Bus collision
-
ఘోర ప్రమాదం... ఓవర్ టెక్ చేయబోయి ట్రక్ని ఢీ కొట్టిన బస్సు
వడోదర: వడోదర కపురై బ్రిడ్జ్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. నివేదిక ప్రకారం.... లగ్జరీ బస్సు ట్రక్ని ఓవర్టెక్ చేసే క్రమంలో ట్రక్కుని ఢీ కొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్స్సు రాజస్తాన్లోని భిల్వారా నుంచి ముంబైకి బయలు దేరుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. #Vadodara 04 died, 15 injured in a collision between a bus and a truck. The bus was going from Bhilwara, #Rajasthan to #Mumbai, collided with the truck while trying to overtake. pic.twitter.com/m7YaHFGJDz — Our Vadodara (@ourvadodara) October 18, 2022 (చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....) -
రైలు, బస్సు ఢీ : 20 మంది మృతి
కరాచి: పాకిస్తాన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సింద్ ప్రావిన్స్లో రైలు, బస్సు ఢీకొట్ట ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. సుక్కూర్ నగరంలోని రోహ్రి ప్రాంతంలో రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సుక్కూర్ పోలీసు ఏఐజీ జమీల్ అహ్మద్ డాన్ అందించిన సమాచారం ప్రకారం గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న తమ సిబ్బంది హుటాహుటిన రక్షణ, హాయక చర్యలు చేపట్టారని తెలిపారు. 45 పాకిస్తాన్ ఎక్స్ప్రెస్ రైలు కరాచీ నుండి రావల్పిండికి వెళుతుండగా, మానవరహిత రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. మరోవైపు రైలులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదమనీ సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మహేసర్ వెల్లడించారు. రైలు మూడు భాగాలుగా విడిపోయి, దాదాపు 150-200 అడుగుల మేర బస్సును రైలు లాక్కుపోయిందని తెలిపారు. -
విద్యార్థుల ప్రాణాలు కాపాడిన 'విద్యుత్ కోత'
గుంటూరు : దాదాపు 50 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ను ఢీ కొట్టింది. అయితే అదే సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ కోతతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఘటన గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులతో ఇంటికి పంపించేశారు. అలాగే బస్సు ఢీ కొనడంతో ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయింది. దీనిపై విద్యుత్ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. -
ఎందుకిలా చేశావు రైలుబండీ....
-
పసిపిల్లల ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం