Buddhist culture
-
బౌద్ధ సంస్కృతితోనే వికాసం, ప్రకాశం
వేల ఏళ్ల క్రితమే భారతదేశం శాంతి సౌభాగ్యాలను ప్రవచించిన బుద్ధభూమిగా విదేశాల వారికి తెలుసు. ప్రపంచమంతా కత్తులతో సామ్రాజ్య విస్తర ణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నాడు. అదీ భారత వారసత్వ బలం. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. బౌద్ధ సూత్రాలు అనేకం మన రాజ్యాంగంలోనూ పొందుపరచారు అంబేడ్కర్. అయితే ఈనాడు తద్ద్విరుద్ధమైన పరిస్థితులుదేశంలో నెలకొని ఉన్నాయి. దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో ఉంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే బౌద్ధ పునరుజ్జీవన ఉద్యమం అవసరం.ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్లో 18వ ప్రవాస భారతీయ దివస్ (పీబీడీ) సదస్సులో ప్రసంగిస్తూ ‘మానవుని భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధునిలో ఉందని’ ఉద్ఘాటించారు. ఇది చాలా చరిత్రాత్మకమైన ప్రకటన. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ప్రకటన అని చెప్పక తప్పదు.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి గురించి, అలాగే ఇజ్రాయెల్– గాజా మధ్య జరుగుతున్న మానవ హననం గురించిన ఆందోళన ఇందులో లీనమై ఉంది. ఇంకా ఆయన ఈ సందర్భంగా మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వార సత్వం కారణంగా మన తత్త్వాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామనీ, ప్రస్తుతం ప్రపంచం మనం చెప్పే మాటను వింటోందని తెలిపారు. ఆయన మరొక ముఖ్యమైన ప్రస్తావన కూడా చేశారు. ‘ప్రపంచ మంతా కత్తులతో సామ్రాజ్య విస్తరణలో తలమునకలైన వేళ అశోక చక్రవర్తి శాంతిమార్గాన్ని ఎన్నుకున్నారు. అదీ భారత వారసత్వబలం. భారత్ అంటే ప్రజాస్వామ్యానికి తల్లి. ప్రజాస్వామ్యం మన జీవితాల్లో అంతర్భాగం. అది మన జీవనశైలి. భిన్నత్వం గురించి మనకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలు దానిపైనే నడుస్తున్నాయి. భారతీయులు ఏ దేశానికి వెళ్లినా ఆ సమాజంలోఅంతర్భాగం అవుతారు. ఆ యా దేశాల సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ చిత్తశుద్ధితో పనిచేసి అక్కడి పురోభివద్ధికి దోహదపడు తుంటారు. అదే సమయంలో వారి హృదయాలు భారత్ కోసం తపిస్తుంటాయి. ప్రవాసులను మన దేశ రాయబారులుగా నేను చూస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరుగుతున్నానంటే దానికి వారే కారణం. అన్ని చోట్లా వారు నాకు ఘనస్వాగతం చెబు తుంటారు. భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని అన్నారు. వాస్తవానికి భారతదేశం అశోకుడు కత్తి దించాక ప్రపంచంఅంతా విస్తరించింది. కేవలం సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, తాత్విక సాంస్కృతిక విప్లవం కూడా భారత్ నుండి ప్రపంచానికి విస్తరించింది. భారతదేశం ఉత్పత్తి క్రమం పెరగాలంటే తప్పక బౌద్ధం విస్తృతి ప్రపంచ దేశాలకే కాదు భారతదేశానికీ మరింత అవసరం అని అంబేడ్కర్ అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో ప్రసిద్ధ భారతదేశ చరిత్ర పరిశోధకులు రొమిల్లా థాపర్ బౌద్ధం... మరీ ముఖ్యంగా అశోకుని బౌద్ధం స్వీయ జీవిత అనుభవం నుంచి వ్యక్తీక రించబడిందని, అనుసరించబడిందని చెప్తూ అది భారతదేశంలో నూత్న నిర్మాణానికి దారి తీయడానికి ఎన్నో సామాజిక అసమాన తలకు సంబంధించిన అమానవ ధర్మాలను త్రోసి పుచ్చిందని అన్నారు. ‘దమ్మం అనేది అశోకుని దృష్టిలో ఒక జీవిత విధానం. అది అతనికి పరిచయమున్న తత్త్వవేత్తల నైతిక బోధనల సారం. బహుశా స్వీయ జీవితానుభవ సారం కూడా అయివుండవచ్చు. ఆ జీవిత విధానం ఉన్నత స్థాయి సామాజిక నీతి మీద, పౌరబాధ్యతల మీద ఆధారపడింది. అంతేగాక అశోకుడు... వర్ణవ్యవస్థను గురించి ఆదర్శప్రాయంగా చిత్రించిన సిద్ధాంతంగా కాక, నిత్యజీవితం దృష్ట్యా తన దమ్మాన్ని రూపొందించార’ని రొమిల్లా థాపర్ విశ్లేషించారు. ‘సాధారణంగా పెక్కు సమాజాలలో కన్పించే సాంఘిక డాంబికత్వాన్ని పరిహరించి, మానవత్వ సిద్ధమైన సాంఘిక ప్రవర్తనను అశోకుడు కాంక్షించాడు. స్వర్గ సౌఖ్యం వంటి ఆధ్యాత్మిక భావనలో ప్రజలకు పరిచయముంది. అటువంటి ప్రతిఫలాల ఆశ చూపటం ద్వారా సాంఘిక బాధ్యతను కేవలం సదాచార వర్తనగా గాక, సాత్విక ప్రాధాన్యం ఉండి నిర్వా్యజంగా అనుసరించే బాధ్యతగా ఉదాత్త స్థానానికి కొనిపోవడానికి అశోకుడు ప్రయత్నించాడ’ని రొమిల్లా థాపర్ అశోకుని పరిపాలనా విధానం గురించి చెప్పారు.ఈనాడు భారతదేశంలో బౌద్ధ సాంస్కృతిక, ఆర్థిక విప్లవం అవసరం అని నరేంద్ర మోదీ సంఘ్పరివార్ శక్తులకు కూడా బోధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై, స్త్రీలపై, మైనార్టీలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. భారతదేశంలో అంతర్గత సామాజిక వ్యవస్థ సంక్షో భంలో వుంది. ప్రజల ఆహార, ఆహార్య అంశాల పట్ల కూడా వివక్ష, హింసలు కొనసాగుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా ఆయనఅంతర్గత లౌకిక వాదానికి కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి దిగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతులు తగ్గుతున్నాయి. భారతదేశంలో సామాజిక ఆర్థిక ఉత్పత్తులు పెరగా లంటే ఈనాడు తప్పకుండా సామాజిక జీవన సామరస్యాన్ని,శాంతిని, కరుణను, కుల వివక్షేతరమైన ప్రజ్ఞను గుర్తించే కుల నిర్మూలనా భావం పాలకులకు అవసరం. బౌద్ధ సంస్కృతీ వికాసం అవసరం. అశోకుడి పాలనను పునర్వివేచించుకొని సమన్వయించు కోవడం అవసరం.బౌద్ధాన్ని ఒక మతంగా కాక ఒక ధర్మంగా, ఒక నీతిగా పరి వ్యాప్తి చేయవలసిన అవసరం వుంది. సారనాథ్లో అశోకుడు నిలిపిన శిలాస్తంభ అగ్రభాగంలోని నాలుగు సింహాల శిల్పాన్ని భారత ప్రభుత్వం అధికార ముద్రగా స్వీకరించింది. కానీ ఈ దేశాన్ని బౌద్ధ భూమిగా ప్రకటించలేకపోయింది. అయితే ఇప్పుడు హిందూదేశంగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుండడం గమ నార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు యుద్ధానికి బదులు శాంతి అవ సరం అని చెబుతున్న పాలకులందరూ ఆయుధ సంపత్తికే ఎక్కువ ధనం ఖర్చు బెట్టడం విడ్డూరం. భారత ప్రధాని నరేంద్ర మోదీ అంత ర్జాతీయ వేదికలపై చెబుతున్న మాటలను భారతదేశంలో కూడా నిరంతరంగా చెప్పడమే కాక, ఆచరణలోకి తీసుకురావడం వల్లఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో భారత రాజ్యాంగకర్త అంబేడ్కర్ను అవమానిస్తూ మాట్లాడటాన్ని మోదీ ఖండించలేదు. అది బాధాకరమైన విషయం. బుద్ధ–అశోకులంతటి వారు అంబేడ్కర్. భారతదేశంలో ఈనాడు రక్తపాతంలేని సమాజం ఏర్పడిందంటే ఆయనే కారణం.నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు ఆర్థిక పరిస్థితులు దిగ జారడానికి కారణం బౌద్ధ జీవన విధానం ప్రపంచంలో లేకపోవ డమే! ప్రపంచమంతా ఆశాంతిగా ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి కారణం ప్రకృతినీ, మనిషి వ్యక్తిత్వాన్నీ కాపాడుకోలేక పోవడమే. పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావనలు పెరిగి పర్యావరణవిధ్వంసం, యుద్ధకాంక్ష, దోపిడీలు పెరగడం వల్ల ప్రపంచంలోశాంతి అంతరిస్తూ ఉంది. అంబేడ్కర్ రాజ్యాంగంలో బౌద్ధ ధమ్మంలోని అష్టాంగ సూత్రాలు, పంచశీల వంటి వాటి నుండే భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. నరేంద్ర మోదీ బౌద్ధంతో పాటు ప్రపంచానికి భారత రాజ్యాంగ ప్రశస్తిని చాటవలసిన అవసరం ఉంది. బుద్ధుణ్ణి, అశోకుణ్ణి, అంబేడ్కర్ని భారతదేశ పునర్మిర్మాణ కర్తలుగా ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్క మోదీనే కాదు, ప్రతిపక్ష నాయకులు, ఆ యా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బౌద్ధ సంస్కృతి వికాసానికి పాటుపడాల్సిన అవసరం ఉంది. ఏపీ సీఎం చంద్ర బాబుకి అమరావతిని బౌద్ధ సాంస్కృతిక, తాత్విక, ఆర్థికకేంద్రంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ చెప్ప వలసిన అవసరం ఉంది. చంద్రబాబు నోట బుద్ధుని పేరు గాని, అశో కుని పేరుగాని, అంబేడ్కర్ పేరుగాని రాకపోవడం శోచనీయం. ఈనాడు భారత రాజ్యాంగ సూత్రాల పునాదుల మీద బౌద్ధ జీవన పునరుజ్జీవనానికి ఆచరణాత్మకంగా పూనుకోవాల్సిన చారిత్రక సంద ర్భంలో మనమున్నాం. ఆ దిశగా నడుద్దాం. - వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695-డా‘‘ కత్తి పద్మారావు -
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
మైమరిపించేలా.. మహాస్తూపం
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతానికి వెళ్తే బుద్ధుడి జీవితచక్రం కళ్లముందు కదలాడుతుంది.. ఆ మహనీయుని బోధనలు అడుగడుగునా ప్రేరణ కల్పించేలా వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రధాన బౌద్ధ స్థూపాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం దేశంలోనే ప్రధాన బౌద్ధపర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటోంది. అదే నాగార్జునసాగర్లోని బుద్ధవనం. 249 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణాల పరంపరలో కీలకమైన మహాస్తూపం ప్రత్యేక తరహాలో సిద్ధమవుతోంది. నంద్యాలలో చెక్కిన శిల్పాలు ఇటీవలే బుద్ధవనం చేరుకున్నాయి. వాటిని ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాశ గుమ్మటం... ఆకర్షణీయం.. మహాస్తూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. అదే ప్రధాన మందిరం. లోపలి వైపు నిలబడి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. పైకప్పునకు ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 16 వరసల్లో గులాబీ పూరేకుల తరహాలో తీర్చిదిద్దా రు. ఈ ఏర్పాటు సిమెంటుతో కాకుండా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్తో