desease
-
US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!
యూఎస్లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్లోని భారత కాన్సులేట్కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు. బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది. (చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!) -
US: ఐసీఈ కస్టడీలో ఉన్న భారత సంతతి వ్యక్తి మృతి!
యూఎస్లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని ఫెడరల్ అధికారులు ధృవీకరించారు. భాదితుడు 57 ఏళ్ల జస్పాల్ సింగ్ గుర్తించి, న్యూయార్క్లోని భారత కాన్సులేట్కు సమాచారం అందించారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అతని బంధువులకు కూడా సమాచారం అందించింది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ప్రకారం.. "అక్టోబర్ 25, 1992న అక్రమంగా యూఎస్లో ప్రవేశించాడు. అక్కడ అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించారు. జనవరి 21, 1998న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి సింగ్ను యూఎస్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో సింగ్ స్వచ్ఛందంగా భారతేదానికి తిరిగి వచ్చేశారు. మళ్లీ జూన్ 29, 2023న యూఎస్ మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా ప్రవేశించడంతో మళ్లీ యూఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రోటక్షన్ అధికారులకు పట్టుబడ్డాడు. బోర్డర్ పెట్రోల్ అధికారులు సింగ్ కస్టడీని ఎన్ఫోర్సమెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ అట్లాంటా(ఈఆర్ఓ)కు బదిలీ చేసింది. దీంతో అతను అట్లాంటాలో ఫెడరల్ ప్రాసెసింగ్ సెంటర్లో నిర్బంధించబడ్డాడు. ఇంకొద్ది రోజుల్లో యూఎస్ నుంచి బహిష్కరణకు గురవ్వుతాడు అనగా విషాదకరమైన రీతీలో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఐతే అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది". అని ఐసీఈ పేర్కొంది. (చదవండి: US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!) -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
గర్ల్ ఫ్రెండ్ కోసం, సాహసం: అతగాడి కష్టం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రియురాలి కోసం గొప్ప సాహసం చేశాడో ప్రియుడు. ఇందుకోసంగా దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి మరీ జాగ్రత్తగా ఆమెకు విగ్ను గిఫ్ట్గా ఇచ్చాడు. విగ్ను గిఫ్ట్గా ఇవ్వడానికి అంత కష్టం ఎందుకు అనుకుంటున్నారా? రండి.. ఈ స్టోరీని చూద్దాం. మెయిల్ ఆన్లైన్ కథనం ప్రకారం మిచిగాన్లోని వాటర్ఫోర్డ్కు చెందిన కోడి ఎన్నిస్, హన్నా హోస్కింగ్ ఇద్దరూ ప్రేమికులు. ఆరునెలల డేటింగ్ తరువాత తనకోసం 30 అంగుళాల జట్టు కావాలని అడిగింది సరదాగా. అంతేకాదు దీనికి మూడు నాలుగేళ్లుపడుతుందని కూడా జోక్ చేసింది. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నాడు ఎన్నిస్. 2020, మే నుంచి జుట్టు పెంచడాన్ని ప్రారంభించాడు. దీనికోసం వేలాది ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూశాడు. దీన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాడు. క్రమం తప్పకుండా జుట్టును వాష్ చేసుకోవడం, కండీషనింగ్ లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాస్మోటాలజిస్ట్ సలహా మేరకు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు వాడాడు. జుట్టు ఏ మాత్రం తెగకుండా సిల్క్ బోనెట్ వాడుతూ జాగ్రత్తపడ్డాడు. చివరికి గత అక్టోబరులో, తన జుట్టును 29-అంగుళాలకు పెంచాడు. దీన్ని కట్ చేసి అంతే జాగ్రత్తగా అందమైన విగ్ను ఆమెకు ప్రెజెంట్ చేశాడు. అచ్చం ఆమె పాత జుట్టులా ఉండేలా శ్రద్ధ తీసుకోవడం మరీ విశేషం. అసలు విషయం ఏమిటంటే.. హన్నా హోస్కింగ్ ఒక కంటెంట్క్రియేటర్. ఆమెకు ఏడేళ్లున్నపుడే అలోపేసియా (హెయిర్ ఫోలికల్ మూలాలను నాశనం చేసే ఆటో-ఇమ్యూన్) అనే వ్యాధి సోకింది. దీంతో క్రమంగా దాదాపు ఐదేళ్ల క్రితంఆమె శరీరం మీద ఉన్న ఒక్కో వెంట్రుక(కనుబొమ్మలతో) సహా రాలిపోవడం మొదలైంది.దీంతో జుట్టుంతా షేవ్ చేసుకుంది. ఈ క్రమంలో 2019లో కోవిడ్ లాక్డౌన్ సమయంలో నవంబరులో హన్నా ఎన్నిస్ తొలిసారి కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమంగా మారింది. ‘ఇది తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, సినిమాలా అనిప్తిస్తోంది అని హన్నా భావోద్వేగానికి లోనైంది హనా. ‘‘ఇది మామూలు విగ్ కాదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవింతలో ఇంత ఇష్టపడే వ్యక్తి ఉన్నాడని తెలియడం,చాలా ఓదార్పుగా, భద్రంగా అనిపిస్తోంది’’ అంటూ కంటతడి పెట్టుకుంది. తన బాయ్ఫ్రెండ్స్ జుట్టుతో తయారు చేసిన విగ్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది హన్నా. నా విగ్గు తనకి చక్కగా అమరిపోయింది అంటే..ఇక నాతో తను విడిపోలేదు అని చెప్పాడు ప్రేమతో -
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
మీనియర్స్ డిసీజ్ అంటే..!
మన లోపలి చెవి (ఇన్నర్ ఇయర్) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు... ఏదో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిప్పుడు వినిపించే హోరు లాంటిది చెవిలోంచి వినబడుతుంటుంది. ఇలా వినికిడి తగ్గడం, తూలి కిందపడిపోయేలా బ్యాలెన్స్ కోల్పోవడం, చెవిలోంచి హోరు వినిపించడం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే మీనియర్స్ డిసీజ్పై అవగాహన కోసం ఈ కథనం. మీనియర్స్ డిసీజ్ను ‘ఇడియోపథిక్ ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్’ అని కూడా అంటారు. అది ప్రాణాంతకం కాదుగానీ... చికిత్స అందరకపోతే క్రమంగా వినికిడి శక్తి కోల్పోయే అవకాశమూ ఉంది. గతంలో కాస్త అరుదుగా కనిపించే ఈ సమస్య... ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. లక్షణాలు: మీనియర్స్ డిసీజ్లో వర్టిగో, టినైటస్, వినికిడిలోపం (డెఫ్నెస్) ఈ మూడు లక్షణాలూ కలగలసి ఉంటాయి. వర్టిగో లక్షణాలు: పిల్లలు గిరగిరా తిరిగీ, తిరిగీ అకస్మాత్తుగా ఆగినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి తూలికింద పడిపోతామేమో అనిపించినట్లుగా లేదా రంగుల రాట్నంపై నుంచి విసిరివేసినట్లుగా అనుభూతి చెందుతూ ఆందోళన పడుతుంటారు. వర్టిగోలో కనిపించే ఇదే లక్షణం మీనియర్లోనూ కనిపిస్తుంది. టినైటస్ లక్షణాలు : ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గరి గుయ్ అనే శబ్దమే కొందరికి చెవుల్లోంచి వినిపిస్తూ, చికాకు కలిగిస్తుంది. టినైటస్లోని ఇదే లక్షణం... మీనియర్స్ డిసీజ్లోనూ కనిపిస్తుంది. వినికిడి తగ్గడం : లక్షణాలను నిర్లక్ష్యం చేయడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల శాశ్వతంగా వినికిడి కోల్పోయి... పర్మనెంట్ డెఫ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వినికిడి లోపం అన్నది ఒక్కోసారి పెరుగుతూ ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకేరోజులోనే ఈ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. చెవి నిండిపోయినట్లుగా ఉండే ఫీలింగ్ చికాకు కలిగిస్తూ ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు: బాధితులు చెప్పే లక్షణాలతో ఆడియాలజిస్టుల ఆధ్వర్యంలో వినికిడి సామర్థ్యం పరీక్షలు (ఆడియోమెట్రీ టెస్ట్) , వెస్టిబ్యులార్ టెస్ట్ బ్యాటరీ పరీక్షలతో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో మెదడు ఎమ్మారై, ‘ఎలక్ట్రో కాక్లియోగ్రఫీ’, ‘ఎలక్ట్రో నిస్టాగ్మోగ్రఫీ’ వంటి పరీక్షలు మీనియర్స్ డిసీజ్ నిర్ధారణకు తోడ్పడతాయి. ఇతర పరీక్షలు: మెదడులో గడ్డలు, కొన్ని రకాల మెదడు సమస్యలు ఉన్నప్పుడూ ఈ లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి... ‘మీనియర్స్ ప్రోటోకాల్’ కూడా చేసి... సమస్య మెదడుకు సంబంధించింది కాదని రూల్ అవుట్ చేసుకుంటారు. నివారణ / వ్యాధి ఉన్నవారికి చెప్పే జాగ్రత్తలు : మీనియర్స్ డిసీజ్ ఉన్నవారిలో కొన్ని రకాల ఆహార నియంత్రణలను సూచిస్తారు. ఇవి కొంతమేరకు నివారణకూ తోడ్పడతాయి ఆహారంలో ఉప్పు తగ్గించడం చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కోలాడ్రింక్స్ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవడం ∙ఆల్కహాల్, పొగ అలవాట్లకు దూరంగా ఉండటం చైనా సాల్ట్కు