bonalu festivals
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
వైభవంగా సోమాజిగూడ శ్రీ రేణుక మహాలక్ష్మి ఎల్లమ్మ కళ్యాణం దృశ్యాలు..
-
Hyderabad Bonalu : ఘనంగా హైదరాబాద్ లో బోనాల సందడి (ఫోటోలు)
-
బోనాలు స్పెషల్.. అమ్మవారి సేవలో ప్రముఖులు (ఫోటోలు)
-
అంబారీపై దర్శనమిచ్చిన అమ్మవారు (ఫొటోలు)
-
వైభవంగా లాల్ దర్వాజ బోనాలు (ఫోటోలు)
-
బోనాలు: మీ తప్పుల వల్లే కుండపోత వర్షాలు కురిపిస్తున్నా
తెలంగాణలో ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు(సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం వద్ద రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. ‘‘మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు. నాకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నాను. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు. -
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందడి (ఫొటోలు)
-
ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. చదవండి: Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు.. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి సాదారణ భక్తులు, వీఐపీ పాస్లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇక్కడి నుంచి అనుమతి ఇస్తున్నారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్. టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొత్తగా రెండు ఎగ్జిట్ గేట్లు ఈ ఏడాది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు మరో రెండు నిష్క్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో దేవాలయం వెనుక వైపు కేవలం ఒకటి మాత్రమే ఉండగా ఈసారి అదనంగా దేవాలయానికి దక్షిణం వైపు మరో రెండు గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
కనుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
ఎల్లమ్మ కల్యాణం.. ఎల్లెడలా ఆనందం (ఫొటోలు)
-
కన్నుల పండుగగా బల్కంపేట అమ్మవారి కళ్యాణం
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా, అత్యంత ఘనంగా జరిగింది. ఆలయం ముందు నిర్మించిన భారీ షెడ్డు క్రింద వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణం నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దంపతులు అమ్మవారి కల్యాణం లో పాల్గొన్న అనంతరం ఆలయం లోపల అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ క్యూ లైన్ లలో నిల్చున్నారు. ఆలయం పక్కన నూతనంగా నిర్మించిన షెడ్డులో కూడా భక్తులు కూర్చొని అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణంలో టీఎస్ఎమ్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ కవిత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, సరళ, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బోనాల ఉత్సవాలకు రూ. 15 కోట్లు మంజూరు
హైదరాబాద్: బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ లతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్, 24 వ తేదీన జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించే బోనాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. పలు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 25 వ తేదీన జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నగరంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో వివిధ వేషదారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పాతబస్తీ లోని దమయంతి బిల్డింగ్, డిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్రభారతి, ఇందిరాపార్క్ వద్ద గల కట్టమైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాప్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, సబ్జిమండి ఆలయాలకు ప్రభుత్వ ఖర్చులతోనే అంబారీ ఊరేగింపు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బోనాల ఉత్సవాల విశిష్ట తను చాటి చెప్పేలా వివిధ ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, పోస్టర్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ అమయ్ కుమార్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఐ అండ్ పీఆర్ సీఐఈవో రాధాకృష్ణ, డీఆర్ఓ సూర్యలత, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ, ఏసీలు బాలాజీ, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
Bonalu Festival 2021: లాల్దర్వాజ బోనాలు: పాతబస్తీలో సందడి
-
బోనాల జాతర
-
అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
బోనం ఎత్తుదాం.. నేటి నుంచి మహా సంబురం
-
