election 2013
-
పతంగిదేపై ‘చేయి’
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల సందర్భంగా సస్పెన్స్లు.. డ్రామాలు.. రక్తికట్టిన అనంతరం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఊహించినట్లుగానే ఏకగ్రీవమయ్యాయి. అధికారంలో ఉన్న పారీ్టతో సఖ్యత ఫార్ములాతో ఎంఐఎం.. కాంగ్రెస్తో జత కట్టడంతో ఆ రెండు పారీ్టల కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో జట్టుకట్టిన ఎంఐఎం.. ఈసారి కాంగ్రెస్తో జత కలిసింది. దాంతో.. ఈసారి బీఆర్ఎస్ స్థానే కాంగ్రెస్ సభ్యులు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీలో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం ఎన్నిక జరిగింది. రెండు పారీ్టలు కలిస్తే.. మిగతా పార్టీలు గెలవవని తెలిసినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయానికి ముందస్తుగానే నామినేషన్లు వేసి బరిలో దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పోలింగ్ జరగకుండానే పోటీలో మిగిలిన 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ప్రకటించారు. పోటీ చేయని బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్కు దూరమంటూ జీహెచ్ఎంసీలో ఆ పారీ్టతో కలిస్తే అపప్రథ అనే తలంపుతో బీజేపీ అసలు పోటీ చేయలేదు. ఈ ఎన్నికకు పారీ్టలతో సంబంధం లేనందున వ్యక్తిగత బలంతో గెలవవచ్చనుకున్నారో, లేక లోపాయికారీగా నామినేషన్లు ముగిసేలోగా ఏమైనా జరగవచ్చనుకున్నారో నామినేషన్లు వేసిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోటీ నుంచి వైదొలిగారు. గెలవలేమని తెలిసి బరిలో ఉండొద్దంటూ అధిష్ఠానం ఆదేశించడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఎంఐఎందే హవా.. స్టాండింగ్ కమిటీలో స్థానంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరువు దక్కించుకున్నప్పటికీ, ఎంఐఎం హవా కొనసాగనుంది. 15 మంది సభ్యులకుగాను 8 మంది ఎంఐఎం వారే. అంటే, ఒక్కటే అయినప్పటికీ, కాంగ్రెస్ కంటే ఎంఐఎందే మెజారీ్ట. ఇక జీహెచ్ఎంసీ పాలకమండలికి చివరి సంవత్సరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్న తరుణంలో స్టాండింగ్క మిటీలో ఆమోదం పొందాలంటే ఎంఐఎం సభ్యులే కీలకం కానున్నారు. ఎంఐఎంకు అధికారంలోని పార్టీలతో అనుబంధం ఈనాటిది కాదు. బీఆర్ఎస్ రాకముందు నుంచీ అది అధికారంలో ఉన్న పారీ్టతో పొత్తు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొత్తులో భాగంగా స్టాండింగ్ కమిటీలోనే కాదు..మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు పొత్తులో భాగంగా పంచుకున్నారు. పెరిగిన కాంగ్రెస్ బలం.. కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 25కు చేరినప్పటికీ, ఆ పార్టీ తొలుత గెలిచింది రెండు సీట్లే. ఇతర పారీ్టల నుంచి చేరికలతో దాని బలం 25కు పెరిగింది. గతంలో కాంగ్రెస్–ఎంఐఎం పొత్తు కొనసాగినప్పుడు కాంగ్రెస్ 8, ఎంఐఎం 7 స్టాండింగ్కమిటీ స్థానాలు పొందేవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బల్దియాలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉన్నప్పుడు బలానికనుగుణంగా అంటూ బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఎంఐఎంనుంచి ఆరుగురు మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. గత పాలకమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం 56కు తగ్గడంతో తిరిగి స్టాండింగ్ కమిటీకి 8 మందినే ఖరారు చేశారు. ఇప్పుడు ఎంఐఎం–కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎంఐఎంకు ఎక్కువమంది కార్పొరేటర్లు ఉన్నందున వారు ఎనిమిది స్టాండింగ్ కమిటీ స్థానాలు పొందారు. మొత్తానికి ఎన్నికలకున్న ఏడాది సమయంలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్లోకి ఇతర పారీ్టల నుంచి వచి్చనవారే స్టాండింగ్ కమిటీలో స్థానం పొందారు. తొలుత గెలిచిన వారిలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యులు (పారీ్టల వారీగా)ఎంఐఎం నుంచి.. అబ్దుల్ వాహబ్ (చాంద్రాయణగుట్ట), డాక్టర్ ఆయేషా హుమేరా (టోలిచౌకి), గౌసుద్దీన్ మహ్మద్(¿ోలక్పూర్), పరీ్వన్ సుల్తానా (ఘాన్సీబజార్), బాతాజబీన్ (విజయనగర్ కాలనీ), మహ్మద్ సలీం (దూద్బౌలి), సమీనా బేగం (తలాబ్ చంచలం), సయ్యద్ మిన్హాజుద్దీన్ (అక్బర్ బాగ్). కాంగ్రెస్ నుంచి.. వి.జగదీశ్వర్గౌడ్ (మాదాపూర్), బానోత్ సుజాత (హస్తినాపురం), మహ్మద్ బాబాఫసియుద్దీన్(బోరబండ), బూరుగడ్డ పుష్ప (ఆర్సీపురం), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), మహాలక్ష్మి రామన్ గౌడ్ (హిమాయత్నగర్), సీఎన్ రెడ్డి (రహ్మత్నగర్). -
తుని: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాల దాడి
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా👉నాలుగోసారి ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గూండాలు👉బలం లేకపోవడంతో అడ్డుకున్న టీడీపీ గూండాలు👉ఎన్నిక జరిగితే ఓడిపోతామన్న భయంతో కూటమి సర్కార్ కుట్రతునిలో టీడీపీ నేతల దౌర్జనకాండ👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతల దాడి👉మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం👉ప్రాణభయంతో వెనుదిగిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు👉మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా టీడీపీ గూండాలు👉కర్రలతో భారీగా టీడీపీ గూండాలు మోహరింపుతునిలో ప్రజాస్వామ్యం ఖూనీ👉మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు👉నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలు👉తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కుట్రలు👉తునిలో 30కి 30 కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వారే👉ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మందిని లాక్కున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు👉తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు👉144 సెక్షన్ అమల్లో ఉన్న పట్టించుకోని టీడీపీ గూండాలుతునిలో పోలీస్ బందోబస్తు లేదు: దాడిశెట్టి రాజా👉తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.👉ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు👉పిఠాపురం టోల్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు👉తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడిని అడ్డుకున్న పోలీసులు👉పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తల వాగ్వాదంనేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్షసాధిపు చర్యలు దిగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి, కౌన్సిలర్ల పై అక్రమ కేసు నమోదు చేశారు.దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైఎస్సార్సీపీ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు.చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్-2 ఎన్నికకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం కలెక్టర్ షాన్ మోహన్తో దాడిశెట్టి రాజా మాట్లాడారు. మరికాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి నివాసం నుంచి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడ ఎఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమ కేసులు బనాయింపు, బెదిరింపులను దాడిశెట్టి రాజా ఖండించారు. బీసీ మహిళ అయిన తనపై అక్రమ కేసు బనాయింపుపై మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ⇒కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తుని మున్సిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది.⇒జంటిల్మెన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్ వైస్చైర్పర్సన్–2 పీఠాన్ని పోలీసులను కీలు»ొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు.⇒ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్చైర్పర్సన్ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్ పెట్టారు. ⇒అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్లను కౌన్సిల్ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్ చైర్పర్సన్ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసైనా కౌన్సిల్లో కోరం సాధించి వైస్ చైర్పర్సన్ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్త, కో–ఆప్షన్ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు.⇒ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొలి్పంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్లు ఎవరూ వెళ్ల లేదు.⇒తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కలి్పస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి. ⇒వైస్ చైర్పర్సన్ అందునా జంటిల్మెన్ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్ చైర్పర్సన్ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.⇒అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్ చైర్పర్సన్ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్మీనాను కలెక్టర్ షన్మోహన్ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్ ప్రకటించారు. -
దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. దళిత ఎమ్మెల్యేకి ఘోర పరాభవం ఎదురైంది. రెండు సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నప్పటికీ సౌమ్య పట్ల తీవ్ర వివక్ష చూపించింది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల వేళ సౌమ్యను డమ్మీగా మార్చింది. నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్గా 14వ వార్డు కౌన్సిలర్ సత్యవతిని ఎమ్మెల్యే సౌమ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యే చెప్పిన కౌన్సిలర్కు కాకుండా మరొకరికి అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది.తాను చెప్పిన కౌన్సిలర్కే ఛైర్మన్ ఇవ్వాలని సౌమ్య పట్టుబట్టారు. సౌమ్య ప్రతిపాదనలను చెత్తబుట్టలో వేసిన అధిష్టానం.. కృష్ణకుమారికి బీ ఫామ్ ఇచ్చింది. దీంతో అధిష్టానంపై ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేక సభ్యులు.. కృష్ణకుమారిని ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం సూచించిన అభ్యర్ధికే ఓటేశారు. -
పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, కార్పొరేటర్లను కూటమి నేతలు కిడ్నాప్ చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఈసీ దృష్టికి వైఎస్సార్సీపీ నేతలు తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈసీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ నేతలు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మల్లాది విష్ణు. కావటి మనోహర్ ఉన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ప్రలోభాలకు గురి చేసి కూటమి నేతలు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారు. డిప్యూటి మేయర్ ఎన్నిక కోసం ఇంతకు దిగజారాలా?.కిడ్నాప్ చేయడానికి దాడులు చేయడానికి వెనకడం లేదు. ప్రజా ప్రతినిధులను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి చర్యలు ఏంటని అడుగుతున్నా. హూకోర్టు ఆదేశాలు కూడా పోలిసులు అమలు చేయడం లేదు. ఏనీలో అక్రమాలకు వంత పాడుతున్న అధికారులు అందరూ చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
మీరు మరీ అంత కంగారు పడకండి సార్ ఆయనేదో మాటవరుసకనుండొచ్చు!
-
ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా పరిగణిస్తున్నందున, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కానుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. నిఫ్టీ ఇప్పటికే సరికొత్త శిఖరానికి చేరుకుంది. కావున తదుపరి నిరోధం 20,500–20,800 స్థాయిని చేధించేందుకు ప్రయత్నం చేసుకుంది. ఇదే సమయంలో సచీలు వారం రోజులు ర్యాలీ నేపథ్యంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 19850–20050 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. బుధవారం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ బుధవారం( డిసెంబర్ 6న) ప్రారంభం కానుంది. చైర్మన్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్నారు. ద్రవ్యోల్బణ దిగిరావడంతో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సప్లై సమస్యలు, వృద్ధి అవుట్లుక్లతో పాటు వచ్చే ఏడాది వడ్డీరేట్ల తగ్గింపు అభిప్రాయాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు భారత్తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈయూలు మంగళవారం సేవారంగ పీఐఎం గణాంకాలు ప్రకటించనున్నాయి. అమెరికా బుధవారం నవంబర్ ప్రైవేట్ రంగ ఉద్యోగ కల్పన డేటా, వీక్లీ జాబ్లెస్ గణాంకాలను గురువారం వెల్లడించనుంది. ఇదే రోజున యూరోజోన్ ప్రస్తుత సంవత్సరపు క్యూ3 జీడీపీ డేటా, చైనా వాణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. జపాన్ క్యూ3 జీడీపీ డేటా శుక్రవారం వెల్లడి అవుతుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక డేటా ప్రకటనకు ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించవచ్చు. నవంబర్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు గత రెండు నెలలు నికర అమ్మకదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్లో ర.9వేల కోట్ల పెట్టబడులు పెట్టారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు దేశీయ మార్కెట్ బౌన్స్ బ్యాక్ ర్యాలీ ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే నెలలో డెట్ మార్కెట్లో ర.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత్ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరగడం, బలమైన ఆర్థిక డేటా, ప్రోత్సాకర కార్పొరేట్ ఆదాయాలు తదితర కారణాలతో దేశీ మార్కెట్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని నిపుణులు పేర్కొన్నారు. -
