coalition government
-
రైతుల కోసమే 'సెకీ' విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఇటీవల ఆమోదించిన డిస్కంల ఆదాయ, అవసరాల నివేదికలో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల విద్యుత్ను ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది. ఆ సందర్భంలోనే సెకీ ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి, ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలేమీ కనిపించడం లేదంటూ స్పష్టం చేసింది. దీంతో సెకీ ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు, కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యాలని తేలిపోయింది. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే–2024 కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది. ‘వనరుల ప్రణాళిక’లో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అంగీకరించింది. 2024–25 నుంచి 2028–29 వరకు (5వ నియంత్రణ కాలం), 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకు ఏపీ ట్రాన్స్కో, డిస్కంలు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు 2023 జూన్లో ఏపీఈఆర్సీ అనుమతినిచ్చిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలున్న వీటిలో ‘సెకీ’తో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఒప్పందం కూడా ఉంది.అవే భవిష్యత్తుకు భరోసా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 డిసెంబరులో విజయవాడ సమీపంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల (స్టేజ్–5) యూనిట్ ఉత్పత్తి ప్రారంభించిందని కూటమి సర్కారు తెలిపింది. ఈ కేంద్రం నుంచి 25 ఏళ్ల పాటు వంద శాతం విద్యుత్ కొనుగోలుకు ఏపీజెన్కో 2022 అక్టోబరులో ఒప్పందం కుదర్చుకుందని పేర్కొంది. ఇదికూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింద్ధి. ఏపీ పంప్డ్ స్టోరేజ్ (పీఎస్పీ) ప్రమోషన్ పాలసీ–2022 ద్వారా రాష్ట్రంలో 29 ప్రదేశాల్లో 33,240 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు టెక్నో–కమర్షియల్ ఫీజిబులిటీ రిపోర్ట్స్ సిద్ధం చేసినట్లు ఆర్థిక సర్వే సాక్షిగా తేటతెల్లమైంది. ఇది గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు నిదర్శనం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం సూర్యఘర్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది. ఆచరణలో మాత్రం పురోగతి సాధించడం లేదని సర్వే తేల్చిచెప్పింది. ఈ పథకానికి 3 డిస్కంలలో కలిపి 16,35,672 మంది చేత రిజిస్టర్ చేయించారు. వారిలో 9,79,665 మంది చేత దరఖాస్తులు పెట్టించారు. కేవలం 10,278 మందికే రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ అమర్చారు. పథకం అట్టర్ ఫ్లాప్ అని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. కేవలం గత ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన విద్యుత్ రంగ ప్రగతిని తమదిగా చెప్పుకొనే ప్రయత్నం మినహా ఆర్థిక సర్వే –2024లో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం విశేషం.‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెకీ)తో 7వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాను కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీఆర్ఏపీఎస్సీవోఎం) పేరుతో ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం నియమించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) మాన్యుఫ్యాక్చరింగ్ లింక్డ్ స్కీమ్ నుంచి 7 వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కోసం రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కం) అనుమతి కోరాయి. దానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది’– ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో కూటమి ప్రభుత్వం -
జగన్దే జనరంజక పాలన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు కూడా స్పష్టమైంది. 2024–25 సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో కూటమి నాయకులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా అనేక అంశాలపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. మన బడి నాడు–నేడు కింద పాఠశాలల్లో రెండు దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అనేక పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది.. జీవనోపాధి మెరుగైందని, పేదరిక శాతం తగ్గిందని స్పష్టమైంది.జగన్ హయాంలోనే పేదరిక నిర్మూలన..పేదరిక నిర్మూలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేసింది. సంక్షేమ, వైద్య, ఆరోగ్య పథకాలు, ఉపాధి అవకాశాల, సామాజిక భద్రత, సాధికారత కార్యక్రమాల లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీతో గ్రామీణ పేదలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు లీకేజీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సకాలంలో సాయం అందింది. కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పేదరికం తగ్గడానికి దోహదపడ్డాయి. పేదరిక నిర్మూలనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. నీతి ఆయోగ్ 2023లో విడుదల చేసిన బహుళ పేదరిక సూచికల్లో ఏపీలో పేదరికం 50 శాతం తగ్గింది. 2015–16 నాటి ఈ స్కోరు 0.053 ఉండగా, 2019–21లో 0.025కు తగ్గింది.2023–24 సుస్ధిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరసమైన స్వచ్ఛమైన ఇంధనం అందించడంలో 1వ స్థానంలో ఉందని, స్థిరమైన అభివృద్ధి కోసం నీటి వనరులను సంరక్షించడం, స్థిరంగా ఉపయోగించడంలో రెండో ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకు, ఉత్పత్తుల బాధ్యతాయుత వినియోగంలో నాలుగో ర్యాంకులో ఉంది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కంటే కూటమి సర్కారు ఏడాది పాలనలోనే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు భారీగా పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం కన్నా కూటమి పాలనలో కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు భారీగా తగ్గిపోయాయి.కూటమి ప్రభుత్వంలో గనుల ఆదాయం కూడా భారీగా పడిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023ృ24లో రూ.3,425 కోట్లు రాబడి వస్తే 2024ృ25లో అది రూ.2,031 కోట్లే. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధి అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా తగ్గింది. 2023ృ24లో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా, 2024ృ25లో 6.71 శాతానికే పరిమితమైంది.2023ృ24 ఆర్థిక సంవత్సరం వరకు వాస్తవ బడ్జెట్ గణాంకాల ప్రకారం జీఎస్డీపీలో 34.58 శాతం అప్పులు. 2024ృ25లో సవరించిన అంచనాల మేరకు కూటమి ప్రభుత్వం జీఎస్డీపీలో 35.15 శాతం అప్పులు చేసింది.ఇవిగో సాక్ష్యాలు..పేదరిక నిర్మూలన: జగన్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలుచేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రత్యక్ష నగదు బదిలీ జరిగింది. ఇతర రాష్ట్రాలకన్నా పేదరికం 50శాతం తగ్గింది.బడుల రూపురేఖలు మారాయి: 15,713 పాఠశాలల్లో రెండు దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించింది.రైతులకు స్వర్ణయుగం: 10,778 ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ప్రయోగం.. అవి అందించిన సేవలు రైతులకు బాగా ఉపకరించాయి. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గ్యాప్ సర్టిఫికేషన్తో రైతులకు ఎమ్మెస్పీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది..సెకీ విద్యుత్ రైతుల కోసమే: రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ కోసమే గత ప్రభుత్వం సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏపీఈఆర్సీ అనుమతించింది.అప్పులే కూటమి ఘనత.. నింగిలో నిత్యావసరాలు: కూటమి సర్కార్ ఏడాది తిరక్కుండా రూ. 53వేల కోట్ల బడ్జెట్ అప్పులు చేసింది.. (బడ్జెటేతర అప్పులతో కలిపితో1.25 లక్షల కోట్లకు పైమాటే..) ద్రవ్యలోటు, రెవెన్యూలోటు భారీగా పెరిగింది.. రాబడి బాగా తగ్గింది. పారిశ్రామికాభివృద్ధీ తగ్గింది.. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి.గత నెల 28న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో మొత్తం అప్పుల చార్ట్ను తొలగించారు. అయితే, ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్ అప్పులను పేర్కొన్నారు. దీనిప్రకారం చూస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న అప్పుల కన్నా ఈ ఆర్థిక ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. 2023-24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4,91,734 కోట్లు ఉండగా.. 2024-25లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులతో అది రూ.5,64,488 కోట్లకు చేరింది.వైఎస్సార్సీపీ హయాంలో ఇంగ్లిష్ ల్యాబ్, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు, కౌంపౌండ్ వాల్ సహా తొలి దశలో 15,713 పాఠశాలల్లో రూ.3,859.12 కోట్లతో 9 రకాల నిర్మాణాలను చేపట్టారు.రెండో దశలో 22,344 పాఠశాలల్లో రూ.8 వేల కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలను చేపట్టారు. (వీటిని పట్టిక రూపంలో సర్వేలో పేర్కొన్నారు). -
నేను చెప్పిందే ‘యాక్ట్’
ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్, బియ్యం... ఏది దొరికినా అమ్మకానికి పెట్టి అక్రమార్జన..! రాబడి ఉందనుకుంటే ఏ ఒక్కరినీ, సంస్థలను వదలకుండా వేధింపులు..! అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇదీ పచ్చ నేతల బరితెగింపు..! ఇప్పుడు వారు బెదిరింపుల పర్వానికీ తెరలేపారు..! తాజాగా బాపట్ల పచ్చ నేత చూపు యాక్ట్ కేబుల్ టీవీపై పడింది. ఇక్కడ తాను చెప్పిందే ‘యాక్ట్’ అంటూ సంస్థను నియోజకవర్గం నుంచి తరిమేసి మొత్తం కనెక్షన్లు తన కేబుల్ టీవీకి మళ్లించుకునేందుకు ఆయన ఎత్తు వేశారు. ఇందుకోసం శక్తిమంతమైన యాక్ట్ యాజమాన్యాన్నే బెదిరించారు. ఆయన బరితెగింపు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీసింది. –సాక్షి ప్రతినిధి, బాపట్లకార్యాలయానికి పిలిపించుకుని బెదిరింపుల పర్వంబాపట్ల పచ్చ నేత నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది యాక్ట్ కేబుల్ యాజమాన్యం. ఇప్పుడు దానినే బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సంస్థకు ఉన్న 32 వేల కనెక్షన్లు తనకు అప్పగించి నియోజకవర్గం వదిలిపెట్టాలని బాపట్ల పచ్చ నేత హుకుం జారీ చేశారు. ఇటీవల యాక్ట్ కేబుల్కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొదలు ఉద్యోగులందరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అల్టిమేటం జారీ చేశారు. ‘మీ కనెక్షన్లన్నీ మా సోదరుడి కేబుల్ టీవీకి బదలాయించండి’అని ఆదేశించారు. కాదూ.. కూడదంటే నియోజకవర్గంలో ఉండలేరన్నారు. వెళ్లకపోతే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిరించారు. ‘మీరంతా చిన్న ఉద్యోగులు.. యాక్ట్ను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దు’ అంటూ తనదైన శైలిలో సూచనలు చేశారు. తక్షణం ఉద్యోగాలు వదలి వెళ్లిపోవాలని ఆల్టిమేటం ఇచ్చారు. ఈ విషయం యాక్ట్ యాజమాన్యానికి తక్షణమే చేరవేయాలని కూడా సూచించారు. తన మాట ఖాతరు చేయకుండా పార్టీ పెద్దలు, లేదా మీ సంస్థకు పరిచయమున్న మంత్రులతో ఫోన్లు చేయించినా వినేది లేదని పచ్చనేత ఖరాకండిగా చెప్పారు. నాతో పెట్టుకోవద్దంటూ ఇలా నేరుగానే బెదిరించారు. యాజమాన్యంతో మీరే మాట్లాడాలని యాక్ట్ ఉద్యోగులు సూచించగా ‘మీ యాజమాన్యంతో మాట్లాడేంత తక్కువ స్థాయి వ్యక్తిని కాదు నేను. అవసరమనుకుంటే వారే నా వద్దకు రావాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారంలో వెళ్లకపోతే కేసులే..వారం రోజుల్లో బాపట్ల వదలి వెళ్లాలని, లేదంటే ఎలా పనిచేస్తారో చూస్తామని.. వరుస కేసులు పెట్టి అంతుచూస్తామని యాక్ట్ ఉద్యోగులకు పచ్చ నేత ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తామని, వారు ఒప్పుకోవాలి తప్ప తామేమీ చేయలేమని చెప్పి యాక్ట్ ఉద్యోగులు వెనుదిరిగినట్లు తెలిసింది. తర్వాత పచ్చనేత సమీప బంధువు వచ్చి నియోజకవర్గానికి సంబంధించి 50 శాతం వాటా ఇస్తే ఓకే చెప్పిస్తానని యాక్ట్ ఉద్యోగుల వద్ద బేరం పెట్టినట్లు సమాచారం. ఇక బెదిరింపుల క్రమంలో ఇటీవల తమ కేబుల్ను కట్ చేశారన్న సాకు చూపి కర్లపాలెం పరిధిలో యాక్ట్ ఉద్యోగిపై అక్రమ కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇటీవల పలుసార్లు యాక్ట్ ఉద్యోగులను పోలీసు ఫిర్యాదుల పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు.ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలే..పచ్చ నేత బెదిరింపులను యాక్ట్ యాజమాన్యం కొందరు ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తెచ్చినట్లు సమాచారం. వాస్తవానికి యాక్ట్ డిజిటల్ టీవీ బలమైన మీడియా సంస్థ. దేశంలోనే మూడో అతిపెద్ద కేబుల్, ఇంటర్నెట్ కంపెనీ. నాన్ టెలికంలో దేశంలో నంబర్వన్ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి 32 వేల కనెక్షన్లతో ఉంది. ఏడాదిన్నర క్రితం బాపట్ల పచ్చనేత తన రాజకీయ అవసరాల కోసం లోకల్ కేబుల్ పెట్టారు. తర్వాత అధికారంలోకి రావడంతో ఏకంగా బలమైన యాక్ట్ కేబుల్ను కనెక్షన్లు తనకు అప్పగించి వెళ్లాలని బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లలో ఏ నాయకుడూ తమను బెదిరించలేదని, మొదటిసారి బాపట్లలో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని యాక్ట్ యాజమాన్యం పేర్కొంటోంది. -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!
అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూములు రిటర్న్బుల్ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్ డీడ్ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్లో అసైన్డ్ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగుతుండగా.. మరోపక్క అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్ భూములకు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూడదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్గా ఉన్న కాంతిలాల్ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. -
‘ఆశా’.. నిరాశే!
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ‘ఆశా’ సిబ్బందికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. ఆశాలను ఉద్ధరించింది తామేనని, దేశంలోనే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారి కష్టాలను విన్నది కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వైఎస్ జగన్ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని సైతం ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.20 వేల వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, 180 రోజుల ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల చెల్లింపునకు అంగీకరించారు.30 ఏళ్ల సర్వీసు ఉంటేనే గ్రాట్యుటీ! ‘ఆశా’లను ఆదేకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రయోజనాలను అమలు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఆశాల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.1.50 లక్షల గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 42,752 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. -
AP: ఉద్యోగులకు ఉత్తచెయ్యి
సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డీఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పీఆర్సీ ఆశలపై నీళ్లుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మాయలేళ్లూ... మరీచికలు!
‘చెప్పేదొకటి, చేసేదొకటి’ స్వభావం గలవాళ్లను మోసగాళ్లనే అంటాము. ప్రజా జీవితంలో ఉంటూ మచ్చుకైనా పారదర్శకత లేని ఇటువంటి బ్యాచ్ కూడా మోసగాళ్లే! మాయ లేడి వేషం వేసుకొని మోసగించిన మారీచునికి వీళ్లు వారసులనుకోవాలి. ఇటువంటి మూడు మాయలేళ్లు కలిసి కూటమి కట్టి ఏర్పాటు చేసిన ప్రభుత్వం నుంచి హామీల అమలు గురించి ఆశించడమంటే మరీచికల వెంట పరుగులు తీయడమే! ఈ కూటమి ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో కూడా ఎన్నికల వాగ్దానాలకు నామం పెట్టారని ప్రతిపక్షం విమర్శిస్తున్నది. ప్రతిపక్షంగా అది వాళ్ల డ్యూటీ కావచ్చు.కూటమి మాత్రం ఆ విమర్శలను పట్టించుకోదు. మేనిఫెస్టో హామీలను అమలుచేయలేమనీ, చేయబోమనీ వారికి ముందే తెలుసు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమం వగైరాల కంటే పరమ పవిత్రమైన ఆశయాలు, ప్రయోజనాలు వారికి విడివిడిగా వేరే ఉన్నాయి. ఆ ప్రయోజనాలు నెరవేరాలంటే అధికారం కావాలి. విడివిడిగా ఉంటే అది కుదిరే పని కాదు. అందుకని ఒక్కటయ్యారు. అయినా నమ్మకం లేక ‘కొండమీది కోతిని నేలకు దించుతాం, బొందితో కైలాసం తీసుకుపోతాం, కళ్ల ముందటే వైకుంఠాన్ని నిలబెడతాం’ తదితరాల స్థాయికి తగ్గని హామీలను మేనిఫెస్టోలో చేర్చుకున్నారు. వాటిని నెరవేర్చి తీరుతామని కూటమి నేతలు వివిధ సభల్లో చేసిన మంగమ్మ శపథాలు,భీష్మ ప్రతిజ్ఞలు ఇప్పటికీ జనం చెవుల్లో గింగిరుమంటూనే ఉన్నాయి.పిట్టల దొర వాగ్దానాలకు తోడు ఢిల్లీ సర్కార్ సౌజన్యంతో ఎన్నికల సంఘం కూడా ఓ చేయి వేయడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన అధికారాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే విషయంపై ఎవరి ప్రాధాన్యాలు వారికున్నాయి. జాతీయ స్థాయిలో కూటమికి పెద్దన్నగా బీజేపీ ఉంటున్నా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీదే పెద్దన్న పాత్ర. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి మారిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించే వైఖరి తీసుకుంటున్నది. విద్య, వైద్యం వంటి ప్రాథమిక విషయాలు కూడా ప్రభుత్వ బాధ్యత కాదనీ, ఆ రంగాల్లో ప్రైవేట్ సేవలు అవసరమనీ చెప్పిన చరిత్ర బాబుది.ప్రభుత్వం నుంచి పొందే సేవలకు కూడా ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించవలసిందేనని ఆయన గతంలోనే ఘంటా పథంగా ప్రకటించారు. అదేరకంగా పాలించారు. మొన్నటి ఎన్ని కల సందర్భంగా ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు ఆయన సిద్ధాంతపరంగానే వ్యతిరేకి! అయినప్పటికీ అటువంటి మేనిఫెస్టోకు రూపకల్పన చేయడమంటే అధికారం పొందడం కోసం ఉద్దేశపూర్వకంగా మోసానికి తెగబడ్డారంటే తప్పవుతుందా? ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈ మధ్యనే ‘పీ4’ అనే ఓ వంటింటి చిట్కాను ప్రకటించారు.ఈ ఉగాది నుంచి అమలుచేయ సంకల్పించిన ఈ ‘పీ4’ చిట్కాతో రాష్ట్రంలోని పేదరికం మటుమాయమైపోతుందట! పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ భాగస్వామ్యమని దాని పూర్తి పేరు. సమాజంలోని పది శాతం మంది అత్యంత సంపన్నులు అట్టడు గున ఉన్న 20 శాతం మంది కడుపేదలను దత్తత తీసుకో వాలట! ఈ పేదవారి అవసరాలను ఆ సంపన్నులు గుర్తించి తృణమో పణమో సాయం చేసి పేదరికం నుంచి బయట పడేయాలట! ఈ ‘సామాజిక బాధ్యత’ నెరవేర్చినందుకు ఆ సంపన్నులకు ఏ సహజ వనరుల్ని కట్టబెడతారన్నది ఇక్కడ రహస్యం.కుల మత ప్రాంతీయ లింగ భేదాల్లేకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికీ భారత రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది. చారిత్రకంగా వివిధ సమూహాల మధ్య అభివృద్ధి క్రమంలో ఏర్పడిన అంతరాలను పూడ్చడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని ఆదేశించింది. సహజ వనరుల్లో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. అందరూ సమానస్థాయిలో పోటీ పడగలిగే అవకాశాలు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) ఏర్పడాలని రాజ్యాంగం చెబుతున్నది. అటువంటి పరిస్థితులను ప్రభు త్వాలు ఏర్పాటు చేసినట్లయితే పేదరికాన్ని పేదలే జయిస్తారు. ఈ దేశాన్ని కూడా సంపన్న దేశంగా నిర్మిస్తారు. రాజ్యాంగం ఆశయం కూడా అదే! ఎవరి ఎంగిలి మెతుకుల తోనో పండుగ చేసుకొమ్మని చెప్పలేదు.ఈ ‘పీ4’ కార్యక్రమాన్ని గురించి రానున్న రోజుల్లోయెల్లో మీడియా ఏ రకమైన ప్రచారాన్ని చేపట్టబోతున్నదోనని ఊహించుకుంటేనే గగుర్పాటు కలుగుతున్నది. ఇంతటి మహత్తరమైన ఆలోచన గతంలో కార్ల్ మార్క్స్కు గానీ, అంబేడ్కర్కు గానీ, మరెవ్వరికీ గానీ రాలేదని వీరతాడు వేయవచ్చు. ఇకముందు రాబోదని కూడా ఛాలెంజ్ చేయవచ్చు. ఈ చిట్కా వైద్యంతో చిటికెలోనే పేదరికం పరారైందని కూడా ప్రకటించవచ్చు.‘పీ4’ సంక్షేమ ప్రచారం హోరులో తెలుగుదేశం పార్టీ అధినేతలకు మిగిలిన పవిత్ర కార్యక్రమం ఏమున్నది? ఒక్క అమరావతి తప్ప! దానికి అభివృద్ధి అనే ముసుగు వేయడం తప్ప! మిగిలిన ఈ మూడేళ్లూ (ఒక సంవత్సరం జమిలి ఎన్నికల కోత ఉండవచ్చు) అమరావతి సేవలోనే ప్రభుత్వం తరించే అవకాశం ఉన్నది. అమరావతి నిర్మాణానికి రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం లేదని, దాని ల్యాండ్ బ్యాంక్ ద్వారా సంపాదించిన సొమ్ముతోనే నిర్మాణం జరిగి పోతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, జర్మనీ, ‘హడ్కో’ల ద్వారా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇంకో ఇరవై వేల కోట్ల రూపాయలను సీఆర్డీఏ ద్వారా సమీకరించేందుకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు.జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలను గనక ఉపయోగంలోకి తెచ్చుకుంటే వైజాగ్ తక్షణమే అందుబాటులోకి వచ్చేది. ఆ సంగతి పక్కనబెట్టి, వైజాగ్ను విస్మరించి, ఇన్ని వ్యయప్రయాసలకోర్చడం వెనుక అసలు కథ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది. రాష్ట్ర రాజధాని పేరుతో అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని, దాని ద్వారా ఆ పార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి ప్రణాళికలు రచించారనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలను పూర్వపక్షం చేసే సంతృప్తికరమైన సమాధానాన్ని తెలుగుదేశం నాయకత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నది. ప్రతిపక్షం వారు రుజువులు చూపిస్తూ చేస్తున్న ఆరోపణలను సహేతుకంగా ఖండించనూ లేకపోతున్నది. దీన్నిబట్టి ఈ మూడేళ్లలో జరగ బోయేది – పేదలకు ‘పీ4’ గంజినీళ్లు! పాలక పెద్దలకు కనక వర్షం!!ఇక భారతీయ జనతా పార్టీది జాతీయ స్థాయి లక్ష్యం. వరసగా మూడుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ, సంఘ్ పరివార్లు మంచి ఊపుమీదున్నాయి. ఇక ఆరెస్సెస్ స్థాపిత లక్ష్యమైన హిందూ రాష్ట్ర ఎజెండాను బయటకు తీసే ముహూర్తం ఇప్పుడు కాక ఇంకెప్పుడని అవి భావిస్తు న్నాయి. మొన్నటి ‘మహా కుంభమేళా’ సందడిలోనే అందుకు అంకురార్పణ కూడా జరిగిపోయిందట! ‘అమర్ ఉజాలా’ అనే ఉత్తరాది హిందీ పత్రిక కోసం అలోక్ కుమార్ త్రిపాఠీ రాసిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ‘ది వైర్ తెలుగు డాట్ ఇన్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంకో పాతికేళ్లలో దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నదట! అందుకు అవసరమైన అడుగులన్నీ ఇక వరసగా వేసుకుంటూ వెళతారు. ‘రుషి సంవిధాన్’ అనే పేరుతో ప్రత్యామ్నాయ రాజ్యాంగం కూడా సిద్ధమైందట! దీన్నే ‘సనాతన రాజ్యాంగ’మని పరివార్ ముఖ్యులు పిలుచుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చబో మంటూ బీజేపీ నేతలు పదేపదే ఇస్తున్న హామీలన్నీ బూటకమే నని ఇప్పుడు సిద్ధంగా ఉన్న ‘రుషి సంవిధాన్’ లేదా సనాతన రాజ్యాంగం రుజువు చేస్తున్నది.సంఘ్ పరివార్ తన అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి కీలకమైన తొలి అడుగు జమిలి ఎన్నికలు లేదా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ (ఒక జాతి... ఒకే ఎన్నిక). ఆ తర్వాత ‘ఒక జాతి... ఒకే భాష’, ‘ఒక జాతి... ఒకే మతం’ వంటి నినాదాలు మొదలు కావచ్చు. కనుక ఎట్టి పరిస్థితుల్లో జమిలి ఎన్నికల కార్యక్రమాన్ని ఈ దఫా వాయిదా వేసే అవకాశం లేదు. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలకు సరిపోయే సంఖ్యాబలం ఎన్డీఏకు ఉన్నదా లేదా అనే శంకలు అనవసరం. సమకూర్చుకోగలమనే నమ్మకం ఎన్డీఏకు ఉన్నది. బీజేపీ శిబిరానికి దూరంగా ఉండే తటస్థ పార్టీలకు కూడా వాటి అవసరాలు వేరువేరుగా ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన రాజకీయ కక్షను, స్టేట్ టెర్రర్ను ఎదుర్కొంటున్న వైసీపీ వాళ్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దమన కాండను వదిలించుకుందామనే దిశలో ఆలోచించవచ్చు.తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏడాది ముందుగానే అధికారంలోకి వచ్చే అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇల్లలకంగానే పండగ కాదు. జమిలి ఎన్నికలు జరిగినంత మాత్రాన హిందూ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు కాదు. ఇంకా చాలా దూరం ఉన్నది. జమిలి ఎన్నికలకు సహ కరించిన పార్టీలన్నీ ‘రుషి సంవిధాన్’కు సహకరించకపోవచ్చు. జమిలి ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు. కాకపోతే చాప కింద నీరులా బీజేపీ చేస్తున్న సన్నాహాలకూ, ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్న మాటలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇక మాటలకూ, చేతలకూ పొంతన ఉండనివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్గా ‘జనసేనాని’ని నియమించుకోవచ్చు. ఈ పదేళ్లలో ఆయన తన ఐడియాలజీని తలకిందులుగా వేలాడ దీశారు. ఆయన ఆరాధన చేగువెరా నుంచి సావర్కర్కు బదిలీ అయింది. తన మాటలకు విరుద్ధంగా తానే మాట్లాడిన ఉదంతాలు కోకొల్లలు. సనాతన రాజ్యాంగం గురించిన మాటలు సంఘ్ పరివారంలో వినపడగానే సనాతన ధర్మ పోరాట యోధుడి అవతారమెత్తడం గమనార్హం. ఏ రాజకీయ స్రవంతిలో కలిసిపోతే తన ప్రయాణం సుఖంగా సాగుతుందని భావిస్తారో అందులో దూకెయ్యడం ఆయనకు రివాజుగా మారింది. ఇలా మాట నిలకడ లేని, పారదర్శకత అసలే లేని ముగ్గురు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమి నుంచి హామీల అమలు గురించి ఆశించడం నీటి కోసం ఎండమావుల వెంట పరుగులు తీయడమే అవుతుంది. కాకపోతే ఈ రాజకీయ వంచనా శిల్పాన్ని ఎండగట్టడం, ప్రజలను జాగృతం చేయడం ప్రజాస్వామ్య ప్రియుల తక్షణ కర్తవ్యం.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కూటమి సర్కార్ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్/ సాక్షి, రాయచోటి: రెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది. జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు గురు మహేష్.. బీపీ, షుగర్, పల్స్ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్రెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కనీ్వనర్ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్ సెల్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ధిక్కారం ‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్సీపీ లీగల్ అడ్వయిజర్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్సిక్స్ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. పోలీస్స్టేషన్కు జిల్లా ఎస్పీఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్స్టేషన్ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 2.. కొనసాగిన వాదనలు పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్స్టేషన్లోనే ఉంచారు. పోలీసుస్టేషన్ ద్వారం వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా ఉదయం 5 గంటలదాకా కొనసాగిన వాదనలు. సుమారు 7 గంటలు కొనసాగిన వాదనలు. సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విదించింది. కాసేపట్లో కడప జైలుకు పోసాని తరలింపు.త్రిబుల్ వన్ సెక్షన్ల దుర్వినియోగం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్ వన్ (111) సెక్షన్లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్ను దుర్వినియోగం చేస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం. – పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ -
ఇంతలో ఎంత తేడా!