ఇక ఆన్లైన్లో బోనం.. ఈసారి లష్కర్ బోనాలతో శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : ఆషాఢమాసం ప్రారంభంతో తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ఈ మాసం మూడో ఆదివారం జరిగే లష్కర్ బోనాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. తలపై బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అందరూ ప్రత్యక్షంగా బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఆలయ నిర్వాహకులకు సరికొత్త ఆలోచన వచ్చింది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మన పేరుతో నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అందులోని బియ్యాన్ని ప్రసాదంలా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. తొలిసారిగా ఈ ఏడాది లష్కర్ బోనాలతో ఈ వినూత్న ప్రయోగానికి దేవాదాయ–తపాలాశాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టనున్నాయి. భద్రాద్రి తలంబ్రాలతో మొదలు కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో ఆలయాల్లోకి భక్తులను అనుమతించలేదు. ముఖ్యమైన వేడుకలు నిర్వహించుకోవాల్సి వస్తే, ఆలయాలకు వెళ్లకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసినా కరోనా భయంతో చాలామంది ఆలయాలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భద్రాద్రి రాముడి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే పరిస్థితి లేనందున, ఆన్లైన్లో గోత్ర నామాలతో పాటు ఇతర వివరాలను ముందుగా నమోదు చేసుకుంటే.. వారి పేరిట పూజాదికాలు నిర్వహించి పోస్టు ద్వారా ముత్యాల తలంబ్రాలు, మిశ్రీ ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణేశ్ మందిరం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి మందిరం, సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆలయం, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయాల్లో కూడా ఆన్లైన్ పూజలతో పోస్టు ద్వారా ప్రసాదం అందించే వెసులుబాటు కల్పించారు. రుసుము రూ.200! బోనాలను కూడా ఆన్లైన్ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.200 రుసుము నిర్ధారించే వీలుంది. ఆ రుసుమును తపాలాకార్యాలయాల్లో చెల్లించి పేరు నమోదు చేసుకుంటే భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, భవిష్యత్తులో మరిన్ని దైవిక సేవలను ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ గణేశ్ మందిరంలో మోదక హవనాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా తపాలాశాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. విభూది, పొడి ప్రసాదం, కుంకుమ, గరిక లాంటి వాటిని పోస్టు ద్వారా పంపుతారు. -
బొనమెత్తనున్న భాగ్యనగరం
-
సప్త మాతృకలకు బంగారు బోనం..
చార్మినార్: రాబోయే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏడు అమ్మవారి దేవాలయాలకు ఏడు బంగారు బోనాలతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జూలై 11న గోల్కొండ జగదాంబ అమ్మవారికి జరిగే మొదటి బంగారు బోనంతో ప్రారంభమవుతుందన్నారు. జూలై 13న బల్కంపేట ఎల్లమ్మ తల్లి, 16న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, 18న విజయవాడ కనకదుర్గమ్మ, 22న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, 27న చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. 29న లాల్దర్వాజ సింహవాహిణి అమ్మవారికి చివరి బోనం సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. -
ఆషాఢ మాస బోనాలకు వేళాయె..
హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవాల నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది కోవిడ్–19 ఆంక్షల నడుమ బోనాల జాతర ఉత్సవాలు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా జరిగాయి. అమ్మవారికి బోనాలను ఆయా దేవాలయాల్లో కాకుండా ఇళ్లల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం సూచించడంతో నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు లేకుండానే అమ్మవారికి ఆయా దేవాలయాల కమిటి ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈసారి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడానికి నిర్వాహకులు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుని ఎన్నిక కూడా పూర్తి అయ్యింది. కమిటి ఆధ్వర్యంలో త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బోనాల జాతర ఉత్సవాలపై చర్చించడానికి సిద్ధమవుతున్నారు. గతేడాది నెల రోజుల పాటు బోనాల సమర్పణ... గతేడాది జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. పాతబస్తీలో గతేడాది జూలై 19న, సంబందిత ఆలయాల ప్రతినిధులు, పండితుల మంత్రోచ్చరణలతో అమ్మవారికి పూజలు,బోనం సమర్పణ జరిగింది. మరుసటి రోజు అంటే..