ఏర్పాటు చేయటం విశేషం. అందులోనే నాలుగు దిక్కులా ఒక్కోటి 9 అడుగుల ఎత్తులో ఉండే నాలుగు బుద్ధుడి భారీ రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మచక్ర ప్రవర్ధన ముద్రలో ఇవి ఉంటాయి. వీటి మధ్య ఒక్కోటి మూడు అడుగుల ఎత్తుతో మరో 4 విగ్రహాలుం టాయి. అవి ధ్యాన ముద్ర, భూస్పర్శ ముద్ర, అభయముద్ర, వర్ణముద్రల్లో ఉంటాయి. వీటి ప్రతిష్ట పూర్తయితే ప్రధాన నిర్మాణం పూర్తయినట్టే. ప్రధాన ద్వారం వద్ద అష్టమంగళ చిహ్నాలు, బుద్ధుడి జాతకచిహ్నాలను రాతితో చేయించిన 104 ప్యానెల్స్పై చెక్కించి ఏర్పాటు చేయించారు. మధ్య 17 అడుగులతో ధర్మచక్ర స్తంభం ఠీవిగా నిలబడి ఆకట్టుకుంటోంది. ఇక బుద్ధచరిత్ర వనంలో బుద్ధుడి జీవితగాథలోని ప్రధానఘట్టాలు ప్రతి బింబించేలా 10 కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేయించారు. బుద్ధుడి జాతక కథలను తెలిపే 40 రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా 27 అడుగుల ఎత్తుతో ఔకాన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. మన దేశంలోని ప్రధాన 5 బౌద్ధ స్తూపాలు, వివిధ దేశాల్లోని ప్రధాన 8 స్తూపాల సూక్ష్మ నమూనాలతో మినియేచర్ పార్కును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులతోపాటు సాధారణ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. -
రేపటి నుంచి అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవాలు
⇒ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ⇒ హాజరుకానున్న పలుదేశాల ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణని తరచి చూస్తే గోదారి పొడవునా అలనాటి ప్రాచీన వారసత్వ సంపదైన బౌద్ధ సంస్కృతి పొంగిపొర్లిన ఆనవాళ్లుంటాయి. బాదన్కుర్తి మొదలుకొని, నాగార్జునకొండ వరకు ప్రతిచోట బౌద్ధం నడయాడిన అరుదైన చరిత్ర తెలంగాణ సొంతం. ఆ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా హైదరాబాద్లో రెండు రోజులపాటు రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో అంతర్జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్టు మంత్రి చందూలాల్ మంగళవారం టూరిజం ప్లాజాలో వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 27 బౌద్ధ చారిత్రక ప్రదేశాలున్నాయని, అందులో 11 ఇప్పటికే గుర్తింపు పొందాయన్నారు. రాష్ట్రంలోని గోదావరీ నదీపరీవాహక ప్రాంతాల్లో బుద్ధిజం ఆచరించబడిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. ఇది యావత్ దేశానికే ఇది గర్వకారణమన్నారు. గురువారం(23) నుంచి నాలుగు రోజుల పాటు(26) వరకు జరిగే తెలంగాణ బుద్ధిజం అంతర్జాతీయ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. దీనికి ప్రపంచ దేశాల నుంచి దాదాపు 250 మంది హాజరవుతున్నారన్నారు. బౌద్ధ చరితను ముందుతరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టీనా చాంగ్ధూ అన్నారు. ఇటువంటివి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకురావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మలేసియాకి చెందిన బుద్ధిస్ట్ రచయిత, చరిత్రకారుడు కుమార్సేథి అన్నారు. -
తెస్తారా.. వదిలేస్తారా..?
తెలంగాణ ప్రాంతంలోని నీళ్లు, భూములు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టిన గత పాలకులు చారిత్రక సంపదనూ వదల్లేదు. ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిన కాలచక్రలో ప్రదర్శించడానికి కొలనుపాక, పానగల్లు నుంచి తరలించిన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు చేర్చలేదు. అత్యంత అమూల్యమైన బౌద్ధ సంపదను తెలంగాణ రాష్ట్రంలోనైనా రాబట్టుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందంటున్నారు పలువురు. -భువనగిరి ⇒ ఎనిమిదేళ్ల క్రితం అమరావతికి ⇒ తరలిన మన బౌద్ధ సంపద ⇒ రాష్ట్ర విభజన వరకు స్వస్థలానికి చేర్చని పాలకులు ⇒ తెలంగాణ ప్రభుత్వంపైనే ఆశలు కొలనుపాక.. బౌద్ధ చరిత్రకు నిలయంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ప్రాంతం. నల్లగొండ జిల్లా ఆలేరుకు సమీపంలో ఉన్న ఈ గ్రామం అత్యంత విలువైన చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు. అయితే గత పాల కుల హయాంలో గుంటూరులో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఇక్కడి నుంచి తరలించిన విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి తీసుకురాలేదు. అసలేం జరిగిందంటే.. 2005 నవంబర్లో గుంటూరు జిల్లా అమరావతిలో బౌద్ధులకు సంబంధించి ‘కాలచక్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాతో పాటు దేశవిదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో బౌద్ధ మతస్తులు హాజరయ్యారు. వారి సందర్శనార్థం ఉంచటానికి జిల్లాలోని పానగల్, కొలనుపాక మ్యూజియం నుంచి బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలు, బౌద్ధ మతానికి చెందిన దేవతామూర్తుల విగ్రహాలు, పీఠాలను అమరావతికి తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి స్వస్థలాలకు చేర్చాల్సిన ఉండగా ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఈ విషయమై అప్పట్లో శాసనసభలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగగా పానగల్ మ్యూజియానికి బుద్ధుని విగ్రహం మాత్రం వచ్చింది. పానగల్ మ్యూజియానికి ఇంకా రెండు విగ్రహాలు రావాల్సి ఉంది. అలాగే కొలనుపాక మ్యూజియంలో వజ్రపాణి (బుద్ధుడు సూర్యునిగా వెలుగొందిన ప్రతిరూపం), బుద్ధుని పీఠం (పెడస్టల్ ఆఫ్ బుద్ధ), లైన్స్టోన్ పిల్లర్ (బుద్ధ ఇమేజ్) బౌద్ధ మతానికి సంబంధించిన అత్యంత విలువైన రాత్రి విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి. తవ్వకాలలో బయల్పడిన విగ్రహాలలో కొన్ని.. కొలనుపాకతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో అత్యంత విలువైన చారిత్రక శిలా శాసనాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానంగా వీరశైవ మతానికి సంబంధించిన విగ్రహాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన రాత్రి విగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న జైన మతానికి సంబంధించిన ప్రాచీనమైన దేవాలయంలో పురావస్తు శాఖ వారు మ్యూజియం ఏర్పాటు చేసి లభించిన విగ్రహాలను భద్రపరిచింది. చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం అమరావతికి తరలించిన అత్యంత విలువైన బుద్ధుని విగ్రహాలను తిరిగి స్వస్థలాలకు తీసుకురాకపోతే వాటికున్న చారిత్రక నేపథ్యం కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ మతానికి సంబంధించిన విగ్రహాల వల్ల పూర్వకాలంలో ఇక్కడ బౌద్ధమతం విలసిల్లిందన్న ఆధారాలు ఉన్నాయి. వాటిపై పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో పరిశోధన జరిపితే అత్యంత విలువైన సమాచారం లభించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేల తరలిపోయిన సంపదను తిరిగి రాబట్టుకోనట్లయితే ఈ ప్రాంతాలకు ఉన్న ప్రాముఖ్యత తెరమరుగయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.