సాక్షి, అమరావతి: అటు మూల ధన వ్యయం, ఇటు పారిశ్రామిక వృద్ధిలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మూల ధన వ్యయం ద్వారా సంపద సృష్టిస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు తీరా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో మూల ధన వ్యయం ఖర్చులో ఏపీ చివరి నుంచి మూడో స్థానంలో ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. 2023 – 25 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో చేసిన మూల ధన వ్యయంపై ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2023–24లో 9 నెలల్లోనే 62 శాతం మూల ధన వ్యయం చేసినట్లు వెల్లడించింది. అదే చంద్రబాబు ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో 9 నెలల్లో కేవలం 27 శాతం మాత్రమే మూల ధన వ్యయం చేసిందని తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో అతి తక్కువగా మూల ధన వ్యయం చేసిన 19 రాష్ట్రాల్లో అట్టడుగున జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర వృద్ధిపై ప్రభావం చూపుతుందని స్పష్టం అవుతోంది.తిరోగమనంలో పారిశ్రామిక వృద్ధి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో పయనిస్తోంది. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడటమే ఇందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు చెబుతున్నట్లు ఈ ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే పారిశ్రామిక వృద్ధి ఎందుకు తగ్గిందో ఆయనే సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు సమాధానం చెబుతూ రాష్ట్ర వృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారం 2024–25లో పారిశ్రామిక వృద్ధి అంతకు ముందు ఆర్థిక ఏడాది కన్నా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక వృద్ధి 7.42 శాతం ఉండగా 2024–25లో కేవలం 6.71 శాతమేనని ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూత పడుతుండటం వల్లే పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పారిశ్రామిక రంగంలోకి వచ్చే మైనింగ్, క్వారీయింగ్లో వృద్ధి మైనస్ 1.38 శాతానికి పడిపోయింది. రెడ్బుక్ పాలన పేరుతో వేధింపుల పర్వం కొనసాగిస్తుండటంతో పాటు బడా పారిశ్రామిక వేత్తలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సంపద సృష్టి అంటూ జపం చేయడం తప్ప తొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2024–25 ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రాష్ట్రంలో 1107 ఎస్ఎంఈలు మూత పడినట్లు కేంద్ర మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో పక్క రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరిగిందని పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పురుషుల నిరుద్యోగ రేటు 6.3 శాతం ఉండగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 6.4 శాతం ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిందని సర్వే తెలిపింది.నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదుతమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శాసన మండలిలో స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పడంపై మంగళవారం మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, నాలుగు లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని మాత్రమే చెప్పామని తెలిపారు. గవర్నర్ ఇంగ్లిష్ ప్రసంగం ప్రతిలో ఇలానే ఉందని, తెలుగు ప్రసంగం ప్రతిలో ఉద్యోగాలు కల్పించినట్లు అచ్చు తప్పు పడిందని చెప్పుకొచ్చారు. -
మీడియాపైనా ‘రెడ్బుక్’ రాజ్యాంగం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాకముందే రాసుకున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా నాలుగు ప్రధాన టెలివిజన్ చానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా చానళ్లుగానీ, పత్రికలుగానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వడం పరిపాటి. ఆ తరువాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ.. అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులు ఉన్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండుటెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైనా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పక్షపాత ధోరణి తగదు: ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులు ఇచ్చి, కొన్ని పత్రికలు, చానళ్ల రిపోర్టర్లను అనుమతించకపోవడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఏచూరి, ‘సామ్నా’ అధ్యక్షుడు నల్లి ధర్మారావు, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారిక సమావేశాలకు కూడా కొన్ని పత్రికలు, చానల్స్ను పిలవకపోవడం తగదన్నారు. శాసనసభ స్పీకర్, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన అన్ని చానల్స్, పత్రికలకు అనుమతి ఇచ్చి, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరారు.ఈ వైఖరి మంచిదికాదు: ఏపీడబ్ల్యూజేఎఫ్అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కొన్ని మీడియా సంస్థలకు పాసులు నిరాకరించడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్లు వీసం శ్రీనివాసరావు, కె.మునిరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి మీడియా సంస్థలకు మీడియా పాసులు నిరాకరించడం సరైన విధానం కాదన్నారు. ఈ విషయంపై స్పీకర్ జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కరించి మీడియా సంస్థలన్నిటికీ పాసులు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్ జగన్
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. – వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీ భవిష్యత్తుకు నాది భరోసా..ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.ప్రజలకు అన్నీ తెలుసు..పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. -
గాల్లో దీపంలా పేదల ప్రాణాలు
టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్ల్లో ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్తో పాటు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్ ఇవ్వడంలేదుగులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు. -
సొంత గ్రూపులకే ‘ఉపాధి’
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాడు.. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రికార్డు స్థాయిలో కోట్ల పని దినాలు కల్పించడం ద్వారా పేదరికాన్ని తొలగించే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. నేడు.. టీడీపీ కూటమి సర్కారు ‘గ్రూపు’ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పల్లెల్లో చిచ్చు రాజేస్తోంది! దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రూపుల వ్యవస్థను ఏపీలో ప్రవేశపెట్టి శ్రమశక్తి సంఘాల (ఎస్ఎస్ఎస్) పేరుతో గ్రామాల్లో ప్రతి 50 మందికి ఓ గ్రూపు చొప్పున ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో ఆధిపత్యం కోసం ఏలూరు జిల్లాలో సోమవారం రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. మే్రస్తిగా ఉన్నవారు తమ వర్గం వారికి అనుకూలంగా మస్తర్లు వేస్తున్నట్లు ఘర్షణకు దిగడంతో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ వేళ సైతం ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ఆదుకుంటే.. కూటమి సర్కారు మాత్రం నచి్చన వారికే ఉపాధి కల్పిస్తోంది. కూలీలు ఓ గ్రూపుగా ఏర్పడి పని కావాలని దరఖాస్తు చేసుకుంటేనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కేటాయిస్తోంది. ఒక గ్రూపులో చేరిన కూలీలు అందులో నుంచి బయటకొచ్చి కొత్త దాంట్లో చేరేందుకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. అసలు గ్రూపులతో సంబంధం లేకుండా ఏదైనా కుటుంబం వ్యక్తిగతంగా పని కావాలని కోరినా కేటాయించే అవకాశమే ఉండదు. గ్రూపులతో గ్రామాల్లో చిచ్చు.. ఒకసారి శ్రమశక్తి సంఘం ఏర్పాటయ్యాక సంవత్సరం వరకు ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి సంఘానికి లీడర్గా ‘మేట్’ ఉంటారు. కూలీలను సమీకరించడం మేట్ ప్రధాన బాధ్యత. కూలీల కుటుంబాలు ఒకసారి ఏదైనా గ్రూపులో చేరితే కనీసం ఏడాదిపాటు ఆ మేట్ సమక్షంలో పనిచేయక తప్పుదు. ఏ పరిస్థితుల్లోనైనా మేట్తో విభేదాలు తలెత్తితే ఆ కుటుంబానికి పని దక్కకుండా చేసే అవకాశం ఉంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉపాధి పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఏ పనులైనా తమకు అనుకూలంగా ఉండేవారికే కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలువురు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమ వర్గీయులను నియమించుకున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లతో తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఫీల్డు అసిస్టెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. అడ్డగోలుగా తొలగింపులు..రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ తమ అనుచరులకు చోటు కల్పిస్తున్నారు. వారి ఆగడాలు తట్టుకోలేక కొందరు స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 115 మందికి పైగా తొలగించారు. అదేమంటే స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఏపీఓలు అంటున్నారు. మిగిలిన వారినీ తొలగించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లావ్యాప్తంగా 435 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. టీడీపీ ప్రభుత్వం పలువురు తప్పుకున్నారు. 40 మంది మేట్లను కూడా తొలగించారు. రాజీనామా చేయని ఫీల్డ్ అసిస్టెంట్లకు డ్వామా అధికారులు నోటీసులిస్తూ వేధిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఇప్పటివరకు 134 మందిని ఇంటికి పంపించగా నెల్లూరు జిల్లాలోని 430 పంచాయతీల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 721 మందికి గానూ 485 మందిని తప్పించి టీడీపీ సానుభూతిపరులను నియమించుకున్నారు. ఏలూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం రాగానే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ తప్పుకోవాలని హెచ్చరించడంతో 350 మంది వైదొలిగారు. కోనసీమ, కాకినాడ జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కాగానే వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 32 మందిని సస్పెండ్ చేయగా, 45 మందిని ఇంటికి పంపించారు. హోంమంత్రి అనిత నియోజకవర్గంలో ఆరుగు ఫీల్డ్ అసిస్టెంట్లు, ముగ్గురు మేట్లను తొలగించారు. శ్రీసత్యసాయి జిల్లాలో 520 మంది ఫీల్డ్ అసిస్టెంట్లనూ మార్చేశారు. అనంతపురం జిల్లాలో 90 శాతం ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చారు. కర్నూలు జిల్లాలో ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి పలువురిని తొలగించారు.పని దినాల కల్పనలో నాడు రికార్డువైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఏ కుటుంబం వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నా పని కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఎవరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా కోరిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా పనులను కేటాయించింది. పనులు కోరిన వారందరికీ జాబ్ కార్డులు జారీ చేసింది. దేశమంతా కోవిడ్తో కకావికలమైన వేళ.. గ్రామాలకు పెద్ద ఎత్తున తరలివచి్చన వారందరికీ భరోసానిచ్చి పనులు కల్పించి ఆదుకుంది. పని దినాల కల్పనలోనూ రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో ఏకంగా 114.82 కోట్ల పని దినాలను కల్పించి రికార్డు సృష్టించింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలను ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలతో పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేర నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్టీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
కప్పం కడితేనే మైనింగ్
రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత.. నాకింత.. అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాథుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా సరే తమ ఆదాయం మాత్రం బాగుండాలనే కూటమి పెద్దల తీరుతో రాష్ట్రంలో మైనింగ్ రంగం అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ గనుల తవ్వకాలు స్తంభించిపోయాయి. తమకు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కప్పం కట్టని గనుల యజమానులపై పది రెట్లకు పైగా జరిమానాలు విధిస్తుండడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. దీంతో మైనింగ్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. మరోవైపు కూటమి నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్య నేత, ఆయన కుమారుడి నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. ఎనిమిది నెలలుగా కూటమి నేతలు జిల్లాల వారీగా క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్ మెటల్, బీచ్ శాండ్, లేటరైట్, బెరైటీస్ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పరం చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. దీనివల్ల ఇప్పటికే రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో అత్యంత డిమాండ్ ఉన్న క్వార్ట్జ్, మైకా తవ్వకాలను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నాయకుడికి అప్పగించారు. ఆ నేత ప్రతి నెలా రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.600 కోట్లు ‘ముఖ్య’ నేతకు కప్పం కట్టాలనే ఒప్పందంతో మొత్తం క్వార్ట్జ్ మైనింగ్ అంతా ఆయన చేతిలో పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమలను పరిశీలించి, అదే తరహాలో తిరుపతి జిల్లా సైదాపురంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా ఇచ్చేందుకు చీకటి ఒప్పందం జరిగినట్లు తెలిసింది.రూ.50 వేల ఖనిజాన్ని రూ.10 వేలకివ్వాలట!ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో దాదాపు 140 ఓపెన్ కాస్ట్, 7 అండర్ గ్రౌండ్ క్వార్ట్జ్ గనులు ఉన్నాయి. వాటిలో తవ్వే ఖనిజాన్ని ఎంపీ చెప్పిన మనుషులకు.. అది కూడా వారు నిర్ణయించిన రేటుకు విక్రయిస్తేనే లీజులను కొనసాగిస్తామంటూ ప్రభుత్వ ‘ముఖ్య’ నేత స్పష్టం చేయడంతో వారు అంగీకరించలేదు. దీంతో తవ్వకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ఖనిజాన్ని విక్రయించే వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తూ, మిగిలిన క్వారీలను నిలిపివేశారు. రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే క్వార్ట్జ్ గనులను చేజిక్కించుకునేందుకు కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలతో మైనింగ్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యే ఈ ఖనిజానికి టన్నుకు కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తానని ఆ ఎంపీ చెబుతుండటంతో మైనింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఖనిజాన్ని చైనాలో టన్ను రూ.50 వేలకు విక్రయించుకుంటూ, తమకు మాత్రం కనీసం మైనింగ్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని రేటును ఇస్తున్నారంటూ పలువురు మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు.కోర్టు ఉత్తర్వులూ బేఖాతరురాజకీయ దురుద్దేశంతో మైనింగ్ అనుమతులు నిలిపి వేయడంపై రాష్ట్రంలోని ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సమర్థించిన కోర్టు నెల రోజుల్లో అన్ని అనుమతులు ఉన్న క్వారీలకు రవాణా ఫారాలను జారీ చేయాలని, పోర్టర్స్ను అన్ బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్య నేత సూచనలతో మైనింగ్ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.రెండు పోర్టుల నుంచి అక్రమంగా ఖనిజ రవాణామరోవైపు లీజులను నిలిపి వేయడంతో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్కు డిమాండ్ పెరగడంతో కూటమి నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడుకుని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన క్వారీ నిర్వాహకులపై అక్రమ మైనింగ్ చేశారని పది రెట్లు జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు నిత్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్ లారీలు పెద్ద ఎత్తున అక్రమ ఖనిజాన్ని చేరవేస్తున్నాయి. చీమకుర్తి తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్ను నిబంధనలకు విరుద్ధంగా పోర్టులకు తరలిస్తున్నారు. అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు, మైనింగ్ అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఇందులో ముఖ్య నేత తనయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. వీటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు అందడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.నిఘా నిర్వీర్యం.. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చెక్పోస్ట్ల వద్ద అక్రమ మైనింగ్ రవాణాను అడ్డుకుంటున్న దాఖలాలే లేవు. విజిలెన్స్ బృందాలను తమ బినామీలకు ఖనిజాన్ని కారుచౌకగా ఇచ్చేందుకు నిరాకరించే వారి పని పట్టడానికే ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడానికే ఈ బృందాలను వాడుకుంటున్నారు. రోడ్ మెటల్, గ్రావెల్, గ్రానైట్, బాల్ క్లే తదితర ఖనిజాల రవాణాపై ఎన్ని ఫిర్యాదులు అందినా.. ఏ మాత్రం పట్టించుకోవద్దని జిల్లాల్లోని అధికారులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలే అక్రమ మైనింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన విషయంలో పార్టీ నేతల మధ్యే విభేదాలు వచ్చి, బజారునపడి రచ్చ చేసుకుంటున్నారు. నూజివీడులో మైనింగ్ దందాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేశారు.వైఎస్ జగన్ హయాంలో పెరిగిన ఆదాయంవైఎస్ జగన్ హయాంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడంతో ఆదాయం భారీగా పెరిగింది. పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడంతో పాటు ఔత్సాహికులు మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో మొదట వచ్చిన వారికే మొదటి అవకాశం (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) విధానం ద్వారా మైనింగ్ లీజులు జారీ చేసేవారు. దీనివల్ల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్లో ఉండడంతో లీజులున్నా, మైనింగ్ చేయకుండా జాప్యం చేసేవారు. గతంలో 4,988 లీజుల్లో 2,826కు మాత్రమే వర్కింగ్ లీజులుండేవి. ఆ విధానాన్ని రద్దు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించడంతో అదనంగా 1,700 లీజులు వర్కింగ్లోకి వచ్చాయి. దీంతో మైనింగ్ ఆదాయం బాగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని లీజులను అనధికారికంగా నిలిపి వేయడంతోపాటు మళ్లీ పాత విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో మైనింగ్ రంగం కుదేలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం రూ.1,950 కోట్లు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణల వల్ల 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆది రూ.4,800 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 వేల కోట్లు రావడమే గగనంగా మారింది.టెక్కలిలో కక్ష సాధింపుగా అడ్డగోలు దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి సోదరుడు గ్రానైట్ క్వారీలపై లేని పోని ఆంక్షలు విధించాడు. అది తట్టుకోలేక టెక్కలి సమీపంలో ఓ గ్రానైట్ క్వారీని మూసి వేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇదే క్వారీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులతో పాటు యజమాని సైతం రోడ్డున పడ్డాడు. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతుండడంతో క్వారీ నిర్వహణ పూర్తిగా నిలిపివేశారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు అధికారులను ఉసిగొలిపి అడ్డగోలుగా విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. దీంతో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో గ్రానైట్ క్రషర్లను నిలిపివేశారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అది తట్టుకోలేక పలువురు క్రషర్లను నిలిపివేశారు. అయితే టీడీపీకి చెందిన కొన్ని క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించక పోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం.. రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గనుల యజమానులు, కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా వేధిస్తున్నారు. ఒకరిద్దరు కూటమి నేతల కన్నుసన్నల్లోనే అనధికారికంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల తీరువల్ల అందరికీ ఇబ్బందులెదురవుతున్నాయి. ఇది చాలా అన్యాయం.– ప్రవీణ్ కుమార్, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాపర్మిట్లు బ్లాక్ చేశారుమైకా గనులను దక్కించుకునేందుకు ఎనిమిది నెలలుగా కూటమి నేతలు పడారని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని గనులకు అనుమతులను మంజూరు చేసినప్పటికీ, నేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకూ మైనింగ్ పరిశ్రమ కుదేలవుతోంది. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.– నాగార్జున, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాఎంతగా సర్దుకుపోతున్నా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రచారం చేసిన వ్యక్తి క్వారీని నిలిపివేశారు. క్వారీలో ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఎందుకు నిలిపివేశారని మైన్స్ అధికారులను అడిగితే దయచేసి తమను ఏమీ అడగొద్దని, పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీంతో గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డంపింగ్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎంతగా సర్దుకుపోతున్నా ఇక్కట్లు తప్పడం లేదు. – క్వారీ యజమానులు, ప్రకాశం జిల్లా -
వల్లభనేని వంశీ అరెస్టు.. 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్/పటమట/కృష్ణలంక (విజయవాడ తూర్పు)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం): కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఉదయం ఏడు గంటలకు అయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకుముందు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు. రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకెళ్లి వంశీకి బీఎన్ఎస్ 47 (1) నోటీసును అందించి ఉన్నపళంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్స్టేషన్లో ఉంచి, అనంతరం కృష్ణలంక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె. దామోదరరావుతోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి. రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్ (35), కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతి (35)లను కూడా పటమట పోలీసులు గురువారం రాత్రి అరెస్టుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం.. వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా..ఇక రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోందనడానికి వంశీ అరెస్టే ఉదాహరణ. ఎందుకంటే.. ఏకంగా న్యాయమూర్తి ఎదుట స్వచ్ఛందంగా 164 సీఆర్పీసీ కింద నమోదుచేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసులకు టీడీపీ కూటమి సర్కారు తెగిస్తోంది. అసలు వంశీపై అక్రమ కేసుకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్న గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ఫిర్యాదే అబద్ధమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని.. అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్థన్ సాక్షాత్తూ న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. వంశీ తనను బెదిరించనేలేదని.. తనపై దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించి తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇది అవమానంగా భావించి ఎలాగైనా వంశీని అరెస్టుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సుదీర్ఘ చర్చల అనంతరం సత్యవర్థన్ కిడ్నాప్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పోలీసులు సైతం కోర్టులోని పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్బుక్ కుట్రనే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సత్యవర్థన్ తమ్ముడు కిరణ్పై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలతో మరో అబద్ధపు ఫిర్యాదును ఈ నెల 12న ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు తదితరులు తన సోదరుడిని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునేలా బెదిరించి, భయపెట్టారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పటమట పోలీసులు వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. అంటే.. తమకు అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది వంశీ అరెస్టు ద్వారా స్పష్టమవుతోంది.కాగా, వంశీ అరెస్టుపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్లో గురువారం హైడ్రామా నడిచింది. హైదరాబాదు నుంచి వంశీని పటమట స్టేషన్కు తీసుకొస్తారని పోలీసులు లీకులు ఇవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. చివరికి భవానీపురం స్టేషన్కు, అక్కడ వంశీని కారుమార్చి కృష్ణలంక పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో రైటర్, ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాలను రహస్యంగా తరలించారు. వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు వల్లభనేని వంశీకి రిమాండ్..14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారి చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్థన్ స్టేట్మెంట్ రికార్డు..మరోవైపు ముదునూరు సత్యవర్థన్ గురువారం సాయంత్రం పటమట పోలీస్స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పోలీసులు రహస్యంగా స్టేషన్లో ఉంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో సత్యవర్థన్ స్టేట్మెంట్ను రికార్డు చేయటం చర్చనీయాంశంగా మారింది.మాజీమంత్రి పేర్ని నాని హౌస్ అరెస్టు..వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని పోలీసులు గురువారం హౌస్ అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బయటికెళ్లేందుకు వీల్లేదని నోటీసులిచ్చారు.ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే లీగల్గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను. – పంకజశ్రీ, వంశీ సతీమణిచంద్రబాబు ఒత్తిడితోనే వంశీ అక్రమ అరెస్టుమాజీ మంత్రి అంబటిసీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వంశీ అక్రమ అరెస్టు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపై డీజీపీ హరీష్కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అంబటి రాంబాబు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం గురువారం అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అయినా డీజీపీ కలవలేదు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ తాను ఆ ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం తీసుకొని, దానితో వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ కుతంత్రాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ అతని సోదరుడితో ఫిర్యాదు చేయించారని తెలిపారు. వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైనా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.తప్పుడు కేసులతో వంశీపై కక్షసాధింపువల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం ఒక నిదర్శనం. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి. – మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేఅరెస్టు చేయొద్దని కోర్టు చెప్పినా..వల్లభనేని వంశీని అరెస్టుచెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు వాటిని ధిక్కరించి మరీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పిచ్చి భ్రమల్లో నుంచి కూటమి నాయకులు బయటకు రావాలి. నియంత పాలన ఎంతోకాలం సాగదు. అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. – జూపూడి ప్రభాకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితప్పుడు ఫిర్యాదు చేయించి..ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోంది. వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వంశీ కేసు పూర్తిగా నీరుగారిపోతోందని చంద్రబాబు, లోకేశ్ కక్షపూరితంగా సత్యవర్థన్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వారితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఇలాంటి దుర్మార్గ విధానాలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా? – వేల్పుల రవికుమార్,వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
కార్యకర్తలకు అన్నలా ఉంటా..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రజలకు తోడుగా.. కార్యకర్తలకు అండగాజగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది. తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్లో 49 స్థానాలుంటే వైఎస్సార్సీపీ 48 గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసుల ద్వారా వాళ్లే అడ్డుకుంటారు. వాళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్లీ ఎన్నికల్లో మావాడు గెలిచాడని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్సార్సీపీకి రాగా టీడీపీకి వచ్చింది కేవలం 3 మాత్రమే. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్సార్సీపీవే. ఇక హిందూపురం మున్సిపాల్టీలో 38 డివిజన్లు ఉంటే వైఎస్సార్సీపీకి 29 వచ్చాయి. టీడీపీకి 6 మాత్రమే వస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అక్కడ తమకు పీఠం దక్కిందని అదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. పాలకొండలో 20 స్థానాలకు 17 వైఎస్సార్సీపీవే. టీడీపీకి మూడు మాత్రమే ఉన్నాయి. అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు 33 వైఎస్సార్సీపీవే. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్సార్సీపీ, ఏడు టీడీపీవి. నందిగామ మున్సిపాల్టీలో కూడా వైఎస్సార్సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్థానాలు వైఎస్సార్సీపీవే. అవిశ్వాసం పెట్టి మేయర్ను దించేస్తామని చెబుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్థానాలు వాళ్లకు... 18 స్థానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు. ప్రజాస్వామం గెలవాలి... ఈరోజు టీడీపీ చేస్తున్నదేమిటి? ఇదా ప్రజాస్వామ్యం? అని అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు అవసరం. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ఇదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.స్కాములు మినహా పాలన ఏది?స్కాములు మినహా ఈ ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. ముఖ్యమంత్రిగా పాలన సాగించేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే... చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలో ఉంటూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్. ఓ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి! ప్రతి నియోజకర్గంలోనూ యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తమ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిపై టెర్రరిస్టుల మాదిరిగా వ్యవస్థీకృత నేర చట్టాల కింద కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. వివిధ స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ చంద్రబాబు మర్చిపోతున్న విషయం ఏమిటంటే... ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. -
చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్
ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్.. ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం.. ముఖ్యమంత్రి మారాడు..! వైఎస్సార్సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది..! అంతే తేడా...! ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకం మోసం.. అబద్ధం! కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ఎన్నికల ప్రచారంలో.. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు బటన్ ఎలా నొక్కాలో తన చెవిలో చెప్పమంటున్నారు. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా?.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మీరూ, మేమూ.. మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకెళదాం..’ అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చరిత్రను మార్చిన జగన్ 1.0 పాలన..2019–2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే.. చక్కటి అబద్ధాలను రంగు రంగుల కాగితాల్లో ముద్రించి ఎన్నికల్లో పంచడం..! ఎన్నికలు అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం..! అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసి మొక్కలా వ్యవస్థను మార్చిన పాలన కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మేనిఫెస్టోను కేవలం రెండు పేజీలకు కుదించి.. అది మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఎంవో, ప్రతి మంత్రి కార్యాలయంలో, ప్రతి కలెక్టర్ కార్యాలయంలోనూ కనిపించేలా ఏర్పాటు చేశాం.బడ్జెట్తోపాటే సంక్షేమ క్యాలెండర్..సంక్షేమ క్యాలండర్ను కూడా బడ్జెట్తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి.. అలా చెప్పిన తేదీకి బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన పార్టీ హయాంలోనే జరిగింది. అంతగా వ్యవస్థలో మార్పులు చేశాం. గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే... 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నానుడిని మార్చి.. లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్ ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నా.. ఆదాయాలు తగ్గినా.. అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజూ సాకులు వెతకలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాం. హామీల అమలుతో పాటు అభివృద్ధి..ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కూడా చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు – నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైంది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ స్కూళ్ల ప్రయాణం మొదలైంది. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ క్లాసులు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన అందించాం. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందచేశాం. ఇవన్నీ రావడంతో ప్రైవేట్ స్కూళ్లు.. ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చదువుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.వైద్యంలోనూ ఊహకందని మార్పులు..తొలిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చేశాం. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా బలోపేతం చేశాం. డబ్ల్యూహెచ్వో, జీఎంపీ ప్రమాణాలు గల ఔషధాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రొసీజర్లను వెయ్యి నుంచి ఏకంగా 3,300 వరకు తీసుకెళ్లడంతోపాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం.రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం..గతంలో మనకు 50 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్ 40 శాతం ఉంది. 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం.. మీ జగన్ ఆ రోజు వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడమే. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్ లీడర్ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో ముద్ర వేయగలిగాడు. మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. 2019–24 మధ్య మన పాలనను ప్రజలు చూశారు. ఇవాళ చంద్రబాబు పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా అబద్ధాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మరి ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం ప్రజల ఓటుతో బంగాళాఖాతంలోకో ఇంకా అథఃపాతాళానికో పోతారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతాడు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగుతారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ, ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా... చిన్నపిల్లలు తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి.. మరి మా రూ.48 వేలు పెన్షన్ డబ్బులు ఎక్కడని ప్రశ్నిస్తారు. ఆ ఇంట్లో రైతులు అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన నా రూ.36 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.రైతును చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు..గ్రామాల్లో ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతన్నలకు తోడుగా నిలిచాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను అసిస్టెంట్గా నియమించి రైతులను చేయి పట్టుకుని నడిపించేలా చర్యలు తీసుకున్నాం. తొలిసారిగా ఇ–క్రాప్ ద్వారా ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. రైతులందరికీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర దక్కేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవస్థను తొలగించాం. ఇవన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. అదే సచివాలయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ ఇంటికే వచ్చి పారదర్శకంగా సేవలు అందించారు.బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు తాము సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. -
రెడ్బుక్ కుట్రతో.. గాడి తప్పిన పోలీసింగ్
సాక్షి, అమరావతి: ⇒ విజయవాడ వరదల్లో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగినంత మంది పోలీసుఅధికారులనువినియోగించని ప్రభుత్వం ఫలితం.. దాదాపు 50మంది దుర్మరణం ⇒ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీని పర్యవేక్షించేందుకు తిరుపతిలో తగినంత మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించని ప్రభుత్వం.. ఫలితం.. తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల మృతి ⇒ సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నా సైబర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేయని ప్రభుత్వం ఫలితం.. గత ఏడాదిలో ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాలు ⇒ ఇక రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, లైంగిక దాడులు అంతులేకుండా సాగిపోతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఫల్యాలకు అంతన్నదే లేదు. రాష్ట్రంలో పోలీసింగ్ అన్నదే కనిపించకుండా పోయింది. శాంతిభద్రతలు దిగజారిపోయాయి. అయినా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో సమర్ధులైన పోలీసు అధికారులు తగినంత మంది లేరా? లేకేం.. ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం. ఇది నిఖార్సైన నిజం. ఎందుకంటే.. అధికారులపై రెడ్బుక్ కక్ష. సీనియర్ ఐపీఎస్ల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అనేక మంది పోలీసు సిబ్బందిపై రెడ్బుక్ కక్ష. డజన్ల కొద్దీ అధికారులను వెయిటింగ్లో, వేకెన్సీ రిజర్వ్లోనో లేదంటే సస్పెన్షన్లోనే పెట్టేసి, చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేస్తోంది. శాంతి భద్రతలు దిగజారుతున్నా, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, మహిళలపై అత్యాచారలు పెచ్చుమీరిపోయినా, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయినా, సామాన్యుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెడ్బుక్ రాజ్యాంగం అమలులో మునిగిపోయి, అధికారులందరినీ పక్కన పెట్టేసింది. ‘వెయిటింగ్’లో పెట్టు...‘వీఆర్’లో ఉంచూ వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ (వీఆర్).. ఈ రెండు పదాల మధ్యే ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అత్యధిక మంది పోలీసు అధికారులకు టీడీపీ కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఐదుగురు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్లో ఉంచి, మరో నలుగురు ఐపీఎస్ అధికారులను కక్ష పూరితంగా సస్పెండ్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం అంతటితో ఆగ లేదు. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్లోనే ఉంచింది. పరిపాలన పరమైన అంశాలతో నలుగురైదురుగురికి స్వల్ప కాలం వెయిటింగ్లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించి వారి సేవలను సది్వనియోగం చేసుకోవడం రివాజు. కానీ ఈ సంప్రదాయాలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసి, వారందరినీ పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. వారిలో నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, ఒక ఏఆర్ డీఎస్పీ ఉన్నారు. – ఇక శాంతి–భద్రతల పరిరక్షణ, ఇతర పోలీసు విధుల్లో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారులపట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దురీ్నతి ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్లో ఉంచడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు రేంజ్లో 28 మంది, కర్నూలు రేంజ్లో 21 మంది, ఏలూరు రేంజ్లో 24 మంది, విశాఖపట్నం రేంజ్లో 17 మంది సీఐలను ‘వీఆర్’లో పెట్టింది. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్సైలను ‘వీఆర్’లో ఉంచింది. దీంతో పని చేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అమాంతంగా పెరిగిన నేరాలు– ఘోరాలు అధికారులపై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్లో, వీఆర్లో పెట్టడంతో పోలీసు వ్యవస్థ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేకపోతోంది. దాంతో శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. 2024లో సైబర్ నేరాలపై ఏకంగా 7.23లక్షల ఫిర్యాదులు వచ్చినా పోలీసు వ్యవస్థ సత్వరం స్పందించలేకపోయింది. దాంతో సైబర్ ముఠాలు సామాన్యుల నుంచి ఏకంగా రూ.1,229 కోట్లు కొల్లగొట్టాయి. రాష్ట్రంలో 17,282 దోపిడీలు, దొంగతనాలు జరిగినా ఆ కేసులను పోలీసు శాఖ ఛేదించలేకపోతోంది. రోడ్డు ప్రమదాలు భారీగా పెరుగుతున్నా రహదారి భద్రతకు తగినంత మంది పోలీసులకు నియోగించలేకపోతోంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ కక్ష రాజకీయాలకే పరిమితమవుతూ ప్రజల భద్రతను గాలికొదిలేసింది. -
స్కామ్ల కోసం సంపద సేల్.. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే
చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కమీషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నవరత్నాలతో ప్రజలకు మేలు చేయడంతోపాటు ఆర్ధిక క్రమశిక్షణతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తే.. తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కారు ఆర్ధిక విధ్వంసం, స్కామ్ల కోసం సంపదను తెగనమ్ముతోందని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS JaganMohanReddy) విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకుని జేబులు నింపుకోవటమేనని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరగని స్కామ్ అంటూ లేదని దుయ్యబట్టారు. తొమ్మిది నెలల పాలనలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసకారుడా? లేక కోవిడ్లోనూ వృద్ధి రేటులో దేశంతో పోటీ పడి ఉత్తమ పని తీరు, మెరుగైన వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, సామాజిక సేవలపై వ్యయం, మూలధన వ్యయంలో పెరుగుదల నమోదు చేసిన తాము విధ్వంసం సృష్టించినట్లా? అని ప్రశ్నించారు. పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చిన తమ ప్రభుత్వం సంపద సృష్టించినట్లా? లేక ఇసుక నుంచి మద్యం దాకా పచ్చముఠాల దోపిడీకి పచ్చజెండా ఊపిన టీడీపీ సర్కారు సంపద సృష్టించినట్లా? అని నిలదీశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన తాము సంపద సృష్టించినట్లా? లేక వాటికి అడ్డుపడి ప్రైవేట్కు అప్పగించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు సంపద సృష్టికర్తా? అని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తొలగించి జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్లతో పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన తాము ఆర్థిక విధ్వంసకారులమా? తిరిగి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్న చంద్రబాబు ఆర్ధిక విధ్వంసకారుడా? అని ప్రశ్నించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిది నెలలుగా టీడీపీ కూటమి సర్కారు అరాచకాలు, హామీల ఎగవేత, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దుష్ఫ్రచారాలను కాగ్, కేంద్ర ఆర్ధిక సంఘం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదికల ఆధారంగా ఎండగట్టి కడిగి పారేశారు.అప్పుల్లో ఆల్టైమ్ రికార్డు⇒ తొమ్మిది నెలల పాలనలో అప్పుల విషయంలో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్ధలు కొట్టారు. బహుశ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.80,827 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తెచ్చే అప్పులు కలిపి మరో రూ.52 వేల కోట్లు ఉంటాయి. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, సీఆర్డీఏ ద్వారా చేయాలని నిర్ణయించిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు ఉంటాయి. మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా తేనున్న అప్పులు మరో రూ.5 వేల కోట్లు..! తీసుకొచ్చిన అప్పులు, తేనున్న అప్పులు కలిపితే రూ.1.45 లక్షల కోట్ల పైమాటే. ఇదొక రికార్డు. దీన్ని ఎవరూ బద్ధలు కొట్టలేరు.⇒ ఈ మధ్య నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు ఆడిన కొత్త డ్రామాలు మీరు చూసే ఉంటారు. ఏదైనా పోల్చినప్పుడు తన ఐదేళ్ల పాలనను, మన ఐదేళ్ల పాలనతో పోల్చి వాస్తవాలివీ అని చెప్పేలా ఉండాలి. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే.. తన పాలనలో బెస్ట్ ఇయర్ (2018–19)లో వచ్చిన ఫలితాలను మన హయాంలో వరస్ట్ ఇయర్ (2022–23)తో కంపేర్ చేస్తూ రాష్ట్రం చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చూపించారు. చంద్రబాబు ఐదేళ్ల డేటా.. మన హయాంలో ఐదేళ్ల డేటాను పరిశీలించి ఎవరు ఆర్ధిక విధ్వంసం చేశారో మీరే చూడండి. మా హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. కానీ చంద్రబాబు హయాంలో ఎలాంటి కోవిడ్లు లేవు.. మహమ్మారులూ లేవు. ⇒ ఏపీ ఎవరి హయాంలో వేగంగా అడుగులు వేసిందో చెప్పేందుకు జీడీపీ (దేశీయ స్థూల ఉత్పత్తి)లో రాష్ట్ర వాటా ఎంత అన్నది కూడా ప్రామాణికం. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో 2014–19లో కేవలం 4.47 శాతం కాగా వైఎస్సార్సీపీ హయాంలో 2019–24లో ఆ వాటా 4.80 శాతానికి పెరిగింది. ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది? ఎవరి హయాంలో వృద్ధి పరుగులు తీసింది? అనేది చెప్పేందుకు ఇదొక నిదర్శనం. ⇒ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఇచ్చిన నివేదికతో మరో ఆధారాన్ని చూపిస్తా. చంద్రబాబు దిగిపోయే నాటికి 2018–19లో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంది. అదే వైఎస్సార్సీపీ హయాంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం 2022–23లో 15వ స్థానానికి ఎగబాకింది. మరి ఎవరి హయాంలో ఆరి్ధక విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ⇒ వృద్ధి రేటులో మా ప్రభుత్వ హయాంలో 2019–24లో దేశంతో పోటీ పడ్డాం. ప్రతి రంగంలో దేశం కంటే రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధించింది. దేశ జీడీపీ 2019–24లో 9.34 శాతం కాగా రాష్ట్రం ఏకంగా 10.23 శాతంతో మెరుగైన పనితీరు కనబరిచింది. ⇒ పారిశ్రామిక రంగం జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) ర్యాంకింగ్ పరిశీలిస్తే చంద్రబాబు దిగిపోయేనాటికి మన రాష్ట్రం 11 స్థానంలో ఉంటే.. 2023–24లో మా ప్రభుత్వం వైదొలిగే నాటికి 9 స్థానానికి ఎగబాకాం. రెండున్నరేళ్లు కోవిడ్ ఉన్నా సరే.. మంచి పనితీరు కనబరిచాం. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? టీడీపీ హయాంలో 2014–19 మధ్య ఆస్తుల కల్పనలో భాగంగా సగటు మూలధన వ్యయం రూ.13,860 కోట్లు ఖర్చు చేస్తే.. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మూలధన వ్యయం కింద రూ.15,632 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు చెప్పండి. ఎవరి హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగింది? ఇక చంద్రబాబు సామాజిక సేవల కింద ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించారు. 2018–19లో సోషల్ సర్వీస్ కింద ఆయన రూ.2,866.11 కోట్లు ఖర్చు చేస్తే.. 2022–23లో రూ.447.78 కోట్లు మాత్రమే వ్యయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ 2014–19 మధ్య ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.2,437 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో దానికి రెట్టింపు.. రూ.5,224 కోట్లు వ్యయం చేశాం. ఇవన్నీ మూలధన వ్యయంలో సోషల్ సర్వీస్ కింద ఖర్చులపై కాగ్ నివేదిక తేల్చిన లెక్కలు. ఒక్క ఏడాదిని మాత్రమే తీసుకుని పోల్చుకోవడం చంద్రబాబు మనస్థత్వానికి, వక్రీకరణలకు అద్దం పడుతోంది. ఏ రకంగా చూసుకున్నా సరే.. మా హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా ముందడుగు వేసింది.ఆర్ధిక అరాచకం..⇒ 2014–19లో టీడీపీ హయాంలో రాష్ట్రం కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43 శాతం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్డీపీ పెరుగుదల 13.46 శాతం. అంటే చంద్రబాబు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే డెట్ సస్టెయినబులిటీ ఎక్కువగా ఉంది. ⇒ 2019–24లో దేశం పరిస్థితిని గమనిస్తే వడ్డీలకు సంబంధించి వృద్ధిరేటు సీఏజీఆర్ 12.80 శాతమైతే.. జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం ఉంది. దేశం జీరో డెట్ సస్టయినబులిటికీ వెళ్లిపోయింది. రాష్ట్రంలో వడ్డీల వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 15.43 శాతం ఉంటే దాన్ని 13.92 శాతానికి తగ్గించగలిగాం. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పడు. ఇక జీడీపీ వృద్ధి రేటు 9.34 శాతం ఉంటే మా హయాంలో మన రాష్ట్రం దేశం కంటే మెరుగ్గా 10.23 శాతం గ్రోత్ నమోదు చేసింది. అక్కడ కూడా మనం ప్లస్లోనే ఉన్నాం. ఇవన్నీ దాచిపెట్టి వడ్డీల పెరుగుదల రేటు 13.92 శాతం.. ఏపీ జీఎస్డీపీ 10.23 శాతం అని చెబుతూ రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ గమనిస్తే చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏ స్థాయిలో విధ్వంసమైందన్నది స్పష్టంగా తెలుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రాన్ని చేయిపట్టుకొని నడిపించే కార్యక్రమం జరిగినట్లు విస్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే.. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ఊదరగొట్టారు. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని బండలు వేశాడు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి రాష్ట్రం అప్పులు రూ.10 లక్షలు కోట్లు అని చెప్పారు. శ్వేత పత్రాలు విడుదల చేసే సమయంలో రూ.12.93 లక్షల కోట్లన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు చెప్పాల్సి వస్తుందని వాయిదా వేస్తూ వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రం అప్పులు రూ.6,46,531 కోట్లు మాత్రమే అని తనంతట తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంత దారుణమైన మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటారు. వీటిని ప్రజలు గమనించాలి. ⇒ ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రాష్ట్ర జీఎస్డీపీలో 3 నుంచి 3.5 శాతం అప్పులు చేయవచ్చని కేంద్రం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే ఎవరైనా తీసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు పాలనలో 2014–19లో ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి రూ.31,082 కోట్లు అదనంగా అప్పులు చేశారు. ఆయన తీసుకున్న అదనపు అప్పులతో రూ.17 వేల కోట్లు మా ప్రభుత్వ హయాంలో కోత పెట్టారు. ⇒ చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. 2023–24లో జూన్–డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.50,804 కోట్లు అయితే.. 2024 జూన్ నుంచి డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.50,544 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 10 శాతం ఆదాయం పెరగడం సాధారణం. అలాంటిది చంద్రబాబు హయాంలో 0.5 శాతం తగ్గింది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు చంద్రబాబు, వారి మనుషులు జేబుల్లోకి పోతున్నాయి!⇒ వృద్ధి రేటు తిరోగమనంలో (నెగిటివ్ గ్రోత్) ఉన్నప్పుడు జీఎస్డీపీలో పెరుగుదల ఉంటుందా? రెవెన్యూ గ్రోత్ తగ్గినప్పుడు జీఎస్డీపీ తగ్గాలి కదా! కానీ చంద్రబాబు తన హయాంలో 13 శాతం పెరిగినట్టు రిపోర్టు ఇచ్చారు. ఆయన ఏ స్థాయిలో అబద్ధాలాడుతున్నారో దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబుకు కొత్తేమి కాదు.⇒ 2016లో చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఏపీకి రక్షణ పరికరాల ప్లాంట్ వస్తుందన్నారు. 2017లో వెళ్లినప్పుడు విశాఖపటా్ననికి హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రీడ్ క్లౌడ్ వస్తుందన్నారు. సౌదీ ఆరాంకో వచ్చేస్తుందన్నారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయన్నారు. ఇంకా ఎయిర్ బస్, అలీబాబా ఏపీకి వస్తున్నాయన్నారు. 2019 జనవరిలో వెళ్లినప్పుడు ఏపీకి జెన్ ప్యాక్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు(ఈనాడు కథనాల క్లిప్పింగ్లను ప్రదర్శించారు). ఇదంతా దొంగల ముఠా.. దోచుకో పంచుకో తినుకో విధానం. ఇలా బిల్డప్లు, అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదు. ⇒ చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేకపోయారంటే ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న పలుకుబడి.. చంద్రబాబు పట్ల పారిశ్రామికవేత్తల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొందో చెప్పేందుకు నిదర్శనం. పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే.. వాళ్లపై కేసులు పెట్టి, వాళ్ల ప్రతిష్టను నాశనం చేసి భయపెట్టి వెళ్లగొట్టాడు. దీంతో అదే దావోస్లో వాళ్లు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. సంపద సృష్టించిందెవరు?⇒ రాష్ట్రం ఆదాయాలు పెరిగేలా వైఎస్సార్సీపీ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ప్రభుత్వ రంగంలో చేపట్టాం. రామాయపట్నం 75–80 శాతం పూర్తయింది. మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో 35–40 శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి. 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మా హయాంలో కొన్ని ప్రారంభోత్సవం కూడా చేశాం. వీటి ద్వారా కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ సంపద సృష్టించబడుతుంది. రాష్ట్రానికి సొంత రాబడి పెరగాలంటే ఇలాంటిæ ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ టైఅప్ అయిన ప్రాజెక్టులు వీటి నిర్మాణానికి నిధుల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. డబ్బులొచ్చి మేరిటైం బోర్డు అకౌంట్లో ఉన్నాయి. డబ్బులు డ్రా చేస్తూ కంప్లీట్ చేస్తే చాలు. ఈపాటికే రామాయపట్నానికి ప్రారంభోత్సవం చేయవచ్చు. మిగిలినవి ఒకటి రెండేళ్లలో పూర్తి చేయొచ్చు. అలాంటిది వీటిని అడ్డం పెట్టుకొని స్కామ్లు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ⇒ మా హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటిలో ఐదు కాలేజీలను మా హయాంలోనే ప్రారంభిస్తే ఈ విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మరో 5 కొత్త కళాశాలలను అడ్డుకుని తమవారికి ప్రైవేట్కు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ⇒ వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇలాంటప్పుడు ఎవరైనా సాధ్యమైనన్ని సీట్లు తమ రాష్ట్రానికి రావాలని ఆరాటపడతారు. కానీ మన రాష్ట్రానికి ఇస్తామన్న మెడికల్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా స్కామ్ల కోసం ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. సంపద సృష్టి అంటే బాబు జేబు నింపుకోవడమా? చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకోవడం! ఈ ప్రభుత్వ హయాంలో జరగని స్కామ్ అంటూ లేదు. గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు పైగా గతంలో కంటే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరుగుతోంది! రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆవిరవుతోంది. ⇒ ఇక లిక్కర్ స్కామ్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు పరం చేసారు. ఇవే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు. చంద్రబాబు తమ ప్రభుత్వంలో స్కామ్లు చేస్తూ అక్కడకు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ను తిట్టి వస్తాడు. మద్యం షాపులను ప్రైవేౖటుపరం చేసాడు. తనవారికి షాపులు ఇప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలతో ఎలా కిడ్నాప్లు చేయించారో చూశాం. తన పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు. లాటరీలో కూడా తమ వాళ్లకే షాపులు దక్కేలా చేసుకున్నారు. వేరే వాళ్లు పాల్గొనకుండా పోలీసులు సమక్షంలో చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు తమ కార్యకర్తలకు కట్టబెట్టారు. వీటిని పాడుకున్న వారికి పోలీసుల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరు. అదే ప్రభుత్వ రంగంలో షాపులుంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం మాత్రం పెరుగుతోంది. ⇒ ఇసుక, మద్యం, సిలికా, క్వార్జ్, ఫ్లైయాష్.. ప్రతిదీ మాఫియానే. అన్నీ పెదబాబు, చినబాబు ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్లు..! మండల, గ్రామ స్థాయిలో కూడా నడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేలకు అడిగినంత ముట్టజెప్పాల్సిందే! ఎమ్మెల్యేలు దండుకున్న సొమ్ములో పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి వాటాలు పంపితే అంతా సాఫీగా జరుగుతుంది. ⇒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు 10 శాతం చెల్లించి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మేం పారదర్శకంగా అమలు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్ల విధానాన్ని రద్దు చేశారు. ఫలితంగా సంపద సృష్టి జరగక ప్రభుత్వ ఆదాయం ఆవిరైపోతోంది. తమ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బెదిరిస్తున్నారు. నాడు నవరత్నాలు.. నేడు విధ్వంసాలు..⇒ పిల్లలను బడులకు పంపేలా తల్లులకు చేయూతనిస్తూ మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ, మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణను తొలగించి పిల్లలను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు దూరం చేశారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ సబ్జెక్ట్ టీచర్ విధానానికి గ్రహణం పట్టించారు. వసతి దీవెన పథకాన్ని రద్దు చేసి, విద్యా దీవెన పథకాన్ని అరకొరగా విదిలిస్తున్నారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసి ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఆరోగ్యశ్రీ ఊపిరి తీశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఈ రోజు పేదలు అనారోగ్యం బారినపడితే అప్పులపాలు అయ్యే దుస్థితి కల్పించారు. ఇది విధ్వంసం కాదా? ⇒ రైతు భరోసాను నిలిపి వేయడం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం, ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ⇒ అక్కచెల్లెమ్మలను చేయి పట్టి నడిపించే ఆసరా, సున్నా వడ్డీ, ఈబీసీ, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ రద్దు చేసి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు. ఇది విధ్వంసం కాదా?⇒ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు లాంటి పథకాలను నిలిపివేసి పేదలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న వాటినే ఊడగొట్టారు. వలంటీర్లను రోడ్డుకు ఈడ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం విధ్వంసం కాదా? ⇒ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా సొంత జేబులో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇసుక, మద్యం, క్వార్ట్జ్, సిలికా లాంటి వనరులను దోచేస్తున్నారు. ఇది విధ్వంసం కాదా? -
జగన్ 2.0: కార్యకర్తల కోసం.. ఎలా పని చేస్తానో చూపిస్తా
వరుసగా రెండేళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలూ తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘మన ప్రభుత్వ పాలనతో చంద్రబాబు సర్కార్ పరిపాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారు.. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు.. మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. మరి చంద్రబాబు అదే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ విజయం సాధించడం తథ్యం.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయం. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy)స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్ధ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ‘ఒక్కటే గుర్తు పెట్టుకోండి.. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్నదే నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి.. ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నామీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రినయ్యా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం. మీకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తు పెట్టుకోండి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్థ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులుదృఢంగా నిలబడినందుకు గర్వపడుతున్నా..విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలు ఉంటే అప్పట్లో మనం 49 గెలిచాం. టీడీపీకి వచ్చిన స్థానాలు కేవలం 14. కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 36 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పేందుకు గర్వపడుతున్నా. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏవి తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత వాటికి ఎన్నికలు జరిగితే మన పార్టీ క్లీన్స్వీప్ చేయగలిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. ప్రతి నెలా ఏ పథకాన్ని అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి ఏటా క్రమం తప్పకుండా, ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం..వైఎస్సార్సీపీ విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకూ ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వ్యవహరించాం. ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా ఈ రోజుకు కూడా గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల మధ్య నిలబడి సమస్యలను వినగలుగుతాం. వారితో మమేకం కాగలుతాం. కారణం.. మనం ప్రజలకు మంచే చేశాం. ఏరోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో.. అది చేసి చూపించిన తర్వాత వాళ్లను ఓట్లు అడిగాం. కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.నిలదీస్తారన్న భయంతోనే రెడ్బుక్ రాజ్యాంగం..ఎన్నికలు జరిగి 9 నెలలు కూడా తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే మొదలు.. కార్యకర్త వరకు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం.. ఏ గడపకు వెళ్లినా ఎన్నికల ముందు వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు గురించి ప్రజలు నిలదీస్తున్నారు. తల్లికి వందనం కింద తమకిస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఆ ఇంట్లో 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు తమకిస్తామన్న రూ.48 వేలు ఏమయ్యాయని అడుగుతున్నారు. అదే ఇంట్లో 20 ఏళ్ల యువకుడు తమకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.36 వేల గురించి నిలదీస్తున్నాడు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళితే అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సంగతేమిటని కండువా వేసుకున్న రైతన్నలు నిలదీస్తున్నారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు తాము చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నారు. అదే మాట గుర్తు చేస్తూ.. ఈరోజు ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని భయపడి రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.ఆ రోజే చెప్పా.. అదే జరిగిందిఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత.. ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పా. ‘చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..! చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే..!’ అని చెప్పా. మన మేనిఫెస్టో, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు ఆ పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు.చేసేదే చెప్పాం.. చెప్పిందే చేశాంరాష్ట్ర బడ్జెట్ ఇదీ.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవీ.. వీటికింత ఖర్చవుతుంది అని నాడు మనం చెప్పాం. మరోవైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నారు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసం.. అని వివరిస్తూ మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాం. ఆరోజు మన ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లా హామీలు ఇద్దామన్నారు. కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పా. ఓడిపోయాం.. ఫరవాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం.. అదీ ఫర్వాలేదు. మళ్లీ అదే రోజుకు వెనక్కి వెళ్లినా కూడా ఇదే విధంగానే మరలా చెబుతాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్ధం అదే! జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్సీపీ మళ్లీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతోంది.ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా. వారి కోసమే నా టైం కేటాయించా. ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా. కార్యకర్తల బాధలను గమనించా. వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు.- వైఎస్ జగన్ ‘‘జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. నాడుృనేడుతో స్కూళ్లు బాగుపడటమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ పాఠశాలల ప్రయాణం మొదలైంది. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది డిజిటలైజ్ అయింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు కనిపించేవి. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్ధితిని రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొదటిసారిగా గవర్నమెంట్ బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి..’’- వైఎస్ జగన్ పాలన పోలుస్తున్నారు.. ప్రజలే తేల్చేస్తారుఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే.. రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక ముందు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్భందీగా జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి పిల్లలను చదివించేలా ప్రోత్సహించాం. వారు ప్రపంచంతో పోటీ పడాలని, ఎంతో ఎదగాలని తపిస్తూ చదువుల్లో సమూల మార్పులు తెచ్చిన పరిస్థితి మన పాలనలో కనిపిస్తే.. ఇప్పుడు 9 నెలల్లోనే ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైంది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే.. నాడు–నేడు పాయె... అమ్మఒడి పాయే... ఇంగ్లీషు మీడియం పాయే... ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే... ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం పాయే... మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ కూడా పాయే..! ఇక వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశా.. 70% బడుల్లో 70 మంది పిల్లలు కూడా లేరు అని రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.ప్రజారోగ్యానికి భరోసా కరువు..పేదవాడికి ఆరోగ్యం బాగా లేకుంటే వారి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారైంది. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్థితి లేదు.అదే మన ప్రభుత్వంలో ఉచితంగా వైద్యం అందించడంతోపాటు ప్రొసీజర్లు వెయ్యి నుంచి ఏకంగా 3,300కి పెంచాం. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రులను 900 నుంచి 2,400కి పెంచాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత పరిపాటే అనే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేశాం. మొదటిసారిగా గవర్నమెంటు ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే మందులు దొరకని దుస్ధితి నుంచి.. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలు మాత్రమే లభించేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్ సీపీదే. రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. 105 రకాల మందులు సరఫరా చేస్తూ 24 గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అక్కడే నిర్వహించేలా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. తొలిసారిగా పీహెచ్సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలో ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్లో గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూశాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి నెలలో కనీసం రెండు రోజులు అక్కడకు వెళ్లేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెఫ్ట్ను అందుబాటులోకి తెచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభత్వమే. కనీవీని ఎరుగని విధంగా తొలిసారిగా ప్రివెంటివ్ కేర్ కూడా వైఎస్సార్ సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయాయి. విలేజ్ క్లినిక్లు పని చేయడం లేదు. పీహెచ్సీలు కూడా పని చేయడం లేదు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బిల్లులను చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పేదలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ఇదీ.. మన ప్రభుత్వానికి, వీళ్ల ప్రభుత్వానికి మధ్య తేడా!అన్ని వ్యవస్థలు నిర్వీర్యం..తొలిసారిగా రైతుల కోసం ఆర్బీకేలు తేవడం.. ఇ–క్రాప్.. దళారీ వ్యవస్థను తొలగించి ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోలు చేయడం.. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ద్వారా వ్యవస్ధను మార్చడం.. ఇలా మనం చేపట్టిన చర్యలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాశనం అయ్యాయి. నాడు గ్రామాల్లో సచివాలయాలను నెలకొల్పి ఎవరెవరు ఎలాంటి పౌర సేవలు అందించాలో నిర్ణయించాం. ప్రతి 50–60 ఇళ్లకు వలంటీర్ను నియమించి ప్రతి పథకాన్ని పారదర్శకంగా ప్రతి ఇంటికీ చేరవేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ నాశనం అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్ధలన్నీ నాశనం అయ్యాయి. మరోవైపు ఏది చూసినా స్కామే...! ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులను రూ.2 లక్షలకో, రూ.3 లక్షలకో ఎమ్మెల్యేలు దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులను తొలగించి ప్రైవేట్ దుకాణాలను తెచ్చారు. ఎక్కడ చూసినా ఇసుక రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నాకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. -
సీఐడీ కుట్ర విఫలం.. ఇక సిట్ కుతంత్రం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపులు రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై అవాస్తవ ఆరోపణలతో, అక్రమ కేసులతో వేధించేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ అక్రమ కేసుతో పన్నిన పన్నాగం బెడిసి కొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో అవినీతిపై ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. దాంతో బాబు ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. తాము చెప్పింది చెప్పినట్టు చేసే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. తెర వెనుక ఉంటూ పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. కాగా సిట్కు నేతృత్వం వహించనున్న రాజశేఖర్ బాబుపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండటం గమనార్హం.కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టలేని సీఐడీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో సీఐడీ అక్రమ కేసు కుట్ర బెడిసికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై సీఐడీ ద్వారా కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అవాస్తవ ఆధారాలను సృష్టించాలని, అక్రమ కేసులు బిగుసుకునేలా చేయాలని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అక్రమ కేసుల బనాయింపులో తాము చెప్పిన లక్ష్యాలు సాధిస్తే ఆయనకు డీజీపీ పోస్టు ఇస్తామని కూడా ప్రలోభ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ ఆరు నెలలుగా చేయని హడావుడి లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డితోసహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని పలుసార్లు విచారణ పేరిట వేధించారు. ఆయన్ను అక్రమంగా రోజుల తరబడి నిర్బంధించి తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని, లేకపోతే అంతు చూస్తామన్న హెచ్చరికలతో సీఐడీ అధికారులు బరితెగించారు. డిస్టిలరీల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. ఇంత చేసినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించ లేకపోయారు. అవాస్తవ ఆధారాలతో కనికట్టు చేసేందుకు చేసిన యత్నాలు ఫలించ లేదు.సీఐడీ చీఫ్పై చినబాబు ఆగ్రహం రెడ్బుక్ రాజ్యాంగ వేధింపుల కేసులను తాము చెప్పినట్టు చేయడం లేదని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్పై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. చినబాబే అందరి ముందు ఆయనపై పరుష పద జాలంతో విరుచుకు పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక దశలో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. కుట్రకు పదునుపెట్టేందుకే సిట్మద్యం అక్రమ కేసు పేరిట వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్తకుట్రకు తెరతీసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్ విఫలమయ్యారని భావించిన ప్రభుత్వ పెద్దలు తమ అస్మదీయ అధికారి రాజశేఖర్ బాబును తెరపైకి తెచ్చారు. ఆయన నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి సిట్ వంటి ప్రత్యేక దర్యాప్తు బృందానికి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తారు. అంటే డీజీపీ, సీఐడీ, ఏసీబీ తదితర విభాగాల్లోని ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ జిల్లా పోలీసు యంత్రాంగాల బాధ్యతలు నిర్వర్తించే పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు సిట్ బాధ్యతలు అప్పగించరు. ఎందుకంటే వారికి వారి జిల్లా శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు చాలా ముఖ్యం. అయితే అందుకు విరుద్ధంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా ఉన్న రాజశేఖర్బాబును సిట్ చీఫ్గా నియమించడం గమనార్హం. అంటే తాము చెప్పినట్టు చేసే అధికారి, ఎంతటి అక్రమ కేసునైనా పెట్టి వేధించే అధికారికే బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రభుత్వ పెద్దల ఉద్దేశమని స్పష్టమవుతోంది. రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ సిట్ తెరవెనుక పాత్ర పోషించనున్నారు. ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్బాబు దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడుతారన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే అసలు రాజశేఖర్బాబు ట్రాక్ రికార్డు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న విషయాన్ని పోలీసు వర్గాలే ప్రస్తావిస్తున్నాయి. మద్యం దందాతోపాటు పలు వ్యవహారాల్లో ఆయన అవినీతి బాగోతాన్ని కేస్ స్టడీలతోసహా ఉటంకిస్తున్నాయి. అసలు మద్యం వ్యవహారంపై సిట్ సంగతి తర్వాత.. అసలు సిట్కు నేతృత్వం వహిస్తున్న పోలీస్ అధికారుల అవినీతి బాగోతం మరోసారి బట్టబయలవుతోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. సిట్ సభ్యులు వీరే.. సిట్ చీఫ్: ఎస్వీ రాజశేఖర బాబు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్సభ్యులు: ఎల్. సుబ్బారాయుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ ఎస్పీ (చంద్రబాబుకు వీర విధేయ అధికారి. అందుకే తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి తిరుపతి ఎస్పీగా నియమించారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రభుత్వ వైఫల్యం.. భక్తుల తొక్కిసలాట.. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు. అయినా సరే ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ప్రస్తుతం సిట్లో సభ్యునిగా నియమించింది.)– కొల్లి శ్రీనివాస్, అదనపు ఎస్పీ, విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం– ఆర్.శ్రీహరి బాబు, అదనపు ఎస్పీ, సీఐడీ– పి.శ్రీనివాస్, డీఎస్పీ, డోన్– కె.శివాజీ, సీఐ– సీహెచ్.నాగ శ్రీనివాస్, సీఐ -
కూటమి కాలకేయుల సాక్షిగా.. ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి, సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఆదిమ తెగల్లోనూ కానరాని అకృత్యాలు టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఆవిష్కృతమయ్యాయి! పట్టపగలు.. తిరుపతి నడి రోడ్డుపై పోలీసులు, జనం సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. తాలిబన్లు.. ఐసిస్.. హమాస్ ఉగ్రమూకలను తలదన్నే రీతిలో మునిసిపల్ ఉప ఎన్నికల్లో పచ్చ ముఠాలు దాడులకు తెగబడి విధ్వంసం, భయోత్పాతం సృష్టించాయి! పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారు. అసలు ఒక్క సీటు కూడా గెలవని చోట్ల.. తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేని చోట్ల భయపెట్టి నెగ్గేందుకు కూటమి పార్టీలు కుతంత్రాలకు దిగాయి. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి బరి తెగించాయి. బల ప్రయోగం, అక్రమాలు, అరాచకాలు, ప్రలోభాలతో ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేలా వ్యవహరించాయి. మునిసిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ గుర్తులతో జరిగాయి. అలాంటిది.. ఒక పార్టీ గుర్తుపై నెగ్గిన వారిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఇంత దారుణంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే.. అసలు ఇక ఎన్నికలు ఎందుకు? పార్టీ గుర్తులు ఎందుకు? అని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరికత, ఆధునిక పోకడలు ఏమాత్రం ఎరుగని ఆటవిక జాతులు.. ప్రజాస్వామ్యం అంటే పరిచయం లేని దేశాల్లో మాత్రమే కనిపించే ఘటనలు ఏడుకొండలవాడి సాక్షిగా చోటు చేసుకోవడం నివ్వెరపరుస్తోందని పేర్కొంటున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు కూటమి పార్టీల గూండాలు అరాచకం సృష్టించారు. ఉప ఎన్నికలో పాల్గొనేందుకు వాహనంలో వెళ్తున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సు ఆపి రాడ్లతో అద్దాలు పగలగొట్టి లోపలకు చొరబడి దాడులకు తెగబడ్డారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లపై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. మహిళా కార్పొరేటర్ల ఆర్తనాదాలు ఖాకీల చెవికెక్కలేదు. కార్పొరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న కూటమి గూండాల వాహనాలకు పోలీసులు దగ్గరుండి దారిచ్చి సాగనంపడం నివ్వెరపరుస్తోంది. పోలీసుల సాక్షిగా కూటమి గూండాలు చిత్తూరు, తిరుపతిలో సృష్టించిన అరాచకం ఇదీ!! రాష్ట్రంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేదని అధికార మదంతో టీడీపీ నేతలు సవాల్ విసరడంపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నగర కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో ఐదు చోట్ల ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకుంటున్న టీడీపీ నాయకుడు అన్నా రామచంద్రయ్య, గూండాలు అర్ధరాత్రి నుంచి అరాచకం..మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. గత ఐదు రోజులుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు రాత్రిపూట పోలీసులను వారి ఇళ్లకు పంపి కేసులు బనాయిస్తామంటూ బెదిరించారు. ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాలులో సోమవారం డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే కుయుక్తులతో కూటమి నేతలు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమయ్యారు. వారంతా చిత్తూరులో ఉన్నారని తెలుసుకుని ఆదివారం అర్ధరాత్రి రిసార్ట్స్లో చొరబడ్డారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, పులిగోరు మురళి, జేబీ శ్రీనివాసులు, అనుచరులు గదుల తలుపులు బాదుతూ వీరంగం సృష్టించారు. గదుల్లో ఉన్న మహిళలు, చిన్నారులు ఆందోళనతో భూమన అభినయరెడ్డికి సమాచారం ఇవ్వడంతో పార్టీ శ్రేణులతో కలసి అక్కడకు చేరుకున్నారు. టీడీపీ మూకలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేటర్లంతా సోమవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతిలోని భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. బస్సుని అడ్డుకుని.. అద్దాలు ధ్వంసం చేసిడిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కోసం సోమవారం ఉదయం 11 గంటలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా భూమన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో ఎస్వీ యూనివర్సిటీలోని సెనెట్ హాలు వద్దకు బయలు దేరారు. దాదాపు 25 మంది కార్పొరేటర్లు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం అందులో ఉండగా వర్సిటీ సమీపంలో వారి బస్సును కూటమి గూండాలు అడ్డుకున్నారు. సుమారు 500 మంది ఒకేసారి బస్సుపైకి దూసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే రాడ్లతో అద్దాలను పగులగొట్టారు. లోపలకు చొరబడి బస్సు తలుపు తెరిచారు. బస్సులో ఉన్న కార్పొరేటర్లు అమరనాథరెడ్డి, అనీష్రాయల్, మోహన్కృష్ణ యాదవ్, బోగం అనిల్, వెంకటేష్పై దాడిచేసి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో కార్పొరేటర్లను బలవంతంగా ఎక్కించారు. బస్సులో ముందు వైపు కూర్చున్న మహిళా కార్పొరేటర్లను నెట్టుకుంటూ లోపలకు చొరబడడంతో భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. కార్పొరేటర్లను కాపాడకపోగా మిగిలిన వారిపై దౌర్జన్యానికి దిగారు.ఎంపీ, సాక్షి ప్రతినిధులపై దాడికార్పొరేటర్లతో పాటు బస్సులో ఉన్న ఎంపీ గురుమూర్తిపై కూడా కూటమి గూండాలు దాడికి యత్నించారు. ఈ అరాచకాలను చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధి, ఫోటోగ్రాఫర్పై దాడి చేశారు. ఎమ్మెల్యే కుమారుడు మదన్, సునీల్ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ చేతిలోని రూ.రెండు లక్షలు విలువచేసే కెమెరాను ధ్వంసం చేశారు. సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధిపై కూడా దాడికి తెగబడ్డారు. ఉదయం 10.15 గంటల నుంచి 10.45 వరకు యధేచ్ఛగా సాగిన విధ్వంసంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోరం లేదని డూప్లికేట్ కార్పొరేటర్లతో..నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తే గెలుపు తమదేనని ధీమాతో ఉన్న కూటమి నేతలకు వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. కిడ్నాప్నకు గురైన కార్పొరేటర్లను ప్రవేశపెట్టే వరకు తాము ఉప ఎన్నికలో పాల్గొనబోమని మిగతావారు వర్సిటీ సెనెట్ హాలు బయటే ఆగిపోయారు. ఉప ఎన్నిక జరగాలంటే కోరం ఉండాలి. అంటే.. 50 మంది కార్పొరేటర్లలో సగం మందైనా ఉంటేగానీ ఉప ఎన్నిక ప్రారంభం కాదు. దీంతో కూటమి నేతలు మరో ఎత్తుగడ వేశారు. నలుగురు జనసేన మహిళలకు మాస్క్లు అమర్చి సెనెట్ హాలు లోపలకు పంపేందుకు యత్నించారు. ఈ కుట్రలను పసిగట్టిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాలు వద్దకు చేరుకోవడంతో ఆ యత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఉప ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శుభం బన్సల్ ప్రకటించారు. నలుగురితో బలవంతంగా వీడియో...డిప్యూటీ మేయర్ పదవిని కైవశం చేసుకునేందుకు టీడీపీ మూకలు కిడ్నాప్ చేసిన నలుగురు కార్పొరేటర్ల చేత బలవంతంగా మాట్లాడించి ఓ వీడియోను విడుదల చేశారు. గొడవల కారణంగా తాము సురక్షిత ప్రాంతానికి చేరుకున్నామంటూ ఒకే డైలాగ్ నలుగురితో చెప్పించి వీడియో తీశారు. అది ఒకే ప్రాంతంలో చేసినట్లు తెలుస్తోంది. పక్కన ఎవరో బలవంతంగా చెప్పిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నలుగురి వీడియోలను టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్వర్మ తన ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గమనార్హం. కాగా భూమన అభినయ్పై అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.అడ్డదారిలో స్టాండింగ్ కమిటీ కైవశంగుంటూరు స్టాండింగ్ కమిటీని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. 56 మంది సభ్యులకుగానూ కేవలం 11 మంది బలం మాత్రమే ఉన్న కూటమి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంది. స్వయంగా ఎమ్మెల్యేలను కార్పొరేటర్ల ఇళ్లకు పంపి పచ్చ కండువా కప్పారు. సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నిక సందర్భంగా బ్యాలెట్ పేపర్పై సీరియల్ నంబర్లు వేసి బెదిరింపులకు దిగి గెలుపొందారు. కాగా కార్యాలయం బయట కూటమి సభ్యులు డబ్బులు పంచుకుంటూ మీడియాకు చిక్కారు.సగం చోట్ల వాయిదా...పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్ పదవులతో పాటు తిరుపతి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, కాకినాడ జిల్లా తుని, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నోటిఫి కేషన్ జారీ చేసిన సగం చోట్ల ఎన్నికలు జరగకుండా వాయిదా పడడం గతంలో ఎప్పుడూ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాయిదా పడిన ఐదు చోట్ల మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. ⇒ టీడీపీ కూటమికి బలం లేకపోయినా నూజివీడు మున్సిపాల్టీలో వైస్ చైర్మన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్లు, ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను అధికారం అండతో చేజిక్కించుకుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. తిరుపతిలో డిప్యూటీ మేయర్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైర్మన్, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వైస్ చైర్మన్, కాకినాడ జిల్లా తునిలో వైస్ చైర్మన్ పదవిలో బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించి విఫలమైంది. ⇒ కృష్ణా జిల్లా నూజివీడు మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా తొమ్మిది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరించి లొంగదీసుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇందుకోసం మంత్రి కొలుసు పార్ధసారథి ఆదివారం రాత్రి కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. ⇒ హిందూపురం మున్సిపాల్టీలో మొత్తం 38 కౌన్సిలర్లకు వైఎస్సార్సీపీ 29, టీడీపీ 6 గెలుచుకుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ 13 మందిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లను కూడా ఉపయోగించుకుని ౖచైర్మన్ పదవిని మోసపూరితంగా తమ పరం చేసుకున్నారు.⇒ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 కార్పొరేటర్లకు 54 సీట్లను వైఎస్సార్సీపీ గెలిచినా.. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని అధికార దుర్వినియోగంతో టీడీపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బెదిరింపులు, ప్రలోభాలతో వారిని తమ వైపు తిప్పుకుని ఆ పదవిని అక్రమంగా కైవశం చేసుకున్నారు. ⇒ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో రెండు వైస్ ౖచైర్మన్ పదవులను బెదిరింపులకు గురి చేసి టీడీపీ మద్దతుదారులకు కట్టబెట్టారు. 20 వార్డుల్లో 18 చోట్ల వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉండగా 12 మందిని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు. ఫిరాయిపుదారుడిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి పదవి దక్కేలా చేశారు. ⇒ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా రెండు డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ అక్రమంగా చేజిక్కించుకుంది. కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న టీడీపీ రెండు డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడాన్ని బట్టి ఆ పార్టీ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ⇒ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఒక్క కౌన్సిలర్ కూడా లేని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి విఫలయత్నం చేసింది. అక్కడున్న మొత్తం 33 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వారంతా మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గడువు లోపు వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఎన్నికను వాయిదా చేశారు. ⇒ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అడ్డగోలుగా తమ పరం చేసుకునేందుకు టీడీపీ యత్నించింది. అక్కడి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీకి చెందిన వారే అయినా వారి తరఫు అభ్యర్థిని నామినేషన్ వేయకుండా పోలీసుల సాయంతో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ కూడా కమిషనర్ ఎన్నికను వాయిదా వేశారు.డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి సాక్షి, అమరావతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో జిల్లా ఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక నిష్పాక్షికంగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ, సెనెట్ హాల్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్పై హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ, పాలకొండపై కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని భర్తీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నాదెండ్ల హారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖాళీగా ఉన్న 19 వార్డుకు ముందు ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎం.స్వర్ణకుమారి దాఖలు చేసిన వ్యాజ్యంపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
‘మన మిత్ర’.. మరో మారీచుడే!
సాక్షి, అమరావతి: మొన్న ‘‘సేవా మిత్ర..!’’.. నేడు ‘‘మన మిత్ర..!’’ పేర్లు మారినా కుతంత్రాలు మాత్రం మారలేదు!!రామాయణంలో మారీచుడు ఎలా రూపాలు మార్చుకుని దారుణాలకు ఒడిగట్టేవాడో... రాష్ట్ర రాజకీయాల్లోనూ చంద్రబాబు ఎప్పటికప్పుడు మాయ వేషాలతో కుట్రలకు పదును పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సర్కారు రాజకీయ కుతంత్రాలపై సర్వత్రా మండిపడుతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో నమోదు చేసే ఆధార్ నంబర్తో ఆయా కుటుంబాల వివరాలు మొత్తం బహిర్గతం కావడంతో గిట్టని వారికి సంక్షేమ పథకాలను నిలిపి వేయడంతోపాటు ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యంగా పౌరుల వ్యక్తిగత డేటా మొత్తం ప్రైవేట్ సంస్థ గుప్పిట్లో పెట్టారని.. అసలు ప్రజల వ్యక్తిగత డేటా మూడో వ్యక్తి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలు ఇంకా ఎన్ని చోట్లకు చేరిపోతాయో...! ఎన్ని చేతులు మారుతాయో? అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ ప్రభుత్వానికి పౌర సేవలపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘‘దిశ’’ యాప్ తరహాలో ప్రభుత్వమే స్వయంగా రూపొందించి ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ సేవా మిత్ర మొబైల్ యాప్తో లక్షలాది మంది ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తన కుతంత్రానికి సరికొత్త రూపాన్నిచ్చారు. అదే.. ‘మన మిత్ర’ మొబైల్ యాప్. మీ ఆధార్ నంబర్ వాట్సాప్ చేస్తే చాలు.. ప్రభుత్వ సేవలు ఇట్టే అందిస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఈ అందమైన మాయాజాలం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. బాలనాగమ్మను మాయల ఫకీరు చిలుకలో బంధించి ఎత్తుకుపోయినట్టు... యావత్ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా అంతా నిక్షిప్తం చేసి అక్రమాలకు పాల్పడేందుకు రాజకీయ మాయల ఫకీరు వేసిన ఎత్తుగడే మన మిత్ర యాప్. ఒక్క ఆధార్ నంబరుతో మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, చిరునామాలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు, ఓటరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలు... సర్వం మాయల ఫకీరు గుప్పిట్లోకి వెళుతుంది. ఆ తరువాత ఏడు సముద్రాలు దాటి విదేశాలకు చేరుతుంది. అక్కడ నుంచి సైబర్ నేరస్తులు ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టొచ్చు...! ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించవచ్చు...! అర్హులైనప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను తొలగించవచ్చు...! ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగించవచ్చు...! చంద్రబాబు సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ ఎత్తుగడ వెనుక ఇంత దారుణ పన్నాగం దాగి ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించే కుతంత్రం ఇది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అరాచక పర్వం ఇది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బరితెగింపు ఇది. ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించాలనే టీడీపీ దీర్ఘకాలిక దురాలోచన దీని వెనుక ఉన్నట్లు సాంకేతిక నిపుణులు, రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. యావత్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.గవర్నెన్స్ ముసుగు.. డేటా చోరీ కుట్ర!వాట్సాప్లో మీ ఆధార్ నంబర్ మెసేజ్ చేస్తే చాలు.. 520 రకాల పౌర సేవలు అందిస్తామని మంత్రి నారా లోకేశ్ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రస్తుతం 161 సేవలను అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మిగిలినవి కూడా అందిస్తామంటూ దీనికి ‘మన మిత్ర’ అనే పేరు ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆ పౌర సేవలను ప్రభుత్వ సాంకేతిక వ్యవస్థ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో అందిస్తామని తెలిపారు. ‘వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా పౌర సేవలు పొందాలంటే 95523 00009 నంబర్కు ప్రజలు తమ ఆధార్ను వాట్సాప్ చేయాలి. అలా చేయగానే ప్రజల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతున్నాయి. ఇక పౌర సేవలు పొందేందుకు ఆ వాట్సాప్ నంబరులో సూచించే ఫారాన్ని ఆన్లైన్లో పూరించాలి. దాంతో ఆయా వ్యక్తుల అదనపు వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. పేరు, ఇంటి నంబరు, ఓటరు కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు, మొబైల్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీ... ఇలా సమస్త వివరాలు సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండానే బహిర్గతమవుతున్నాయి.అంటే ప్రజల వ్యక్తిగత గోప్యత అన్నది పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినట్లు నిర్ధారణ అవుతోంది.పౌరుల డేటా ప్రైవేట్ సంస్థ గుప్పిట్లోకి...వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడికి చేరుతోందన్నది అత్యంత కీలకంగా మారింది. వాట్సాప్ గవర్నెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రవేశ పెట్టలేదు. ప్రభుత్వ విభాగం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా సొంతంగా ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. నిజంగా చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే ప్రభుత్వమే సొంతగా మొబైల్ యాప్ను రూపొందించవచ్చు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళల భద్రత కోసం ‘దిశ’ మొబైల్ యాప్ను పోలీసు శాఖే స్వయంగా రూపొందించింది.ప్రజలు అన్ని రకాల పోలీసు సేవలు పొందేందుకు ‘పోలీసు సేవా యాప్’ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయా ప్రభుత్వాలే సొంతంగా మొబైల్ యాప్లు రూపొందించి పౌర సేవలు అందిస్తున్నాయి. అంతేగానీ సున్నితమైన ప్రజల వ్యక్తిగత సమాచారంతో ముడిపడిన అంశాలపై ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. మరి పౌర సేవల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం సొంతంగా యాప్ ఎందుకు రూపొందించలేదన్నది సందేహాలకు తావిస్తోంది. అంటే ప్రజల వ్యక్తిగత వివరాలన్నీ ప్రైవేట్ సంస్థకు అందుబాటులోకి వచ్చినట్లేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పథకాల్లో కోత... ఓట్ల తొలగింపు – ఎన్నికల్లో అక్రమాలే అసలు లక్ష్యం..వాట్సాప్ గవర్నెన్స్ ముసుగులో సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్నదే టీడీపీ సర్కారు అసలు కుట్ర. వైఎస్సార్సీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులను వేధించడం.. వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం.. టీడీపీకి ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగించే పన్నాగం దాగి ఉంది. 2029 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలన్న దీర్ఘకాలిక దురాలోచన ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారంటే.. ఒకరి ఆధార్ నంబరు టైప్ చేస్తే చాలు ఆ కుటుంబంలోని ఇతర సభ్యుల ఆధార్ నంబర్లు, వారి వ్యక్తిగత డేటా కూడా మొత్తం బట్టబయలవుతోంది. సాధారణంగా ఎక్కడైనా ఆధార్ నంబరు నమోదు చేస్తే సంబంధిత వ్యక్తి మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేశాకే మిగతా ప్రక్రియను కొనసాగించేందుకు వీలుంటుంది. కానీ టీడీపీ ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్లో ఇలాంటిదేమీ లేదు. ఒకరి ఆధార్ నంబరు వెల్లడిస్తే ఆ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత డేటా సైబర్ నేరస్తులకు కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ అన్ని రకాల సైబర్ నేరాలు, మోసాలకు తలుపులు బార్లా తెరుస్తోంది.ఆధార్ చట్టం ఉల్లంఘన...ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. ఆధార్ సంబంధిత డేటా పరిరక్షణ కోసం కేంద్రం రూపొందించిన యూఐడీఏఐ చట్టం పటిష్ట మార్గదర్శకాలను నిర్దేశించింది. వాటి ప్రకారం..– ఆధార్ డేటాను భారత్లోనే భద్రపరచాలి. దేశ సరిహద్దులు దాటించి విదేశీ సర్వర్ల ద్వారా డేటా ప్రాసెసింగ్ అన్నది పూర్తిగా నిషిద్ధం. కానీ చంద్రబాబు ప్రభుత్వం విదేశీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తద్వారా ప్రజల ఆధార్ డేటా దేశ సరిహద్దులు దాటేందుకు ఆస్కారం ఇచ్చింది. – ఆధార్ నంబరు, డేటాను ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశాల్లో కూడా ప్రచురించకూడదని చట్టం చెబుతోంది. రేషన్ కార్డు, జనన ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లలో ఆధార్ పూర్తి నంబరు ప్రచురించకూడదు. కేవలం ఆధార్లోని చివరి నాలుగు అంకెలే ప్రచురించాలి. అందుకు విరుద్ధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆధార్ నంబరును పూర్తిగా అంటే మొత్తం పది అంకెలను బహిర్గతం చేస్తున్నారు.ఐటీ, డేటా భద్రతా చట్టాలకు విరుద్ధంగా..పార్లమెంట్ ఆమోదించిన ఐటీ చట్టం–2000, ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్–2023’ను చంద్రబాబు ప్రభుత్వం యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే ఐటీ చట్టం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పించింది. ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణలో విఫలమైతే ఒక్కో ఉల్లంఘనకు ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అవకాశం కల్పించింది. వీటిని టీడీపీ సర్కారు ఏమాత్రం లెక్క చేయడం లేదు.సుప్రీం తీర్పు బేఖాతర్...వ్యక్తిగత డేటా పరిరక్షణ ప్రజల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వివరాలను ఎలా ఉపయోగించాలన్నది పూర్తిగా ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇతరులు ఎవరికీ ప్రజల వ్యక్తిగత డేటా మీద నియంత్రణ ఉండకూడదని 2017లో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనికి విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తేవడం విస్మయపరుస్తోంది.2019లో ‘సేవా మిత్ర’ యాప్తో అక్రమాలు2014–19 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే తరహాలో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాలను హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా టీడీపీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించారు. టీడీపీ ఎన్నికల వ్యూహం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్లోకి ప్రజల వ్యక్తిగత డేటాను చేరవేశారు. పేరు, చిరునామా, కులం, మతం, ఆధార్ నంబరు, ఓటరు కార్డు నంబరు, పోలింగ్ బూత్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు... ఇలా పూర్తి వివరాలు టీడీపీ సేవా మిత్ర యాప్లో అనుసంధానమయ్యాయి. అనంతరం వాటిని దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులని భావించిన దాదాపు 35 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు బరి తెగించింది. దానిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెప్పారంటే.. చేయరంతే!
సాక్షి, అమరావతి: ‘ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్ లెటర్లు (Offer Letters) ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్ (Nara Lokesh) ఆర్భాటంగా సెలవిచ్చారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్ కేలండర్ (Job Calendar) ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్ కేలండర్ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్ మాత్రమే కాదు.. నారా చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్–1, 2 మెయిన్స్ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది.10 లక్షల మందిలో తీవ్ర ఆందోళన కూటమి ప్రభుత్వంలో గ్రూప్–2, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రెండుసార్లు వాయిదా వేశారు. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఫిబ్రవరిలో గ్రూప్–2, మే నెలలో గ్రూప్–1 మెయిన్స్కు తేదీలు ప్రకటించారు. అయితే, గత సంఘటనలతో ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయో లేదో అనే అనుమానం నిరుద్యోగులను వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న అభ్యర్థులు గతంలో ప్రకటించిన మరో 21 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలలుగా ఈ పరీక్షల నిర్వహణపై ఇటు ఏపీపీఎస్సీ, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో యువత భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్తో పాటు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీని నీరుగార్చింది. దీంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక ఇంకా శిక్షణ కొనసాగించాలా.. లేక విరమించాలో తేల్చుకోలేక నిరుద్యోగ అభ్యర్థులు మదనపడుతున్నారు. ఈ 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యా శాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా వేశారు. సెప్టెంబర్లో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ మే నెలకు వెళ్లిపోయింది. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అలాగే ఉంది. కేవలం ఈ మూడు పరీక్షలకు సంబంధించి మెయిన్స్కు అర్హత సాధించిన వారు దాదాపు 1.15 లక్షల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు. వారంతా దీర్ఘకాలిక సెలవులు పెట్టి మెయిన్స్కు సిద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వారంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ‘యువగళం’లో యువతకు హామీ ఇచి్చన విషయాన్ని 2023 నవంబర్ 30న ‘ఎక్స్’లో పోస్టు చేసిన లోకేశ్ మభ్య పెట్టడమే సర్కారు విధానంరాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గతేడాది అనుమతిచ్చింది. ఇందులో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 70, బీట్ ఆఫీసర్ పోస్టులు 175, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 375, తానాదార్ 10, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 12, జూనియర్ అసిస్టెంట్లు 10 పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సర్వీస్ కమిషన్కు ప్రభుత్వం అనుమతించలేదు. కానీ కొత్తగా 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో పోస్టులు భర్తీకి ముందు ఖాళీలను గుర్తించాలి. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇవేమీ చేయకుండానే 150 గ్రూప్–1 పోస్టులు ఉన్నట్టు పేర్కొని నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను చేర్చి ‘డ్రాఫ్ట్ జాబ్ కేలండర్–2025’గా ప్రచారం చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.యువత సంక్షేమం పేరుతో జ్యాబ్ క్యాలెండర్ ఇస్తామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం గత ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారమే భర్తీవైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి పక్కాగా పోస్టులు భర్తీ చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా నియామకాలు పూర్తి చేశారు. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి, ఏకంగా 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఏ ఒక్క నోటిఫికేషన్ వాయిదా పడిన సందర్భంగానీ, రద్దు చేయడం గాని జరగలేదు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేశారు. 2024లో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్వీస్ కమిషన్ల పని తీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి: అప్పులు తీసుకునే శక్తి ఏపీకి లేదు2019కి ముందు ఇచ్చిన నోటిఫికేషన్లపై వివాదాలు చెలరేగి నిరుద్యోగ యువత నష్టపోయారు. ప్రస్తుతం ఉద్యోగ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతినెలా సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. 2018 డిసెంబర్లో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చినా, ఒక్క నోటిఫికేషన్కు పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 2019కి ముందున్న పరిస్థితే వచ్చిందని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట!
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి.. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా?ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల.. తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారుతుంటే తమలో అభద్రతా భావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంత మంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల.. జాబ్చార్ట్ పూర్తిగా మారిపోయి.. పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప.. రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే..గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్కు సంబంధించి.. సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. రేషనలైజేషన్ను మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా.. వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలి’ అని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
ఏపీలో మరో బాదుడు.. ఆస్తి విలువలు 40–50% పెంపు
సాక్షి, అమరావతి: హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈమేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. జిల్లా జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలువలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యాలయాల్లో పెరిగిన విలువల అప్లోడ్ పనులను వేగంగా చేపట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50 శాతం వరకు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నెపంతో అనేక ప్రాంతాల్లో ఇలా పెంచేశారు. విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండనుంది. మిగిలిన చోట్ల కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు.రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యం.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా..భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం దొడ్డిదారిని ఎంచుకుంది. భూముల క్లాసిఫికేషన్లనే మార్చేసింది. ప్రతి ఏరియాలో భూమికి ప్రస్తుతం ఒకే విలువ అమలులో ఉంది. ఇప్పుడు దానికి రెండో విలువను జోడిస్తున్నారు. ఇందుకోసం లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తెచ్చారు. గతంలో వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగానూ.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న భూమిగా క్లాసిఫైడ్ చేశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలోని మెట్ట, మాగాణి భూముల్లోనే రకరకాల క్లాసిఫికేషన్లు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్లో చేరుస్తున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకున్న భూమికి ఒక ధర, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లో క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చారు. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు భారీగా పెరిగిపోనున్నాయి.అమరావతికి మినహాయింపురాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్ తేవాలని యత్నిస్తున్నారు. దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి అమరావతిలో మాత్రం వెన్నపూస రాయడం ఏమిటని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
సిబ్బందిని కుదించేశారు..
సాక్షి, అమరావతి: రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారు ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల ఉద్యోగులను మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ⇒ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఐఓటీ తదితర సాంకేతిక విధానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులను ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ పేరుతో ఆయా సచివాలయాల్లో కొనసాగిస్తారు. ⇒ రేషనలైజ్ తర్వాత మిగులు ఉద్యోగులుగా గుర్తించే వారిని ఇతర ప్రభుత్వ శాఖలలో వినియోగించుకోవటంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ⇒ ఏదైనా గ్రామం సంబంధిత సచివాలయానికి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పంచాయతీకి ఇబ్బంది లేకుండా సమీప సచివాలయం పరిధిలో చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి మిగులు ఉద్యోగులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శి, వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు వార్డు అడ్మిన్ సెక్రటరీ హెడ్గా కొనసాగుతారు. ⇒ సచివాలయాల పర్యవేక్షణకు కొత్తగా మండల లేదా మున్సిపల్ స్థాయితో పాటు జిల్లా స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగులు సిబ్బందిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ⇒ ఆస్పిరేషనల్ ఉద్యోగుల ద్వారా సచివాలయాల స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ అక్షరాస్యత, ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందించనున్నారు. వీఆర్వో కోసం వెతుక్కోవాల్సిందే..!ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రేషనలైజేషన్ అనంతరం చాలా సచివాలయాల్లో ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే ఉద్యోగులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ప్రస్తుతం సచివాలయాల్లో ప్రజలు వెళ్లగానే వారి నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడే కంప్యూటర్లో అప్లోడ్ చేసి రశీదు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఇకపై చాలా చోట్ల ఉండరు. 2,500 లోపు జనాభా ఉండే సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఆరుకు కుదింపు కారణంగా ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిసెంట్లలో ఎవరో ఒకరు మాత్రమే పని చేస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల సరి్టఫికెట్ల జారీలో కీలకమైన వీఆర్వోలు రేషనలైజేషన్ అనంతరం దాదాపు అన్ని చోట్ల ప్రతి రెండు సచివాలయాల్లో ఒకరు చొప్పున మాత్రమే విధులు నిర్వహించే అవకాశం ఉంది. వ్యవసాయ సహాయకుడు, పశు సంరక్షక సహాయకుడు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లు సైతం రెండు సచివాలయాలకు ఒకరు చొప్పున మాత్రమే పని చేస్తారు. వార్డు సచివాలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉత్పన్నం కానుంది. -
మహిళకు మోసం!
సాక్షి, అమరావతి: ఎన్నికలు ముగిసి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది... ఒకవైపు ఎనిమిది రాష్ట్రాల్లో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ఇప్పటికే ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం కసరత్తుల పేరుతో నింపాదిగా కాలక్షేపం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అమ్మ ఒడి నుంచి చేయూత దాకా.. సున్నా వడ్డీ నుంచి విద్యా దీవెన వరకు దాదాపు ప్రతి పథకంలోనూ నవరత్నాలతో అక్క చెల్లెమ్మలకే లబ్ధి చేకూర్చగా.. టీడీపీ సర్కారు పగ్గాలు చేపట్టాక మహిళా సాధికారతను గాలిలో దీపంలా మార్చింది! మహిళలకు రక్షణతోపాటు ఆర్థిక భద్రత కరువైంది. 2024 ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను ఆయా చోట్ల అధికారంలోకి రాగానే 8 రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వారికిచ్చిన హామీలను ఇంకా నెరవేర్చడం లేదని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మహిళలే కేంద్రంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పేర్లు, వాటికి బడ్జెట్లో కేటాయించిన నిధుల వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం.ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ..సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 19 నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న ప్రతి మహిళకు ఏటా రూ.18 వేల చొప్పున (నెలకు రూ.1,500) ఇస్తానని చంద్రబాబు ఎన్నికల హామీల్లో వాగ్దానం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి పథకాల అమలు ప్రారంభమైనా సీఎం చంద్రబాబు మాత్రం ఏడు నెలలు గడిచిపోతున్నా ఆ ఊసే పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ‘ఆడబిడ్డ నిధి’ కోసం నిరీక్షిస్తున్న 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయామని గ్రహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పేద మహిళలను ఆర్థికంగా నిలబెట్టిన చేయూత, సున్నా వడ్డీ, ఆసరా లాంటి పథకాలు చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో ఇప్పుడు అక్క చెల్లెమ్మల పరిస్థితి దయనీయంగా ఉంది.8 రాష్ట్రాల్లో బడ్జెట్లోనూ కేటాయింపులు..మహిళలు కేంద్రంగా కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో ఇచ్చిన హామీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశాయని రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 8 రాష్ట్రాల్లో మహిళలకు ప్రకటించిన పథకాల అమలుకు ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల రెవెన్యూ రాబడుల్లో 3 శాతం నుంచి 11 శాతం వరకు మహిళా పథకాలకు వ్యయం చేస్తున్నట్లు నివేదిక తెలిపింది.తల్లికి వందనం లేదు.. వంచనే!తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు దీని అమలు గురించి కనీసం బ్యాంకర్ల సమావేశంలో కూడా ప్రస్తావించలేదు. ఇక పీ–4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో చెప్పారు. ప్రత్యేక చర్యలు దేవుడెరుగు.. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే గండి కొట్టారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు మేరకు అంగన్వాడీవర్కర్లకు గ్రాట్యుటీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే మరిచిపోయారు. ఆశా వర్కర్ల కనీస వేతనం పెంచుతామని ఆశ పెట్టి ఊరించి నట్టేట ముంచారు. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పి దాన్ని కూడా అమలు చేయడం లేదు. కలలకు రెక్కలు పథకం ద్వారా విద్యార్థినులకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఎన్నికలకు ముందే దరఖాస్తులు సైతం స్వీకరించి బుట్ట దాఖలు చేశారు. పండుగ కానుకలు ఇవ్వడంతో పాటు పెళ్లి కానుక పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఇప్పటికే మూడు ప్రధాన పండుగలు వెళ్లిపోయాయి. పెళ్లి కానుక అందక ఎన్నో జంటలకు నిరాశే ఎదురైంది. సూపర్ సిక్స్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మంత్రుల బృందం అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మహిళలను కూటమి సర్కారు వంచిస్తోంది.ఉచిత గ్యాస్లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి జిమ్మిక్కులతో మహిళలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు.జగనన్న ఉండి ఉంటే..వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండి ఉంటే గత ఏడు నెలల్లో తమకు ఎంతో మేలు జరిగేదని రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ గుర్తు చేసుకుంటోంది. మహిళలకు రక్షణతోపాటు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగనన్న ఎంతో భరోసా ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లూ మహిళా సాధికారతకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. ఏటా ఏప్రిల్లో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన.. జూన్లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక.. ఆగస్టులో మళ్లీ విద్యా దీవెన.. సెప్టెంబర్లో చేయూత.. నవంబర్లో తిరిగి విద్యా దీవెన.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పథకాలతో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలతోపాటు పథకాలన్నీ మహిళలే కేంద్రంగా సంక్షేమాన్ని అందచేశారు. డ్రాపౌట్స్ను అరికట్టడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన అన్ని పథకాలను కూటమి సర్కారు కక్షపూరితంగా నిలిపివేయడంతో ఇంటిని చక్కదిద్దే మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా అమలు చేయకుండా పిల్లలను సైతం మోసగించారు. అమ్మ ఒడి పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం కనీసం తల్లికి వందనం పథకాన్నైనా అమలు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించింది. ఇక మహిళలకు వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పథకాలను కూటమి సర్కారు అటకెక్కించడంతో అన్ని వర్గాల మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...జిందాల్ను వేధించిన బాబు సర్కారు– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..– ఈవీ, సోలార్ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలుసజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.నాడు.. పెట్టుబడులకు రాచబాట..– పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ భరోసావైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. -
Andhra Pradesh: కృష్ణా జలాల 'హక్కులు హుళక్కే'!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ) 2లో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ) 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ చట్టానికి సవరణ చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభజన చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన విధి విధానాలను అనుసరించి విచారణ చేయడానికి వీల్లేదనే కోణంలో వాదనలు వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని నిపుణులు తప్పుబడుతున్నారు. చంద్రబాబు సర్కారు సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే సెక్షన్ 3 ప్రకారమే కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటామని కేడబ్ల్యూడీటీ 2 గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని.. అంతిమంగా ఇది రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత రెండు కళ్ల సిద్ధాంతంతో రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసుతో వ్యక్తిగత లబ్ధి కోసం 2014–19 మధ్య కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిన తరహాలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.బాబు సర్కారు నిర్వాకంతో...కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 811 టీఎంసీలను కేటాయిస్తూ 1976 మే 27న కేడబ్ల్యూడీటీ–1 తీర్పు ఇచ్చింది. అయితే కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమలులోకి రాని నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 తీర్పే ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ క్రమంలో విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్ 89 ద్వారా కేడబ్ల్యూడీటీ–2కే కేంద్రం అప్పగించింది. రెండు రాష్ట్రాలకు నీటి లెక్కలను ట్రిబ్యునల్ తేల్చే వరకూ.. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అదే విధానంలోనే 2023–24 వరకూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తోంది. అయితే ఐఎస్ఆర్డబ్యూడీఏ 1956 సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జల్శక్తి శాఖ కేడబ్ల్యూడీటీ–2కు అదనపు విధి విధానాలను జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ 2023 అక్టోబర్ 31న సుప్రీంకోర్టులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆ రిట్ పిటిషన్పై సమర్థంగా వాదనలు వినిపించడంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్రం సెక్షన్ 3 కింద జారీ చేసిన అదనపు విధి విధానాలు చెల్లుబాటు కావనే కోణంలో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించి ఉంటే.. కేడబ్ల్యూడీటీ–2లో ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.నాటి తరహాలోనే నేడూ..విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం రెండు కళ్లు, కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ.. నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, పులిచింతల విద్యుత్ కేంద్రం తమ భూభాగంలో ఉన్నాయంటూ తెలంగాణ సర్కార్ వాటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగభాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ రాష్ట్ర భూభాగంలో ఉన్నా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆధీనంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. దీంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస తదితర ప్రాజెక్టులను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టినా నాడు చంద్రబాబు నోరు మెదపలేదు. ఫలితంగా తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను కాలరాస్తూ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు తరలిస్తూనే ఉంది. తెలంగాణ సర్కార్ జల దోపిడీపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన ఫలితంగానే 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగ భాగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించిందని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ 2014–19 తరహాలోనే వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించేలా కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ చేపట్టినా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని.. కేడబ్ల్యూడీటీ–2లోనూ సమర్థంగా వాదనలు వినిపించడం లేదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. -
క్యాసినోలా కోళ్ల పందేలు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ఇటు జూదం.. అటు మద్యం! కోట్లు వెదజల్లితే చాలు కోరినవన్నీ కూర్చున్న చోటకే! ఎక్కడ చూసినా పందెం కోళ్లు.. బెల్టు షాపుల కోలాహలం! గోవా, శ్రీలంక, బ్యాంకాక్ తదితర చోట్ల కళ్లు మిరుమిట్లు గొలిపే క్యాసినోలను మించి రాష్ట్రంలో కోడి పందేలు, జూద క్రీడలు బరి తెగించి విచ్చలవిడిగా సాగాయి. కోడి పందేల బరుల వద్ద మినీ బార్లు, మద్యం షాపులను తెరిచి యథేచ్ఛగా బెల్టు అమ్మకాలు సాగించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా సంక్రాంతి సంబరాల ముసుగులో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అడ్డూ అదుపు లేకుండా నిర్వహించారు. పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఎన్నడూ లేనిది విజయవాడ నడిబొడ్డున రామవరప్పాడులో కోడి పందేలు, పేకాట, గుండాట జోరుగా నిర్వహించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో సాగించిన ఈ పందేల విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కోడిపందేల నిర్వహణ పూర్తిగా కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలోనే సాగింది. చాలాచోట్ల నేరుగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనగా కొన్నిచోట్ల వారి అనుచరులతో నిర్వహించారు. కోడి పందేలను భారీ ఆదాయ వనరుగా మార్చుకుని కూటమి నేతలు ఈ మూడు రోజులు విజృంభించారు. ఒక్కో బరిపై మూడు రోజుల్లో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు పిండుకున్నట్లు తెలుస్తోంది.పోటాపోటీగా ‘గోదావరి’రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200కిపైగా బరుల్లో కోడి పందేలు జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 350 చోట్ల పందేలు నిర్వహించగా వాటిలో 120కిపైగా పెద్ద బరులున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 300కిపైగా పందేల బరులుండగా సుమారు వందకుపైగా పెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ 320కిపైగా కోడి పందేల బరుల్లో పందేలు జరిగాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 150 వరకు బరులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పెద్ద బరుల్లో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలు.. ఆపైన మొత్తాలతో పందేలు నిర్వహించారు. చిన్న బరుల్లో రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పందేలు సాగాయి. కొన్నిచోట్ల రూ.కోటి, కోటిన్నర పందేలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలను స్వయంగా ఎమ్మెల్యేలే పోటాపోటీగా నిర్వహించడం గమనార్హం.‘బరి’లో డిప్యూటీ స్పీకర్పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో భారీగా నిర్వహించిన కోడి పందేలకు అక్కడి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నేతృత్వం వహించారు. 25 ఎకరాల్లో కోడి పందేల ప్రాంగణాన్ని ఆయన సిద్ధం చేయించారు. సినిమా సెట్టింగులను తలపించేలా దారి పొడవునా ఫ్లెక్సీలు, వేలాది మంది కూర్చునేలా కుర్చీలు, ప్రముఖుల కోసం వీఐపీ గ్యాలరీలు, సోఫా సెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్లైట్లతో ఒక ఉత్సవంలా పందేలను నిర్వహించారు.చింతమనేని ‘మినీ స్టేడియం’దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ కోడి పందేల్లా కాకుండా తన బరిని మినీ స్టేడియంలా సిద్ధం చేయించి అందులో పందేలు నిర్వహించారు. నియోజకవర్గంలోని దుగ్గిరాలలో జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటైన ఈ పందేల బరులు కుంభమేళాను తలపిస్తున్నాయి. సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో నెల రోజులకు పైగా కార్మికులు శ్రమించి దీన్ని తయారు చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు, వీఐపీలు రెస్ట్ తీసుకునేందుకు క్యారవాన్, పక్కనే కోసాట, గుండాడ ఒకటని కాకుండా అన్ని రకాల జూద క్రీడలు అక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.కూటమి ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో..పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రూరల్ డేగాపురం, మహదేవపట్నం, సీసలి, ఆకివీడు, కొవ్వాడ, అన్నవరం, వీరవాసరం మండలం నౌడూరు, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలం కలగంపూడి, తణుకు తదితర ప్రాంతాల్లో భారీ బరులతో పందేలు నిర్వహించారు. డేగాపురంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, సీసలిలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు దగ్గరుండి కోడి పందేలు వేయించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సమీపంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. విస్సన్నపేటలో ఏకంగా కాకతీయ ప్రీమియర్ లీగ్ పేరుతో పందేల బరులు పెట్టారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీగా కోడిపందేలు జరిగాయి. పామర్రు, కూచిపూడి, కోసూరు, పమిడిముక్కల, గడ్డిపాడు, గరికపర్రు, తోట్లవల్లూరు, కొమ్ముమూరు, పెదపారుపూడి, యలమర్రులో భారీ ఎత్తున పందేలు నిర్వహించారు. బాపట్ల జిల్లా తీరప్రాంతంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారి పాలెం, కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే బరులు ఏర్పాట్లు చేశారు.క్యారవ్యాన్లు.. మహిళా బౌన్సర్లు!కోడి పందేల బరుల వద్ద భారీ సెట్టింగులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చాలాచోట్ల వీవీఐపీలు, ముఖ్యులకు క్యారవ్యాన్ల సదుపాయం కల్పించారు. డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలతో వీడియో, సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. పందేలు నిర్వహించే చోటే అన్ని రకాల మాంసాహారాలతో విందు భోజనాలు వడ్డించారు. బిర్యానీ పాయింట్లు, చికెన్ పకోడీ పాయింట్లు, ఇతర ఆహార పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రాత్రి సమయాల్లోనూ నిరాటంకంగా పందేలు జరిగేందుకు ఫ్లడ్లైట్లు పెట్టారు. కోడి పందేలకు వచ్చిన వారి కార్లు, ద్విచక్ర వాహనాలతోనే ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. జూద జన సందోహాలు, వాటిని వీక్షించడానికి వచ్చే వారితో కిటకిటలాడిపోయాయి. కొన్నిచోట్ల లోపలికి ప్రవేశించేందుకు రుసుము పెట్టారు. పెద్ద బరుల్లో టోకెన్లు జారీ చేసి అవి ధరించిన వారినే లోపలకు అనుమతించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. కొన్నిచోట్ల మహిళా బౌన్సర్లు కూడా ఉండడం గమనార్హం.బరుల వద్దే బార్లు, బెల్టు షాపులు అన్ని బరుల వద్ద మద్యం బెల్టు షాపులు ఏర్పాటు చేయడంతో మందు ఏరులై పారింది. పెద్ద బరుల వద్ద ఏకంగా బార్లు తెరిచి అమ్మకాలు సాగించారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేశారు. యధేచ్చగా అమ్మకాలు సాగుతున్నా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు.బాపట్ల ‘బరి’లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు..బాపట్ల జిల్లాలో సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కోడిపందేలను నిర్వహించడమే కాకుండా స్వయంగా పాల్గొనడం గమనార్హం. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో 30 ఎకరాల బరిలో కోడిపందేలతో పాటు పలురకాల జూద క్రీడలు జరిగాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు సినీ నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగ్నేశ నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఆయన బంధువులు మంతెన వారిపాలెంలో 40 ఎకరాల్లో పెద్ద బరి ఏర్పాటు చేసి కోడిపందేలు ఆడించారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ దగ్గరుండి మూడు రోజులపాటు పర్యవేక్షించడంతోపాటు స్వయంగా సొంత కోళ్లతో బరిలో నిలిచి పందెంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరు నియోజకవర్గంలో ఐదు బరులు ఏర్పాటు చేయించి పందేలను స్వయంగా పర్యవేక్షించారు. అన్ని బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు.అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేష్ సమక్షంలో..అనకాపల్లి జిల్లాలో కూటమి నేతలు విద్యాలయాన్నే కోళ్ల పందేలకు అడ్డాగా మార్చేశారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలీసుల సమక్షంలోనే కోళ్లకు కత్తులు కట్టి మంగళవారం రోజంతా పందేలను నిర్వహించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోసం ప్రత్యేకంగా కోడి పందేలు జరిపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పేకాట, కోళ్ల పందేలు, బల్లాట తదితర జూద క్రీడలు నిర్వహించరాదని ఎస్పీ ముందుగానే ఆదేశాలు జారీ చేసినా ఎక్కడా లెక్క చేయలేదు. దేవరాపల్లి చరిత్రలో ఇంత విచ్చలవిడిగా కోళ్ల పందేలు జరగడం ఇదే తొలిసారి. హోంమంత్రి ఇలాకాలో బెల్టు షాపులు, పందేలు..ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతో పాటు యలమంచిలి, మాడుగులలో ఇష్టారాజ్యంగా కోడి పందేలను నిర్వహించారు. అడ్డరోడ్డు, వేంపాడు టోల్ప్లాజా వద్ద విచ్చలవిడిగా జరిగాయి. హోంమంత్రి నియోజకవర్గంలోనే బెల్టు షాపులు, కోళ్ల పందేలు ఏర్పాటైనా పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి నియోజకవర్గంలోని రామన్నపాలెం వద్ద లాటరీ బాల్తో పాటు బెల్టు షాపులకు వేలం నిర్వహించి మరీ అప్పగించారు. భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో కూడా కోడి పందేలను నిర్వహించారు. మురమళ్లలో హైటెక్ హంగులతో..సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండాటలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగాయి. ఐ.పోలవరం మండలం మురమళ్లలో స్టేడియాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన భారీ బరి వద్ద ముమ్మిడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో బుధవారం కోడి పందేలు జరిగాయి. ఆయనే స్వయంగా బరి వద్ద తిష్ట వేసి పందేలను పర్యవేక్షించారు. అమలాపురం, కాకినాడ ఎంపీలు గంటి హరీష్ మాధుర్, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా పందేలను ఆద్యంతం వీక్షించారు. రామచంద్రపురం, మండపేట, రాజోలు, కొత్తపేట, అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల అండదండలతో పందేలు జోరుగా సాగాయి. అన్ని బరుల వద్ద గుండాటలు, జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. జిల్లా మొత్తం మీద దాదాపు 110 కోడిపందేల బరులు ఏర్పాటు కాగా మురమళ్లలో హైటెక్ హంగులు, ఎల్ఈడీ స్క్రీన్లతో సిద్ధం చేశారు. ఒక్క మురమళ్ల బరి వద్దే రూ.60 కోట్ల మేర పందేలు జరగ్గా జిల్లాలో మొత్తం రూ.300 కోట్ల మేర సాగినట్లు అంచనా. ఇక మామిడికుదురు మండలం గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లితో పాటు అమలాపురంలో రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో హద్దులు మీరి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో పోలీసులు అటువైపు తిరిగి కూడా చూడలేదు.వేంపల్లెలో మందుబాబుల ఘర్షణ..వైఎస్సార్ కడప జిల్లా గిడ్డంగి వారి పల్లెలో మంగళవారం కోడిపందేల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. గెలిచిన వారికి ఓడిపోయిన వారు కోడి ఇవ్వలేదని తాగిన మైకంలో గొడవ పడ్డారు. భోగి రోజు టి.వెలమ వారి పల్లె గ్రామంలో ఆటగాళ్లకు తాగేందుకు నీళ్లు ఏర్పాటు చేయలేదని దుర్భాషలకు దిగారు. వర్షాలు సరిగా లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు ఒడిగడుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు, జూదాలు లాంటివి నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రామిరెడ్డి పల్లె, గిడ్డంగివారి పల్లె, ఎగువతువ్వపల్లె, అలవలపాడు గ్రామాల్లో పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా రెండు రోజులపాటు కోడి పందేలు కొనసాగించారు.ఎన్నారై టీడీపీ నేత తోటలో..అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన ఎన్నారై టీడీపీ నేతకు చెందిన తోటలో కోడి పందేలు జోరుగా సాగాయి. పల్లెల్లో ఎక్కడా పెద్దగా సంక్రాంతి కనిపించకపోయినా ఎన్ఆర్ఐ నేత తోటలో మాత్రం కోలాహలం నెలకొంది. రూ.లక్షల్లో జూదం సాగుతున్నా పోలీసులు అటువైపు తొంగి కూడా చూడలేదు. హద్దుల విషయంలో పుల్లంపేట, మన్నూరు పోలీసులు ఒక నిర్ణయానికి రాకుండా అది తమ పరిధిలోది కాదంటూ తప్పుకున్నారు. ⇒ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు జోరుగా సాగాయి. పందెం నిర్వహించే ప్రాంతాన్ని పూర్తిగా గ్రీన్ మ్యాట్తో కప్పేశారు. పందెం కాసేందుకు, తిలకించేందుకు వచ్చిన వ్యక్తుల నుంచి రూ.500 చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేశారు.⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు రెండు బులెట్లతో పాటు నాలుగు బైకులను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా నిర్వాహకులు అందజేశారు. ఫొటో: జిడివి63 : విజేతలకు బులెట్ను అందజేస్తున్న ఎమ్మెల్యే రాము⇒ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, అమలాపురం రూరల్ మండలం కామనగరువులో కోడి పందేల విజేతలకు బుల్లెట్లు బహుమతులుగా అందించారు. భీమవరంలో క్యాసినో.. డ్యాన్స్లుఉమ్మడి పశ్చిమ గోదావరిలో భారీ సినీ సెట్టింగులతో బరులు ఏర్పాటు చేసి ఫ్లడ్లైట్ వెలుగుల్లో రాత్రిపూట కూడా జాతరలా కోడి పందేలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో రూ.300 కోట్ల మేరకు కోడి పందాలు, జూదం కొనసాగినట్లు అంచనా. ప్రధానంగా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామన్నగూడెం, ఉండి నియోజకవర్గంలోని సీసలి, పెదఅమిరం, భీమవరం నియోజకవర్గంలోని డేగాపురం, దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగిలో కోట్లల్లో పందాలు కొనసాగాయి. వెంకట్రామన్నగూడెంలో బుధవారం రూ.1.25 కోట్ల పందెం కొనసాగింది. భీమవరం మండలంలో కోడిపందేల బరి వద్ద యువతుల రికార్డింగ్ డ్యాన్స్లు తాడేపల్లిగూడెంలోని ప్రభాకర్కు చెందిన నెమలి పుంజు, రంగాపురం రత్తయ్యకు చెందిన రసంగి పుంజు 20 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రభాకర్కు చెందిన పుంజు విజేతగా నిలవడంతో రూ.1.25 కోట్లను కైవసం చేసుకున్నారు. దెందులూరు, భీమవరంలో, వెంకట్రామన్నగూడెంలో భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి మద్యం, నాన్వెజ్తో సహా అన్ని సౌకర్యాలను శిబిరాల్లోనే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. క్యాసినో తరహాలో నగదు కాకుండా కాయిన్స్తో జూదాలు నిర్వహించారు. వెంకట్రామన్నగూడెంలో మహిళా బౌన్సర్లను ప్రత్యేకంగా నియమించారు. చింతలపూడి, పోలవరం, కైకలూరు, ఉంగుటూరు, తణుకులో ఎమ్మెల్యేలు శొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, కామినేని శ్రీనివాస్, పి.ధర్మరాజు, ఆరమిల్లి రాధాకృష్ణలు కోడి పందాలను ప్రారంభించి పరిశీలించారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో అత్యధిక పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బహుకరించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పశ్చిమ గోదావరిలో బరుల సంఖ్య భారీగా పెరిగింది.డ్యాన్స్లు.. క్యాసినోభీమవరం మండలంలో కూటమి నాయకులు నిర్వహించిన కోడి పందేల బరి వద్ద మ్యూజికల్ నైట్ పేరుతో మహిళలతో డ్యాన్స్లు చేయించారు. భీమవరంలో గతంలో ఎన్నడూలేని విధంగా క్యాసినో జూదం నిర్వహించారు. -
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్ సీజన్లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపోయారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సందడి లేని సంక్రాంతి
చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి ప్రజల దిగాలుపండగంటే కొత్త దుస్తులు, పిండి వంటలు, కొత్త వస్తువుల కొనుగోళ్లు, ఇంటికొచ్చిన బంధువులకు కానుకలు, చుట్టుపక్కలోళ్లకు పెట్టుబతలు.. గ్రామస్తులంతా తలో చేయి వేసి నిర్వహించే సామూహిక సంబరాలు.. ఇలా కోలాహలం కళ్లకు కట్టేది. ఈ ఏడాది ఏ ఊళ్లో అయినా ఇలాంటి సందడి కనిపిస్తుందేమోనని దివిటీ పట్టుకుని వెతికినా కనిపించని దుస్థితి. అన్ని వర్గాల ప్రజల్లో అదో నిర్లిప్తత, నైరాశ్యం. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై ‘సాక్షి’ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించాయి. ‘ఆనందంగా పండుగ చేసుకోవాలని ఉంది. అయితే అందుకు చేతిలో నాలుగు డబ్బులుంటేనే కదయ్యా..’ అని అంటున్నారు ఊరూరా జనం. పండగ అంటే గత ఐదేళ్లలోనే అని గుర్తు చేసుకున్నారు. ‘ఊళ్లో పరిస్థితి బాగోలేదు.. ఇంట్లోనూ అందుకు భిన్నంగా లేదు’ అని పెద్దలు వాపోయారు. ‘స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ ఆగిపోయాయి.. సచివాలయాల్లో పనులు కావడం లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యమయ్యాయి.. ఇంటికొచ్చి పని చేసి పెట్టే వలంటీర్లు కనిపించడం లేదు.. నెలకు రెండుసార్లొచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యారో తెలీదు.. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా లేదు.. మత్స్యకార భరోసా లేదు.. పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇళ్లకు పంపించేస్తున్నారు.. పరిస్థితి ఇట్లా ఉంటే ఏంది పండుగ చేసుకునేది?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో ఊరారా ఇదే దుస్థితి కనిపించింది. అందరి నోటా ఇదే మాట వినిపించింది. మొత్తానికి రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ కళ తప్పింది.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘అవసరానికి అందివచ్చే డబ్బులు.. కష్టకాలంలో ఆదుకునే పథకాలు.. వెరసి ప్రతి రోజూ పండుగ రోజే’ అన్నట్లుగా గత ప్రభుత్వ పాలనలో ప్రతి పేద ఇంటిలో సంతోషం కనిపించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతో ‘అవసరానికి చేతిలో చిల్లిగవ్వలేదు.. కష్టకాలంలో పట్టించుకునే నాథుడే కరువు.. పెద్ద పండుగ వస్తున్నా కన్పించని సందడి’ అన్నట్లు ప్రతి ఇల్లూ మారిపోయింది. రాష్ట్ర ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి సందడి ఈ ఏడాది ఊళ్లల్లో కనిపించడం లేదు. గడిచిన ఏడు నెలల్లో సంక్షేమాభివృద్ధి ఆగిపోవడమే ఇందుకు కారణం. దేశంలోనే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన ‘నవరత్నాలు’ ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజల గడపకు చేరడం లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు జమ (డీబీటీ పద్దతి) చేస్తూ గత సర్కారు అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం ఆపేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనీసం కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ సైతం అమలు చేయక పోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఐదేళ్లు మహోజ్వల వైభవంగత ప్రభుత్వంలో ప్రతి ఏడాది సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, చెప్పిన నెలలో చెప్పిన సమయానికి ఆయా వర్గాలకు ఆర్థిక లబ్ధిని వారి ఖాతాలకు (డీబీటీ పద్దతి) నేరుగా జమ చేసేవారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య, వైద్యం అందించడంతోపాటు వారి రోజువారీ అవసరాలకు చేతిలో డబ్బులు ఉండేలా చేశారు. తద్వారా జీవన ప్రమాణాలు పెరిగేలా చేశారు. విద్యార్థులు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లతోపాటు పొదుపు మహిళలు, రైతులకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఆర్థిక లబ్ధిని కలిగించే సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించడంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో ప్రజలు ఆర్థిక ఇక్కట్లను అధిగమించి కొనుగోలు శక్తి కొనసాగేలా చేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వంటి పర్వదినాల్లో కొత్త దుస్తులు, ఇంట్లోకి కావాల్సిన సామగ్రి, పిండి వంటలకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసుకునేలా చేశారు. ప్రధానంగా విద్య, వైద్యం పరంగా దిగుల్లేకుండా చేశారు. సచివాలయ–వలంటీర్ వ్యవస్థతో ఉన్న ఊళ్లోనే పనులన్నీ జరిగేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి మార్పుల దిశగా గత 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ అడుగులు పడలేదు. అలాంటి మార్పులను.. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో సాకారం చేసింది. తద్వారా ఉన్నత వర్గాలతోపాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా పండుగలను ఆనందంగా జరుపుకొనేలా ఆర్థిక ఊతం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లలో కోత పెట్టేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో పాటు మరో పథకాన్ని ప్రజలకు అందివ్వలేదు. ఏడు నెలలైనా ఒక్క పథకాన్ని కూడా అందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు చేతికి వచ్చేవని, ఆ డబ్బులతో కావాల్సినవి కొనుక్కుని ఇంటిల్లిపాది పెద్ద పండుగను గొప్పగా జరుపుకొనేవాళ్లమని గతం గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. కూటమి సర్కారు రాకతో తమ పరిస్థితి తారుమారైందని వాపోతున్నారు. గత సర్కారే కొనసాగి ఉంటే గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పలు పథకాల ద్వారా దాదాపు 2.63 కోట్ల మందికి రూ.20,102 కోట్లçకుపైగా లబ్ధి చేకూరేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు అందక పోవడంతో పండుగ పూట పస్తులు తప్పడం లేదని పేదలు ఆవేదన చెందుతున్నారు.అసంపూర్తి గదిలో పాఠాలుఇది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇందులో దాదాపు 220 మంది చదువుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తరగతి గదుల నిర్మాణానికి రూ.1,93,88,511 మంజూరయ్యాయి. భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలోనే రూ.75,42,872 ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మిగిలిన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గదులకు కిటికీలు, డోర్లు, టైల్స్ అమర్చాల్సి ఉంది. బయటి వైపు ప్లాస్టింగ్ చేయాలి. గదుల కొరత కారణంగా అసంపూర్తిగా ఉన్న నూతన భవనాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కిటికీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్ధులకు ఎండ తగలకుండా ఉండేందుకు యూరియా సంచులు అడ్డు పెట్టారు. బంధువులను పిలవలేకపోతున్నాంగత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా వచ్చే డబ్బులతో పిల్లల ఫీజు కట్టే వాళ్లం. ఈసారి ‘తల్లికి వందనం’ సాయం అందలేదు. పంటలో వచ్చిన డబ్బులన్నీ స్కూల్ ఫీజులకే చాలడం లేదు. పండుగ వచ్చినా మా ఇంట్లో ఎలాంటి సంబరాలూ చేసుకోలేని స్థితి. మా చుట్టుపక్కల ఏ గ్రామంలో చూసినా సంక్రాంతి సందడి కనిపించడం లేదు. చాలా మందితో ఫోన్లో మాట్లాడితే ఇదే సమాధానం చెబుతున్నారు. బంధువులను కూడా ఇళ్లకు పిలవలేని పరిస్థితి నెలకొంది.– రైతు గోవిందప్ప, సంతేబిదనూరు, హిందూపురంఇప్పుడు ఆ సందడి లేదువిజయనగరం పట్టణం మూడు రాష్ట్రాలకు వాణిజ్య కేంద్రం. గత ఐదు సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కంటే ఉమ్మడి విజయనగరం ప్రజల నుంచి మార్కెట్లో కొనుగోలుదారులు పెరిగారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ వ్యాపారం తగ్గింది. ముఖ్యంగా బడుగు మధ్యతరగతి ప్రజల నుంచి కొనుగోళ్లు తగ్గాయి. గతంలో సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి వ్యాపారాలు ఉండేవి. అటు హోల్సేల్ ఇటు రిటైల్ వ్యాపారాలతో పట్టణం కళకళలాడేది. ఇప్పుడా సందడి కనిపించడం లేదు.– కాపుగంటి ప్రకాష్, అధ్యక్షుడు, విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్కొనుగోలు శక్తి తగ్గిందిగత ఐదేళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో కరోనా వచ్చినప్పటికీ సంక్రాంతంటే మార్కెట్ కళకళలాడేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఆర్థికంగా కాస్త నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తాయి. ఇప్పుడు ఏ పథకాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోళ్లు లేక ఈ సంక్రాంతి కళ తప్పింది. – షేక్ చాంద్బాషా, మండీ మర్చంట్, పాత మార్కెట్, కడప సంక్రాంతి పండగలానే లేదుఈ ఏడాది సంక్రాంతి కళ మా గ్రామంలో కనిపించడం లేదు. వ్యాపారాలు పడిపోయాయి. గ్రామస్తుల దగ్గర డబ్బులు లేవు. రొటేషన్ లేక కొనుగోలు శక్తి తగ్గిపోయింది. గ్రామంలో మా కిరాణా షాపు గత ఏడాది వరకు రోజుకు రూ.15 వేలు అమ్మకం జరిగేది. ప్రస్తుతం రూ.5 వేలు కూడా అమ్మకం జరగడం లేదు.– లావుడియా శ్రీనివాసరావు, సర్పంచ్, కనిమెర్ల, ఎన్టీఆర్ జిల్లాసంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డాంపశువులు, వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గత ఆర్నెల్లుగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కనీసం సంక్రాంతి కానుకైనా ఇస్తుందని ఆశగా ఎదురు చూశాం. అది కూడా లేకుండా చేశారు. పెరిగిన పప్పులు, నూనెల ధరలు చూస్తుంటే పండుగకు పిండి వంటలు మానుకోవడమే ఉత్తమంగా కన్పిస్తోంది. ఈ ఏడాది మాలాంటోళ్లందరూ ఇలానే అంటున్నారు. – ఎస్.భవాని, కొత్తవలస, విజయనగరం జిల్లాపంట మునిగినా పైసా ఇవ్వలేదు.. ఇంక పండగెక్కడ?వైఎస్సార్ హయాంలో కాలనీ ఇల్లు వచ్చింది. అందులోనే ఉంటున్నాం. జగన్ వచ్చిన తర్వాత మా అబ్బాయికి అమ్మ ఒడి పడేది. పదో తరగతి పూర్తయింది. మాకు 30 సెంట్లు భూమి ఉంది. గత ఏడాది వరకు జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడిసాయం ఇచ్చేది. రైతులం పంటలు పండించుకునేవాళ్లం. ఈసారి ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పోసప్పో చేసి పంట వేశాం. మొన్న అక్టోబర్లో వర్షాలకు పొలం మునిగిపోయింది. పంట నష్టం ఇస్తామని చెప్పారు. అధికారుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నాను. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంక మా బతుకులకు పండగొకటి. అన్నిటికీ ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. – పల్లా రాము, రైతు, టి.నగరపాలెం, భీమిలి నియోజకవర్గంగత ప్రభుత్వంలోనే ఎంతో మేలుప్రస్తుతం ఏ కుటుంబమూ సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఓ వైపు ఆర్థిక సమస్య, మరోవైపు ధరలు చూస్తే ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఉంటే పిండి వంటలు ఎలా వండుకుంటాం? సంతోషంగా పండగ ఎలా జరుపుకుంటాం? గత ప్రభుత్వ హయాంలోనే ఎంతో మేలు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మా బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యేది. ఖర్చులకు, అవసరాలకు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – సీహెచ్ భారతి, గృహిణి, నెల్లూరుచేతిలో లెక్కేదీ?వైఎస్సార్ జిల్లా అనిమెల గ్రామంలో సుమారు 2,500 జనాభా ఉంది. ఈ గ్రామంలో గత ఐదేళ్లు సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కళ తప్పింది. పండుగ ఆనందం ఏ ఒక్క ఇంట్లోనూ కనిపించలేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు తగ్గట్లు దిగుబడులు లేకపోగా, వచ్చిన అరకొర దిగుబడికి ఆశించిన ధరలు లేక రైతులు ఆవేదనతో ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం నుంచి ఏ సహాయం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఒక్క గ్రామానికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.1.8 కోట్లు లభించింది. ఈ లెక్కన ప్రజల చేతుల్లో డబ్బు ఏ రీతిన రొటేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని గ్రామస్తులు అన్నారు. ఏం ఉందని జరుపుకోవాలి?బాపట్ల జిల్లా రాజుబంగారుపాలెంలో 3,200 కుటుంబాలుంటున్నాయి. ఈ ఊళ్లో దాదాపు అందరూ సామాన్యులే. ‘ఏమ్మా.. పండుగ ఎలా చేసుకుంటున్నారు..’అన్న ప్రశ్నకు రైతులు, కూలీలు, చిరువ్యాపారులు, ఆటోవాలాలు, కూరగాయలమ్ముకునే మహిళలు.. ఇలా అందరూ కూడబలుక్కున్నట్లు ఒకే సమాధానం చెప్పారు. అమ్మ ఒడి రాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. చేయూత రాలేదు. ధాన్యం పండిస్తే మద్దతు ధర ఇవ్వలేదు.. అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. ఊరిని నమ్ముకొని చికెన్ కొట్టు పెట్టుకుంటే జనం దగ్గర డబ్బులు లేక కొట్టు మూయాల్సి వచ్చిందని వెంకటేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పిల్లోళ్లకు బట్టలు కొందామంటే డబ్బులు లేక ఉప్పుకయ్యల్లో పనికెళుతున్నానని జొన్నలపావని కన్నీటి పర్యంతమైంది. జగనన్న లాగా నెలనెలా డబ్బులు ఇచ్చివుంటే అందరం సంతోషంగా పండుగ చేసుకునేవారమని సరస్వతి పేర్కొంది. పింఛన్లు తీసేశారని కొందరు, రైతు భరోసా ఇవ్వలేదని ఇంకొందరు వాపోయారు. ఇలాంటి కష్టాల్లో పండుగ ఎలా జరుపుకోగలమని ఊరు ఊరంతా ఎదురు ప్రశ్నిస్తోంది. సాయం అందితే కదా..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం (వీకే రాయపురం) గ్రామంలో ఎవరిని కదిపినా చేతిలో డబ్బులు లేకుండా పండుగ ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. సుమారు 2,600 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఏ వీధిలో ఎవరిని పలకరించినా జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, అర్హులందరికీ పథకాలు రావడంతో గత ఏడాది సంక్రాంతిని ఊరు ఊరంతా హుషారుగా పండగ చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక వరుస తుపానులతో పంటలు నష్టపోయినా సాయం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న ఏకైక మినీ రైస్మిల్లు గత సంక్రాంతికి ముందు కస్టమర్లతో కిక్కిరిసిపోయేదని, ఈ సంక్రాంతికి రోజుకు ఐదుగురు రావడమే గగనమైపోయిందని యజమాని రేలంగి వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మద్యం, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామంలోకి వచ్చేయడంతో రోజంతా కష్టపడ్డ రెక్కల కష్టంలో సగం సొమ్ము మద్యానికే వెచ్చించడం కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని మహిళలు అంటున్నారు. నాడు వలంటీరు వ్యవస్థతో ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఇంటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. -
ధరలు ధగధగ.. వ్యాపారం వెలవెల!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సందడి పెద్దగా కనిపించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ వ్యాపారాలు అంతంత మాత్రమేనని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సంతోషంగా పండుగ ఎలా చేసుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే వస్త్ర, బంగారు, ఇతర వ్యాపారాలన్నీ దాదాపు సగానికి సగం పడిపోయాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పూట పిండి వంటలు చేసుకునేందుకు కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎనిమిది నెలలుగా ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న నిత్యావసరాల ధరలను చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు నాలుగు రకాల పిండి వంటలు కూడా చేసి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. గతేడాది జనవరితో పోల్చి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల నుంచి బియ్యం వరకు మండుతున్న ధరలను చూసి గగ్గోలు పెడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయలేని టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరో వైపు ఎన్నికల్లో ఇచి్చన హామీలు అమలు చేయకపోగా, చంద్రన్న సంక్రాంతి కానుక సైతం ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 20–40 శాతం మేర పెరిగిన ధరలు సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. పండుగ నాలుగు రోజులు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకే కాదు.. బంధువులు, స్నేహితులకు ఘుమ ఘుమలాడే పిండి వంటలు వండి వడ్డించడం మన తెలుగువారి సంప్రదాయం. బూరెలు, గారెలు, అరిసెలు, సున్నుండలు, పొంగడాలు, పాకుండలు, కజ్జి కాయలు, పులిహోర ఇలా ఎవరికి వారు తమ స్థాయికి తగ్గట్టుగా పిండి వంటలు చేసుకుని ఆనందంగా గడుపుతారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నిత్యావసరాల ధరలు షేర్ మార్కెట్లా దూసుకెళ్లాయి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ అండదండలతో అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. గతేడాది సంక్రాంతికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం సగటున 20 నుంచి 40 శాతం మేర పెరిగాయి. నిత్యావసర వస్తువులే కాదు.. కాయగూరల ధరలు సైతం పెరిగాయి. వెల్లుల్లి అయితే రికార్డు స్థాయిలో మూడు రెట్లు పెరిగింది. పిండి వంటల్లో ఉపయోగించే పప్పులు, బెల్లం, నెయ్యి ధరలు కూడా గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. పప్పన్నానికీ దూరం పండుగ పూట పప్పన్నం వండుకునేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధర సామాన్య, నిరుపేదలను బెంబేలెత్తిస్తోంది. గతేడాది జనవరిలో కిలో రూ.84.50 ఉన్న శనగపప్పు ప్రస్తుతం రూ.100–140 పలుకుతోంది. గత ఏడాది రూ.150 ఉన్న కందిపప్పు అయితే నేడు ఏకంగా రూ.160–224తో అమ్ముతున్నారు. గతేడాది రూ.126 పలికిన పెసరపప్పు నేడు రూ.140–170 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ.20 తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ, అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం గతేడాది కిలో రూ.50 పలుకగా, నేడు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. బియ్యం ధర గురించి అయితే చెప్పనవసరం లేదు. గతేడాది ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.57 ఉండగా, నేడు సాధారణ రకమే ఆ ధరతో విక్రయిస్తున్నారు. ప్రీమియం రకాలు రూ.64–75 మధ్య పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం ధర కిలో రూ.120కి పైగానే ఉంది. నూనెల ధర ధగధగ దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకు రూ.30–50 వరకు ఎగబాకాయి. దిగుమతి సుంకంతో సంబంధం లేని కొబ్బరి నూనె కిలోకు రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10–30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.20 అదనంగా ఉన్నాయి. గతేడాది జనవరిలో లీటర్ 88.60 ఉన్న పామాయిల్ ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. రూ.112.80 పలికిన సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ ప్రస్తుతం రూ.150–160 చొప్పున అమ్ముతున్నారు. నెయ్యి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు పెరిగింది. పాల ధరలు గతంతో పోలిస్తే లీటర్కు రూ.10–20 మేర పెరిగాయి. ఇలా బెంబేలెత్తిస్తున్న నిత్యావసర ధరల ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సగటున ఒక్కో కుటుంబంపై రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది.ముందస్తు ఆర్డర్లు లేవు.. సంక్రాంతి గతంలో ఉన్నట్టు ఈ ఏడాది లేదు. ముందస్తు ఆర్డర్లు తగ్గిపోయాయి. కార్పొరేట్ గిఫ్టుల కోసం తప్పితే ప్రజల నుంచి వచ్చే ఆర్డర్లు లేవు. చిన్న కుటుంబం రూ.1,500 ఖర్చు చేస్తే 10 రకాల పిండి వంటలు అందించేవాళ్లం. అవి దాదాపు 11–12 కిలోలు ఉండేవి. గతంలో పెట్టిన డబ్బులకు ఇప్పుడు 8 కిలోలు కూడా ఇవ్వలేకపోతున్నాం. శనగపిండి, వంట నూనెల రేట్లు పెరగడంతో తక్కువ పిండి వంటలు కొనుక్కుంటున్నారు. నెయ్యి క్వాలిటీదైతే రూ.వెయ్యి పలుకుతోంది. కంపెనీ నెయ్యి హోల్సేల్లోనే గతంలో కిలో రూ.500–550 ఉంటే ఇప్పుడు రూ.650 పలుకుతోంది. కొత్తగా అల్లుళ్లు, కోడళ్లకు సారె పెడితే 100 మందికి పంచుకునే వాళ్లుŠ. ఇప్పుడు 20–30 మందికే పరిమితం అయ్యేలా పెడుతున్నారు. ఫలితంగా మాకు ఆర్డర్లు తగ్గిపోయాయి. – కె.సందీప్, పిండి వంటల వ్యాపారం, రావులపాలెంమూడొంతుల వ్యాపారం పడిపోయింది సాధారణ రోజుల్లో రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వ్యాపారం జరిగేది. పండుగ సీజన్లో రోజుకు రూ.19 వేల వరకు జరిగేది. సంక్రాంతి పండుగకు 15 రోజుల ముందు నుంచి షాపు కిటకిటలాడేది. ఇంటిల్లిపాది కొత్త చెప్పులు కొనుగోలు చేసేవారు. కానీ ఆరు నెలల నుంచి వ్యాపారం బాగా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో రూ.2 వేలు దాటడం లేదు. ఈ పండుగ సీజన్లోనూ రూ.4 వేలకు మించడం లేదు. మూడొంతుల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల ఇబ్బంది పడాల్సి వస్తోంది. – ఇమ్రాన్, చెప్పుల వ్యాపారి, అనంతపురంరూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు.. చాలా రోజులుగా బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నా. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నగలు తయారీ చేయించి విక్రయిస్తుంటాను. పలువురు మహిళా కస్టమర్లకు వాయిదాల పద్ధతిలో కూడా నగలు చేయించి ఇస్తున్నా. గతేడాది వరకు సంవత్సరానికి రూ.50 లక్షల మేరకు వ్యాపారం సాగుతుండేది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఈ ఏడాది రూ.25 లక్షలకు మించి వ్యాపారం జరగలేదు. ప్రస్తుతం తమ చేతులో డబ్బుల్లేవని కస్టమర్లు చెబుతున్నారు. – వి.శేషగిరిరావు, శ్రీ మహేశ్వరి జ్యూయలర్స్, ఆత్మకూరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ సంక్రాంతి పండుగ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రధాన పట్టణాల నుంచి నిత్యావసర సరుకులు పెద్ద మొత్తంలో తెచ్చాం. కనీసం సాధారణ రోజుల్లో జరిగినంత వ్యాపారం కూడా జరగడం లేదు. గత ఏడాది సంక్రాంతికి పది రోజుల నుంచి పండుగ వరకు మా దుకాణంలో సుమారు రూ.25 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ఈ ఏడాది జనవరి 12 వస్తున్నా కనీసం రూ.3 లక్షల వ్యాపారం జరగలేదు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు. – శ్రీరాములు, జనరల్ స్టోర్ యజమాని, తిరుపతి ఇప్పుడే ఈ పరిస్థితి పెద్ద పండుగ వేళ అస్సలు వ్యాపారం లేకపోవడం ఇప్పుడే చూస్తున్నాం. ఎవరిని అడిగినా డబ్బులేదంటున్నారు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఆఫర్లు మంచిగా ఇస్తున్నాం. కానీ ఎవ్వరూ కొనడం లేదు. కాలానికి తగ్గట్టు టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లలో కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్నాయి. బాగానే సేల్ అవుతాయని ఆశించాం. కానీ ఎల్రక్టానిక్స్ రంగం మొత్తం పండుగ వేళ పడిపోయింది. – బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారి, నగరి ఇలా అయితే పండుగ చేసుకునేదెలా? నేను వ్యవసాయ పనులకు వెళ్తాను. నెలకు రూ.10 వేలు కూడా రావట్లేదు. నిత్యావసరాలకు గతంలో రూ.3 వేలయ్యేది. ప్రస్తుతం రూ.5 వేలకు పైగా ఖర్చవుతోంది. కందిపప్పు రూ.180 పైగానే ఉంది. వంట నూనె ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలు ఇలా మండిపోతుంటే పండుగలెలా చేసుకుంటాం? ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే భయపడే పరిస్థితి కన్పిస్తోంది. – ద్వారపూడి సత్యారావు, సీతారాంపురం, విజయనగరం జిల్లావ్యాపారాలు తగ్గిపోయాయి ప్రస్తుతం వ్యాపారాలు 75% తగ్గిపోయాయి. చాలా ఏళ్లుగా సామర్లకోటలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాను. గత సంక్రాంతి సీజన్లో రోజూ రూ.20,000 వ్యాపారం జరిగేది. ఈ సీజన్లో రూ.5,000 కూడా జరగడం లేదు. ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం వల్ల కొనేవారు తగ్గిపోయారు. – గ్రంథి సత్యనారాయణమూర్తి, వస్త్ర వ్యాపారి, సామర్లకోట, కాకినాడ జిల్లా -
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
ఏడు కొండలవాడా.. ఎంత ఘోరం.. ఎంత ఘోరం
గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి.గతంలో గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి..! నాడు పబ్లిసిటీ పిచ్చి.. నేడు అలవిమాలిన అలసత్వం!సందర్భం ఏదైనప్పటికీ ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యానికి అమాయకులు బలి అవుతున్నారు! కోట్లాది మంది తమ జీవిత కాలంలో ఒక్క అవకాశం కోసం ఆరాట పడే వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ ఏర్పాట్లలో సర్కారు వైఫల్యం కారణంగా పెను తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.సాక్షి తిరుపతి నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది. 30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది. చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది. రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది. ఏటా భారీగా భక్తులు తరలివచ్చే వైకుంఠ ఏకాదశికి టికెట్ల జారీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కనీస మార్గదర్శకాలను గాలికొదిలేయడంతో భక్తులు బలైపోయారు. రోజుకు 75 వేల మందికిపైగా భక్తులు తరలివస్తున్నా.. ఏటా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు ఆరేడు లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నా.. ఏనాడూ ఇటువంటి విషాదం సంభవించ లేదు. కేవలం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారహిత్యంతోనే తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట సంభవించి మాటలకందని పెను విషాదానికి దారితీసింది. ముమ్మాటికీ ఇది నిర్లక్ష్యమేవైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఆనవాయితీ. పది రోజుల పాటు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు టీటీడీ టోకెన్ల జారీ ప్రక్రియ ఏర్పాటు చేసింది. తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పది రోజుల పాటు ఈ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగనుంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో బైరాగిపట్టెడ ఎంజీఎం స్కూల్, ఎంఆర్పల్లి, శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో చౌల్ట్రీ, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, సత్యనారాయణపురం (జీవకోన) ప్రాంతాల్లో టీటీడీ టోకన్ల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని భక్తులకు చేరవేయంలో టీటీడీ విఫలమైంది. దీంతో భక్తులు మంగళవారం రాత్రే తిరుపతికి పయనమయ్యారు. బుధవారం ఉదయం నుంచే తండోపతండాలుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలోని ఎంజీఎం స్కూల్కు చేరుకున్న భక్తులను క్యూలైన్లోకి అనుమతించలేదు. దీంతో సాయంత్రానికి భారీగా భక్తులు పెరిగిపోయారు. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి పంపమని సూచించినా, డీఎస్పీ ఒకరు నిరాకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. రాత్రి 8.35 గంటల ప్రాంతంలో అందరినీ ఒకేసారి విడిచి పెట్టమని డీఎస్పీ ఆదేశించటంతో పోలీసులు గేట్లు తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లోకి ప్రవేశించటంతో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో కింద పడిపోయిన వారిని పైకి లేపే అవకాశం లేక.. ఊపిరి ఆడక ఆరుగురు మృతి చెందారు. కింద పడిపోయిన వారిని బతికించేందుకు భక్తులు, పోలీసులు కొందరు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అదే విధంగా శ్రీనివాసం, ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ కేంద్రాలకు వచ్చిన వారిని వచ్చినట్లే క్యూలైన్లోకి అనుమతించారు. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని, తీవ్ర గాయాలపాలైన వారిని రుయా, సిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారు, తీవ్ర గాయాలైన వారిలో ఎక్కువ మంది మదనపల్లి, తమిళనాడుకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.అన్ని కౌంటర్ల వద్ద తొక్కిసలాటఅలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద బుధవారం ఉదయం నుంచి భక్తులు పడిగాపులు కాశారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేశారు. క్యూ లైన్లోకి వెళ్లే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది భక్తులు కిందపడిపోయారు. ఈ తోపులాటలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. తోపులాట చోటు చేసుకోవటంతో భక్తుల అరుపులు, రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. టీటీడీ వైఫల్యం..వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వం, టీటీడీ పూర్తిగా విఫలమైంది. క్యూలైన్ల వద్ద టాయిలెట్లు లేవు. దీంతో మహిళలు, చిన్నారులు నరకం అనుభవించారు. అనేక ప్రాంతాల్లో కనీసం తాగు నీరు కూడా ఏర్పాటు చేయలేదు. అన్న ప్రసాద వితరణ ఎక్కడా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి నీరు అందించి చేతులు దులుపుకున్నారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో ఒకసారిగా గేట్లు తెరవడంతో జనాలు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 40 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం నరసాపురం నుంచి 360 మంది గోవిందమాల భక్తులు కాలి నడకన తిరుపతికి చేరుకున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్గా ఉంది. వీరితో పాటు వచ్చిన బంధువులు బాధితులకు ఏమి జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో వేచి చూస్తున్నారు. ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. దారుణం జరిగిపోయాక పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ప్రచారార్భాటమే2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచారార్భాటం కోసం చేసిన షూటింగ్ గిమ్మిక్కుతో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు టీటీడీ వ్యవస్థను భ్రష్టు పట్టించడం అడుగడుగునా కనిపిస్తోంది. బాబుకు తోడుగా అభినవ సనాతన ధర్మ పరిరక్షకుడిగా బ్రాండ్ ఇమేజ్ కోసం తిరుపతిలో సినీ తరహాలో గిమ్మిక్కులు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా టీడీడీ వ్యవస్థను దెబ్బ తీయడంలో తానో చేయి వేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి సేవలో తరిస్తే చాలు.. సామాన్య భక్తులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా టీటీడీ యంత్రాంగం నిర్లిప్తంగా మారిపోయింది. టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల అదనపు జేఈవో వైఖరి భక్తుల పాలిట యమపాశమైంది. వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని ఆశించిన భక్తుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఈ ఘోరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలచివేస్తోంది. రామానాయుడు స్కూల్లో దారుణంఅక్కడే 40 మంది వరకు అపస్మారక స్థితిలోకి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంతిరుపతి అర్బన్: తిరుపతిలోని రామానాయుడు స్కూల్లో బుధవారం రాత్రి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట సంభవించి 40 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 360 మంది గోవిందమాల భక్తులు మూడ్రోజులపాటు నడిచి తిరుపతికి చేరుకున్నారు. వీరంతా అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల నరసాపురం నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన బంధువులు తమ వారికి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతున్నారు. ఎటు వెళ్లాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక స్కూల్కు దగ్గరలో ఉన్న పద్మావతి పార్కులో తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్లో జరిగిన తొక్కిసలాటలో మదనపల్లె, పుంగనూరు, నరసాపురం, చిత్తూరు, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారున్నట్లు సమాచారం. భక్తజ నాన్ని అదుపుచేయడంలో అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైంది. అయితే, ఈ చీకట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. పెద్దఎత్తున పర్సులు, సెల్ఫోన్లు, జేబులు కొల్లగొట్టారు. దారుణం జరిగిపో యాక పోలీసు రావడంతో భక్తులు మండిపడుతున్నారు.నాడు కట్టుదిట్టంగా.. నేడు నిర్లక్ష్యంగా..తిరుపతి సిటీ: వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు సామాన్య భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీటీడీ పటిష్ట ఏర్పాట్లుచేసింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంగానీ, టీటీడీ గానీ సామాన్య భక్తులను పట్టించుకోలేదని శ్రీవారి భక్తులు దుమ్మెత్తిపోస్తూ గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలను గుర్తుచేస్తున్నారు.నాడు2023 డిసెంబరు 23వ తేదీ వైకుంఠ ఏకాదశి, 2024 జనవరి 1వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 22వ తేదీ వేకువజాము 5 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభించారు. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాల్లో వీటిని జారీచేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 10వేల చొప్పున పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మొత్తం పది రోజుల్లో లక్ష టోకెన్లు జారీచేశారు. ప్రతి కౌంటర్ దగ్గర సింగిల్ లైన్ క్యూలు ఏర్పాటుచేశారు. కౌంటర్ వద్ద ఒకే వ్యక్తి టోకెన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు కౌంటర్ల వద్ద రద్దీలేకుండా చర్యలు చేపట్టారు. అలాగే.. జారీచేసిన టోకెన్లు, మిగిలినవి పారదర్శకంగా తెలిసేలా డిస్ప్లే బోర్డులు పెట్టారు. దీంతో భక్తులకు సక్రమంగా సమాచారం అందేది. అలాగే.. ఒక్కో కౌంటర్ వద్ద టీటీడీ సెక్యూరిటీతోపాటు పోలీసులు సుమారు 25 మంది భద్రతా విధులు నిర్వర్తించేవారు. గంట గంటకూ టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే వారు.నేడు..వైకుంఠ ద్వార దర్శన టోకెన్లకు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలు ఏర్పాటుచేశారు. గురువారం వేకువజాము 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించాల్సి ఉంది. అయితే, భక్తుల రద్దీ కారణంగా బుధవారం రాత్రి 9 గంటలకే పంపిణీ మొదలుపెట్టారు. దీనికితోడు అపరిమితంగా టోకెన్ల జారీకి టీటీడీ సన్నద్ధం కావడంతో కౌంటర్ల వద్దకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అదుపు చేయలేని పరిస్థితుల్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తుల మధ్య తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. శ్రీనివాసం దగ్గర ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్దకు భక్తులను ఒక్కసారి గుంపులుగా వదలడమే తొక్కిసలాటకు కారణంగా భావిస్తున్నారు. ఒక్కో కౌంటర్ వద్ద కేవలం ఇద్దరు ముగ్గురు పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించారు. తొక్కిసలాట జరిగాక అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వారు వీరే..లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట నిర్మల (45), పొల్లచ్చి, తమిళనాడు వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతా పం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. అక్కడి పరిస్థితు లను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.తిరుపతి ఘటనపై సీఎం రేవంత్ విచారం సాక్షి, హైదరాబాద్: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సాను భూతి ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. -
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
సాక్షి, అమరావతి: దంపతులంటే..? జీవిత భాగస్వాములంటే..? భార్యాభర్తలు కాదా? వైవాహిక బంధానికి కూటమి సర్కారు కొత్త భాష్యం చెబుతోంది! పేదల పింఛన్ల విషయంలో చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతోంది. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరణించిన పింఛన్దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎడాపెడా పింఛన్లకు కోత పెడుతూ.. అసలు కొత్త వాటి ఊసే లేకుండా చేసింది. ఆర్నెల్లలో దాదాపు 1.72 లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. మరోవైపు లక్షలాది దివ్యాంగ పింఛన్లపై ఏరివేతల కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్ల మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చే విషయంలో వింత విధానాలను అమలు చేస్తోంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో కేవలం భార్యకు మాత్రమే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. స్పౌజ్ అంటేనే భార్యా భర్తలని అర్థం! కానీ ఆ పదానికే అర్థం మార్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ఇంటికి ఒకే పింఛను విధానం ప్రకారం... ఎక్కడైనా భార్య చనిపోయి, ఆ కుటుంబంలో భర్త ఇప్పటికీ పింఛను పొందని పరిస్థితి ఉంటే... 70–80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పుడా ఆస్కారమే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. ప్రస్తుతం ఫించన్ తీసుకుంటూ కుటుంబంలో భర్త చనిపోతే అతని భార్యకు మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేసేలా జారీ చేసిన సర్క్యులర్ ఇది. అది కూడా నవంబర్ 1 తర్వాత చనిపోయిన వారికే వర్తించేలా.. 23 వేల మంది చనిపోతే.. ఐదు వేల మందికే! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య పింఛను లబ్ధిదారుల్లో దాదాపు 23 వేల మంది చనిపోగా స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వీరికి డిసెంబరులో పింఛన్లు మంజూరు కాగా నెలాఖరులో తొలి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12వ తేదీ నుంచి నవంబరు 1కి ముందు వరకు దాదాపు నాలుగున్నర నెలల వ్యవధిలో భర్తలు మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల కుటుంబాల్లో వారి భార్యలకు మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామంటూ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. 50 ఏళ్లకే పింఛను దేవుడెరుగు.. కూటమి సర్కారు వచ్చాక ఉన్న పెన్షన్లే ఊడగొడుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశిస్తున్నారు. ఎడాపెడా కోతలు.. ఒకవైపు కొత్తగా పింఛన్ల కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు ఎడాపెడా పెన్షన్లు ఏరివేస్తూ పింఛన్దారులను హడలెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత ఆర్నెల్లలో ఏకంగా 1,71,921 పింఛన్లను తగ్గించేసింది. గతేడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగగా, గత డిసెంబరు 31న కూటమి ప్రభుత్వం కేవలం 63,77,943 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే.పింఛన్లకు మరింత భారీగా కోతలు పెట్టేందుకు పక్షవాత బాధితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా దీర్ఘకాలిక జబ్బుల రోగులకు శల్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న 8.18 లక్షల మంది లబ్ధిదారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు మళ్లీ సమర్పించాలంటూ వారిపై కత్తి వేలాడదీసింది. ‘రియల్’ సీన్ ఇదీ.. గత ఐదేళ్లపాటు కోవిడ్ సమయంలోనూ ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే సజావుగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం రాగానే తూట్లు పొడిచింది. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రియల్టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సర్వేలో 12.7 శాతం మంది లబ్ధిదారులు తమకు ఇంటి వద్ద పెన్షన్లు అందడం లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరు శాతం మంది లబ్ధిదారులు తెలిపారు.నాడు నిరంతరం.. సంతృప్త స్థాయిలో..వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో నిరంతరం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గత ఐదేళ్ల పాటు కొత్తగా పింఛనుకు అర్హత పొందే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వలంటీర్లే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 60 ఏళ్ల దాటిన వారు సైతం కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేసింది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు రెండు లక్షలకు పైగా అర్జీలను కూడా కూటమి ప్రభుత్వం మూలన పడేసింది. -
బాబూ.. జీతాలెప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్ అమరావతి జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు. వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్వో సంఘం గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో సేవలు అందించే తమకు డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్వో) అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్ ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
స్కామ్ల పరం.. అమరావతి పురం!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో అమరావతిని కూటమి ప్రభుత్వం కుంభకోణాల మయంగా మార్చేస్తోంది. అడుగడుగునా కమీషన్ల దందాతో ఖజానాకు చిల్లు పెడుతూ అమరావతిని అక్రమాల పురంగా తీర్చిదిద్దుతోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇప్పటికే అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిపై మోపితే వ్యతిరేకత వస్తుందని పసిగట్టి దాన్ని రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేస్తోంది. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి, వాటినే కమీషన్లు రూపంలో వసూలు చేసుకునేందుకు ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలను గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు బహిర్గతం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రెండింటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే అయినా హ్యాపీ నెస్ట్ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,500కిపైగా అదనంగా ఉండటమే అక్రమాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.షెడ్యూళ్లకు 8వ తేదీ తుది గడువుఅమరావతిలో 2018లో నాటి టీడీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తుల్లో 1,200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నారైలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అడ్వాన్సులు సేకరించింది. హ్యాపీ నెస్ట్ పనులను అప్పట్లో రూ.658 కోట్లకు సీఆర్డీఏ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. అయితే అది ముందుకు కదల్లేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత టెండర్ను రద్దు చేసింది. తాజాగా రూ.818.03 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మూడేళ్ల పాటు నిర్వహించాలనే నిబంధనతో ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో టెండర్లు పిలిచింది. టెండర్ల షెడ్యూళ్ల దాఖలుకు ఈనెల 8వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్లను పదో తేదిన తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది. జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు రూ.153.05 కోట్లు రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొంది. షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం ప్రేమ్వర్క్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషెస్.. బయట, లోపల విద్యుదీకరణ, ఎల్పీజీ లాంటి సౌకర్యాలతో హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని టెండర్లలో పేర్కొంది. తగ్గిన ధరలు.. అంచనాల్లో వంచనహ్యాపి నెస్ట్ ప్రాజెక్టుకు 2018లో తెరతీసిన ప్రభుత్వం.. అప్పట్లో పనులను కాంట్రాక్టర్కు రూ.658 కోట్లకు అప్పగించింది. కానీ.. ఆ ప్రాజెక్టు అప్పట్లో ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. భవన నిర్మాణాల్లో వినియోగించే స్టీల్, సిమెంట్, కంకర తదితరాలతోపాటు విద్యుత్, శానిటరీ ఉపకరణాల దగ్గర నుంచి లిఫ్ట్ల వరకూ గతంతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి 2018తో పోలిస్తే కొన్నిటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ఇక ఇసుక పూర్తి ఉచితమని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే ఉండదని ప్రముఖ బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటిది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.818.03 కోట్లుగా నిర్ణయించి తాజాగా సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, రూ.153.05 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొనడంపై బిల్డర్లు విస్తుపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.971.08 కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టులో మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చ.అ. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,511.76 చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన డిజైన్ కంటే మరిన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టినా చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపినా రూ.1,800 నుంచి రూ.2వేల లోపే నిర్మాణ వ్యయం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు.అక్రమాలు ఇలా బహిర్గతం..హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ రీతిలోనే.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో గెజిటెడ్ ఆఫీసర్లకు టైప్–1, టైప్–2 విధానంలో జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం నిర్మిత ప్రాంతం 27,24,080 చ.అ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 అవుతుంది. ఇక సీనరేజీ, ఎన్ఏసీ, జీఎస్టీ పన్నుల రూపంలో రూ.93.2 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. ఇవన్నీ కలిపినా గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,148.45 దాటదు. దీన్ని బట్టి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు సీఆర్డీఏ పిలిచిన టెండర్ల సాక్షిగా బట్టబయలైందని బిల్డర్లు చెబుతున్నారు.సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు⇒ రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 మాత్రమే. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మాత్రం నిర్మాణ వ్యయం ఏకంగా చ.అ.కు రూ.4,511.76 చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెస్ట్.. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు.. ఇవి రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే. కానీ నిర్మాణ వ్యయం మాత్రం వేర్వేరు.⇒ అధునాతన సదుపాయాలు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగించి కట్టే బహుళ అంతస్తుల భవనాల్లోనూ (టవర్స్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని (జీఎస్టీ, సీనరేజీ లాంటి అన్ని పన్నులతో కలిపి) విజయవాడ–గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పేరు మోసిన బిల్డర్లు చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రాజధాని అమరావతిలో చేపట్టిన హ్యాపి నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులో మాత్రం చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4,511.76 ఉంది. దీన్ని బట్టి ఒక్కో చ.అడుగుకు రూ.2,500కిపైగా అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.⇒ రెండు మూడు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పడి షెడ్యూలు దాఖలు చేయడానికి వీల్లేదని హ్యాపీనెస్ట్ టెండర్ నోటిఫికేషన్లో సీఆర్డీఏ నిబంధన విధించింది. కానీ ఆ ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 25 శాతం పనులను సబ్ కాంట్రాక్టు కింద అప్పగించే వెసులుబాటు కల్పించింది. దీన్ని బట్టి ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అధిక ధరలకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వ్యూహంతో ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు వెల్లడవుతోంది. -
సిలికా.. దున్నేద్దామిక!
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రకృతి సంపద కొల్లగొట్టడమే లక్ష్యంగా కూటమి నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇసుక, మైకా క్వార్ట్జ్ ఖనిజాలను కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు.. తాజాగా సిలికా శాండ్ కోసం రంగంలోకి దిగారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లోని సిలికాను తవ్వి, విక్రయించేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎటువంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, సిలికా కోసమే అని అనుమానం రాకుండా.. జాతీయ, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం మైనర్ మినరల్స్ను లీజు ప్రాతిపదికన తవ్వుకోవచ్చని డిసెంబర్ 24న ఒక జీవో జారీ చేయించారు. ఈ జీవో ఆధారంగా ఒక ముఖ్య నేత ఆదేశాలతో తవ్వకాలు జరిపేందుకు కృష్ణపట్నం పోర్టు సిబ్బంది, స్థానికంగా ఉన్న కూటమి శ్రేణులు సిలికా ఉన్న భూముల ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు, కోట మండలాల పరిధిలో సుమారు 28 వేల ఎకరాల్లో విస్తారంగా సిలికా శాండ్ ఉంది. ఇందులో వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూములు, సిలికా లీజు దారులకు చెందిన భూములు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిల్లకూరు, కోట పరిధిలోని సుమారు 87 మంది లీజు దారులను సిలికా మైన్లోకి వెళ్లకుండా అడ్డుకుంది. కూటమి నేతలు యజమానులను భయపెట్టి, కొన్ని మైన్లను బలవంతంగా లాక్కున్నారు. మరి కొందరు కూటమి నేతల ఆగడాలకు భయపడి వారు చెప్పినట్లు చేస్తున్నారు. బీడు భూములపై కన్ను చిల్లకూరు, కోట మండలాల పరిధిలో వివిధ పరిశ్రమల కోసం ఏపీఐఐసీ కేటాయించిన వేలాది ఎకరాల భూములు ఏళ్ల తరబడి బీడుగా దర్శనమిస్తున్నాయి. ఇందులో కృష్ణపట్నం పోర్టు, నవయుగకు కేటాయించిన భూమలున్నాయి. చిల్లకూరు మండలం చిలతవరం సెజ్ కోసం 550.48 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో మాస్ అపెరల్ పార్కు పరిశ్రమను 2011లో 15 ఎకరాల్లో శ్రీలంకకు చెందిన యాజమాన్యం ప్రారంభించింది. మూడేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన పరిశ్రమను అప్పట్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అనుచరులు చేసిన గొడవ వల్ల మూసి వేసారు. దీంతో కోట, చిల్లకూరు, గూడూరు మండలాలకు చెందిన సుమారు 700 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి పోయింది. ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో 3,931.86 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయించారు. ఇందులో సుమారు 800 ఎకరాల్లో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. అందులో జిందాల్ సింహపురి పవర్ ప్రాజెక్టు, వేదాంత, మీనాక్షి పవర్ ప్రాజెక్టులు పని చేస్తున్నాయి. మోమిడి రెవెన్యూ పరిధిలోని మన్నేగుంట ప్రాంతంలో కెనేటా పవర్ ప్రాజెక్టు పేరుతో 200 ఎకరాలు కేటాయించినప్పటికి, ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. మిగిలిన భూమి కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఖాళీగా ఉంది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు, తమ్మినపట్నం, కోట మండలంలోని కొత్తపట్నం, సిద్దవరం రెవెన్యూ పరిధిలో క్రిస్ సిటీ ఏర్పాటు కోసం ఏపీఐసీసీ.. పట్టా, ప్రభుత్వ భూములు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. అంకులపాటూరు రెవెన్యూలో 151 ఎకరాలు, ఉడతావారిపాళెం, కలవకొండ రెవెన్యూ పరిధిలో 122.280 ఎకరాల్లో ఎస్బీ క్యూ స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమ నష్టాల బాట పట్టడంతో మూత పడింది. భూములు బీడుగా ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల్లోని పేద రైతులు ఎకరం, రెండెకరాల చొప్పున చదునుచేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా ఖాళీకా ఉన్న భూములన్నింటిపై కూటమి నేతలు కన్ను వేశారు. 30 గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు ⇒ సిలికా శాండ్ తవ్వకాలతో 30 గ్రామాలకు ప్రమాదం తప్పదని తెలిసినా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను అడ్డు పెట్టుకుని, పరిశ్రమల ప్రతినిధులను ముందు పెట్టి.. కూటమి నేతలు తెర వెనుక నుంచి దందాకు తెర లేపారు. ⇒ బీడు భూముల్లో కనీసం రెండు మీటర్ల మేర సిలికాను తవ్వుకుంటే వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ తవ్వకాలు సాగించాలనే విషయమై పరిశీలనకు వచ్చిన బృందాలను పలు చోట్ల రైతులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించారు. భూముల్లో సిలికా తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ⇒ పరిశ్రమల కోసం కేటాయించి ఉంటే.. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. సముద్ర మట్టానికి 30 మీటర్ల ఎత్తులో ఉండే భూములు.. ప్రస్తుతం తొమ్మిది మీటర్లకు చేరాయని, మరో రెండు మీటర్లు తవ్వితే తుపాను ధాటికి గ్రామాలు కొట్టుకుపోయి జల సమాధి కావాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ సిక్స్కు చంద్రబాబు ఎగనామం
తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేశాం! అసలు పథకాన్నే ఎగరగొడదాం..! రైతు భరోసా రెండుసార్లు ఎగనామం.. ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం..! ఆడబిడ్డ నిధి అబ్బే..! మనకు ఇప్పుడు అసలా ఆలోచనే లేదు! ఉద్యోగులు, నిరుద్యోగులు ఆ ఊసే మరిచిపోదాం!! సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ కేబినెట్ సాక్షిగా సూపర్ సిక్స్ హామీలకు కూటమి సర్కారు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం నుంచి అన్నదాతా సుఖీభవ దాకా.. ఆడబిడ్డ నిధి నుంచి ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్.. నిరుద్యోగులకు భృతి వరకు ఇదే తీరు!! కొత్త ఏడాది కోటి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు, రైతన్నలు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మళ్లీ నిరాశ మిగిలింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్.. సెవన్ అంటూ ఎడాపెడా హామీలిచ్చిన సీఎం చంద్రబాబు పీఠం ఎక్కిన తరువాత వాటిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అటకెక్కించి తొలి ఏడాది గడిపేశారు. కొత్త సంవత్సరంలోనూ నిర్దిష్టంగా ఏమైనా ప్రకటిస్తారనుకున్న వారికి నిరాశే మిగిలింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హామీల అమలుపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్లో చర్చించారని మంత్రి ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడంతో 87.42 లక్షల మంది విద్యార్ధులు ఒక్క ఏడాదే రూ.13,112 కోట్ల మేర నష్టపోయారు. 54 లక్షల మంది రైతన్నలు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.10,000 కోట్ల మేర నష్టపోయారు. కోటి మందికిపైగా యువత నిరుద్యోగ భృతి కోసం.. ‘ఆడబిడ్డ నిధి’ కోసం 1.80 కోట్ల మంది మహిళలు పడిగాపులు కాస్తుంటే నూతన ఏడాది నిర్వహించిన తొలి మంత్రివర్గ భేటీలో ఒక్క సానుకూల ప్రకటన కూడా చేయలేదు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే ప్రభుత్వం సాగదీస్తోందని, ఎన్నికల హామీలను నమ్మి తాము మోసపోయామని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత అదే జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ సమయానికి ఏ పథకాల కింద, ఎంత లబ్ధి చేకూరేదో బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పారదర్శక పాలనతో వ్యవస్థలు, పథకాలను ఇంటి వద్దకే వైఎస్ జగన్ చేరువ చేశారు. ఏటా ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మే నెలలో విద్యా దీవెన, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా.. జూన్లో అమ్మ ఒడి.. జూలైలో విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు.. ఆగస్టులో విద్యా దీవెన, నేతన్న నేస్తం.. సెప్టెంబర్లో చేయూత.. అక్టోబర్లో రైతు భరోసా.. నవంబర్లో విద్యా దీవెన, రైతులకు సున్నా వడ్డీ రుణాలు.. డిసెంబర్లో ఈబీసీ నేస్తం, లా నేస్తం, మిగిలిపోయిన అర్హులకు సైతం పిలిచి మరీ పథకాలు అందించే కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టారు.అమ్మ ఒడి ఆగిపోయి.. తల్లికి వందనం లేక!పేదరికం చదువులకు అడ్డు కాకూడదని, పేదింటి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని దృఢంగా నమ్మిన మాజీ సీఎం వైఎస్ జగన్ ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపిన తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. విద్యా రంగ సంస్కరణకు ఐదేళ్లలో దాదాపు రూ.73వేల కోట్లు వ్యయం చేసిన వైఎస్ జగన్ ఒక్క అమ్మ ఒడి ద్వారానే రూ.26 వేల కోట్లకుపైగా తల్లులకు అందించి పిల్లల చదువులకు భరోసా కల్పించారు. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించారు. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీషు మీడియం చేయడంతో పాటు సీబీఎస్సీతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణం దిశగా అడుగులు వేశారు. రోజుకొక మెనూతో రుచికరంగా గోరుముద్ద అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని విద్యా సంస్కరణలను రద్దు చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారు ఐబీ, సీబీఎస్ఈ, టోఫెల్ను రద్దు చేసి.. తల్లికి వందనం పథకంపై చేతులెత్తేసింది. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. తొలి ఏడాది దీన్ని అమలు చేయకుండా పిల్లల చదువులను నీరుగార్చిన కూటమి సర్కారు అసలు పూర్తిగా పథకాన్నే ఎత్తివేసే దిశగా వ్యూహం రచిస్తోంది. అన్నదాతలకూ ఎగనామమేకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని రెండు వ్యవసాయ సీజన్లు గడుస్తున్నా అందించలేదు. రైతు భరోసా పేరును అన్నదాతా సుఖీభవగా మార్చడం మినహా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అమలు చేయలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు రెండు విడతలు ఆర్థిక సాయం అందించడం గమనార్హం. చంద్రబాబు సర్కారు ఆ రెండు విడతలూ అన్నదాతలకు సాయం అందించకుండా ఎగనామం పెట్టింది. కేంద్రం తదుపరి ఇచ్చే వాటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాపై ఆలోచన చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. అన్నదాతా సుఖీభవ కోసం 54 లక్షల మంది అన్నదాతలకు రూ.10వేల కోట్లకుపైగా అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే విదిలించడం గమనార్హం. ఇంతవరకు పథకం విధివిధానాలే ఖరారు చేయలేదు. ఇక ఖరీఫ్ 2023 సీజన్కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. సున్నా వడ్డీ రాయితీ ఊసే లేదు. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు సేవా కేంద్రాలను (ఆర్బీకేలు) చంద్రబాబు నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేశారు. కాగా రైతులకు రైతు భరోసా పథకాన్ని మరుసటి ఏడాది నుంచి అమలు చేస్తామని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ తొలి కేబినెట్లోనే నిర్ణయం తీసుకుని తొలి ఏడాది నుంచే వైఎస్ జగన్ అమలు చేశారు.జాడలేని ఆడబిడ్డ నిధి..19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలందరికీ ఏటా రూ.18 వేలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ పథకాన్ని నెరవేర్చే ఉద్దేశం కానరాకపోవడం, మంత్రివర్గ సమావేశాల్లో కనీసం చర్చించకపోవడంతో 1.80 కోట్ల మంది మహిళలు మోసపోయినట్లు గ్రహిస్తున్నారు.ఉచిత గ్యాస్లోనూ మాయఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు జిమ్మిక్కులతో మహిళలను మోసం చేశారు. ఈ ఏడాది రెండు సిలిండర్లకు కోత పెట్టారు. రాష్ట్రంలో 1.54 కోట్ల కుటుంబాలకు ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.895 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దీంతో కేవలం కోటి మందికి మాత్రమే ఒక్క సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉంది.మత్స్యకారులనూ ముంచారు..గత ఏడాది వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయానికి చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. దీంతో 1.30 లక్షల మత్స్యకారులు ఇప్పటికే రూ.260 కోట్లు నష్టపోయారు. ఇప్పుడు ఏప్రిల్లో సాయం అందించడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు చెబుతోంది. అయితే పథకం అమలుపై కచ్చితమైన ప్రతిపాదనలు, నిర్ణయాలు మాత్రం జరగలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు. కేవలం చర్చలు, ఆలోచనలతోనే సరిపుచ్చారు. వైఎస్ జగన్ చెప్పిన మాట మేరకు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే మత్స్యకార భరోసాను అమలు చేశారు.ఉద్యోగుల ప్రయోజనాలపై చర్చలేదుఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యను పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాలాజీ జీవీ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలా మంత్రివర్గం సమావేశాలను నిర్వహిస్తున్నా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి చర్చలు లేవన్నారు. పీఆర్సీ అమలుకు కమిటీని నియమించాలిఏపీటీఎఫ్ అమరావతి 12వ పీఆర్సీ అమలు కోసం కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన సంవత్సరంలోనైనా డీఏ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. తల్లులకు మోసం వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం తల్లికి వందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ధ్వజమెత్తారు. తల్లికి వందనం పథకం ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రివర్గ సమావేశంలో ప్రకటించి తల్లులను దగా చేసిందన్నారు. అమలు చేయకుంటే ఆందోళనఎస్ఎఫ్ఐ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ గురువారం ఓ ప్రకటనలో ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలు చేయకపోతే ఆందోళన చేస్తామన్నారు.ఉద్యోగులకు మొండిచెయ్యిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుపై దృష్టి సారించలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ, కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చింది. సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని వాగ్దానం చేసింది. ఇంతవరకూ ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటుతోపాటు కమిషనర్ను నియమించింది. అయితే చంద్రబాబు సర్కారు కమిషనర్తో రాజీనామా చేయించింది. ఇక పీఆర్సీ కమిషన్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఇప్పుడు 7 నెలలైనా ఐఆర్ గురించి చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. గత సర్కారు ఉద్యోగుల సమస్యలపై సీఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పరిష్కరించగా, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే మరిచింది.నిరుద్యోగికి నయవంచన..యువతకు ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున నెలకు రూ.4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి రూ.57,600 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్లో ఇందుకు పైసా ఇవ్వలేదు. క్యాబినెట్లో కనీసం చర్చించలేదు. దీంతో నిరుద్యోగ భృతి హామీకి నీళ్లు వదిలినట్టయ్యింది.కొత్తవి లేవు.. అన్నీ రద్దులేతాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానంటూ ఉగాది సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఏకంగా ఆ వ్యవస్థకే మంగళం పలికి 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారు. ఇక 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్న హామీ బూటకంగా మారింది.ఉద్యోగుల ఆశలపై నీళ్లు..కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ఆలోచించడం లేదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని గురువారం మీడియాతో పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా ఇవ్వలేదన్నారు. ఐఆర్ ఇవ్వలేదని, డీఏ, జీపీఎస్ బకాయిలు, ఈఎల్స్ సరెండర్ బకాయిలు చెల్లించలేదన్నారు. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ను ఇంతవరకు నియమించలేదన్నారు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాము ఒత్తిడి చేయకుండా వేచి చూశామని, కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. 2019లో గత ప్రభుత్వం జూలై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిందని వెంకట రామిరెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు కూడా అలాగే ఇస్తారని ఉద్యోగులు నమ్మారన్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఐఆర్ ఇస్తారని ఎదురు చూస్తూ వస్తుంటే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. గత ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించిందన్నారు. సాధ్యం కాకుంటే కనీసం తమకు చెప్పేదన్నారు. పెండింగ్ బకాయిలు దశలవారీగా ఎప్పుడు ఎంత చెల్లిస్తారో పారదర్శకంగా చెప్పేవారన్నారు. ఇప్పుడు అది కూడా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కానీ, ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఉద్యోగులను పిలిచి మాట్లాడడం గానీ జరగలేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వేధించడం మొదలు పెట్టిందన్నారు. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ అధికారులు ఆరుగురిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి ముగ్గురికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక డీఏ ఇవ్వాలని, వెంటనే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని కోరారు. -
Andhra Pradesh: కష్టాలు చెబితే.. కస్సుబుస్సు
గన్నవరంలో గబగబ..కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించగా పట్టుమని 20 మంది కూడా పాల్గొన లేదు. భూముల సమస్యలు అత్యధికంగా ఉండే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వారిని కూర్చోబెట్టారు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన వారిలో చాలా మంది టీడీపీ సానుభూతిపరులే. గ్రామాలకు సంబంధించి పార్టీ పరమైన సమస్యలను వారు ప్రస్తావించారు. గత సర్కారుపై నిందలు మోపడం, ఈ ప్రభుత్వం ఏదో చేసేసినట్లు చెప్పుకోవడానికి ఆరాట పడ్డారు. తహశీల్దార్, ఇతర అధికారులు ప్రసంగించిన అనంతరం వినతులు స్వీకరించారు. ఇదంతా కేవలం గంటన్నరలోనే ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూమంత్రంగా జరిపారు.సాక్షి, అమరావతి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రచారం చేసిన కూటమి సర్కారు వాటిని మొక్కుబడి తంతుగా మార్చి తుస్సుమనిపించింది. లక్షల్లో ఫిర్యాదులు అందుతున్నా వేలల్లో కూడా పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఉసూరుమంటూ కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలకు అవే సమస్యలతో పోటెత్తుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన భూ సంస్కరణలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం వాటిపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ రెవెన్యూ సదస్సులు చేపట్టింది. తూతూమంత్రంగా నిర్వహిస్తుండటంతో స్థానికుల భాగస్వామ్యం పెద్దగా ఉండడం లేదు. పెద్ద గ్రామాల్లో నిర్వహించే సభల్లోనూ 30, 40 మందికి మించి ప్రజలు కనపడడంలేదు. దీంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చేవారిని సభల్లో కూర్చోబెట్టి ఫొటోలు తీసి పంపుతున్నారు. అసలు ఈ సభలను అధికారులే సీరియస్గా తీసుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ఎలాగోలా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఓ మోస్తరుగానైనా జనం వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన చోట వాటికి పరిష్కారం కనిపించడంలేదు. కేవలం తాము పరిష్కారం చూపించగలమన్న అంశాలకు సంబంధించిన వినతులను మాత్రమే అధికారులు స్వీకరిస్తున్నారు. భూ వివాదాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ప్రస్తావిస్తే కోర్టుకు వెళ్లాలని, అది తమ పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలతో.. సీఎంను కలిసినా ఏం లాభం? పలు చోట్ల రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వారంతా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలతో అందచేసే వినతి పత్రాలను స్వీకరిస్తూ నమోదు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల పేర్లు ప్రస్తావిస్తూ ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్య ఏదైనా సరే వైఎస్సార్సీపీ బాధితులమని చెప్పాల్సిందిగా ఫిర్యాదుదారులకు టీడీపీ నేతలు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలాగే పలువురిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తరలించి సీఎం చంద్రబాబు, మంత్రులకు విజ్ఞాపనలు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ బాధితులమని, కబ్జా చేశారని చెబితేనే ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి నేరుగా సీఎం చంద్రబాబుకు అందచేసే విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన్ను కలిసిన వారు వాపోతున్నారు. లక్షల్లో ఫిర్యాదులు.. ఇప్పటివరకు 12,862 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయి. సోమవారం వరకు 1,75,182 వినతి పత్రాలు అందగా 12,409 అర్జీలను పరిష్కరించారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 6న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రోజూ 800 నుంచి వెయ్యి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది. జనం లేక వెలవెలబోతున్న సభలో మాట్లాడుతున్న గన్నవరం తహసీల్దార్ సదస్సులతో ఫలితం లేక కలెక్టరేట్లకు..⇒ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మొదటి రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తరువాత వదిలేశారు. సదస్సుల్లో ఇప్పటి వరకు 9,155 అర్జీలు నమోదు కాగా కేవలం 142 మాత్రమే పరిశీలించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు అర్జీలతో పోటెత్తుతున్నారు. డిసెంబర్ 23న చిత్తూరు కలెక్టరేట్లో పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి 145 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో స్పందన లేకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. ⇒ తిరుపతి జిల్లాలో గత నెల 28 వరకు రెవెన్యూ సదస్సుల్లో 13,803 అర్జీలు అందగా అందులో 10 వేలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. 22 ఏ భూ సమస్యలు, పట్టాల మార్పులు, మ్యుటేషన్లు, భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల సమస్యలే అధికం. విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, తాగునీరు, పారిశుద్ద్యం, రేషన్, ఫించన్ సమస్యలపై 3,803 అర్జీలు వచ్చాయి. అయితే విద్యార్థులకు సర్టిఫికెట్స్ సమస్యలను మాత్రమే అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. నోడల్ ఆఫీసర్లు ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. ⇒ కాకినాడ జిల్లా రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను స్వీకరించడం, సమస్యలపై చర్చించడం మినహా ఏ ఒక్కటీ పరిష్కరించిన దాఖలాలు లేవు. కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించి ఆ సమస్యలు పరిష్కారమైనట్లు చూపుతున్నారు. ఇప్పటి వరకూ 4,635 సమస్యలపై అర్జీలు వచ్చాయని చెబుతున్నారు. ⇒ విశాఖ జిల్లాలో 4,666 వినతులు రాగా 3,167 అర్జీలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. భూఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. రెవెన్యూ పరంగా వచ్చే దరఖాస్తులను జాయింట్ కలెక్టర్కు నివేదిస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లా రెవెన్యూ సదస్సుల్లో 5,984 వినతులు రాగా 284 అర్జీలను పరిష్కరించారు. భూ ఆక్రమణలు, పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. ⇒ అనంతపురం జిల్లా రెవెన్యూ సదస్సుల్లో ఆర్భాటమే కానీ ఫలితం కనిపించడంలేదు. భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. 5,450 ఫిర్యాదులు అందగా 366 మాత్రమే పరిష్కరించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఇప్పటివరకు 9,311 భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. 8,871 సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ⇒ అన్నమయ్య జిల్లా పరిధిలో సదస్సుల ద్వారా 10,421 సమస్యలపై ప్రజలనుంచి వినతులు అందాయి. 924 సమస్యలకు అధికారులు పరిష్కారం చూపారు. 80 శాతం ఫిర్యాదులు భూ సమస్యలపైనే అందాయి. ⇒ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 6,908 అర్జీలను స్వీకరించిన అధికారులు కేవలం 513 సమస్యలకు మాత్రమే పరిష్కారాలు చూపారు. అర్జీల పరిష్కారంపై కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 21 రోజులైనా ఎందుకు పరిష్కారం కావడం లేదని ఇటీవల సమీక్షలో నిలదీశారు. దేవనకొండ మండలంలో ఒక్క అర్జీకి కూడా పరిష్కారం చూపకపోవడంపై సంబంధిత తహసీల్దార్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల సమస్యలే అధికం.. రెవెన్యూ సదస్సుల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 60 శాతం పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. తప్పులు, ఆన్లైన్ సమస్యలు, హద్దుల తేడాలు లాంటి సమస్యలే అధికం. భూముల రీ సర్వే మొత్తం తప్పుల తడకని కూటమి నేతలు ప్రచారం చేసినప్పటికీ వాటికి సంబంధించిన వినతులు చాలా తక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. అసైన్డ్ భూముల సమస్యలు, నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, డీ పట్టాలు, ఇళ్ల పట్టాలకు చెందిన వినతులు ఉంటున్నాయి. అయితే రశీదులు ఇవ్వడమే కానీ పరిష్కారం మాత్రం చూపకపోవడంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. నెల తరువాత చూద్దాం.. గన్నవరానికి చెందిన పొక్కునూరి సోమలింగేశ్వరరావు, ఆయన సోదరుడు తమకు తండ్రి శోభనాచలపతిరావు నుంచి వారసత్వంగా వచ్చిన 3.3 ఎకరాల భూమిని పంచుకుని మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు వారి పేర్లు ఆన్లైన్లో కనిపించడంలేదు. దీనిపై గన్నవరం రెవెన్యూ సదస్సులో వినతి పత్రం అందచేయగా నెల తర్వాత పరిష్కరించేందుకు ప్రయతి్నస్తామని అధికారులు చెప్పారు. -
చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?
ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ మారిపోయారనీ, అధికారంలోకి వచ్చాక ప్రజల క్షేమం గురించి బాగా ఆలోచిస్తున్నారనీ కొంత కాలంగా అక్కడక్కడా వినిపిస్తోంది. పవన్లో చాలా ముఖాలున్న నేపథ్యంలో ఆయన మారి పోయాడన్నది ప్రచారం మాత్రమే. అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపీడీఓపై దాడి జరిగిందని పవన్ హంగామా చేశారు. శనివారం కడప రిమ్స్కు వెళ్లి పరామర్శ పేరుతో వైఎస్సార్సీపీ నేతల్ని అనరాని మాటలన్నారు. ఈ వివాదం గురించి ఆయన పూర్తిగా తెలుసుకోకుండా రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించార నేది జనాభిప్రాయం. వైఎస్సార్సీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని అంటూ... ‘అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తా’నంటూ పరుష పద జాలం వాడారు.కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ, భాగస్వామ్య పార్టీల నాయకులు అధి కారులపై దూషణలకు దిగడం, బెదిరించడం, దాడులు చేయడం రివాజుగా మారింది. ఈ నెల లోనే వైఎస్సార్ కడప జిల్లాలో వీఆర్వోపై టీడీపీ నాయకుడు బీరు బాటిల్తో దాడి చేశాడు. ఇప్పుడు సదరు నేత తోలు తీసే ధైర్యం పవన్కు ఉందా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పంచాయతీ రాజ్య వ్యవస్థలో ఉద్యోగులపై అధికార పార్టీ వేధింపులు చాలా ఉన్నాయి. సాక్షాత్తూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ సందర్భంలో దళిత డాక్టర్ను దూషించిన విషయాన్ని డిప్యూటీ సీఎం మరిచి పోయినట్టు ఉన్నారు.కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయనేది దేశం మొత్తానికి తెలిసిన నిజం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 229కి పైగా హత్యలు, 750కి పైగా హత్యాయత్నాలు, నాలుగు వేలకు పైగా దాడులు, ఏడువేలకు పైగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది.‘నేను తప్పు చేసినా శిక్ష పడాలి’ అని అసెంబ్లీలో చెప్పిన వ్యక్తినంటూ పవన్ గొప్పలు చెప్పు కొన్నారు. కానీ నేడు టీడీపీ నేతలు చేస్తున్న దారు ణాలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తు న్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. పవన్ ప్రత్యామ్నాయంగా మారుతాడనీ, మార్పు తెస్తాడనీ అభిమానులూ, జనసేన కార్యకర్తలూ ఆశించారు. కానీ నేడు అలా జరగడం లేదు. పైగా రాక్షసపాలన చేస్తున్న చంద్రబాబును వీలు చిక్కి నప్పుడల్లా ఆయన ఆకాశానికి ఎత్తడం వారిని బాధిస్తోంది. ‘ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైరవ్వను’– అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ చెప్పిన మాట ఇది. కానీ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిన విషయం ఆయనకు తెలి యదా? కానీ దానిపై మాట్లాడితే చంద్రబాబు ఇబ్బంది పడతారు. ఆరు నెలల్లోనే 126కు పైగా అత్యాచారాలు, లైంగికదాడులు జరిగాయి. 12 మందిపై హత్యాచారం జరిగింది. వీటిపై పవన్ మాట్లాడకపోగా డైవర్షన్ కోసం ప్రయత్నించి జనాగ్రహాన్ని మూట గట్టుకున్నారు. ‘నేనే హోం మంత్రినైతే...’ అంటూ సినిమా టైటిల్ తరహా స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం వ్యవహారాన్ని బాబు వైపు నుంచి తెలివిగా మళ్లించారు. గతంలో పవన్ ఆడపిల్లలపై దాడుల విషయంలో అనేక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కొన్ని అంశాలు అంట గట్టే ప్రయత్నం చేసి పెద్ద గొంతుతో సినిమాటిక్గా అరిచారు. ఇప్పుడు ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో అరాచకం రాజ్య మేలుతున్నా మౌనం వహించడంతో జనసేన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారన్నది అక్ష రాలా నిజం.డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఎంపీడీ ఓను పరామర్శించారు. దానిని ఎవరూ కాద నరు. రాష్ట్రంలో రోజూ బాలికలు, మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి వీటిపై స్పందించరేం? నిజంగా ఆ పని చేస్తే ఆయనపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటిపై పాలకులు మౌనంగా ఉంటే పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు. ప్రశ్నిస్తూనే ఉంటానని పార్టీ పెట్టిన వ్యక్తి... ముందు తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పాలి. ఇది సినిమా హీరోలను దేవుళ్లుగా కొలుస్తున్న సమాజం కాబట్టి ఏం చెప్పినా... చేసినా చెల్లుబాటవుతుందనే భ్రమల్లో పవన్ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది సోషల్ మీడియా యుగం. వివిధ యాప్స్ వేదికగా యువత ప్రశ్నలు సంధిస్తోంది. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంపై ఉంది.– వెంకట్ -
‘ఉద్యోగ భద్రత’ హామీ నిలబెట్టుకోండి
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదుతిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు. – రమణమ్మ, తిరుపతి⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఉచిత వైద్యం కలే..అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.ప్రజారోగ్యానికి పెద్దపీటప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో అప్లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.రోగులపై మందుల భారంరాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉచిత వైద్యం లేదన్నారుగత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది. – పి.వాణి, కాకినాడ జిల్లారూ.30 వేలు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాకార్డున్నా ఆపరేషన్ చేయలేదునా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు. – ఆసియా, అనంతపురంఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత సీఎం వైఎస్ చొరవతో... ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు. రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి. – ఎస్.శంకరరావు, అగనంపూడి నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం -
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
-
కరెంట్ కోత.. చార్జీల మోత
మా ఇంటికి రూ.10 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మాకేమీ ఏసీలు లేవు. లైన్మెన్ని అడిగితే ఫ్రిజ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు. చివరకు అప్పు చేసి బిల్లు కట్టేశాం.– చిన్నం వెంకటేష్, ఎం.ఎం.పురం, ఏలూరు జిల్లాబోణం గణేష్, ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం నుంచి సాక్షి ప్రతినిధికరెంట్ బిల్లులు శీత కాలంలోనూ ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి! ఒకపక్క ప్రతి నెలా రూ.వందలు... వేలల్లో బిల్లులు రావడం.. మరోపక్క చలి కాలంలోనూ కోతలు విధించడంతో దోమల బాధతో నిద్రలేని కాళరాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే రూ.6,072.86 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి హై వోల్టేజీ షాకులిచ్చిన కూటమి సర్కారు జనవరి నుంచి మరో రూ.9,412.50 కోట్ల చార్జీల భారాన్ని అదనంగా వేయనుండటం వినియోగదారులను గజగజ వణికిస్తోంది. ఆర్నెలల్లోనే రూ.9,412.50 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం.. మరోపక్క సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశన్నంటడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తోంది. వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే వేసవిలో ఏ స్థాయిలో షాక్లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపైనా పెనుభారం మోపింది. వినియోగం తక్కువే.. అయినా కోతలురాష్ట్రంలో ప్రస్తుతం 194.098 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్ అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే 1.17 శాతం తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా అందించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత సర్కారు మండు వేసవిలోనూ, తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది. కరెంట్ కష్టాలు చెప్పుకోలేక..ఏలూరు జిల్లా మల్కీమహ్మద్పురం (ఎం.ఎం.పురం) గ్రామంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ప్రజల కరెంట్ కష్టాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పల్లపూరుగా పిలుచుకునే ఏలూరు జిల్లా ఎం.ఎం పురంలో ప్రజలంతా పేద, మధ్యతరగతి వారే. తెల్లవారుజామునే నిద్రలేచి, కూలి పనులకు వెళుతుంటారు. చుట్టు పక్కల వ్యవసాయ పనులు దొరక్కపోవడంతో దాదాపు 40 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వరకూ వెళ్లి రాత్రికి ఇంటికి చేరుతుంటారు. ఇంటికి వచ్చాక సేదదీరుదామంటే విద్యుత్ లేక ఫ్యాన్లు పనిచేయడం లేదు. దోమలతో తెల్లవార్లూ జాగారం చేయాల్సిన పరిస్థితి! అది చాలదన్నట్టు కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. వారి కష్టాల గురించి చెబితే పింఛన్లు తీసేస్తారని, రేషన్ కార్డు పోతుందని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే..రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిందంటే అది స్థానిక పరిస్థితుల కారణంగా జరిగి ఉంటుంది. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ బిల్లులు కూడా నిబంధనల ప్రకారమే వేస్తున్నాం. ఎవరికైనా ఎక్కువ వేశారనిపిస్తే అధికారుల దృష్టికి తేవచ్చు. –కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ‘ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సింగారపు పాపమ్మ. ఏలూరు జిల్లా మల్కీ మహ్మద్పురం (ఎంఎం పురం)లో నివసిస్తోంది. భర్త చుక్కయ్య, ఇద్దరు కుమారులు చనిపోవడంతో పిడికెడు మెతుకుల కోసం ఏడు పదుల వయసులోనూ పని మనిషిగా చేస్తూ ఒంటరిగా బతుకుతోంది. పగలంతా పనిచేసి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతుంది. ఒక ఫ్యాను, సెకండ్ హ్యాండ్లో కొన్న చిన్న టీవీ, ఓ లైటు మినహా ఆమె ఇంట్లో మరో విద్యుత్ ఉపకరణం లేదు. అలాంటప్పుడు ఆమె ఇంటికి విద్యుత్ బిల్లు ఎంత రావాలి? మహా అయితే వందో.. రెండొందలో కదా! కానీ నవంబర్లో వినియోగానికి సంబంధించి ఈ నెల పాపమ్మకు వచ్చిన బిల్లు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1,345.39. అది తెలిసి గుండె ఆగినంత పనైందని ఆ వృద్ధురాలు ‘సాక్షి’తో తన గోడు చెప్పుకుంది. ఇంత బిల్లు వేస్తున్నా కరెంట్ సవ్యంగా సరఫరా కావడం లేదు. చీకట్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. ఇంకా దారుణమేమిటంటే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పాపమ్మకు గత ప్రభుత్వంలో ఉచితంగా విద్యుత్ అందగా ఇప్పుడు రూ.వేలల్లో బిల్లులు రావడం!!శుక్రవారం, మంగళవారం అసలు కరెంటు ఉండదు మా ఊరిలో శుక్రవారం, మంగళవారం కరెంటు ఉండదు. మిగతా రోజుల్లోనూ గంటల తరబడి తీసేస్తున్నారు. చార్జీలు మాత్రం భారీగా పెంచేశారు. పాచి పని చేసుకునేవాళ్లకు కూడా రూ.వేలల్లో బిల్లులు వేస్తున్నారు. ఇదేం ప్రభుత్వమో ఏంటో?. – ఓగిరాల లక్ష్మీ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా రోజూ కరెంటు పోతోంది రాత్రిళ్లు 11 గంటలకు తీసేసి తెల్లవారుజాము రెండుకో, మూడుకో ఇస్తున్నారు. దోమలు కుట్టి రోగాల బారిన పడుతున్నాం. రోజూ కరెంటు పోతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో కరెంటు కోతలు మేమెప్పుడూ చూడలేదు. – అంజమ్మ, ఎంఎం పురం, ఏలూరు జిల్లా జగనన్న అధికారంలో ఉండగా మేం బిల్లు కట్టాల్సి రాలేదుజగనన్న అధికారంలో ఉండగా మేం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు బిల్లులు కట్టమని ఇంటికి వస్తున్నారు. కరెంటు మాత్రం రాత్రి, పగలూ అనే తేడా లేకుండా తీసేస్తున్నారు. – సరోజిని, ఎంఎం పురం, ఏలూరు జిల్లా -
ప్రభుత్వ విద్య మిథ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్ ప్లస్లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం ⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్ విద్యను పటిష్టం చేసింది. ⇒ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు. ⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ను ఇంటర్ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థకు అప్పగించారు. ⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది. ⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం. ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! ⇒ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ శిక్షణను పైలట్గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు. ⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. ⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్ చేయడం గమనార్హం. అధికారంలోకి రాగానే మొదలు.. ⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. ⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా రద్దు చేసింది. ⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది. ⇒ ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ను మండలిలో నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. - ఇ.మహేష్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శి -
రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్ల మీద షాక్లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల మోత మోగించాలని వికసిత్ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.ఆస్తి పన్ను పెంచేలా అడుగులుపట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైమ్ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ ఉపయోగించి బిల్డింగ్ ప్లాన్ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్ డిజిటలైజ్డ్ బిల్లింగ్ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్ డిజిటల్ బిల్లు జనరేట్ చేయనున్నారు. ఎస్ఎంఎస్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్ చేయనున్నారు. చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్ను రాష్ట్ర స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.వరదలనూ వాడుకుంటాం..రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్ను కోరింది. శనివారం రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్కు విజ్ఞప్తి చేశారు. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. చిన్న వ్యాపారులు, కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా పాల్గొన్నారు. -
ట్యాబ్ ఏది బాబూ?
సాక్షి, అమరావతి: డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో ట్యాబ్లతో లక్షల మంది పిల్లల మొహాల్లో సంతోషం తొణికిసలాడేది! అంతులేని సందేహాలను వాటి ద్వారా నివృత్తి చేసుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహంతో ఉరకలు వేసేవారు! డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన, సకల సదుపాయాలతో సర్కారు స్కూళ్లు కళకళలాడేవి!! మరి ఈ ఏడాది ట్యాబ్లు ఎక్కడ? మాపై ఎందుకంత కక్ష? అని లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సీఎం చంద్రబాబును అడుగుతున్నారు. 9.52 లక్షల మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ఉచితంగా అందించిన ట్యాబ్స్ పంపిణీని కూటమి సర్కారు ఈ ఏడాది నిలిపివేసింది. అదే జగన్ మామయ్య ప్రభుత్వం ఉంటే ఈ పాటికి ట్యాబ్లు వచ్చేవని 8వ తరగతి పిల్లలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన జగన్ మామను ప్రతి విద్యార్థీ తలచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే తమకు ఠంఛన్గా అమ్మ ఒడి వచ్చేదని తల్లులు గుర్తు చేసుకోని రోజు ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పేద కుటుంబాల తలరాతలను మార్చేవి చదువులేనని గట్టిగా నమ్మి గత ఐదేళ్లూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేశారు. ఏటా జూన్లో అమ్మ ఒడితో తల్లులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. నాడు నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దిన సర్కారు స్కూళ్ల ప్రయాణం ఇంగ్లీష్ మీడియం చదువుల నుంచి టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ స్థాయికి చేరుకుంది. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్ల బోధన లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలతో గోరుముద్ద అందించి పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. యూనిఫామ్ నుంచి పుస్తకాల దాకా అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం ఐదేళ్లలో ఏకంగా దాదాపు రూ.73 వేల కోట్లు వ్యయం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసి పిల్లల చదువులకు తోడ్పాటు అందించారు. ప్రభుత్వ విద్యా రంగానికి బలమైన పునాది వేశారు. ఇప్పుడు వాటిని సమూలంగా పెకిలించే దిశగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. పేద విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ స్కూళ్లపై పగబట్టినట్లు వ్యవహరిస్తోంది. విద్యా రంగ పథకాలను ఇంకా అద్భుతంగా అమలు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే అన్నింటినీ నిలిపివేసింది. ఆర్నెల్ల పాలనలో ఒక్కటైనా కొత్త పథకాన్ని అందించకపోగా గత సర్కారు అమలు చేసిన వాటిని కక్షపూరితంగా ఆపేసింది. ఇందుకు నాడు నేడు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఏఐ టెక్నాలజీ యాప్తో ట్యాబ్స్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు ప్రతి పాఠ్యాంశాన్ని విశ్లేషణాత్మకంగా, ఇంటి వద్ద కూడా చదువుకునే అవకాశం దక్కింది. విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా ట్యాబ్స్లో ‘డ్యులింగో’ యాప్ అప్లోడ్ చేశారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను రూపొందించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది.సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్ రద్దువైఎస్ జగన్ దేశమంతా ప్రశంసించే విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధనను అంచెలంచెలుగా అమలు చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను గత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే కూటమి సర్కారు ఈ ఏడాది రద్దు చేసింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు 2023–24 విద్యా సంవత్సరంలో మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్’ శిక్షణను కూడా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఈ సదుపాయం లభించగా ఈ ఏడాది ఒక్కరికీ అవకాశం లేకుండా చేసింది. గతేడాది 16 లక్షల మంది టోఫెల్ పరీక్ష రాయగా కనీసం ఆ ఫలితాలను కూడా ప్రకటించలేదు. పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఐబీ బోధన 2025 జూన్ నుంచి రాష్ట్రంలోని 38 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించేందుకు గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తే దాన్ని రద్దు చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.‘వందనం’ లేదు.. వంటా లేదు..!ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు చేతులెత్తేశారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా సీఎం చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవడంతో 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర నిస్పృహ చెందుతున్నారు. ఇక నాడు–నేడు పనులను మధ్యలో నిలిపి వేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. ఇటీవల ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన మెగా పీటీఎంలో తల్లిదండ్రులకు ఇదే భోజనాన్ని పెట్టడంతో అధికారులు, నాయకులను పలుచోట్ల నిలదీశారు. టీడీపీ హయాంలో గతంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నంతో సరిపెట్టగా వైఎస్ జగన్ నాణ్యమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో మధ్యాహ్నం రుచి, శుచితో పోషకాహారాన్ని అందించారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వంటలో మార్పుచేర్పులు చేశారు. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కోసం ఏటా రూ.450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.7,244.6 కోట్లు ఖర్చు చేసింది. అటకెక్కిన సబ్జెక్టు టీచర్ల బోధనవిద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనను వైఎస్ జగన్ అమల్లోకి తెస్తే ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. గత ప్రభుత్వం దాదాపు 6 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి, 3–5 తరగతులను హైస్కూళ్లకు మార్చి నాణ్యమైన బోధన అందిస్తే ఈ విద్యా సంవత్సరంలో కూటమి సర్కారు సబ్జెక్టు టీచర్లను కేవలం ఉన్నత తరగతులకే పరిమితం చేసి విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందకుండా చేసింది.మండలానికి రెండు కాలేజీలు రద్దురాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిలో ఒకటి బాలికల కోసం కేటాయించిన గత ప్రభుత్వం 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేసింది. 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటై బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 504 హైస్కూల్ ప్లస్లను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం ఇవి ఉండవని ఇటీవలే ప్రకటించింది.‘ఆణిముత్యాల’ ఆశలు ఆవిరి..వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022–23లో టెన్త్, ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 22,768 మంది విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించింది. ‘జగనన్న ఆణిముత్యాలు–స్టేట్ బ్రిలియన్స్’ అవార్డులతో వెన్నుతట్టి అభినందించింది. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారికే దక్కాయి. ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో చదివి ఉత్తమంగా రాణించిన 10 మంది నిరుపేద విద్యార్థులను గత ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది. 2023–24లో కూడా ఇదే విధానం కొనసాగుతుందనే ఉత్సాహంతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివిన దాదాపు 32 వేల మంది విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ఫలితాలు సాధించారు. అయితే జూన్లో నిర్వహించాల్సిన సత్కారాన్ని కూటమి సర్కారు నిలిపివేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల పట్ల అన్యాయంగా వ్యవహరించింది. వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలను రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కారు ఆరు నెలల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసింది.విద్యా సంస్కరణలువైఎస్ జగన్ చేపట్టిన చదువుల యజ్ఞంతో సర్కారు బడులు సమున్నతంగా మారాయి. 2019 నుంచి వివిధ విద్యా, సంక్షేమ పథకాలను అమలు చేశారు. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే జగనన్న విద్యాకానుక ఇవ్వడంతో తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫారం భారం లేకుండా పోయింది. బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్పించడం, పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఏటా సగటున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున జగనన్న అమ్మఒడి కింద నేరుగా నగదు జమ చేసింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టారు. ‘మన బడి నాడు–నేడు’ పథకంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సమున్నతంగా మారాయి. కొత్త భవనాలు, డబుల్ డెస్క్ బెంచీల నుంచి కాంపౌండ్ వాల్ వరకు దాదాపు 11 రకాల సదుపాయాలు సమకూరాయి. నాడు – నేడు పనులు పూర్తయిన హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్పీలు, ఎలిమెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్ టీవీలు అందించి డిజిటల్ బోధన ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజనంలో జగనన్న గోరుముద్ద కింద వారానికి 16 రకాల వంటకాలతో నాణ్యమైన పోషకాల భోజనం అందించారు. దేశంలో ఈ తరహా భోజనాన్ని పిల్లలకు అందించిన రాష్ట్రం మరొకటి లేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. ఇక 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో డిజిటల్ బోధన అందించడంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగాయి. ఇంగ్లిష్ మీడియం బోధనతో 2022–23 విద్యా సంవత్సరంలో 84 శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కాగా 2023–24లో అది ఏకంగా 93 శాతానికి పెరిగింది. 2024 మార్చి పదో తరగతి పరీక్షల్లో 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో 2.25 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాయగా 1.96 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకే పరిమితమైన ‘స్టేట్ టాపర్స్’ గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల నుంచి రావడం గమనార్హం. టాపర్స్గా నిలిచిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించి ఏపీలో విద్యా సంస్కరణల గురించి ప్రపంచానికి చాటి æచెప్పారు. ఇప్పుడు ఆ పథకాలు, సదుపాయాలు, ప్రోత్సాహం లేకపోవడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు తరలిపోయారు. -
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్లో సోమవారం షోల్జ్కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
పింఛనర్లపై పగ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నెలనెలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి.. మా పార్టీలో చేరండి. లేదంటే అంతే సంగతులు.. ఆశలు వదులుకోండి. ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనంలేదు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య, శ్రీనివాసరావులతోపాటు కొందరు పింఛన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితోపాటు మరికొందరికి మాత్రం డబ్బులివ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకున్నారు. మూడోనెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే.. మీ పింఛన్లు లేవన్నారు. ఆరాతీస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సచివాలయ పరిధిలో ఉన్నాయని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు నెలలు శ్రమకోర్చి అక్కడికే వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. సొంత ఊరిలో ఉంటే ఎలాగూ పింఛన్ ఇవ్వరని కేతనకొండ నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి బదిలీ పెట్టుకున్నారు. ఆరోనెల శంకరాపురానికి వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. విషయం తెలిసి మంత్రి గొట్టిపాటి ముండ్లమూరు అధికారులకు చీవాట్లు పెట్టడంతోపాటు తక్షణం ముగ్గురి పింఛన్లను వేర్వేరు ఊర్లకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకేముంది.. వికలాంగుడు శ్రీనివాసరావు పింఛన్ శ్రీకాకుళానికి.. బత్తుల చిన్న అంజయ్య పింఛన్ అనంతపురానికి, లీలావతి పింఛన్ చిత్తూరు జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. వారు అంతదూరం వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే అంతకుమించిన ఖర్చవుతుంది. లేదంటే మంత్రిని కలిసి జీ హుజూర్ అనాల్సిందే అంటున్నారు.వైఎస్సార్సీపీకి మద్దతు పలికారని..గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా ఇలాంటి వారి పింఛన్లను తొలగించారు. కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీచేశారు. పింఛన్దారులను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారు. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పట్టు నిలుపుకునేందుకే ఇలా..ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇసుక, గ్రానైట్, రేషన్ బియ్యం దందాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై కూటమి సర్కారు పెనుభారం మోపడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతిష్ట నియోజకవర్గంలో పూర్తిగా మసకబారింది. పైగా.. నేతలు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని పసిగట్టిన గొట్టిపాటి నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పింఛన్లను సైతం నిలిపేసి వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
కేసులపై కుతంత్రం!
చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ అక్రమాలు, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను ఆ సీనియర్ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది!! – సాక్షి, అమరావతి -
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
Andhra Pradesh: చంద్రబాబు ప్రభుత్వం హై ఓల్టేజ్ షాక్
సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం.. పైగా తగ్గిస్తాం.. నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఐదు నెలలకే మాట తప్పి రాష్ట్ర ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తోంది. సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ చార్జీలపై చేసిన వాగ్దానాన్ని మరచి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విద్యుత్తు చార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజీ షాకులిస్తున్నారు. రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడుకు తెర తీశారు. విద్యుత్తు వాడకం తక్కువగా ఉండే శీతకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాక్లు ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ను దూరం చేసి బిల్లులతో బాదేస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర వర్గాలపై పెనుభారం మోపింది.నివ్వెరపోతున్న వినియోగదారులు..ఈ నెల 2వ తేదీ నుంచి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందిస్తున్నారు. వాడిన దానికి మించి విద్యుత్ బిల్లులతో షాక్లకు గురి చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్నారని గ్రహించి గగ్గోలు పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.6,072.86 కోట్ల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వినియోగదారులపై ప్రభుత్వం వేస్తోంది. సర్దుబాటు చార్జీ ప్రతి యూనిట్కు సగటున రూ.1.27గా నిర్ణయించిన ఏపీఈఆర్సీ దీనిని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెలా వినియోగదారులపై ఈ సర్దుబాటు భారం యూనిట్కు సగటున రూ.0.63 చొప్పున పడుతోంది.వచ్చే నెల నుంచి మరింత మోత..ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలులో నివసించే గడ్డం రమణారెడ్డికి నవంబరులో రూ.1,620 విద్యుత్ బిల్లు రాగా ఈ నెల ఏకంగా రూ.2,541 బిల్లు వచ్చింది. గత నెలతో పోలిస్తే 56 శాతం అదనంగా పెరిగి రూ.921 అధికంగా బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నారు. నవంబర్,డిసెంబరు నెలల బిల్లులు చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో అద్దె ఇంట్లో నివసించే రమేష్కు ప్రతి నెలా రూ.300 – రూ.400 మధ్య కరెంట్ బిల్లు వస్తుంది. అక్టోబర్లో రూ.363 వచ్చింది. నవంబర్లోనూ రూ.385కి మించలేదు. అలాంటిది ఈ నెల ఏకంగా రూ.679 రావడంతో షాక్ తిన్నాడు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని ప్రకాశ్నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించే కత్తి రామక్క నలుగురు సంతానం అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరు వ్యాపారంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఎస్సీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని వర్తింపచేయడంతో ఐదేళ్లుగా ఆమెకు కరెంటు బిల్లు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు బిల్లు కట్టాలంటూ విద్యుత్ శాఖ అధికారులు ఇంటి వద్దకు వచ్చారు. రూ.3,464 బిల్లు కట్టాలని, 2018 నుంచి బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ కరెంట్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గిపోతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారుగా బాబు 16/08/2023: టీడీపీ విజన్ డాక్యుమెంట్– 2047 విడుదల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచం.. వీలైతే తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ⇒ మా ఇంటికి వైఎస్సార్ సీపీ హయాంలో ఉచిత విద్యుత్తు అందించారు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నుంచి బిల్లు కట్టమని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ⇒ కన్నేపల్లి కుమారి (ఎస్సీ సామాజిక వర్గం), సిటిజన్ కాలనీ, గాంధీ గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా (02 వీఎస్సీ 803)కర్నూలులోని బుధవారపేటలో అద్దె ఇంట్లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి అజయ్కి (సర్వీస్ నెంబర్ 8311102106824) గత నెలలో విద్యుత్ బిల్లు రూ.688 రాగా ఈ నెలలో ఏకంగా రూ.1,048 రావడంతో గుండె గుభిల్లుమంది. ఆ కుటుంబంపై ఒక్క నెలలోనే రూ.360 అదనపు ఆర్థిక భారం పడింది. ఈ నెల నుంచి పెరిగిన విద్యుత్ బిల్లుల బాదుడు స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 88 యూనిట్లకు రూ.348.97 బిల్లు రాగా ప్రస్తుతం 91 యూనిట్లకు రూ.463.91 బిల్లు వచ్చినట్లు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన కె.సూర్యకాంత్ తెలిపారు. అదనంగా వాడిన మూడు యూనిట్లకు రూ.114.94 బిల్లు ఎక్కువగా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. ఉచిత విద్యుత్తు ఇచ్చిన వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ కూటమి సర్కారు బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం హరిజనవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు ఇటీవల నిరసనగా దిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న బి.శివాజీ. విజయవాడలోని కానూరులో ఉంటారు. ఆయన ప్రతి నెలా దాదాపు రూ.600 విద్యుత్ బిల్లు చెల్లిస్తుండగా ఈ నెల రూ.813 బిల్లు వచ్చింది. దాదాపు 35 శాతం అదనంగా చార్జీలు పడటంతో శివాజీ గగ్గోలు పెడుతున్నాడు. ఇంత భారం మోపితే కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నాడు. పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగేవారే లేరా? అని నిస్సహాయంగా ప్రశ్నిస్తున్నాడు.విజయవాడలోని ప్రసాదంపాడుకు చెందిన ఏ.సహిల్కు ఈ నెల (నవంబర్ వినియోగం)రూ.1,321 బిల్లు వచ్చింది. గత నెల ఇదే సర్వీసుకు ఆయన చెల్లించిన బిల్లు రూ.861 మాత్రమే. అంటే ఈ నెల బిల్లులో ఏకంగా 53 శాతం అదనంగా భారం పడింది. -
డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో హీరో సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందులో ఆఖరులో కొన్ని డైలాగ్స్ చెబుతారు. అవి ఇప్పటి పరిస్థితులకు అతికినట్లు ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ‘రేయి నిన్నే... వాడు నీ తల మీద ఎక్కి కూర్చుంటే... పెట్రోల్ రేటు పెరిగిపోద్ది. కంది పప్పు పెరిగిపోతుంది. పిల్లల స్కూల్ ఫీజులు పెరిగి పోతాయి. బస్సు చార్జీలు పెరిగిపోతాయి. ఇవి నీకు ఓకేనా. టైం లేదా నీకు. కొత్త సినిమా రిలీజైతే తెల్లవారు జామున ఐదు గంటలకల్లా క్యూలో నిలుచుంటావే. నీకిష్టమైన హీరో సినిమా పది, ఇరవై సార్లు చూస్తావ్. దానికి టైం ఉంటుంది. ఒక్క మ్యాట్నీ వదిలేసి రా ఒక పనైపోద్ది. నీకు హీరో కావాలా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో! మరి ఇంటి కోసం నువ్వేం చేస్తు న్నావు? మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేమీ లేదు రా ఎదవ బానిస సంకెళ్లు తప్ప. రా... రా... వెయిట్ చేస్తున్నా రా...’ సినిమాలో గొంతు పెద్దది. ఈ డైలాగ్స్ పలి కిన పవన్ నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అధికార పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచిపోయి ప్రతి పక్షంపై దాడులకు పూనుకున్న విషయం తెలిసిందే. నడిరోడ్డుపై హత్యలు జరిగాయి. ఇక దౌర్జన్యాలకైతే లెక్కే లేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ఎన్నోసార్లు ప్రకటించిన పవన్ వీటిని ఖండించ లేదు. తన సినిమాలో మాత్రం రా కదలి రా... ప్రశ్ని ద్దామని కన్నెర్ర చేశారు.సినిమా కోసం రైటర్ ఇచ్చిన డైలాగులను బట్టీపట్టి పవన్ సినిమాలో చెప్పారు. కానీ అవి భవిష్యత్ సంకేతాలుగా నిలిచాయి. చంద్రబాబు గద్దె నెక్కాక ప్రజల జీవనయానంపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా నిత్యా వసరాల ధరలు తగ్గకపోగా ఆకాశన్నంటుతున్నాయి. మద్యం షాపులపై పెట్టిన శ్రద్ధ బడి పిల్లలపై చూప లేదు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారు. సంక్షేమ పథకాలకు ఫుల్స్టాప్ పడి పోయింది. భారత రాజ్యాంగం స్థానంలో నేడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనేది మెజారిటీ ప్రజానీకం అభిప్రాయం.నేడు కొత్త సినిమా టికెట్ల కోసం లైన్లు తగ్గిపోయాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్లిపోతున్నారు. ఓటీటీ పుణ్యాన మార్పులు శర వేగంగా వచ్చాయి. ఇప్పుడు వేరే లైన్లు ఉన్నాయి. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ లబ్ధిదారులూ, రేషన్ కోసం మహిళలూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. తాను స్వయంగా చెప్పిన డైలాగులను పవన్ మరిచిపోయినట్లున్నారు. పోరాడితే పోయే దేమీ లేదు... ఎదవ బానిస సంకెళ్లు తప్ప అని భావించిన చాలామంది రియల్ హీరోలు ప్రశ్నించాలంటే మ్యాట్నీలు వదలాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలనుకున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇంకేముంది రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు శిక్షలు మొదలయ్యాయి. ఈ అన్యాయాలను ప్రశ్నించాల్సిన పవన్ మాత్రం నేను సినిమాల్లో మాత్రమే హీరోనని తల పక్కకి తిప్పేశారు. పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని కోరుకున్న వ్యక్తి అది నిజంగా జరగడాన్ని ఊహించలేదా? లేక తట్టుకోలేకోయారా? తనకు అధికారం ముఖ్యం కాదని గతంలో ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు. అయితే ఇప్పుడు ఆ పవర్ ముఖ్యం కావడంతో నోరు కుట్టేసుకున్నారని సమాజం భావిస్తోంది.పవన్ కాకినాడ పోర్టుకెళ్లి స్టైల్గా ‘సీజ్ ద షిప్’ అనడం... ఆయన అభిమానులు సోషల్ మీడియాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో పోస్టులు పెట్టి సంబర పడిపోవడం చకచకా జరిగాయి. అసలు డిప్యూటీ సీఎం అనాల్సిన మాట వేరే ఉంది. ఆరు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ‘కదలిరండి.. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’ అనుంటే హాల్లో వినిపించిన చప్పట్ల సౌండ్ నిజ జీవితంలో మరింత గట్టిగా వచ్చేది. కానీ పవన్ సినిమాటిక్గానే వ్యవహరించి డిప్యూటీ సీఎం అనేది చంద్రబాబు దర్శకత్వంలో చేస్తున్న ఒక పాత్ర మాత్రమేనని చెప్పకనే చెప్పారు.– వెంకట్ -
ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్లింది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్ జగన్
కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీల షాక్లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.– పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గాలనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ (మూడు నెలలు) అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్లో పెట్టారు. ⇒ ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు ⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు ⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.ఇసుక, మద్యం మాఫియా ⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్షాప్లు కేటాస్తున్నారు. ⇒ ఈ రోజు బెల్ట్షాప్లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్షాప్కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం ⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనసంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్లో ఉన్న పార్టీ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలి.మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్మెంట్పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్ చేయాలి.ఈ మూడు సమస్యలతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేద్దాం. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ను కట్ చేసింది. దీనిపై విద్యుత్శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలను టీడీపీ కూటమి ప్రభుత్వం ముంచేసింది. తుపాను హెచ్చరికలున్నా ముందుస్తు చర్యలు చేపట్టకుండా వారిని నడిరోడ్డుపై వదిలేసింది. కోసిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలకు కళ్లెదుటే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక నిస్సహాయ స్థితిలో కుంగిపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన తిండి గింజలను అమ్ముకోవడానికి హీనమైన దుస్థితి అనుభవిస్తున్నారు. వాస్తవానికి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచే దళారులు, మిల్లర్ల దందాకు టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్లు తెరిచింది. ఫలితంగా గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు వెళ్లిన కర్షకులకు నిరాశ తప్ప భరోసా దక్కట్లేదు. వర్షాల సాకుతో మద్దతు ధరలో మరింత కోత పెట్టేందుకు వారు కుట్రలు చేస్తున్నా సర్కారు కళ్లుండీ కబోదిలా వ్యవహరిస్తోంది. దీంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా మిల్లర్లు, దళారులు ధాన్యం కొనడం నిలిపేశారు. రైతులు బతిమాలితే నామమాత్రపు ధర ఇచ్చి సరిపెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడచూసినా ఇలాంటి దోపిడీయే సాక్షాత్కరిస్తోంది. 75 కిలోలకు మద్దతు ధరలో కోత పెట్టడంతో పాటు అదనంగా మరో కేజీ దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరోవైపు.. అకాల వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక.. రంగు మారుతుందన్న భయంతో.. మొలక వస్తుందన్న దిగులుతో రోడ్లపైనే ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా సాధారణ రకం ధాన్యానికి రూ.2,300, ఏ–గ్రేడ్కు రూ.2,320గా మద్దతు ధర ప్రకటించింది. ఇందులో 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1,725, ఏ–గ్రేడ్కు రూ.1,740 గిట్టుబాటు ధర ఇవ్వాలి. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు 75 కేజీల బస్తాకు రూ.300 నుంచి రూ.400కి పైగా నష్టపోతున్నాడు. ఇలా ఎకరాకు సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేలకు పైగా మద్దతు ధరను దళారులు, మిల్లర్లు దోచేస్తున్నారు.రైతుకు అన్యాయం జరుగుతోంది..‘‘నేను టీడీపీ కార్యకర్తను. శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడి (నీటి సంఘాలు)గా పనిచేశా. కిందటేడాది మద్దతు ధరకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకున్నాం. ఇప్పుడు రైతుకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం పేరుతో మిల్లర్లు దగా చేస్తున్నారు. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. తొమ్మిది ఎకరాల్లో ‘1061’ రకం సాగుచేశా. ధాన్యాన్ని రూ.1,500 (76 కిలోల బస్తా) అమ్ముకున్నా. ఇక్కడే ఒక బస్తాకు రూ.23 నష్టపోతున్నాను. మరో పదెకరాల్లో ‘1262’ రకాన్ని సాగుచేశా. ఇప్పుడు కోసి ఆరబెట్టా. దీనిని కొనేవాడు లేడు. సంచులు కూడా ఇవ్వట్లేదు. కేవలం రూ.1,400 అయితే కొంటామని బేరగాళ్లు చెబుతున్నారు. అలా అమ్ముకోవడానికి ఇష్టంలేక కాపాడుకోవడానికి నానా యాతన పడుతున్నాను’’.. ..ఇదీ కృష్ణాజిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన రైతు దోనేపూడి గోపీకృష్ణ ఆవేదన. రైతుగా తనకు జరుగుతున్న నష్టాన్ని ఆయన వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తు్తన్నారు.మాఫియాకే ‘మద్దతు’!రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మాఫియాను తలదన్నేలా జరుగుతోంది. పేరుకే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తోంది. నిజానికి.. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే పూర్తిగా మేలు జరుగుతుంది. కానీ, పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వం దగ్గరకు రైతు వెళ్తే.. ‘సంచుల్లేవు.. కూలీల్లేరు.. ఇప్పుడు కొనలేం’.. అంటూ నిరుత్సాహపరిచే సమాధానాలు ఎదురవుతున్నాయి. పోనీ బయట అమ్ముకుందామంటే మిల్లర్లు, దళారులు మొత్తం సిండికేట్ అయిపోయారు. వారి ఆజ్ఞలేనిదే రైతుకు సంచులు, హమాలీలు వచ్చే పరిస్థితిలేదు. సంచులు వస్తేనే పంటను బస్తాల్లో నింపుకుని తరలించేందుకు వీలుంటుంది. వీటన్నింటివల్ల రైతులు నిస్సహాయ స్థితిలో గతిలేక దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకే పంటను అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పైగా తేమ శాతం పేరుతో కోత కూడా విధిస్తున్నారు. దళారులు మాత్రం రైతుల పేరుతోనే ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధరను సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. రైతుసేవా కేంద్రంలో తేమ శాతం సక్రమంగా ఉన్నప్పటికీ పూర్తి మద్దతు ధర వస్తుందన్న గ్యారంటీ లేదు. పక్క జిల్లాల మిల్లులకు తీసుకెళ్లండిఇదిలా ఉంటే.. ఫెంగల్ తుపాను దెబ్బకు కోస్తాలో అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కృష్ణాజిల్లాలోని రైతాంగం కుదేలైంది. కోసిన పంట వర్షానికి తడిసిపోగా.. కోతకొచ్చిన పంట నేలవాలిపోయింది. తుపాను హెచ్చరికలకు వారానికి ముందు కోసిన పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. విజయవాడ నగర శివారు నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారికి ఇరువైపుల సుమారు 60 కిలోమీటర్ల మేర వర్షంలో తడుస్తున్న ధాన్యపు రాశులే దర్శమిస్తున్నాయి. ఇక్కడ యుద్ధప్రాతిపదికన పంటను తరలించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. మరోవైపు. కొన్న అరకొర ధాన్యం కాస్తా మిల్లుల బయట రోజుల తరబడి వాహనాల్లో నానుతోంది. దీంతో రైతులను తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమలోని మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. వ్యయ ప్రయాసలు కోర్చి అలా తరలించినా అక్కడ అన్లోడింగ్కు రోజులు తరబడి సమయంపడుతోంది. సుమారు 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు లోడును తీసుకెళ్తే రవాణ ఖర్చు తడిసిమోపుడు అవుతోందని రైతులు వాపోతున్నారు. అక్కడ వెంటనే దిగుమతి చేయకుంటే వాహనానికి వెయిటింగ్ చార్జీలు గుదిబండలా మారుతాయని భయపడుతున్నారు. ఇలా పక్క జిల్లా మిల్లులకు తరలించుకుంటే నష్టం తప్ప పైసా లాభంలేదని వారు పెదవి విరుస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ధాన్యం తరలింపునకు ప్రభుత్వం అసలు కాంట్రాక్టరునే నియమించలేదని తెలుస్తోంది. ఫలితంగా రైతులు సొంతంగా లోడును తరలించుకోలేక.. మిల్లరు వాహనం పంపిస్తే.. వాళ్లు చెప్పిన ధరకే పంటను విక్రయించాల్సి వస్తోంది.గతంలో ఎంతో మేలు..గతంలో ప్రభుత్వం గోనె సంచులు, హమాలీలు, రవాణా నిమిత్తం రైతుకు జీఎల్టీ చెల్లించేంది. సొంత వాహనాలున్న రైతులు హాయిగా తమకు ట్యాగ్ చేసిన మిల్లులకు లోడును తీసుకెళ్లే వారు. వాహనాల్లేని రైతుల కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటుచేసేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తల్లకిందులైంది. రైతే సొంతంగా మిల్లుకు ధాన్యాన్ని తోలుకుంటే జీఎల్టీ రాకపోగా పూర్తి మద్దతు ధర కూడా దక్కడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు సేకరించారు.‘హాయ్’ అన్నా పలకని ప్రభుత్వం..పౌరసరఫరాల సంస్థలో వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని సందేశం పంపి వివరాలు నమోదుచేస్తే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ఆర్భాటంగా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేసుకున్నారు. కానీ, రైతులు ‘హాయ్’ అంటుంటే అటు నుంచి కనీస స్పందన కరువైంది. పైగా.. తమ గోడు చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్కు ప్రయత్నించినా ఉలుకూ.. పలుకూ ఉండట్లేదని రైతులు వాపోతున్నారు.11,157 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలుఅత్యధికంగా 10,426 ఎకరాల్లో వరిపంటకే నష్టంఆ తర్వాత వేరుశనగ, అపరాలకు.. అంచనా వేసిన వ్యవసాయశాఖఫెంగల్ తుపాను ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 11,157 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంట్లో 10,426 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు గుర్తించారు. 501 ఎకరాల్లో వేరుశనగ, 180 ఎకరాల్లో మినుము, 50 ఎకరాలల్లో కంది, పెసర, మొక్కజొన్న పంటలు ముంపునకు గుర్యయాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 9,612 ఎకరాలు, నెల్లూరులో 643 ఎకరాలు, చిత్తూరులో 522 ఎకరాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.భయమేస్తోంది..నేను కౌలుకు సాగుచేస్తున్నా. 40 ఎకరాల్లో వరి వేశా. ఇప్పుడు 20 ఎకరాల్లో కోత కోశాను. వర్షాలు పడుతుండడంతో పంటను మిల్లులకు తరలించా. ఇంకా 20 ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. రెండ్రోజులుగా తుపానుతో వీస్తున్న గాలులకు పంట నేలవాలింది. ఇంకా వర్షం అధికంగా వస్తుందని చెబుతున్నారు. నేలవాలిన పంటను కోత కోయడానికి ఎకరాకు పదివేల వరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడి చేతికి రాకపోగా నష్టం వస్తుందేమోనని భయమేస్తోంది. – యనమదల వెంకటేశ్వరరావు, కౌలు రైతు, మద్దూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా కొనేవారు కరువయ్యారు.. ‘1318’ రకం ధాన్యం సాగుచేశాను. ఐదెకరాలకు పైగా పంటను కోశాను. ధాన్యం కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇంతలో వర్షం రావడంతో తడిసిపోయింది. మిల్లర్లు కూడా స్పందించట్లేదు. రైతుసేవా కేంద్రాల దగ్గరకు వెళ్తే సంచులిస్తాం.. లారీలో మండపేటకు తీసుకెళ్లమని చెబుతున్నారు. పచ్చి ధాన్యం సంచుల్లో నింపితే రంగుమారి, మొలకలు వస్తాయి. రూ.1,400కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ కొనట్లేదు. – వీరంకి చెన్నకేశవులు, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాఅన్ని విధాలా నష్టపోయాం.. పంట కోతకు రావడంతో కోసేశాం. ఇంతలో తుపాను వచ్చింది. వడ్లను ఆరబెట్టుకునేలోగా తడిసిపోయాయి. పంటను తీసుకెళ్లే దారి లేకపోవడంతో రోడ్ల పక్కనే టార్పాలిన్లు కప్పి ఉంచాం. ఆవిరికి రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉంది. ఏంచేయాలో దిక్కుతోచట్లేదు. కౌలుకు చేసుకుంటున్న మేం అన్ని విధాలా నష్టపోయాం. – నాంచారమ్మ, జుజ్జువరం, పామర్రు మండలం, కృష్ణాజిల్లాగతంలో ఇలా ఇబ్బంది పడలేదు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వ అధికారులు సంచులు కూడా ఇవ్వలేదు. వర్షం వస్తోందని తెలిసి మిల్లరు దగ్గరకు వెళ్తే సంచులు ఇచ్చాడు. ఇప్పుడు సరుకు అక్కడికి తీసుకెళ్తేగాని రేటు చెప్పరు. ఇక తేమ ఎక్కువగా ఉంది.. ఆరబెట్టుకోండని రైతుసేవా కేంద్రంలో చెప్పారు. ఈ వర్షాల్లో ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకుంటాం. ఒక్కరోజు ఆలస్యమైతే రంగుమారి పోతుంది. గతంలో మాకెప్పుడూ ఇబ్బందిలేదు. ఇప్పుడు తక్కువకు అడుగుతున్నారు. మద్దతు ధర రాకపోయినా.. అమ్ముకోక తప్పదు. మద్దతు ధర వచ్చినా రాకపోయినా కౌలు పూర్తిగా చెల్లించాలి కదా?. – పి. వెంకటేశ్వరరావు, రామరాజుపాలెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లా -
సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు
బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. – అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లాసాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది.. ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు. ఫెంగల్ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి. అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండిఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. వైఎస్ జగన్ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు (జీఎల్టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు. మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. ⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. -
అదిగో పులి... ఇదిగో తోక!
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్ మోహన్ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్సెన్స్లో అనేక సందేహాలు తలెత్తుతాయి.సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్ పొదుపు తప్పు ఎట్లయింది?సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?‘సెకీ’తో పాటు ప్రైవేట్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!జగన్ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్గఢ్, జమ్ము–కశ్మీర్ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్మోహన్ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?ఏపీలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్గఢ్ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్కేను బయ టకు పంపించాలనీ డిమాండ్ చేయగలరా?అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్దాన్లోని సాగర్ అదానీ టెలిఫోన్ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్బీఐ నేరారోపణ చేసింది. ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్ మోహన్ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. భారత్లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబ్బల్ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్కో ముక్కలను, ట్రాన్స్కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.కేజీ బేసిన్లో గ్యాస్ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్టీ, ఎల్టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.ఒక్క విద్యుత్రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. జగన్మోహన్ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏపీ ప్రజలపై మరో భారం (ఫోటోలు)
-
Andhra Pradesh: అభివృద్ధిపైనా అబద్ధాలే
సాక్షి, అమరావతి: వరుసగా ఏటా సొంత ఆదాయాల్లో పెరుగుదల.. జాతీయ స్థాయికి మించి పెరిగిన తలసరి ఆదాయం.. చిన్న, సూక్ష్మ పరిశ్రమలతో 32.79 లక్షల ఉద్యోగాలు.. కోవిడ్లోనూ ఉపాధికి ఢోకా లేకుండా భరోసా.. గాడిన పడ్డ పొదుపు సంఘాలు.. బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు.. పేదవాడికి ఆరోగ్య భరోసా.. రైతుల్లో నిశ్చింత.... ఇవన్నీ ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రయాణానికి తిరుగులేని నిదర్శనాలు! స్ధిర ధరల ఆధారంగా వృద్ధి రేటు వైఎస్సార్ సీపీ హయాంలో ఏటా పెరిగినట్లు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టంగా చెబుతోంది. అయినా సరే.. గత సర్కారు పాలనలో అభివృద్ధి జరగలేదని.. ఆదాయం పెరగలేదని.. తలసరి ఆదాయం తగ్గిపోయిందని.. పెట్టుబడులు రాలేదని.. స్కీములన్నీ స్కామ్లేనంటూ బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు కట్టుకథలు చెప్పారు!! కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించిన 2023–24 సామాజిక ఆర్ధిక సర్వే సాక్షిగా ఈ అబద్ధాలు బట్టబయలయ్యాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణించడం వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. వైఎస్సార్ సీపీ హయాంలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం వెంటాడినప్పటికీ ప్రతి ఏడాది వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. 2022–23తో పోల్చితే 2023–24లో స్థిర ధరల ఆధారంగా వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది.వృద్ధికి ఊతం..⇒ 2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,84,205 కాగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,42,479గా ఉంది. ⇒ 2021–22 నుంచి 2023–24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగాయి. పొదుపు మహిళకు ‘‘ఆసరా’’రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు 99 శాతం రికవరీతో పాటు 30 శాతం వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే వెల్లడించింది. స్వయం సహాయక సంఘాలకు 2019 ఏప్రిల్ 11వతేదీ వరకు ఉన్న రుణాల భారాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా చెల్లించి గత ప్రభుత్వం ఆదుకుంది. 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలకు రూ.25,557.54 కోట్లు చెల్లించింది.పారిశ్రామిక విప్లవం.. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.11,688.11 కోట్ల పెట్టుబడితో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించి 14,596 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ⇒ రూ.6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టులు నిర్మాణ, ప్రారంభ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా 4.86 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,286.48 కోట్ల పెట్టుబడితో 2,71,341 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడమే కాకుండా వాటి ద్వారా ఏకంగా 19,86,658 మందికి ఉపాధి కల్పించాయి. ⇒ గతంలో ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎంఎస్ఎంఈల ద్వారా రూ.26,000 కోట్ల పెట్టుబడులు, 8.67 లక్షల మందికి ఉపాధి కల్పించగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంఎస్ఎంఈలతో రూ.33,177 కోట్లు పెట్టుబడులు, 32.79 లక్షల మందికి ఉపాధి చూపినట్లు సర్వే వెల్లడించింది. 2023–24లో 2.24 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా 64,307 మంది ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. విద్యా సంస్కరణలు.. చదువులకు సాయం⇒ మన బడి నాడు – నేడు కింద తొలి దశలో రూ.3859.12 కోట్ల వ్యయంతో 15,715 స్కూళ్లలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా రెండో దశలో రూ.8,000 కోట్లతో అదనపు తరగతి గదులతోపాటు 11 రకాల సదుపాయాలను 22,344 స్కూళ్లలో కల్పించారు. రూ.372.77 కోట్లతో 883 స్కూళ్లలో వసతులు కల్పించారు. ⇒ పిల్లల చదువులకు పేదరికం అడ్డురాకూడదనే సంకల్పంతో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. పిల్లల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున 2022–23లో 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు అందచేశారు. ⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు డ్రాప్ అవుట్స్ లేవు. 6 నుంచి 8వ తరగతి వరకు 0.01 శాతం మాత్రమే డ్రాప్ అవుట్స్ ఉండగా తొమ్మిది, పదో తరగతిలో 2.39 శాతం డ్రాప్ అవుట్స్ నమోదయ్యాయి.ఆర్బీకేలు.. పెట్టుబడి సాయందేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు సేవలందించాయని సర్వే తెలిపింది. రైతు భరోసా – పీఎం కిసాన్ కింద 2023–24లో 2.58 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్, కౌలు రైతులతో సహా 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,226.08 కోట్లు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం అందచేసింది. రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి ఆర్థిక వనరుల గురించి సామాజిక, ఆర్థిక సర్వేలో పేర్కొన్న భాగం -
ప్రజలకు షాక్లు.. సర్కారు సోకులు 'వాతలపై వాకౌట్'
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు విద్యుత్తు షాకులపై శాసన మండలి దద్ధరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని... అవసరమైతే చార్జీలను ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతోపాటు ఐదు నెలల్లోనే ప్రజలపై ఏకంగా రూ.17 వేల కోట్లకుపైగా కరెంట్ చార్జీల భారాన్ని మోపడాన్ని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మండలి సాక్షిగా నిగ్గదీసింది. గత సర్కారుపై బురద చల్లే యత్నాలను ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా డిస్కమ్లకు (విద్యుత్తు పంపిణీ సంస్థలు) సకాలంలో రాయితీలను అందించి ఆదుకుందని, ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లకు పైగా అందచేసిందని గుర్తు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించేందుకు నిరాకరిస్తూ వినియోగదారులపై నిర్దాక్షిణ్యంగా రూ.17 వేల కోట్లకుపైగా చార్జీల భారాన్ని మోపుతోందని మండిపడింది. విద్యుత్తు చార్జీల వాతలు, సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు లేకపోవడం, రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సోమవారం మండలి నుంచి వాకౌట్ చేసింది. శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని ఎందుకు మోపుతున్నారని నిలదీశారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన తరువాత ఆ కార్యక్రమాల వ్యయాన్ని ఆయా ప్రభుత్వాలే భరించాలని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో మీరే వాగ్దానం చేశారు కదా? హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? సబ్సిడీ కింద ప్రభుత్వం నిధులు కేటాయించి వినియోగదారులకు ఊరట కల్పించవచ్చు కదా? ఇప్పటికే రూ.ఆరు వేల కోట్లకుపై భారాన్ని ప్రజలపై మోపారు. ఇంకో రూ.11 వేల కోట్లకుపైగా భారాన్ని కూడా వేసి ఏం చేద్దామనుకుంటున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు జరపకపోవడం మోసపూరితమని మండిపడ్డారు. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ బకాయిలు, అప్పులు రూ.ఏడు వేల కోట్ల దాకా ఉంటాయి. 2014–19 మధ్య టీడీపీ సర్కారు వాటిని రూ.29 వేల కోట్ల వరకు తీసుకెళ్లింది. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.395 కోట్లకు మించి ఐదేళ్లలో డిస్కంలపై భారం పడలేదు. అదే నాడు టీడీపీ హయాంలో రూ.22 వేల కోట్ల మేర భారం వేశారు. ఇక టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో డిస్కంలకు రూ.15 వేల కోట్లు మాత్రమే సబ్సిడీ కింద ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లకుపైగా విద్యుత్ రంగానికి అందచేసి ఆదుకుంది’ అని గణాంకాలతో కూటమి సర్కారు షాకులను ఎండగట్టారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరితో కలసి వాకౌట్ చేశారు. అప్పులపై తప్పుడు ప్రచారం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం ఆనవాయితీ. ఇంత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినా సూపర్ సిక్స్ పథకాలకు ఎటువంటి కేటాయింపులు లేకపోగా ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై కూడా స్పష్టత లేదంటే ఇది మోసపూరిత బడ్జెట్ కాక ఇంకేమంటారు? మాజీ ఆర్ధికమంత్రి రూ.14 లక్షల కోట్ల అప్పలు అంటారు! ముఖ్యమంత్రి రూ.పది లక్షల కోట్లు అంటారు! ఆర్థిక మంత్రి రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్లో అంటారు! మరి ఇందులో ఏది నిజం? ఎవరు తప్పుడు లెక్కలు చెబుతున్నారో సభకు స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిమితికి లోబడి అందులో 86 శాతం మాత్రమే అప్పులు తీసుకుంది. సూపర్ సిక్స్ ఎక్కడ? సూపర్సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడ? స్కూలుకు వెళ్లే పిల్లలకు తల్లికి వందనం ఎక్కడ? నీకు 15 వేలు.. నీకు 15 వేలు అనేది ఇప్పుడు తెగ ప్రచారమవుతోంది. పాఠశాల విద్యార్థులు 80 లక్షల మందికిపైగా ఉంటే బడ్జెట్లో కేటాయించిన రూ.5,000 కోట్లు ఎలా సరిపోతాయి? ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్లు దాటిన వారికి ఫించను హామీని ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆలస్యం ఎందుకు? 20 లక్షల ఉద్యోగాలు సృష్టించలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి కదా? దిగజారిన శాంతి భద్రతలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఉప ముఖ్యమంత్రే చెప్పారని బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, హత్యాచారాలపై మండలిలో చర్చ సందర్భంగా అధికార – ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం చోటు చేసుకుంది. హోంమంత్రి అనిత జవాబిచ్చిన తీరును బొత్స ఖండించారు. సభ్యుల ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పకుండా మంత్రి రాజకీయ ఉపన్యాసాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత ఐదు నెలల కాలంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, వేధింపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కల్పలత ఆందోళన వ్యక్తం చేశారు. యథేచ్ఛగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటవుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన నేరాల్లో 24–48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కాగా శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం అనలేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఔను.. ఒక్క సిలిండరే ఉచిత గ్యాస్ సిలెండర్ హామీపై బొత్స గట్టిగా నిలదీయండంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి అసలు విషయాన్ని బయటపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇస్తామని, ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో స్పష్టం చేశారు. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం పెంపు ప్రతిపాదన లేదు.. ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనాల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి ఫరూక్ తెలిపారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మహ్మమద్ రుహల్లాలు ఈ అంశాలను ప్రస్తావించారు. మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు: మంత్రి గొట్టిపాటి రవి రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ఉపప్రశ్నకు మంత్రి గొట్టిపాటి ఈ మేరకు బదులిచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తున్నాం: లక్ష్మణ్రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిలును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.6 వేల కోట్ల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపింది. ఇప్పుడు మరో రూ.11 వేల కోట్ల బాదుడుకు సిద్ధమైంది. మొత్తం సుమారు రూ.17 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేస్తోంది. వినియోగదారులకు ఇది మోయరాని భారం. ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా? దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. మూజువాణితో ఆమోదం... మండలిలో విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానిచ్చారు. గత ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్లు బొత్స సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని విమర్శించారు. ఇది సవరణ మాత్రమేనని, గత ప్రభుత్వమే ప్రజలపై భారం వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లోపాలను సరిదిద్దడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. అనంతరం బిల్లుపై సభలో తీర్మానం ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు చైర్మన్ మోషేన్రాజు ప్రకటించారు. -
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వం... అక్రమ కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులకు చిత్రహింసలు
-
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
హామీలు సూపర్ సిక్స్.. అమలులో క్లీన్ బౌల్డ్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్ సిక్స్ హామీలు డకౌట్ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపిస్తోంది. గత ఆర్ధిక ఏడాది కంటే ఈదఫా పన్ను ఆదాయం ఏకంగా రూ.23,894 కోట్లు అదనంగా వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారం మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్ధిక ఏడాది మద్యం ద్వారా రూ.15,977 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్ధిక ఏడాది రూ.25,597 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పన్నేతర ఆదాయం గత ఆర్థిక ఏడాది కన్నా రూ.3,000 కోట్లకు పైగా అదనంగా వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. భారీ అప్పులు చేసి ప్రజలపై రుణం భారం మోపడమే లక్ష్యంగా 2024–25 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ ఆర్థిక ఏడాది ప్రజా రుణం ఏకంగా రూ.91,443 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. ‘సూపర్’.. బాదుడే! సూపర్ సిక్స్లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. సూపర్ సిక్స్లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్ బడ్జెట్లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి పైసా కేటాయింపుల చేయకపోగా త్వరలో అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి కేశవ్ ముక్తాయించారు. మరోపక్క విద్యుత్ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2023–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024–25లో సగానికిపైగా కోత విధించి కేవలం రూ.8,155.31 కోట్లను కేటాయించారు. అంటే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపుచ్చారు. 2023–24 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,866 కోట్ల వ్యయం చేయగా 2024–25లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.4,012 కోట్లు మాత్రమే కేటాయించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అంటే భూమి విలువలను పెంచడం ద్వారా ప్రజలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023–24 లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు రూ.9,542 కోట్లు ఆదాయం రాగా 2024–25లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్టెట్లో పేర్కొన్నారు. జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి ఆదాయం, అప్పులు భారీగా.. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు బడ్జెట్లో ఆ మాటే గుర్తు లేన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. మొత్తం మీద పన్నుల రూపంలో భారీ ఆదాయం, భారీ అప్పులతో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.బాబు మేనిఫెస్టోలో హామీలు ఘనం... బడ్జెట్లో కేటాయింపులు శూన్యంప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్సిక్స్ హామీలతోపాటు మరికొన్ని హామీలు ఘనంగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్లోనే వాటి అమలుకు పైసా కేటాయించలేదు.పూర్ టు రిచ్: పేదలకు సంపన్నులను చేసే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్ (పీ4) పథకాలు: అసలు ప్రస్తావనే లేదు.సౌభాగ్యపథం: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ: ఈ ఊసే లేదు.యువత సంక్షేమం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్: దీని గురించి ఎలాంటి ఊసేలేదుఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహకాలు: చిల్లిగవ్వ ఇవ్వలేదుపరీక్షలకు ప్రిపేర్ కావడానికి డిజిటల్ లైబ్రరీలు: ఈ ప్రస్తావనే లేదుబీసీ డిక్లరేషన్బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం: ఆ మేరకు కేటాయింపులు లేదుదామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు: చిన్న మాట కూడా లేదుస్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం: స్పష్టత లేదు.రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ: కేటాయింపు లేదుఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల వేతనం: ఊసే లేదు.వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం: పైసా లేదుమహిళా సంక్షేమంపీ4 మోడల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం: ఊసే లేదు.అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ: దీని ప్రస్తావన లేదుఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు: దీని ప్రస్తావన లేదువిద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు: ఒక్క మాట లేదుఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర హామీలుప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్: పట్టించుకోలేదులేదుసీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారం: ఆ ప్రసక్తే లేదుతక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు: ఊసే లేదువలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు: సున్నాకాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు: పైసా కేటాయించలేదు నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఏటా రూ.100 కోట్లు: పైసా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ చొప్పున 20లక్షల మందికి ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి: ఊసే లేదుప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రతి హైవీ లైసెన్సు లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం: ఒక రూపాయి కేటాయించలేదువ్యవసాయంధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు: పైసా కేటాయించలేదు రాయితీతో సోలార్ పంపు సెట్లు: దీని ప్రస్తావనే లేదుడ్రిప్ ఇరిగేషన్కు 90 శాతం సబ్సిడీ: ఆ ఊసే లేదుసబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: లక్ష మంది రైతులు, కిసాన్ డ్రోన్లకు రూ.342 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ.187.68 కోట్లు మాత్రమే పేదల గృహవసతిపేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు: బడ్జెట్లో ప్రస్తావన లేదుఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: స్పష్టత ఇవ్వలేదుసాగునీటి రంగంగాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణం: ఆ మేరకు నిధుల కేటాయింపు లేదురాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి: బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేవు. ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం -
ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
AP: షాక్ల మీద షాక్!
‘‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దుబాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగాయని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్ల మీద షాక్.సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్ షాక్లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్ చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్ నెల నుంచే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.గరిష్టంగా యూనిట్కు రూ.3 భారం ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు డబుల్ కానున్నాయని, ఎక్కువ విద్యుత్ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్ నెలలో వాడిన కరెంట్కు డిసెంబర్ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్లో వాడిన కరెంట్కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) -
ఒక నెలతో సరి.. ఒకటో తేదీ జీతాల్లేవ్
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగుల ప్రభుత్వమని, అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలివ్వడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలిచ్చారని, తర్వాత నెలల్లో ఐదు, ఆరు తేదీల్లోనే వేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రెండులక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. పెన్షన్లు కూడా అందరికీ అందలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, మొదటి నెలలో మాత్రం ఒకటో తేదీ జీతాలు చెల్లించి, తర్వాత ప్రతినెలా 4, 5, 6 తేదీల్లో జీతాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐ వంటి అవసరాలతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలి? ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు జమచేయలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్కుమార్రెడ్డి, గెడ్డం సుదీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము దాచుకున్న డబ్బును ఇవ్వకపోతే తమ పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబ్బులు అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన పీఎఫ్ లోను బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగస్తులపై కేసులు పెట్టిన వారికి అండగా ఉంటామని మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు మానుకుని, వారి సంక్షేమం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. -
కరెంట్ చార్జీల పెంచడమే దీపావళి కానుకా?.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్లార్డ్ మోడల్లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది. న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్íÙప్ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు కూడా.. మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారిప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది. -
దళారీల ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్లైన్లో భారీగా ఇసుక బుకింగ్ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. తక్కువ రేటుకు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్లోడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేపట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్లు, 25 స్టాక్ పాయింట్లు, 17 మాన్యువల్ రీచ్లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్లైన్లో చేసుకోలేకపోతే రీచ్ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్తో విక్రయంవిశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్లు లేనందున చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్్కగా కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకందీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అర్హత గల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దురూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరు చొప్పున అవకాశం. ⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయం. ⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం–1956, డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. ⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ⇒ మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. ⇒ వరి సేకరణ కోసం మార్క్ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.ఆ దళారులు మీవాళ్లే కదా?⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్ మార్కెట్ ఆరోపణల పాటఅధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్లో ఎస్వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ‘డయేరియాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. 11మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడంలేదు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంలలో మంచి ఆస్పత్రులు ఉన్నా బాధితులకు స్థానిక పాఠశాలలోని బెంచీల మీద చికిత్స అందించడం దారుణం.నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. లిక్కర్, ఇసుక స్కాముల్లో నిండామునిగిపోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికొదిలేశారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బాబుగారు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడంలేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. గత మార్చి నుంచి దాదాపు రూ.1,800 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. సీహెచ్సీలలో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలను నిర్వీర్యం చేశారు.ఫ్యామిలీ డాక్టర్ ఊసేలేదు. ప్రభుత్వాస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిచిపోయాయి. కొత్త మెడికల్ కాలేజీలను అస్తవ్యస్థం చేశారు. స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధమవుతున్నారు. తనవారికి కట్టబెట్టేందుకు చంద్రబాబు వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. డయేరియా బాధిత గ్రామాల్లో మంచి వైద్యం, తాగునీటి వనరులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. -
‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది.80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా– ఇదీ టీడీపీ సిండికేట్ దందా...ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది.డీల్ సెట్.. సిండికేట్కు పచ్చజెండాప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది.345 దుకాణాలు మహిళలకే...రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి.రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది.ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు..శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది.అంతా సిండికేట్ ఇష్టారాజ్యం..రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..అచ్చెన్నదే హవా..మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్కుమార్(109), బెండి అరుణ్కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి.⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది.విశాఖలో పచ్చదండు పాగా..విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం.⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు.అధికార పార్టీ అరాచకాలు⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది.⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్ప్రసాద్రెడ్డి సోదరుడు రాహుల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు.⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలుతెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది.హిందూపురంలో కిడ్నాప్.. ధర్నాసాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.