జూలై 20న, ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారి ఘటాల ఊరేగింపు కొనసాగింది. పరిమిత సంఖ్యలో దేవాలయాలకు చెందిన భక్తులు తప్పా..సా«ధారణ ప్రజలెవరు ఈ సామూ హిక ఘటాల ఊరేగింపులో పాల్గొన లేదు. ఈసారి కరోనా వైరస్ సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసుల సంఖ్యగణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రభుత్వం ఆంక్షలను తొలగిస్తుందని ఉత్సవాల నిర్వాహకులు ఆశిస్తున్నారు. గతేడాదిలా కాకుండా ఈసారి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మాస్క్లు «ధరించడంతో పాటు... భౌతిక దూరం పాటిస్తూ ఆయా దేవాలయాలలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకపోవచ్చని భావిస్తున్నారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు జూలై 11న, గోల్కొండ జగదాంబా అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో నగరంలో ఉత్సవాలు ప్రాంభమవుతున్నాయి. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. అదే రోజు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రాంభమవుతాయి. ఈ ఏడాది జాతర వివరాలివీ... ఆగస్టు 1న పాతబస్తీలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పన పూజా కార్యక్రమాలుంటాయి. ఆగస్టు 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాలుంటాయి.. వచ్చే నెల 25న సికింద్రబాద్ అమ్మవారి బోనాల జాతర రోజే పాతబస్తీలో కాశీవిశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు కొనసాగుతుంది. అనంతరం ఆయా దేవాలయాల్లో ఘటాల స్థపాన జరుగుతుంది. గతంలోలాగే ఈసారి కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించనున్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబా అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, సికింద్రాబాద్ ఉజ్జయి నీ మహంకాళీ అమ్మవారు, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తలి, చార్మినార్లోని భాగ్యలక్ష్మీ అమ్మవారు, లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారితో కలిపి ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పించనున్నారు. ఏడు దేవాలయాల అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈసారి ఘనంగా నిర్వహిస్తాం.. భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగి ంపు కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయమై మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలువనున్నాం. వారి సలహాలు, సూచనల మేరకు ఆషాఢ మాస బోనాలలను గతేడాది కన్నా ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా దేవాలయాలలో అమ్మ వారికి బోనాలు సమర్పించేలా తగిన ఏర్పాట్లు చేస్తాం. – బల్వంత్ యాదవ్, భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు -
భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఘటాల ఊరేగింపు
-
ఆషాఢ బోనం.. ఇంటికే పరిమితం
నిజామాబాద్ కల్చరల్: అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమతో అలంకరించిన పాత్రలో అగ్ని సాక్షిగా నైవేద్యం(బోనం) సమర్పించడం అమ్మవారికి ఎంతో ఆనందాన్నిస్తుంది. గ్రామ పొలిమేరల్లో ఉండే అమ్మవార్లకు ఈ మాసం మొత్తం బోనాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే కరోనా ప్రభావం బోనాల పండుగపై కూడా తీవ్రంగా పడింది. బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని సూచించారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం విస్తారంగా కురిసే వర్షాలతో ఈ మాసంలో కలరా, మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు మనుషులపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ఇలా వ్యాధులు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గ్రామదేవతలను వేడుకొని భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా మహిళలు కాళ్లకు రాసుకునే పసుపుతో వానాకాలంలో అరికాళ్లు చెడకుండా ఉంటాయి. దీంతో పాటు ఈ పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మానికి, వీధి వీధికి వేపాకు మండలు కడతారు. వేపాకులో ఉండే ఔషధగుణం ద్వారా క్రిమికీటకాలు నాశనం అవడంతో పాటు అంటువ్యాధులు దరికి చేరవు. సాదాసీదాగా.. ప్రతి ఇంటా సంతోషంగా జరుపుకునే బోనాల వేడుకలు ఈ సంవత్సరం కోవిడ్ –19 కరోనాతో బోనాలను ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, సాదసీదగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆలయాలలో పూజారుల ఆధ్వర్యంలో బోనాల తంతు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు మాత్రం తమ ఇళ్లలోనే అమ్మవార్లకు బోనం సమర్పించి అందరిని సల్లగా చూడాలని కోరుతూ మొక్కులు చెల్లించాలని చెప్పింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ నిర్ణయం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆషాఢ బోనంకు కరోనా గ్రహణం పట్టింది. దీంతో బోనాల పండుగను ఇంటికే పరిమితం చేసుకోవాలని ప్రభుత్వం సూచించడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాధి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదే. ఎల్లమ్మ అనుగ్రహంతో కరోనా వ్యాధి త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటాను.– పంచరెడ్డి ఎర్రన్న, అధ్యక్షుడు, ఎల్లమ్మ ఆలయం, ఎల్లమ్మగుట్ట -
బోనాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. తెలంగాణలో నిర్వహించే ఈ బోనాల్లో.. లాల్దర్వాజ బోనాలు విశిష్ఠమైనవి. ఆషాడ మాసం చివరివారంలో పాతబస్తీలో జరిగే లాల్దర్వాజ బోనాలకు 104 ఏళ్ల చరిత్ర ఉంది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ను ముంచెత్తుతున్న సమయంలో నిజాం నవాబు సింహవాహని మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని.. ఆపద గట్టెకిస్తే.. గుడికట్టిస్తానని వేడుకున్నారని ప్రతీతి. అప్పటి నుంచి లాల్దర్వాజ బోనాల ఆనవాయితీ కొనసాగుతుందంటారు భక్తులు. ఇంతటి విశిష్ఠత ఉన్న ఈ బోనాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇంటిల్లిపాది వచ్చి అమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు. బోనం ఎత్తుకుని.. అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెలంగాణవారే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా.. బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇక, సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. అక్కన్న మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభిస్తారు. ఒడిషా, కర్ణాటక, కేరళ నుంచి వచ్చిన కళాకారులు వివిధ ఆకృతులతో అమ్మవారి శకటాలను సుందరంగా అలంకరిస్తున్నారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పాతబస్తీ బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 13 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీటరికి తోడుగా 43 ప్లటూన్ల సాయుధ బలగాలు కూడా భద్రత విధుల్లో పాటు పంచుకోనుంది. -
సింగపూర్లో ఘనంగా బోనాల వేడుకలు
బోనాల పండుగ వేడుకలు దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా సింగపూర్లో ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పండగ వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్’ లోని శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్లో తెలంగాణ ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. సుమారు 700 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ‘తీన్ మార్’ స్టెప్పులు వేసి అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ప్రజలకు మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని టీసీఎస్ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోనాల పండుగను సింగపూర్కు మూడేళ్ల క్రితం పరిచయం చేశామని టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలోటిసిఎస్ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగా కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగలో పాల్గొని అత్యంత వైభవంగా జరుపుకునేందుకు సహకరించిన ప్రజలందరికి, ప్రసాద దాతలకు సొసైటీ తరపున.. సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు.. ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు.. ఎమ్ దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు పాల్గొని.. ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బోనాల వేడుకల స్పాన్సర్స్.. మాలబార్ గోల్డ్ & డైమండ్స్ ధీరజ్, వేలన్ ట్రేడింగ్, టేస్ట్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐ ఫ్యాషన్స్, రియో కాఫీ.. ఇతర దాతలకు సొసైటీ సభ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, దీపా నల్ల, సౌజన్య నంగునూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్కారి గంగాధర్, మడిగె రాజు, మల్లా రెడ్డి మిటపల్లి, తౌట గంగాధర్, అనుపురం శ్రీనివాస్, జుట్టు ఉమేందర్, టి. శ్రీనివాస్, మంత్రి సాయిరాం, తుర్క శ్రీనివాస్, కటుకం మారుతి, మనోజ్ గార్లు వ్యవహరించారు. పోతరాజుల వేషాలు మరియు పులి వేషాలు వేసిన పాచంపల్లి శ్రీధర్, నేరెళ్ళ శ్రీనాథ్, చాడ సంతోశ్ రెడ్డి, వెంగళదాస్ తిరుపతి, అద్ది మల్లేశం గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. -
ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న కేసీఆర్
