DG
-
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్ఫోన్కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్మెయిలింగ్లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
ఐదుగురు ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, బి.శివధర్రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా, టీజీఎఫ్ఎస్ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి డైరెక్టర్గా కొనసాగుతున్నారు.కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది. -
సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్
ఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ కేడర్కు చెందిన ఆమె.. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ ప్రత్యేక డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్కు చెందిన 1989-బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుత ఐటీబీపీ చీఫ్ అనీష్ దయాళ్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(IB)కోసం పనిచేశారు. డిసెంబర్ 11న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దయాళ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వివేక్ శ్రీవాస్తవను ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రత్యేక డైరెక్టర్గా ఉన్నారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
సీఎం జగన్ను కలిసిన ఎన్సీసీ డీజీ గుర్బీర్పాల్ సింగ్
-
సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్రమోషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో సీనియర్ ఐపీఎస్లు అంజనాసిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అసన్రేజా, పీఎస్ఆర్ ఆంజనేయులు, కే రాజేంద్రనాథ్రెడ్డి, నళిని ప్రభాత్ గజరవు భూపాల్, పేముషీ, గోపీనాథ్ జెట్టి, సెంథిల్కుమార్, గ్రీవల్ నవదీప్సింగ్, నవీన్గులాటి, కాంతిరాణా టాడా, ఎల్కేవీ రంగారావు, పి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. చదవండి: (దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ) -
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్…
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీగా అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంజనీ కుమార్కు ప్రస్తుత డీజీ గోవింగ్ సింగ్ బాధ్యతలు అప్పజెప్పి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఏసీబీ డీజీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏసీబీలో పని చేసే ప్రతి ఒక్క అధికారి నిబద్ధతతో పని చేయాలని సూచించారు. అవినీతి నిర్మూలనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. తనను ఏసీబీ డీజీగా నియమించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కమిషనర్గా మూడేళ్లు పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించాను. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. నాతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు. నేను సీపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్లాం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లింది. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల పాటు కంటిన్యూ చేశాను. ఏసీబీ డీజీగా నియమించి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. శాఖాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం* అని అంజనీ కుమార్ ప్రకటించారు. చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్! -
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్
-
రామ మందిరం కోసం పోలీస్ ప్రతిజ్ఞ
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బహిరంగంగా మద్ధతు పలికిన డీజీపీ స్థాయి అధికారి కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మూడు రోజుల క్రితం రామ మందిర నిర్మాణంపై లక్నో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో హోంగార్డ్స్ డీజీ సుర్యకుమార్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం సత్వరమే చేపట్టాలంటూ ఆయన చేసిన ప్రమాణం శుక్రవారం సామాజిక మాధ్యమాలు, టీవీల్లో ప్రసారమైంది. ‘రామ భక్తులమైన మనం ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణానికి పూనుకుందాం. జై శ్రీరాం!’ అని శుక్లా అన్నట్లు వీడియోలో కనిపించింది. -
ఏసీబీ డీజీగా పూర్ణ చంద్రరావు
హైదరాబాద్ః అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్గా అదనపు డీజీపీ పూర్ణచందర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రిక్రూట్మెంట్బోర్డు చైర్మన్గా ఉన్న పూర్ణచందర్రావు రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా ఆయన ఏసీబీకి డీజీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును కలిసి పుష్పగుచ్చం అందజేశారు. -
'ఓటుకు కోట్లు కేసు విచారణ కొనసాగుతోంది'
-
చదువుకొనలేం..
ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు - ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈటెక్నో, ఇతర పేర్లతో దోపిడీపర్వం - నియంత్రణంలో సర్కారు విఫలం - పేదలకు భారమవుతున్న విద్య చదువుకునే రోజులు పోయి, చదువు‘కొనే’ రోజులొచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలు ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈ టెక్నో అంటూ కొత్త పేర్లు పెట్టుకొని వేలల్లో ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఎక్కడ వెనకబడతారోననే భయంతో తల్లిదండ్రులు సైతం ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి స్కూళ్లలోనే చదివి స్తున్నారు. దీంతో యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచుతున్నాయి. ఫలితంగా పాఠశాల విద్య భారమవుతోంది. ఇంత ఫీజులా? నాకు ఇద్దరు పిల్లలు... పెద్దోడు మూడో క్లాస్, చిన్నోడు ఎల్కేజీ. మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా అని కరీంనగర్లో పేరున్న స్కూళ్లో చదివిద్దామని పోతే... వాళ్లు ఫీజు చెప్పగానే కళ్లు తిరిగినయ్. ఎల్కేజీకి బస్సు ఫీజుతో కలిపి 20 వేలు చెప్పిండ్రు. మూడో క్లాస్కు 24 వేలు అన్నరు. ఇద్దరు పిల్లలను అందులో చదివించాలంటే స్కూల్ ఫీజే 45 వేల రూపాయల అయితది. స్కూల్ డ్రెస్లు, బుక్కులు, స్టేషనరీ వీటన్నింటికీ మరో 10 వేలన్నా అయితయ్. నాకొచ్చే జీతం ఏడాదికి 72 వేలు. పిల్లల స్కూల్కే 55 వేలు పోతే ఇంకా మా కుటుంబం ఎట్ల గడవాలె. - మహేందర్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, న్యూస్లైన్ : మరో పది రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు... ఆపై మరో వారం రోజులకు ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు రంగురంగుల కరపత్రాలతో రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. చాలాపాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేదు. ఒలింపియాడ్, ఐఐటీ, టెక్నో, కాన్సెప్ట్, ఈ టెక్నో, ఈ కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర పేర్లను గతేడాది తొలగించారు. పేర్లు మారినా ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలను చేర్పించడంపై టీచర్లకు కూడా ‘ప్రైవేటు’ యాజమాన్యాలు టార్గెట్ విధించాయి. ఒక్కో టీచర్ కనీసం పది మందిని చేర్పిస్తే వేతనాలు సంతృప్తికరంగా ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా ఓపికతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఫీజులు పలు పాఠశాలల్లో ఫీజులు లక్ష రూపాయలకు చేరాయి. జిల్లాకేంద్రంతోపాటు గోదావరిఖని, పలు మున్సిపాలిటీల పరిధిలోని కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో హాస్టల్ ఫీజుతో కలుపుకుని రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. మండలకేంద్రాల్లోనూ ఫీజులు ఇంచుమించు ఇంతే ఉన్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. బోధనతోపాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్ ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్సులు, టై అంటూ ఇష్టమొచ్చిన ధరలు యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఓ విద్యాసంస్థ మొదటిసారిగా ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ అంటూ జిల్లా కేంద్రానికి చేరుకుని... అప్పటివరకు రూ.3 నుంచి రూ.5 వేలు ఉన్న పాఠశాల ఫీజును ఏకంగా రూ.15 వేలకు పెంచింది. ఆ తర్వాత జిల్లాలో అసలు విద్యా సంస్థల తీరే మారిపోయింది. సాధారణ స్థాయి పాఠశాలల్లో నర్సరీకి రూ.3 వేల వరకు ఫీజుండగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి దాకా తరగతి ప్రకారం రూ.4 వేల నుంచి రూ.15 వేల దాకా ఉన్నాయి. అదనంగా హాస్ట ల్ ఫీజులు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఉంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా 12వేల నుంచి 30 వేల దాకా ఫీజులుంటున్నా యి. హాస్టళ్లో ఉంచి చదివించాలంటే స్కూలు ఫీజు కాకుండా రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా కట్టాల్సిందే. పదో తరగతి అయితే ఇంకా ఎక్కువే. కొన్ని పాఠశాలలు మరో అడుగు ముందుకేసి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులో బీజాలు వేస్తామంటూ లక్ష రూపాయల ఫీజు అంటూ కొత్త విధానానికి రూపకల్పన చేశాయి. కొన్ని పాఠశాలలు బ్రాండ్ ఇమేజ్ పేరుతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతో జిల్లాకేంద్రంలో 20కి పైగా పాఠశాలలు ఉన్నాయంటే దోపిడీ ఎంత మేర ఉందో ఊహించుకోవచ్చు. ఆధునిక విధానంలో బోధన అందించడం, భవిష్యత్ లక్ష్యాలకు ఇప్పటినుంచి తర్ఫీదు ఇవ్వడం మంచిదే అయినా అలా విజయాలు సాధించినవారి సంఖ్య ఒకటిరెండుకే పరిమితమవుతుండడంతో ధనార్జనకోసమే ఇలాంటి కోర్సులనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత సొమ్ము వెచ్చించి ప్రైవేట్లో చదివించడం పేదలకు సాధ్యమయ్యే పనికాదు. నిబంధనలకు విరుద్ధం విద్యాహక్కుచట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిం చకూడదనే నిబంధన ఉన్నా చాలా స్కూళ్లు దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్లతో విద్యార్థులు చిన్న వయసులోనే మానసికంగా కుంగిపోయి చదువు పై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీనికితో డు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న చాలా పాఠశాల లు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది - ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు. - పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. - ప్రవేశపరీక్ష నిర్వహించకూడదు. - అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే విద్యాబోధన చేపట్టాలి. - అనాథలు, హెచ్ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, 60 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. - పాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఉండాలి. - ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. -
పూర్వస్థితికి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదా!