దూరంగా ఉండటం. చికిత్స : ►వికారం, వాంతుల వంటి లక్షణాలను తగ్గించేందుకు యాంటీ–నాసియా (యాంటీ–ఎమిటిక్) మెడిసిన్స్ ఇస్తారు ∙ చెవిలోని ఒక రకం ద్రవం పెరగడం వల్ల మీనియర్స్ డిసీజ్ ►వచ్చే అవకాశం ఉన్నందున దేహంలోని ద్రవాలను బయటకు పంపించేందుకు మూత్రం ఎక్కువగా వచ్చే మందులైన ‘డై–యూరెటిక్స్’ అనే మందుల్ని వాడతారు ►వర్టిగోలో కనిపించే కళ్లు తిరగడం, పడిపోవడం లాంటి లక్షణాలను తగ్గించేందుకు ‘వెస్టిబ్యులార్ రీ–హ్యాబిలిటీషన్’ అని పిలిచే ఫిజియోథెరపీ లాంటి చికిత్సలను అందిస్తారు. ఇందులో బాధితులతో కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తారు ►వినికిడి సామర్థ్యం కోల్పోయిన వారిలో... వారు ఏ మేరకు కోల్పోయారో దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ మెషిన్నూ అమర్చవచ్చు. ►పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు చాలా అరుదుగా కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇందులో ‘ఎండోలింఫాటిక్ శాక్’ అనే ప్రొసీజర్ ద్వారా చెవిలో అత్యధికంగా స్రవించే ద్రవాన్ని డ్రైయిన్ చేస్తారు∙ ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన ‘ఇంట్రాటింపానిక్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్’ థెరపీ కూడా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఈ.సీ. వినయ కుమార్ సీనియర్ ఈఎన్టి సర్జన్ (చదవండి: అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?) -
సీఎం జగన్ చొరవతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స
-
ఆ యువకుడి వైద్యానికి ఏటా రూ.1.80 కోట్ల ఖర్చు
కర్నూలు (హాస్పిటల్): ఆ యువకుడి వయసు 18 ఏళ్లు. ఇప్పటికీ సరిగ్గా నడవలేడు. స్వతహాగా కూర్చోలేడు. ప్రతి పనికీ ఇంకొకరి సహాయం కావాల్సిందే. అరుదైన ఈ ఆరోగ్య సమస్యను స్పైనల్ మస్కులర్ అట్రోఫి (వెన్నెముక కండరాల క్షీణత)గా వైద్యులు గుర్తించారు. అత్యంత అరుదైన ఈ వ్యాధి కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం మనేకుర్తి గ్రామానికి చెందిన పేదరైతు వి.లక్ష్మీకాంత్ కుమారుడు వి.విజయ్కుమార్(18)కి సోకింది. నడక మొదలైనప్పటి నుంచి సరిగ్గా నడిచేవాడు కాదు. నడుస్తూ నడుస్తూ కిందపడిపోయేవాడు. తల్లిదండ్రులు అతడిని కర్నూలు, హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇటీవల ఆదోనికి వెళ్లిన కర్నూలు న్యూరోఫిజీయన్ డాక్టర్ హేమంత్కుమార్కు ఆ యువకుడిని చూపించారు. అతనికి ఉన్న వ్యాధి లక్షణాలను గమనించి జెనెటిక్ టెస్ట్ చేయించారు. అందులో అతనికి అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి సోకినట్టు నిర్ధారించారు. సాధారణంగా ఈ వ్యాధిని శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆరు నెలల్లోగా, జన్మించాక ఏడాదిలోపు, ఆ తర్వాత 18 నెలలలోపు, 30 ఏళ్లలోపు, 30 ఏళ్ల తర్వాత అనే రకాలుగా విభజిస్తారు. 2 ఏళ్లలోపు గుర్తిస్తే జొల్గొన్స్మా అనే ఇంజెక్షన్ (రూ.16 కోట్ల విలువ) వేస్తే సరిపోతుంది. కానీ ఆలూరుకు చెందిన ఈ యువకునికి ప్రస్తుతం 18 ఏళ్లు. ఇలాంటి వారికి ఆ ఇంజెక్షన్ పనిచేయదని డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. ఈ వయసు వారికి వచ్చే ఈ వ్యాధికి స్విట్జర్లాండ్కు చెందిన రోష్ ఫార్మా కంపెనీ రిస్డిపాల్మ్ అనే పౌడర్ను 2020 ఆగస్టులో కనుగొందని చెప్పారు. 60 మిల్లీ గ్రాముల ప్యాకెట్ ఖరీదు రూ.6 లక్షల వరకు ఉంటుందని, దానిని రోజూ 5ఎంజీ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ లెక్కన నెలకు రూ.15 లక్షలు, ఏడాదికి రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ మందును రోగి దీర్ఘకాలం వాడాల్సి ఉంటుందన్నారు. ఈ మందుకు శరీరం స్పందించే తీరును బట్టి చికిత్సను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని, ఇప్పటివరకు దేశంలో కేవలం 800 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. మేనరిక వివాహాలు, రక్త సంబం«దీకుల్లో వివాహం చేసుకోవడం కారణంగా ఇలాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. -
ఫిలిప్పీన్స్లో అనుమానాస్పద స్థితిలో పెద్దపల్లికి చెందిన మెడికో మృతి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనికి చెందిన మెడికో విద్యార్థి నాగపూజిత ఫిలిప్పీన్ దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వైద్య విద్య అభ్యసించేందుకు నాలుగేళ్ల క్రితం నాగపూజిత ఫిలిప్పీన్స్కి చేరుకుంది. కాగా 2022 మార్చి7న పరీక్షలు రాసి హాస్టల్కి వచ్చి పడుకుంది. ఆమెను లేపేందుకు రూమ్మేట్స్ ప్రయత్నించగా అచేతనంగా కనిపించింది. ఆ తర్వాత నాగపూజిత చనిపోయిన విషయాన్ని గోదావరిఖనిలో ఉన్న తల్లిదండ్రులకు రూమ్మేట్స్ చేరవేశారు. తన కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ నాగపూజిత తండ్రి నాగ శ్రీనివాస్ గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా 2022 మార్చి 29న నాగపూజిత బాడి హైదరాబాద్కి చేరుకుంది. దీంతో గోదావరిఖని పోలీసులు గాంధీ హాస్పటిల్కి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం నివేదిక వస్తే మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. చదవండి: London: హైదరాబాద్ వాలా రెస్టారెంట్లో ఎన్నారై యువతిపై కత్తితో దాడి -
అది మహా పాపం.. శిక్ష నుంచి తప్పించుకోలేరు!
అబుదాబి ఎయిర్పోర్టు దాడి ఘటనపై యూఏఈ ప్రభుత్వం స్పందించింది. ‘సాటి మనుషుల ప్రాణాలు తీయడం పాపం. ఇలాంటి పాపపు పని చేసిన వారు శిక్ష తప్పించుకోలేరు’ అంటూ యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ ఆల్ నహ్యాన్ అన్నారు. తీవ్రవాదులు తమ లక్ష్యం చేరుకునే క్రమంలో అక్రమంగా ఆయుధాలు వాడుతూ సౌదీ గడ్డపై రక్తం చిందిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. జనావాసాలు, ప్రజా సౌకర్యాలపై దాడులు చేస్తున్నారంటూ టెర్రిస్టుల చర్యను ఖండించారు. యెమెన్ హౌతీ రెబల్ టెర్రరిస్టులు చేసిన డ్రోన్ దాడిలో చనిపోయిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు పూర్తి సహకారం అందిస్తామని యూఏఈ తెలిపింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తగు ఏర్పాట్లు చేస్తోంది. وزير خارجية دولة الإمارات: ندين استهداف ميليشيا الحوثي الإرهابية لمناطق ومنشآت مدنية في الدولة اليوم.https://t.co/XLhlzxXARh — وزارة الخارجية والتعاون الدولي (@MoFAICUAE) January 17, 2022 చదవండి: అబుదాబి ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడి ఇద్దరు భారతీయుల దుర్మరణం -
నిమోనియా వ్యాధితో జరభద్రం..