రాంగోపాల్పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు తెల్లవారుజాము 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు, రంగం వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో రెండువేల మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి శాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీ ఊరేగింపు వంటి ప్రధాన ఘట్టాలు రెండు రోజులపాటు కొనసాగుతాయి. గతేడాది ఘటోత్సవం నుంచి రంగం వరకు 15 రోజుల పాటు 20 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 25 లక్షలు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే కనీసం 5 లక్షల మందికి పైగా దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : దుర్గగుడి ఈవో
సాక్షి, విజయవాడ : ఆషాడం మాసంలో తెలంగాణ బోనాలు మొదలైతే.. దుర్గగుడిలో పవిత్ర సారె ఉంటుందని కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఆషాడ మాసం మొత్తం పవిత్ర సారె కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరుగుతుందని అన్నారు. గతేడాది యాభై వేలమంది భక్తులు పవిత్రసారె తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈసారి కూడా అమ్మవారికి పవిత్ర సారె తీసుకొచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జూలై 3నుంచి ఆగస్ట్ 1వరకు ఈ ఆషాడ మాసం ఉంటుందని అన్నారు. పవిత్రసారె తీసుకొచ్చే భక్తులు ముందుగా తెలియజేస్తే.. అందుకు తగ్గ ఏర్పాట్లతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జూలై 14,15,16 తేదీల్లో శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రకటించారు. 16న చంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు సాయంత్రంఘైదు గంటలకే దర్శనం నిలుపుదల చేస్తామని, మళ్లీ ఉదయం పదిగంటలకు తిరిగి దర్శనం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుంచి ఆహ్వానం వచ్చిందని, బోనం సమర్పించడానికి 26న అక్కడికి వెళ్లనున్నుట్లు తెలిపారు. పవిత్ర సారె తీసుకొచ్చే వారందరికి ముఖమండప దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. -
బోనాలకు రజనీ రెడీ
చార్మినార్: బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ సిద్ధంగా ఉంది. ఉత్సవాల్లో రజనీ (ఏనుగు)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో మావటీలు శిక్షణనిస్తున్నారు. నగరంలోని మూడు ప్రతిష్టాత్మకమైన అమ్మవారి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ఊరేగింపులో రజినీ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఎలాంటి అదురు బెదురు లేకుండా అత్యంత ఉత్సాహాంగా బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొంటోంది. 30న ఊరేగింపు ఈ నెల 30న (సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జాయినీ మహాంకాళి దేవాలయం అమ్మవారి జాతర ఊరేగింపులో రజనీ పాల్గొంటుంది. ఆగస్టు 5వ తేదీనా బోనాల సమర్పణ రోజు కార్వాన్లోని సబ్జిమండి నల్లపోచమ్మ మహాంకాళి దేవాలయం ఉత్సవాల సందర్బంగా నిర్వహించే బోనాల జాతరలో రజనీ ఊరేగింపులో ఉంటుంది. 5న శ్రీ అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆరు దశాబ్దాలుగా అంబారీపై అక్కన్న మాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతూ వస్తోందని దేవాలయం కమిటి అధ్యక్షులు జి.నిరంజన్ తెలిపారు. -
సింగపూర్లో ఘనంగా బోనాలు
-
సింగపూర్లో ఘనంగా బోనాల జాతర
సింగపూర్ : సింగపూర్లోని శ్రీ అరసకేసారి శివన్ టెంపుల్లో బోనాల జాతర అంగరంగవైభవంగా జరిగింది. డప్పుల సప్పుళ్ల మధ్య అమ్మవారి ప్రదర్శన, పోతురాజుల విన్యాసాల నడుమ సింగపూర్లోని తెలుగు వారు బోనాల జాతరను జరుపుకున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒగ్గు కళాకారుడు బొల్లి రాజు యాదవ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ జాతరలో సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారు సుమారుగా 800 మంది పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలంగాణ వాసులందరి ఆధ్వర్యంలో , తెలంగాణ బోనాల జాతరను తేదీ 22 (ఆదివారం) నాడు శ్రీ అరసకేసారి శివన్ టెంపుల్ నందు డప్పుల డీజే సప్పుడుల మధ్య, పోతురాజుల విన్యాసాల నడుమ పిల్లలు పెద్దలు అందరు కలిసి అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుపుకున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఒగ్గు కళాకారుడు బొల్లి రాజు యాదవ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ జాతర వేడుకలో సింగపూర్లో నివసిస్తున్న తెలుగువారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర నేపథ్యంలో సింగపూర్ సిటీ నలుమూలల నుండి బస్సు సౌకర్యం