాఖాతంలో వేశాం.. కొత్త చట్టం తెచ్చాం. జమాబందీ వల్ల లాభం తప్ప నష్టం లేదు. ప్రతీ సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి.భూ భారతి కాదు.. భూ హారతి: పల్లా రాజేశ్వర్ రెడ్డిభూ భారతిపై కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తే.. మేము కూడా ధరణిపైనే ఎన్నికలకు వెళ్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూ భారతి కాదు భూ హారతి. జమాబంది పేరుతో మరో దుకాణం తెరిచింది. ఇప్పుడు జమాబంది ఎందుకో ప్రభుత్వం చెప్పాలి.భవిష్యత్లో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం: పొంగులేటిపల్లా రాజేశ్వర్రెడ్డి.. అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే వారిని ఓడించారు. ధరణి రెఫరెండంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం.. ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ధరణితో బీఆర్ఎస్ సభ్యులు ఇబ్బంది పడ్డారు. ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదు. అసత్యాన్ని సత్యాన్ని చేసేందుకు పల్లా ప్రయత్నం చేస్తున్నారు. 2020న ధరణి చట్టం తీసుకువచ్చి.. 2023 వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని చట్టంలోనే పెట్టాం. -
భూభారతిలో నమోదైన భూములకే భరోసా
సాక్షి, హైదరాబాద్: భూభారతి (ధరణి) పోర్ట ల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగానే పట్టా భూమి గల రైతులకు ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగి స్తారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేసే ‘ఆర్ఓఎఫ్ఆర్’ పట్టాదారులకు సైతం రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో ఈనెల 26 నుంచి అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్ట త ఇచ్చింది. రైతులకు ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం అందించే రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు కానుండగా, వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయంగా అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు కానుంది. ఈ మేరకు రెండు వేర్వేరు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. డీబీటీ విధానంలో జమఈ నెల 26వ తేదీ నుంచి మొదలుపెట్టి వ్యవ సాయ యోగ్యమైన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున జమ చేయ నున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యవసాయ సంచాలకుల నేతృత్వంలో అమలయ్యే ఈ పథకానికి సాయాన్ని ఆర్బీఐ నిర్వహించే ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీ టీ)’ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బాధ్యత తీసుకొంటారు. పథ కానికి సంబంధించిన లోటుపాట్లపై వ్యవసాయ సంచాలకులు ఎప్పటికప్పు డు తగిన చర్యలు తీసుకుంటారు. వ్య వసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిర త్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించేలా చూడటమే రైతుభరోసా ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.10 లక్షల కుటుంబాలకు ఆత్మియ భరోసా! ‘ఇందిరమ్మ ఆత్మియ భరోసా’ పథకం కింద 10 లక్షల వ్యవసాయ కూలీ కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 55 లక్షల జాబ్ కార్డులు ఉండగా, 29 లక్షల కుటుంబాలకు ఎలాంటి భూమి లేదు. ఇందులో కనీసం 10 రోజులు పనిచేసిన కుటుంబాలు 11 లక్షలు ఉండగా, కనీసం ఒకరోజు పని చేసిన కుటుంబాలు 15 లక్షలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 20 రోజుల పనిని ప్రామాణికంగా తీసుకుంటే 10 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మియ భరోసా కింద లబ్ధి చేకూరే చాన్స్ ఉంది. ఈ లెక్కన ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,200 కోట్లు వెచ్చించనుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసాగ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూ మిలేని వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించేందుకే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరో సా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభు త్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లో నమోదు చేయబడి, 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి ప్రతి విడతకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేల ఆర్ధిక సహాయాన్ని డీబీటీ పద్ధతిలో కూలీ కుటుంబ యజమాని ఖాతాకు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ (కమిషనర్) నోడల్ విభాగంగా, జిల్లాల్లో కలెక్టర్ పర్యవేక్షణలో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. -
భూ భారతి బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు.ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆనంద భాష్పాలొస్తున్నాయి.. భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్కుమార్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.స్పీకర్కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలుఅసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్లో ప్రసాద్కుమార్ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. -
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్బుక్లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్లైన్తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్తో ప్రారంభించి 33 మాడ్యూల్స్కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్కు పెంచాం. ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
తెగనున్న భూ‘పంచారుుతీ’
ముకరంపుర : తెలంగాణ ప్రాంత భూముల చిట్టా అంతా నిజాం లెక్కల్లోనే ఉండడంతో చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయి. 30 ఏళ్లకు ఒకసారి చేపట్టాల్సిన భూ రీసర్వే 70 ఏళ్లు గడిచినా అతీగతి లేకపోవడంతో భూములకు అనామతు లెక్కలే ఆధారమయ్యాయి. అప్పటి రికార్డులకు చెదలు పట్టడంతో లెక్కల గుట్టు తెలవకుండా పోరుుంది. ఐదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పెలైట్ ప్రాజెక్టుగా నిజామాబాద్లో భూభారతి కార్యక్రమం అమలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించినా పాలకుల నిర్లక్ష్యంతో మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం ‘భూభారతి’ కార్యక్రమం ద్వారా భూముల లెక్కలు తేల్చడానికి చర్యలు మొదలుపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సర్వేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చినిగిపోయిన టీపన్లు నైజాం పాలనలో ఒక్కో సర్వే నంబర్లో ఉన్న భూ మిని ఒక టీపన్(ఒక సర్వే నంబర్లోని భూ వైశాల్యం హద్దులు)గా గుర్తించారు. అప్పుడు జిల్లాలో 6,21,990 టీపన్లు ఉండగా 1,63,762 టీపన్లు చెదలు పట్టి పోయాయి. దీంతో ప్రస్తుతం అధికారు ల వద్ద 4,58,228 టీపన్లు మాత్రమే మిగిలారుు. అందులో సగానికి పైగా ఆనవాళ్లు కనిపించకుండా ఉన్నారుు. ఈ టీపన్ రికార్డులన్నీ 1926-36 మధ్య కాలంలో కాగితపు రికార్డుల్లో నమోదు చేసి ఉండడంతో వాటి భద్రత కష్టంగా మారింది. నాడు గొలుసులు, దారాలతో చేసిన కొలతలు సక్రమమే అయినప్పటికీ వాటి రికార్డులు భద్రంగా లేకపోవడంతో లెక్కలు తారుమారవుతున్నాయి. భూముల హద్దు లు.. లెక్కలు గందరగోళంగా మారడంతో తగాదాలు పెరిగిపోరుు పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా తయూరైంది. మరోవైపు భూములు అన్యాక్రాంతమై వివాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది బాధితులు భూరికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో భూ సర్వే కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కరించడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత రికార్డులు(టీపన్) ఆధారంగా ఉన్న కొలతలకు ఇప్పుడున్న కొలతలకు పొంతన లేకుండాపోయూరుు. బాధితులు సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. జిల్లాలో 78 మంది సర్వేయర్లు అవసరం ఉండగా, 37 మంది మాత్రమే ఉన్నారు. లెసైన్స్డ్ సర్వేయర్లు అమాయక రైతుల నుంచి సర్వేల పేరుతో అధిక సొమ్ము దండుకుంటున్నారు. ప్రభుత్వ సర్వేయర్లు కొలతల కోసం సర్వే నంబర్ల వారీగా రూ.200 నుంచి రూ.400 వరకు తీసుకుంటుండగా లెసైన్స్డ్ సర్వేయర్లు ఎకరాలను బట్టి గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాలవారీగా రూ.500 నుంచి రూ.1000 తీసుకోవాలని నిబంధన ఉన్పప్పటికీ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు.