Commercial loans
-
పూనావాలా ఫిన్ వాణిజ్య వాహన రుణాలు
సెక్యూర్డ్ రుణాల బిజినెస్లోకి ప్రవేశించడం ద్వారా ఎన్బీఎఫ్సీ పూనావాలా ఫిన్కార్ప్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో వాణిజ్య వాహన(సీవీలు) రుణాలు అందించనుంది. కొత్త, వాడుకలో ఉన్న వాహనాలకు రుణాలు సమకూర్చనుంది. తొలి దశలో భాగంగా టైర్–2, టైర్–3 మార్కెట్లలో ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. 12 రాష్ట్రాలలోని 68 ప్రాంతాలలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో 20 రాష్ట్రాలలో 400 ప్రాంతాలకు రుణ సర్వీసులను విస్తరించనున్నట్లు వివరించింది.చిన్న, తేలికపాటి, భారీ వాణిజ్య వాహన నిర్వాహకులకు అవసరాలకు అనుగుణమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ఈ ఆవిష్కరణలో భాగంగా రిస్క్-ఫస్ట్ విధానంతో అనుసంధానించబడిన సాంకేతిక పరిష్కారాన్ని కూడా పరిచయం చేసింది. ఇది కస్టమర్లకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను తగ్గించడంతో పాటుగా వేగంగా సర్వీసులు పొందేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..పూనావాలా ఫిన్కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అరవింద్ కపిల్ మాట్లాడుతూ.. వాణిజ్య రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారుతుందని చెప్పారు. కొత్త వాణిజ్య వాహన రుణాల్లో క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు, సులువైన డాక్యుమెంటేషన్తో రవాణాదారుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. -
హెచ్డీఎఫ్సీ రుణాల్లో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మార్చి చివరినాటికి రుణాల్లో 16.9 శాతం వృద్ధి సాధించినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. మొత్తం రుణాలు రూ.16 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ‘2022 మార్చి 31 నాటికి మొత్తం రుణాలు రూ.13.6 లక్షల కోట్లు. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో వాణిజ్య రుణాలు 30 శాతం, గ్రామీణ ప్రాంత రుణాలు 9.5 శాతం వృద్ధి సాధించాయి. దేశీయ రిటైల్ రుణాలు దాదాపు 21 శాతం, కార్పొరేట్, టోకు రుణాలు 12.5 శాతం దూసుకెళ్లాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి 31 నాటికి డిపాజిట్లు 20.8 శాతం ఎగసి రూ.18.83 లక్షల కోట్లకు చేరుకున్నాయి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్తో హోమ్ లోన్ ఏర్పాటు కింద డైరెక్ట్ అసైన్మెంట్ రూట్ ద్వారా బ్యాంక్ రూ.9,340 కోట్ల రుణాలను మార్చి త్రైమాసికంలో కొనుగోలు చేసింది. హెచ్డీఎఫ్సీని 40 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు 2022 ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంగీకరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరం రెండవ, లేదా మూడవ త్రైమాసికంలో విలీనం పూర్తి అయ్యే అవకాశం ఉంది. -
భారత్ విదేశీ రుణ భారం 456 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ రుణ భారం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 456 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మార్చి స్థాయితో పోల్చిచూస్తే ఈ పరిమాణం 3.1 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది. మొత్తం రుణాన్ని పలు విభాగాల్లో చూస్తే, దీర్ఘకాలిక రుణం మార్చితో పోల్చితే 4.7% పెరిగి, 369.5 బిలియన్ డాలర్లుగా ఉంది. స్వల్పకాలిక రుణ భారం 3.2% తగ్గి, 86.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లు ఎగయడం విదేశీ రుణ పరిమాణం పెరుగుదలకు కారణమని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. మొత్తం విదేశీ రుణంలో వాణిజ్య రుణాల పరిమాణం అత్యధికంగా 35.4%గా ఉంది. తరువాత ఎన్ఆర్ఐ డిపాజిట్లు 23.8%గా ఉన్నాయి. ఇతర రుణాలు 11.7%గా ఉన్నాయి. కాగా దేశాభివృద్ధికి సంబంధించి కేంద్రం విదేశీ కరెన్సీలో జారీ చేసే బాండ్లకు సంబంధించిన ‘సావరిన్ ఎక్స్టర్నల్ డెట్’ సెప్టెంబర్లో 88.4 బిలియన్ డాలర్లులుగా ఉంది. మార్చి 2014లో ఈ మొత్తం 81.5 బిలియన్ డాలర్లు.