కల్పించారు. ముందుగా కార్యక్రమంలో కవిత, సునీత, అనిత ఆధ్వర్యంలో బోనాలు తయారు చేసి గుడికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ది శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండగకు పిలవగానే వచ్చిన భక్తులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ వారి కోసం రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్సవాలను జరుపుతామనఆనరు. ఈ కార్యక్రమంలో వీరమళ్ళ కృష్ణ ప్రసాద్, ఏళ్ళ రాంరెడ్డి, మర్రి వెంకటరమణ రెడ్డి, నల్లావుల రాజేందర్ రెడ్డి, కట్ట రాజిరెడ్డి, చిలుక సురేష్, చిట్ల విక్రమ్ పటేల్, గోపగోని దామోదర్, ఆర్ సి రెడ్డి, పింగిళి భరత్, అల్లోల మురళి రెడ్డి, నల్ల వేణు, గడిపల్లి చంద్ర, గోసంగి శంకర్, అంకటి తిరుపతి, చెట్టిపల్లి మహేష్, చల్ల కృష్ణ, బైరి రవి, యాసరవేణి విజయ్, వీర చందు, ముదమ్ అశోక్ తదితరులు పాల్గున్నారు. -
ఘనంగా అమ్మవారి బోనాలు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ అమ్మవారి బోనాల ఉత్సవాలు జూలై 15 నుండి ఘటం ఎదుర్కోలుతో ప్రారంభమవుతాయని, జూలై 29న అమ్మవారికి బోనాలు, 30న రంగం (భవిష్యవాణి) కార్యక్రమాలు ఉంటాయని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించేం దుకు పెద్దఎత్తున ఏర్పాట్లను చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని, ఎక్సైజ్శాఖ మంత్రి పద్మారావు గౌడ్తో కలసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బోనాల జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బంగారు బోనం నమూనాను మం త్రులు ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభు త్వం తరుఫున కోటి రూపాయలతో 3 కిలోల 80 గ్రాముల బంగారంతో బోనం తయారు చేయిస్తున్నా మన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనా లను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఆలయ పరిసరాలలో పారిశు«ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని, బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తులకు తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని, షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు విధులు నిర్వహిస్తారని అన్నారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున దానిని దృష్టిలో ఉంచు కొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయం ఆవరణలో 24 లక్షల రూపా యల ఖర్చుతో భారీషెడ్డును నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సమావేశంలో కలెక్టర్ యోగితా రాణా, వాటర్వర్క్స్ ఎండీ దానకిషోర్, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహంకాళి ఆలయ ఈవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
'బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం'
హైదరాబాద్: నగరంలో బోనాల ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. బోనాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించినట్టు నాయిని వెల్లడించారు. -
బోనాలు చిత్రాలు
బోనాలు.. కొందరికి సంప్రదాయుం.. వురికొందరికి పండుగలా.. ఇంకొందరికి ఆటవిడుపులా కనిపి స్తుంది. ఈ వైవిధ్యాన్ని విభిన్నంగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 22న ప్రారంభమైన కళాత్మక ప్రదర్శనలా ఉంటుంది. బోనాలు.. ఈ జానపద వేడుకను శిల్పి ఉలి ఎలా చెక్కుతుంది.. కెమెరా కన్ను ఎలా ఫ్లాష్ కొడుతుంది.. ఫిల్మ్ మేకర్ ఎక్కడ యూక్షన్ చెబుతాడు.. కవి ఏ తీరుగ వర్ణిస్తాడు.. చిత్రకారుడి కుంచె ఎలా స్పంది స్తుంది..? ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ప్రదర్శన. ప్రముఖ శిల్పకారుడు, చిత్రకారుడు చిలువేరు మనోహర్ చేసిన అరుదైన ప్రయత్నమిది. వేర్వేరు రంగాల్లో తనకు పరిచయం ఉన్న నలుగురు కళాకారులతో కలిసి ‘బోనాలు’తో ఒకే వేదిక పైకి వచ్చి ఈ ప్రయోగానికి బోనమెత్తారు! స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వురో రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన కళాభివూనుల వునసు కట్టిపడేస్తోంది. ప్రతి కోణం అపురూపం.. బోనాల వేడుక వసుధైక కుటుంబానికి ప్రతిరూపవుని చిత్రకారుడు చిలువేరు వునోహర్ తన చిత్రాల్లో చూపించారు. ఫిలిం మేకర్ దూలం సత్యనారాయుణ బోనాల పండుగను తెలంగాణ ప్రజల ఉనికిగా చూపే ప్రయుత్నం చేశారు. కాలగవునంలో బోనాలు ఉత్సవంలో వచ్చిన వూర్పులను క్లిక్ వునిపించారు ఫొటోగ్రాఫర్ రావూ వీరేశ్బాబు. బోనాలతో పాటు జీవన విధానంలోని వూర్పులపై కూడా తన ఫోకస్ ఉంటుందంటున్నారు. రచరుుత దెంచనాల శ్రీనివాస్ జనాల బోనాలు అందుకునే అవ్మువారిని శైవశక్తి రూపంలో వర్ణిస్తూ కవితా రూపం ఇచ్చారు. -
అమ్మవారికి ప్రీతిపాత్రుడు పోతరాజే..