ఓటేసిన సినీ సెలబ్రిటీలు వీరే.. ఫస్ట్ ఓటు ఎవరంటే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. తెలంగాణ బరిలో నిలిచిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.26 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబరు 3న చేపట్టనున్నారు. టాలీవుడ్ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా హీరో సుమంత్ తన ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును వినియోగించుకున్నాడు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేశాడు. వాస్తవంగా ఓటేసేందుకు ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నది బన్నీనే.. ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోనే నిల్చున్నాడు. (ఇదీ చదవండి: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్) జూబ్లీహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో జూ. ఎన్టీఆర్ కుటుంబంతో సహా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తారక్తో పాటు తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు అమ్మగారు షాలిని ఉన్నారు. వారందరూ కూడా క్యూ లైన్లో నిల్చోని ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. యువత అందరూ నేడు జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చాడు. ► జూబ్లీహిల్స్ బూత్ నం.149లో ఓట్ వేసిన హీరో రామ్చరణ్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన తెలుగు హీరో ఆది సాయికుమార్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) ► జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటేసిన హీరో మహేశ్బాబు ► ఓటేసిన యాంకర్ అనసూయ.. సెల్ఫీ ఫొటో ఇన్ స్టాలో పోస్ట్ ► తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన టాలీవుడ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, మెహర్ రమేశ్ ► జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)లో ఓటేసిన విజయ్ దేవరకొండ ► నానక్ రామ్ గూడలో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు నరేష్ ► ఓటుతో మీ గళాన్ని వినిపించండి అంటున్న యంగ్ హీరోస్ మంచు మనోజ్, రామ్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన రవితేజ, గోపీ చంద్ ► గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటేసిన హీరో నాని ► వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ బూత్ 151 వద్ద ఓటేసిన నాగార్జున, అమల, నాగచైతన్య ► నా హక్కును ఉపయోగించుకున్నాను: సాయి ధరమ్ తేజ్ ►ఓటు వేయడం మన హక్కు, భాద్యత కూడా మరిచిపోకండి: సింగర్ సునీత ► ఓటేసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్, హీరో సుమంత్ ► సతీమణి తబితతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్ సుకుమార్ ► పాన్ ఇండియా స్టార్స్.. జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ ► ఓటు హక్కు వినియోగించుకున్న విక్టరీ వెంకటేశ్,డైరెక్టర్ తేజ ► ఓట్ వేయని వాడు 'దేశ ద్రోహి': తేజ ► FNCC వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రాణా దగ్గుబాటి ► ఓటేసి సామాజిక అభివృద్ధిలో పాల్గొనండి: నటి పూనమ్ కౌర్ ► జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నితిన్ ► షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో ఓటేసిన రాజమౌళి.. మీరు వేయండి అంటూ ట్వీట్ ► తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు హరీశ్ శంకర్.. ఆసక్తికర ట్వీట్ ► మా కుటుంబంలోని 9 మంది ఓట్లేశారు.. మీరు కూడా ఓటేయాలని కోరిన ఆర్. పి. పట్నాయక్ ► జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149) వద్ద భార్యతో కలిసి ఓటు వేసిన చిరంజీవి -
తెలంగాణ ఎన్నికలు: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- 2023 పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ నుంచి పులువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటును వినియోగించుకునేందుకు సుమారు గంటకు పైగానే క్యూ లైన్లో ఉన్నారు. హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153 వద్ద అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వచ్చాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందరి కంటే ముందుగా పోలింగ్ కేంద్రం వద్దకు బన్నీ వచ్చాడు. ఉదయం 6:50 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు ఆయన చేరుకున్నాడు. ఆయన క్యూ లైన్లో ఉండగా కొంత సమయం పాటు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అల్లు అర్జున్ గంటకు పైగానే క్యూ లోన్లోన్లోనే ఉన్నాడు. -
TS Election 2023: పోలీస్లకు ఝలక్..! ఎన్నికల సంఘం ఆదేశం..!