నిమోనియాతో జరభద్రం నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమో నియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాదీ, ఈ ఏడాదీ కోవిడ్ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కోవిడ్ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల (నవంబరు) 12న ‘ప్రపంచ నిమోనియా డే’ సందర్భంగా ఆ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షలు చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా... కోవిడ్ తోడుకావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే... ఎప్పుడూ నమోదయ్యే నిమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా. నిమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ లక్ష్యం. వ్యాధి నిర్ధారణ ►రోగిలో కనిపించే లక్షణాలతో ►సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ►ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె/గల్ల/తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు. నివారణ... ►పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. ►పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ కూడా. ►పొగ వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ►ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ►క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు. ►పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. నిమోనియాకు తక్షణం చికిత్స అవసరం... లేదంటే... పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేని వల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు... మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది. అన్ని వయసుల వారిలోనూ... చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం. ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు ►ఝఝసీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవారు గుండె సమస్యలు ఉన్నవారు ►స్పీన్ తొలగించిన వాళ్లు ►పొగతాగేవారు ►ఇక క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతావాళ్ల కంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది. చికిత్స నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో... మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే. వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్/మెడికల్ స్పెషలిస్ట్ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి. ఇవీ కారణాలు ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా రెండోవేవ్తో స్వైరవిహారం చేసిన కరోనా వైరస్ ఓ ప్రధానమైన కారణమే అయినప్పటికీ... ఇది మాత్రమేగాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఇవే... ►బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా, హీమోఫీలస్ (మొదటిది పెద్దల్లో, రెండోది పిల్లల్లో నిమోనియాకు కారణమవుతుంది). అవే కాకుండా... గ్రామ్నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల. ►ఫంగస్ వల్ల ►కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్). ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా, ఇంకా అన్ని వైరస్లతో పాటు, నిమోనియాకి కూడా ఓవర్ క్రౌడింగ్ ఓ ప్రదాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తప్పదు. ►మైక్రో యాస్పిరేషన్ – ఒక్కోసారి తినే, తాగే సమయాల్లో మనకు తెలియకుడానే కొన్ని పదార్థాలూ, ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ►ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. ►ఆల్కహాల్ – దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు. నిమోనియా లక్షణాలివే... ►దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం ►కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది... తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు. ►నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు. ►నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు. ఇంటస్టిషియల్ నిమోనియాలో అనే తరహా రకంలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతోఒక్కోసారి శ్వాసప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ►ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ‘ఎగ్జుడస్’ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్ అందదు. దాంతో ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు. ►ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు. డాక్టర్ తపస్వి కె. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ -
చనిపోయింది కరోనాతోనే...