జాతరలో చెర్నాకోలుతో విన్యాసాలు గుమ్మడికాయతో బలిదానం లాల్దర్వాజా ఆలయంలో ‘పోసాని’ కుటుంబం రికార్డు అమ్మవారి సేవలో తరిస్తున్న మూడు తరాలు వందేళ్లుగా కొనసాగుతోన్న ఆనవాయితీ ఈసారి కొత్తగా గజ్జె కట్టనున్న పోసాని హేమానంద్ చాంద్రాయణగుట్ట: జాతర అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది పోతరాజు విన్యాసాలు. ఒంటి నిండాపసుపు, కుంకుమ రుద్దుకొని... చేతిలో చెర్నాకోలు... కళ్లకు కాటుక... నోట్లో నిమ్మకాయలతో నృత్యం చేస్తూ వేలాది మంది భక్తజన సందోహం నడుమ పోతరాజు చేసే సందడి అంతా ఇంతా కాదు. గజ్జెకట్టి పోతరాజు వేసే ఒక్కో అడుగుకు ఎంతో ప్రాధాన్యముంటుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో అతను చేసే నృత్యాలు, హావభావాలు, కొరడా ఝుళిపించడం తదితర విన్యాసాలు అందరిని అలరిస్తాయి. లాల్దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ జాతరలో ఇలాంటి ప్రధానమైన తంతును లాల్దర్వాజా మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నిర్వహిస్తోంది. దాదాపు వందేళ్లుగా జాతర సమయంలో అమ్మవారికి సేవలందిస్తున్నారు. పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర.. లాల్దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆలయం తరఫున నిజాం కాలం నుంచి పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబం వందేళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. 1908వ సంవత్సరంలో ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాలంలో ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణలో సేవలందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన మూడో తరానికి చెందిన వారు ఆ ఆనవాయితీని కొనసాగించడం విశేషం. పోసాని బాబయ్య ఎలియాస్ సింగారం బాబయ్యతో పోతరాజు వేషధారణ ప్రారంభమైంది. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబూరావు, బాబూరావు సోదరుడు సుధాకర్ ఇలా ఇప్పటివరకు ఆరుగురు ఒకే వంశం నుంచి సేవలందించారు. ఈ సారి బోనాల ఉత్సవాల సందర్భంగా బాబూరావు తమ్ముడు పోసాని హేమానంద్ తొలిసారిగా పోతరాజు సేవలందించేందుకు ముందుకు వస్తున్నారు. దున్నపోతు నుంచి గుమ్మడికాయ వరకు.. అప్పట్లో మేకల బండనుంచి దున్నపోతుపై ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చేవారు. ఆ దున్నపోతును పన్నుతో అదిమి పట్టి అమ్మవారికి బలిచ్చేవారు. తరువాత రోజుల్లో మేకను బలిచ్చారు. జంతు బలిని నిషేధించడంతో గుమ్మడికాయతో పోతరాజు శాంతిస్తున్నాడు. పోతరాజంటే.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమెర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటారు. డప్పుచప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటారు. ఏడుగురు అక్కాచెల్లెల్లైన అమ్మవార్లకు ఈ పోతరాజంటే అమితానందం. ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమెర దాటుతారు. దీక్షతో... పోతరాజు వేషధారణ అంటే నియమంతో కూ డుకున్నది. ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠిం చిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతరాజుగా నృత్యం చేసేవారు ముందురోజు నుంచే ఉపవాస దీక్షలో ఉం టారు. శాంతి అయ్యే వరకు మత్తు పదార్థాలను, ఆహారాన్ని తీసుకునేందుకు వీలు లేదు. కేవలం అమ్మవారి ధ్యానంలోనే గడుపుతారు. కొరడా దెబ్బల కోసం... పోతరాజు కొరడా దెబ్బల కోసం భక్తులు పోటీపడతారు. కొరడా దెబ్బలను తింటే దుష్ట శక్తులు ఆవహించవని ప్రతీతి. దీంతో భక్తులు కొరడా దెబ్బలు తినేందుకు పోటీ పడుతుంటారు. అమ్మ ఆశీర్వాదంతోనే 30 ఏళ్లపాటు.. లాల్దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను 30 ఏళ్లపాటు పోతరాజుగా అలరించాను. ఘట స్థాపన నుంచి ఊరేగింపు వరకు ఎంతో నిష్టతో ఉండేవాడిని. ముఖ్యంగా వేషధారణ చేసే సోమవారం రోజున ఉపవాస దీక్ష పాటిస్తాం. అమ్మ దయతోనే ఇప్పటివరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. దశాబ్దాలుగా పోతరాజుగా వ్యవహరించడంతో నా ఇంటిపేరు పోతరాజుగా మారింది. - పోతరాజు (పోసాని) బాబూరావు అదృష్టంగా భావిస్తున్నా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో వారిని పోతరాజు వేషధారణలో చూస్తున్నా. ఈ సారి నేను తొలిసారిగా పోతరాజుగా వేషం కట్టనున్నాను. మొదటిసారి అయినప్పటికీ నాకెలాంటి భయం లేదు. ఘట స్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో నిమగ్నమయ్యా. అమ్మవారి కరుణతోనే ఈ సారి పోతరాజు విన్యాసాలు చేసే అవకాశం రానుంది. - పోసాని హేమానంద్