రెండు రాష్ట్రాల్లోనూ ఐజీలే నేతృత్వం వహించే అవకాశం ఇబ్బందులు వస్తాయంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల నిఘా విభాగాధిపతుల హోదాలు పూర్వస్థితికి చేరుకోనున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణకూ ఐజీ స్థాయి అధికారులే ఇంటెలిజెన్స్ చీఫ్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏడేళ్ల క్రితం వరకు ఈ హోదా అధికారులే నిఘా విభాగాన్ని పర్యవేక్షించినా.. తర్వాత ఆ పోస్టును అదనపు డీజీ స్థాయికి పెంచారు. పోలీసు విభాగంలో డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) తర్వాత అంతటి శక్తివంతమైనదిగా రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ పోస్టును పరిగణిస్తారు. రాష్ట్రంలో ఐపీఎస్ సహా అనేక కీలక అధికారుల పోస్టింగ్స్, దేశంలోని ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడంతోపాటు రాజకీయ, ఇతర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించడం, పలు కీలక సమయాలు, సందర్భాల్లో సలహాలు ఇవ్వడం నిఘా విభాగాధిపతి కీలక బాధ్యతలు. ముఖ్యమంత్రిని ప్రతిరోజూ డీజీపీ కలవాల్సిన అవసరం ఉండదు. అయితే నిఘా విభాగం చీఫ్ మాత్రం నిత్యం సీఎంను కలిసే తొలి అధికారిగా ఉంటారు. ఇంతటి కీలకమైన పోస్టుల్లో సాధారణంగానే ముఖ్యమంత్రులు తమకు అనుకూలమైనవారిని నియమించుకుంటారు. మాజీ డీజీపీ కె.అరవిందరావుకు ముందు వరకు ఈ పోస్టు ఐజీ స్థాయికే పరిమితమైంది. ఆయన హయాంలోనే పరిపాలనాపరమైన కారణాల నేపథ్యంలో ప్రభుత్వం అదనపు డీజీ స్థాయికి పెంచింది. అరవిందరావు తర్వాత మహేందర్రెడ్డి సైతం అదనపు డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండింటికీ రెండు ఇంటెలిజెన్స్ విభాగాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నం పోలీసు కమిషనర్గా పనిచేసి, ఇంటెలిజెన్స్కు బదిలీపై వచ్చిన శివధర్రెడ్డికి తెలంగాణ నిఘా విభాగాధిపతి పోస్టింగ్ దాదాపు ఖరారైనట్లే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుత ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారిపై చంద్రబాబు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. సాధారణ నిఘాతోపాటు రాజకీయ రంగంపైనా ఆయనకు మంచి పట్టు ఉండటం, సుదీర్ఘకాలంగా ఇంటెలిజెన్స్లో పనిచేయడంతో ఆయన్నే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తారనే వాదన వినిపిస్తోంది. ఇదే ఖరారైతే రెండు రాష్ట్రాలకూ నిఘా విభాగాధిపతులుగా ఐజీ ర్యాంకు అధికారులే కొనసాగనున్నారు. అయితే దీనివల్ల కొన్ని పరిపాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. డీజీపీ తర్వాత అంతటి కీలకమైన పోస్టులో ఉండే వ్యక్తి అవసరమైన సందర్భాల్లో మిగిలినవారికి ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. ఐజీ స్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్లుగా కొనసాగుతున్నప్పుడు అందరికీ ఆదేశాలు ఇవ్వడం సాధ్యపడదు. తెలంగాణ విషయానికి వస్తే రాజధానిగా ఉండే హైదరాబాద్ కమిషనర్గా అదనపు డీజీ స్థాయి అధికారి, దీనికి పొరుగున ఉన్న సైబరాబాద్కు సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటారు. వీరికి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్న ఐజీ కేవలం సూచనలు ఇవ్వడం తప్ప ఆదేశాలు జారీ చేయలేరు. ఇప్పటికే విశాఖపట్నం కమిషనర్గా సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఉంటున్నారు. కొత్త రాజధానిని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతాన్ని కమిషనరేట్గా చేస్తే కచ్చితంగా అదనపు డీజీ స్థాయివారినే కమిషనర్గా నియమించాల్సి ఉంటుంది. దీంతో అక్కడా ఇలాంటి ఇబ్బందులే వస్తాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.