సాక్షి, హైదరాబాద్, వరంగల్: మావోయిస్టు పార్టీ నేతలపై కరోనా పంజా విసిరింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్తోపాటు మరో కీలక నేత, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ద బోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో మరణించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఈ వివ రాలు వెల్లడించారు. 21వ తేదీ ఉదయం హరి భూషణ్, 22న ఉదయం సారక్క చనిపోయారని.. వీరికి దండకారణ్యంలో ప్రజల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించామని తెలిపారు. ఈనెల 22న వారిద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించామని, వారి కుటుంబాలకు మావోయిస్టు పార్టీ తరఫున సంతాపం తెలియజేశామని వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడుతున్న హరిభూషణ్.. దండకారణ్యంలో ఉండటం, తగిన చికిత్స అందకపోవడంతో మరణించాడని పోలీసులు తెలిపారు. సారక్క ప్రస్థానమిదీ..: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఓ ఆదివాసీ కుటుం బంలో సిద్దబోయిన సారక్క జన్మించింది. 1985లో ఏటూరునాగారంలో విప్లవమార్గం పట్టింది. 1986లో అరెస్టైనా జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి పార్టీలో చురుకుగా మారింది. 2008లో పదోన్నతిపై దండకారణ్యానికి బదిలీ అయింది. ఎన్నో ఎన్కౌంటర్లలో త్రుటిలో తప్పించుకుంది. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్ ఏర్పాటు చేసిన పాఠశాల బాధ్యతలు చూస్తోంది. ఆమె కుమారుడు అభిలాష్ కూడా మావోయిస్టు పార్టీలో చేరాడు. గత ఏడాది జూన్ లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. సారక్కతో 29 సంవత్సరాలు కలిసి నడిచిన సహచరుడు కత్తి మోహన్ రావు ఈ నెల 10వ తేదీనే గుండెపోటుతో మరణించాడు. తర్వాత 12 రోజుల వ్యవధిలో సారక్క కరోనా లక్షణాలతో చనిపోయింది. మిగతావారి పరిస్థితి ఏమిటి? సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి అడవుల్లో ఉన్న మావోలపైనా ప్రతాపం చూపింది. వందల సంఖ్యలో మావో యిస్టులు కరోనా బారిన పడినట్టు సమాచారం. కాగా హరిభూషణ్తో కలిసి ఒకే ప్రాంతంలో ఉన్న ఆయన భార్య, శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద ఏమైందని, ఆమె ఆరోగ్యం ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కరోనా బారినపడ్డ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పరిస్థితి ఎలా ఉందోనని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లొంగిపోతే చికిత్స చేయిస్తాం: భద్రాద్రి ఎస్పీ మావోయిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా బారినపడి మరణించడానికి మావో యిస్టు పార్టీ అగ్రనాయకులే కారణమని భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మావోయిస్టుల్లో ఎవరికీ కరోనా సోకలేదని మొదట్లో ప్రకట నలు చేశారని.. చికిత్స కోసం బయటికి వెళ్ల కుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. కరోనా సోకిన మావోయిస్టులు తక్షణమే బయటికి రావాలని, వారికి అండగా ఉంటామని, చికిత్స చేయిస్తామని పిలుపునిచ్చారు. చదవండి : వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ -
మరో సారి హైకోర్టును ఆశ్రయించిన ఫర్నీక తండ్రి
సాక్షి, హైదరాబాద్: గౌచర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీకకి వైద్యం అందించడంలో నిలోఫర్ వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పాప తండ్రి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని వాపోయారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఫర్నీక వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, మెరుగైన చికిత్స అందించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలను వైద్యులు పట్టించుకోవడం లేదని, తమ కూతురుకి చిక్సిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫర్నీక తండ్రి మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్పత్రిలో సరైన వసతులు లేవని, ఒక్కో బెడ్ మీద నలుగురు పిల్లలు ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో పాపను ఎలా ఉంచాలని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు పాటించి ఫర్నీకకు మెరిగైన చికిత్స అందించాలని కిరణ్ డిమాండ్ చేశారు. (చదవండి : చిన్నారి చికిత్సకు హైకోర్టు కీలక ఆదేశాలు) అరుదైన వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాపకు ప్రత్యేక బెడ్, వార్డు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని తండ్రి కిరణ్ కోరారు. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు అవుతుండటం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఫర్నీక తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నారికి తక్షణమే చికిత్స అందించాల్సిందిగా నిలోఫర్ ఆస్పత్రి, తెలంగాణ మెడికల్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఏవీ గుర్తుండవు!
మతి మరుపు సమస్య పెనుసవాల్గా మారింది. స్కూల్ పిల్లల వద్ద నుంచి ఉద్యోగులు. యువతలో రోజురోజుకూ ఈ సమస్య తీవ్ర తరమవుతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతిమరుపు సమస్యకు తీవ్రమైన వత్తిళ్లు, పరీక్షల భయం, ఆందోళనలు కారణంగా చెపుతున్నారు. దీనిపై కథనం... లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్కి టైమ్ అయిపోతుందనే హడావుడిలో మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోయే పిల్లలు...