EDLI
-
ప్లాస్టిక్ కవర్పై ఇడ్లీ చాలా డెడ్లీ
రంగు కలిపిన బొంబై మిఠాయి తింటే ఉదరకోశ రోగాలు, క్యాన్సర్ రావచ్చునని గతంలో సర్కారు హెచ్చరించింది. అదే రంగు కలిపిన చికెన్ పకోడా, గోబీ ఆరగిస్తే కూడా జబ్బులు తప్పవని హెచ్చరించి రంగులను నిషేధించింది. ఇప్పుడు ఇడ్లీలకు అలర్ట్ జారీ అయ్యింది. ప్లాస్టిక్ కవర్లు వేసి వండిన ఇడ్లీలను తినరాదని, క్యాన్సర్ ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక వినియోగదారులు జాగ్రత్త వహించాల్సిందే.బనశంకరి : ప్రతి ఇంటా, హోటల్లో ఇడ్లీలు చేస్తారు, కడుపారా ఆరగించి ఆకలి తీర్చుకుంటారు. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇడ్లీ తగిన ఆహారం. కానీ వండే సమయంలో తప్పుడు విధానాల వల్ల క్యాన్సర్కు గురి కావచ్చు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ ఇదే విషయం చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు.. ప్రమాదం ఇడ్లీలను వండడానికి కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ పేపర్లు ఉపయోగిస్తారు, ప్లాస్టిక్లో క్యాన్సర్ కారకాలు చేరడం వల్ల ఆ ఇడ్లీలను తినడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ నివేదికలు ప్రభుత్వం చేతికి రెండురోజుల్లో అందుతాయని మంత్రి దినేశ్ చెప్పారు. ఇటీవలి కాలంలో ఇడ్లీల తయారీలో, వడ్డించడంలో ప్లాస్టిక్ కవర్ల వాడకం అధికమైంది. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హోటల్స్లో, క్యాంటీన్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ కవర్లను వాడరాదని నిషేధం విధించామన్నారు. మరో రెండురోజుల్లో అధికారిక ఆదేశాలు జారీచేస్తామని తెలిపారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు, పెద్ద పెద్ద హోటల్స్లో ఇడ్లీ తయారీలో, పార్శిల్ కట్టడంలో ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. దీనిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. అందులోనే ఇడ్లీ తయారీదారులకు సలహాలు, సూచనలు ఉంటాయన్నారు. నమూనాల పరీక్షల్లో వెల్లడిరాష్ట్ర ఆరోగ్య శాఖ సిబ్బంది బెంగళూరుతో పాటు పలు జిల్లాల నుంచి ఇడ్లీల్లో ప్లాస్టిక్ కవర్లు వాడే చోట్ల నుంచి 500 శాంపిల్స్ను పరిశీలించారు. ఇందులో 35 నివేదికలు సాధారణం కాగా పలు నివేదికల్లో క్యాన్సర్ కారకాలు బయటపడ్డాయి. ఇడ్లీలు సులభంగా ఊడి రావడానికి ప్లాస్టిక్ పేపర్ పరిచి దానిపై ఇడ్లీ పిండి వేసి వేడి చేస్తారు. నిజానికి అక్కడ తెల్ల నూలు బట్టను వాడాలి. ప్లాస్టిక్ కవర్ అధిక వేడిమి వల్ల ప్రమాదకర రసాయాలను విడుదల చేస్తుంది. అవి కాస్తా ఇడ్లీల్లోకి, ఆపై శరీరంలోకి చేరుతాయి. దీంతో క్యాన్సర్, గుండెపోటు, ఇతరత్రా అనారోగ్యాలు తలెత్తుతాయి. -
ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవితబీమా
ఉద్యోగులకు సామాజిక భద్రతా కల్పించేందుకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) స్కీమ్ 1976లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో సభ్యులుగా ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్లో వాటాదారులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తారు.ఈడీఎల్ఐ స్కీమ్ వివరాలుఅర్హతలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇతర నిబంధనల చట్టం 1952 కింద నమోదైన అన్ని సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. నెలకు రూ.15,000 వరకు మూల వేతనం ఉన్న ఉద్యోగులు ఈ స్కీమ్లో డిఫాల్ట్గా చేరతారు.యాజమాన్యం వాటా: ఉద్యోగి నెలవారీ వేతనంలో 0.5% యజమానులు ఈడీఎల్ఐ పథకానికి విరాళంగా ఇస్తారు. గరిష్ట వేతన పరిమితి రూ.15,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఈడీఎల్ఐలో ఉద్యోగి నుంచి ఎలాంటి కంట్రిబ్యూషన్ అవసరం లేదు.బీమా కవరేజీ: సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణిస్తే, రిజిస్టర్డ్ నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు అందుతాయి. గత 12 నెలల్లో ఉద్యోగి తీసుకున్న సగటు నెలవారీ వేతనానికి 30 రెట్లు, నెలకు గరిష్టంగా రూ.15,000కు లోబడి ఈ బెనిఫిట్ను లెక్కిస్తారు.ప్రయోజనాలు: కనీస హామీ ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ట ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. ఇది నెలవారీ గరిష్టవేతన పరిమితిపై ఆధారపడుతుంది. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ఈడీఎల్ఐ(EDLI) పథకంలో ఉద్యోగి వేతనంలో 0.5 శాతం వాటాను యాజమాన్యం జమచేయాలి. అయితే దీని కంటే మెరుగైన ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy)లు ఏవైనా ఉంటే యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.ఇదీ చదవండి: కూతురి కోసం మంచి పథకంఎలా క్లెయిమ్ చేయాలి?ఉద్యోగి మరణిస్తే నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు ఆ డబ్బులు చెందుతాయి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు క్లెయిమ్ ఫారాన్ని ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. క్లెయిమ్ మొత్తం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందుకోసం నామినీ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం నుంచి ఫారం 5 ఐఎఫ్ (ఇన్సూరెన్స్ ఫండ్) పొందాలి. మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతా నంబర్, మరణించిన తేదీ, నామినీ వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను ఫారంతో నింపి కార్యాలయంలో అందించాలి. అందుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయాలి. -
EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్పై మరింత ప్రయోజనం
ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెరుగుపరిచిన ఈ పథకం రూ. 7 లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుండి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.1976లో ప్రారంభమైన ఈ పథకం ఈపీఎఫ్ఓ సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఈ స్కీమ్ కింద కనీసంగా రూ. 1.5 లక్షలు, గరిష్టంగా రూ. 6 లక్షల బీమా కవరేజీని 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2021 ఏప్రిల్ వరకు కొనసాగింది. మళ్లీ 2021 ఏప్రిల్ 28 నుంచి పొడిగిస్తూ కనీస బీమా ప్రయోజనాన్ని రూ. 2.5 లక్షలకు, గరిష్ట కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..అంతేకాకుండా ఈ లబ్ధి పొందేలంటే చివరి 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉన్నా సరిపోతుంది. ఈ పథకం చెల్లుబాటు ఈ ఏడాది ఏప్రిల్ 27తో ముగియగా ఈ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. ఈ చొరవ ఇప్పుడు 6 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమాను అందిస్తుంది. -
బీమా సొమ్ము.. ఆర్టీసీ సొంత అవసరాలకు
సాక్షాత్తూ భవిష్యనిధి(పీఎఫ్) సంస్థ కల్పించిన బీమా పథకానికి ఆర్టీసీ గండి కొట్టింది. ఆ పథకం ద్వారా మృతుడి కుటుంబ సభ్యుల(నామినీకి)కు గరిష్టంగా రూ.7 లక్షలు అందే ఓ చట్టబద్ధ ప్రయోజనాన్ని ఏడాదిన్నరగా అందించటం లేదని తెలిసింది. ఇప్పుడు ఈ ఆర్థిక ప్రయోజనం కోసం దాదాపు 300కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భవిష్యనిధిలో అంతర్భాగంగా ‘‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూ్యరెన్స్ (ఈడీఎల్ఐ)’’స్కీమ్ ఆర్టీసీలో కొనసాగుతోంది. ఓ సంస్థలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులుండి, వారికి ఇంతకంటే మెరుగైన మరే బీమా పథకాన్ని సంస్థ అమలు చేయని పక్షంలో, కచ్చి తంగా దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రత్యేక కాంట్రిబ్యూషన్ అంటూ లేకుండా సాగుతుంది. ఉద్యోగి బేసిక్ ప్లస్ డీఏ (మూల వేతనం ప్లస్ కరువు భత్యం)మీద 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.75 చొప్పున ప్రతినెలా సంస్థ ఉద్యోగిపక్షాన అతని/ఆమె భవిష్య నిధి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. భవిష్యనిధిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఉద్యోగి (అర్హతలను అనుసరించి) దీని ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగి చనిపోతే అతని/ఆమె నామినీకి కనిష్టంగా రూ.రెండున్నర లక్షలు.. నెలవారీ వేతనం, భవిష్యనిధి నిల్వ తదితరాల ఆధారంగా గరిష్టంగా రూ.ఏడు లక్షల వరకు చెల్లిస్తారు. ఉద్యోగి నయాపైసా కాంట్రిబ్యూషన్ లేకుండా ఇది అందుతుంది. ఇష్టారాజ్యానికి ఇదే కారణం.. భవిష్యనిధి ఖాతాల నిర్వహణలో ఆరీ్టసీకీ ప్రత్యేక మినహాయింపు ఉంది. సొంతంగానే పీఎఫ్ ట్రస్టును నిర్వహిస్తుంది. దీనికి ఓ నిర్వహణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తుంది (ప్రస్తుతం కమిటీ లేదు). ఈ వెసులుబాటే ఇప్పుడు ఆర్టీసీ ఇష్టారాజ్యానికి కారణమైంది. భవిష్యనిధి చెల్లింపులు పూర్తి చట్టబద్ధమైనమే అయినా, కాంట్రిబ్యూషన్ను ట్రస్టుకు జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ కట్టు తప్పే సంప్రదాయం ఆర్టీసీలో మొదలైంది. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని కొంతమేర తగ్గించి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా.. సంస్థ ఆర్థిక అవసరాలు, ప్రభుత్వం నుంచి సకాలంలో సాయం అందకపోవటం లాంటి వాటి వల్ల దానికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలోనే ఈ బీమా పథకం కోసం యాజమాన్యం చెల్లించే వాటాను ట్రస్టులో డిపాజిట్ చేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఏడాదిన్నరగా దీని చెల్లింపులు నిలిచిపోయాయి. గతేడాది మార్చి వరకు భవిష్యనిధి బీమా పథకం చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత నిలిచిపోయినట్టు సమాచారం. ప్రతి మూడు నెలలకోమారు ఈ పథకం కోసం ఆర్టీసీ నిధులు విడుదల చేసే పద్ధతి ఉండేది. ఏడాదిన్నరగా అవి కూడా నిలిచిపోయాయి. అప్పటి నుంచి దాదాపు 300 మందికిపైగా ఉద్యోగులు మరణించారు. వీరి కుటుంబ సభ్యుల(నామినీ)కు ఆ బీమా మొత్తాన్ని చెల్లించటం లేదని తెలిసింది.