ఆఫీస్కు లేట్ అవుతున్నామనే భయంతో బైక్కీస్ మరిచి గబగబా మెట్లు దిగిపోయే ఉద్యోగులు.. టీం లీడర్తో మీటింగ్ ఉంది.. ఫైల్ ప్రిపేర్ చేయాలంటూ హడావిడిలో ఇంటి వద్దనే డెస్క్కీస్ మరిచి పోయే మార్కెటింగ్ ఉద్యోగులు ఇలా.. వీళ్లే కాదండి బాబూ నగరంలో ఇప్పుడు ఇలా మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే వచ్చేస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తుందంటే నమ్మక తప్పదు. పరీక్షల భయం, పనివత్తిడి ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు కాగా, పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు ఇందుకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. టీనేజ్లో బీజం మతిమరుపు సమస్యకు టీనేజ్లో బీజం పడుతోంది. ఔను ఇది నిజం. ఇక 25–35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోంది. వైద్య నిపుణులు చెపుతున్న మాట ఇదే. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామని తెలియక ఏదో సమస్యతో వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించ గలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. ఏకాగ్రతే ప్రధాన లోపం ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలో యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్న దానిని మనసులో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోక పోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరొకరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి. అంతు చూస్తున్న ఒత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జాయిటీ, సైకాలజికల్ అంశాలు మెమరీ పవర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఏదో పని చేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా మైండ్ పట్టు తప్పుతోంది. బీపీ, మధుమేహం ప్రభావం డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలున్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్లు అభివృద్ధిలో లోపాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆనందంగా ఉండాల్సింది పోయి, మానసికంగా మందకొడిగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బి–12 కారణమని, దానిలో లోపం వల్ల మతిమరుపు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని, బీ12 నాన్వెజ్లో అధికంగా, పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. యాంగ్జయిటీతో ముప్పు మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వలన స్ట్రెస్ పెరిగిపోతుంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దాంతో విన్న విషయం గుర్తుకు రాకపోవడం జరుగుతోంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్ధిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, పనిష్మెంట్లు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. మెదడుకు పదును పెట్టండి మతిమరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. సకాలంలో సరైన జవాబు మన వద్ద లేక పోవడమే దీనికి కారణం. ప్రతి చిన్న విషయానికి వస్తువులపై ఆధారపడటం.. అంటే లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడటం, ఎక్కువ సమయం సెల్ఫోన్తో గడపడం వంటివి. వీటి వలన ప్రతి విషయాన్ని మరిచిపోవడం జరుగుతుంది. మతి మరుపునకు ఇదీ ఒక కారణం. ఒత్తిడిని జయిం చేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్కు ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతిమరుపు తగ్గే అవకాశాలుంటాయి. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవస రం. తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు కోసం వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. –డాక్టర్ ఆర్కే అయోధ్య,మానసిక వైద్య నిపుణులు -
’మాబిడ్డను ఆదుకోండి’
-
రోగం ముదిరినట్టే
సంగారెడ్డి క్రైం: పేరుకే పెద్దాసుపత్రి.. ఇక్కడ వైద్య సేవలు అంతంతే... ఆపరేషన్ చేద్దామంటే మత్తు మందు ఇచ్చే డాక్టరే లేడు... పురిటి నొప్పులతో వచ్చే వారి బాధలు వర్ణణాతీతం... వసతులు అసలే లేవు... వైద్యులు, సిబ్బంది, బెడ్ల కొరత.. టాయిలెట్కు వెళ్లాలంటే క్యూ కట్టాలి... ఆరుబయటే చెట్ల కింద భోజనాలు.. స్ట్రెచర్లు, వీల్చైర్లు మూలకు.. పారిశుద్ధ్యం అధ్వానం.. ఇలా ఒకటేమిటి అన్నీ సమస్యలే.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అని ఎక్కడెక్కడి నుంచో వైద్యం కోసం నిరు పేదలు ఇక్కడికి వస్తుంటారు. తీరా వైద్యం అందక ఉసూరుమంటున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా ఆ మేరకు సేవలు, సౌకర్యాలు ఏ మాత్రం మెరుగు పడలేదు. మూడు దశాబ్దాల నాటి సేవలే ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రి స్థాయిని పెంచుతామని పాలకులు చెబుతున్నా ఆచరణలోకి రావడం లేదు. ‘సాక్షి’ మంగళవారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించగా వెలుగు చూసిన వాస్తవాలివి.. మూడు దశాబ్దాల కిందట ప్రతి పాదించి ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాసుపత్రి ఇప్పటికీ అరకొర సౌకర్యాలతోనే కొట్టుమిట్టాడుతోంది. అప్పటికీ ఇప్పటికీ వంద శాతానికిపైగా పెరిగిన రోగుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలను పెంచకపోవడంతో రోగుల అవస్థలు వర్ణణాతీతం. నిత్యం వందల మందికి వైద్య సేవలందిస్తున్న సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాసుపత్రిని సాధ్యమైనంత త్వరగా అప్గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకత వుంది. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన దామోదర రాజనర్సింహ, ప్రభు త్వ విప్గా పనిచేసిన తూర్పు జయప్రకాశ్రెడ్డి సంగారెడ్డి ఆసుపత్రిని సందర్శించి ఈ ఆసుపత్రిని కచ్చితంగా అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరముందని హామీ ఇచ్చి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కే సీఆర్ మంత్రివర్గం లో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రాజయ్య సైతం ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్న రోగు ల సంఖ్య, డాక్టర్లు, అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిని సందర్శిం చిన వారంతా హామీలు ఇవ్వడం తప్పితే అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రతినెలా 450 డెలివరీలు... ఈ ఆసుపత్రికి సంగారెడ్డి పట్టణ ప్రజలేగాక జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని మోమిన్పేట, శంకర్పల్లి చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రతినెలా 450 డెలివరీలు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాల కొరత కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ప్రస్తుతం 250 పడకల ఆసుపత్రిగా ఉన్నా రోజూ ఇక్కడ 400 నుంచి 500 మంది వరకు ఇన్పేషంట్లు ఉంటున్నారు. నెలకు 450 డెలివరీలు జరుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కేవలం 30 పడకలు మాత్రమే మంజూరు చేసింది. చాలాసార్లు బెడ్లు లేక కుటుంబ నియంత్రణ చేసుకున్న వారిని, డెలివరీకి వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి చికిత్స అందించిన సందర్భాలు ఈ ఆసుపత్రిలో వున్నాయి. మేల్ సర్జికల్ వార్డులో అధికారికంగా 30 బెడ్లు వుండాలి. కానీ రోగుల సంఖ్య ఎక్కువ ఉండ టంతో అధికారులు ఈ వార్డులో 50 బెడ్ల వరకు వేశారు. ఇదే పరిస్థితి ఫిమేల్ సర్జికల్ వార్డులో కూడా ఉంది. రోగులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వరండాలో కూడా బెడ్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్ల సమస్య.. నిబంధనల ప్రకారం పది మంది రోగులుండే వార్డుకు రెండు టాయిలె ట్లు ఉండాలి. కానీ 40 నుంచి 50 మంది రోగులున్న వార్డుల్లో నాలుగంటే నాలుగే టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లు సరిపోక రోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్పేషంట్ల కోసమే కాకుండా అవుట్ పేషంట్లకు కూడా సరిపోను టాయిలెట్లు లేవు. దాదాపు వెయ్యి నుంచి 1200 మంది వచ్చే ఆసుపత్రికి రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. రోగులు 50 మంది ఉంటే వారికి సహాయకులుగా మరో 50 మంది వరకు ఉంటారు. ఇలా వంద మందికి నాలుగు టాయిలెట్లు ఎలా సరిపోతాయో అధికారులకే తెలి యాలి. ఉదయం పూట క్యూ కట్టాల్సి వస్తుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. వైద్యుల కొరత ఆసుపత్రిలో ఉండాల్సినంత మంది వైద్యులు ఇతర సిబ్బంది కూడా లేరు. 13 మంది సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైనా ఇక్కడ కేవలం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆపరేషన్ సందర్భాల్లో అందుబాటులో ఉండాల్సిన అనస్తీషియా పోస్టు కూడా ఖాళీగా ఉంది. రేడియాలజిస్ట్, డెంటల్తోపాటు ఆర్ఎంఓ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆర్ఎంఓతోపాటు డీసీహెచ్ఎస్ పోస్టుల్లో ఇన్చార్జీలే కొనసాగుతున్నారు. మూడు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే ఒకే ఒక్క డాక్టర్ పనిచేస్తున్నారు. 18 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు మంజూరైతే వాటిలో 15 పోస్టులు భర్తీ అయ్యాయి. -
ఐదు లక్షల్లో ఒకరికి..
అరుదైన వ్యాధిని గుర్తించి వెంటనే వైద్యసేవలందించి చిన్నారి ప్రాణాలను కాపాడారు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం బండలింగంపల్లికి చెందిన లక్ష్మి, మల్లేష్ దంపతుల కుమారుడు హరీష్ (8) కొద్దిరోజులుగా అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. గొంతునుంచి ఆహారం లోపలకు వెళ్లకపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యులు వ్యాధిని గుర్తించలేకపోవడంతో నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. హరీష్ను రెండు రోజులు ఐసీయూలో ఉంచి, వ్యాధి నయం కావాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పారు. కూలిపనులు చేసుకునే మల్లేష్ అంత సొమ్ము చెల్లించలేక హరీష్ను పదిరోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. గాంధీ ఆస్పత్రి పిల్లల విభాగం వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి హరీష్ సిస్టమిక్ మయస్తీనియా వ్యాధికి గురైనట్లు గుర్తించారు. నాలుగు రోజులు వెంటిలేటర్పై ఉంచి ఐవీ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చి అరుదైన వ్యాధిని నయం చేశారు. పూర్తిస్థాయిలో కోలుకున్న హరీష్ను సోమవారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా యూనిట్ వైద్యులు ఉషారాణి, నాను సోము, సంతోష్కుమార్, రమేష్బాబు మాట్లాడుతూ.. సిస్టమిక్ మయస్తీనియా అరుదైన వ్యాధని, ఐదు లక్షమంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధిని గుర్తించి శస్త్రచికిత్సలు లేకుంగా నయం చేసిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పిడియాట్రిక్ హెచ్ఓడీ జే.వెంకటేశ్వరరావు అభినందించారు. తమ కుమారుడికి ప్రాణభిక్షపెట్టిన గాంధీ వైద్యులకు హరీష్ తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.