వరంగల్: పోలీస్శాఖలో బదిలీలు, పోస్టింగ్లపై రచ్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై అందిన ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) స్పందించింది. వరంగల్, కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీసు అధికారుల పోస్టింగ్ల్లో కమిషన్ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. అత్యధికంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 21 మందికి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ముగ్గురు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పోస్టింగ్లు ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ కోణం, వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్ఓయూ 3/ 2023 ద్వారా రాశారు. అడుగడుగునా ఉల్లంఘనలే...? ఫిర్యాదుల పరంపరపై ఆరా... ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్లు ఇవ్వాలని లెటర్ నంబర్ 437/6/1/ఐఎన్ఎస్టీ/ఈసీఐ/ఎఫ్యుఎన్సీటీ/ఎంసీసీ/2023 ద్వారా తేదీ 02.06.2023న కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పేర్కొంది. అందుకు విరుద్ధంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అనేక మందికి తిరిగి జిల్లాలోనే పోస్టింగ్లు ఇచ్చారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరహా పోస్టింగ్లకు సంబంధించి 51 మంది పేర్లతోపాటు వారు ఎక్కడెక్కడ, ఎంతకాలం పని చేశారన్న వివరాలను ఫిర్యాదులో చేర్చారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 21 మంది పో స్టింగ్లపై ఫిర్యాదులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్లు వివాదాస్పదం అయ్యాయి. ఈ పోస్టింగ్ల పైనే వివాదం.. నాలుగేళ్లలో మూడేళ్లు పూర్తి చేసిన కొందరికి అదే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారని ఫిర్యాదులున్నాయి. చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్న ఎన్నికల కోడ్ వర్తించే అధికారుల జాబితా ఇలా ఉంది. ► జూలై 15న మామునూరు ఏసీపీగా నియమితులైన సి.సతీష్.. దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పనిచేశారు. ఇది కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన వారు కూడా ఉన్నారు. ► ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జరిగిన బదిలీల్లో పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. ► 2014 ఎన్నికల్లో పని చేసిన డేవిడ్రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్లలో పని చేశారు. ► గత ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి నర్సంపేటకు ఏసీపీగా బదిలీ అయిన పి.తిరుమల్ ఎనిమిదేళ్లు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే పని చేశారు. ► ఇంతేజార్గంజ్ సీఐ నుంచి శాయంపేట ఇన్స్పెక్టర్గా బదిలీ అయిన మల్లేశ్ ఆయన సర్వీసు కాలమంతా వరంగల్ జిల్లా, కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు. జనగామ, నర్మెటలలోనూ సీఐగా పనిచేశారు. ► సీసీఎస్, టాస్క్ఫోర్స్లలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాస్ ఐటీకోర్.. టాస్క్ఫోర్స్లకు మారగా.. ఎనిమిది సంవత్సరాలుగా వరంగల్ (కమిషనరేట్) జిల్లాలోనే పనిచేశారు. ► హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు కమిషనరేట్లో టాస్క్ఫోర్స్, డీసీఆర్బీ, వెకెన్సీ రిజర్వు (వీఆర్)లలో పోస్టింగ్లు కొ ట్టారు. ఏసీపీ విజయ్కుమార్, సీఐలు రవికుమార్, దేవేందర్, కె.కుమారస్వామి, ఓ.రమేష్లు పై పోస్టింగ్లలో ఉన్నారు. సుబేదారి ఎస్హెచ్ఓ షుకూరుది వరంగల్ జిల్లా. ► ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులైన శ్రీధర్ తొమ్మిదేళ్లుగా వరంగల్ జిల్లా (పోలీస్ కమిషనరేట్)లో పని చేస్తున్నారు. హసన్పర్తి ఎస్హెచ్ఓగా, ఎస్బీ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఆయన ధర్మసాగర్ ఎస్హెచ్ఓగా నియమితులయ్యారు. ► వరంగల్ జిల్లాలోనే తన సర్వీసు కాలమంతా పని చేసిన సీఐ సుజాతను కాజీపేట ట్రాఫిక్గా నియమించడం వివాదాస్పదమైంది. ఆరేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న మరో మహిళా అధికారిణి సువర్ణను కూడా రూరల్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా నియమించారు. ► ఆరేళ్లుగా జిల్లాలోనే పని చేస్తున్న రామకృష్ణ సీఐని గీసుకొండ ఇన్స్పెక్టర్గా నియమించారు. ఐదేళ్లుగా అర్బన్ మహిళ పోలీసుస్టేషన్ సీఐగా ఉస్మాన్ షరీప్ పనిచేస్తున్నారు. ► మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్ను ఆదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామి అని ఆరోపణలున్న రాణాప్రతాప్ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ► ములుగు జిల్లా డీఎస్బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్లో ఉన్న శివకుమార్లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. -
సీఎం పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి : బొంకూరి సురేందర్ సన్నీ
కరీంనగర్: సీఎం కేసీఆర్ పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఈ నెల 26న భీమ్ గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బొంకూరి సురేందర్ సన్నీ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్క్లబ్లో కౌన్సిలర్లు బొంకూరి భాగ్యలక్ష్మి, ఈరబోయిన శ్రీనివాస్లతో కలిసి, మాట్లాడారు. సహజ వనరులు, పారిశ్రామిక ప్రాంతం కలిగి ఉన్న పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారని అన్నారు. ర్యాలీని విజయవంతం చేసి, సీఎం కేసీఆర్ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి జెండా కూడలిలోని కాన్షీరాం విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. సీఎం పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. -
పోలింగ్ వీక్షణం కేంద్రాల గుర్తింపునకు జియోట్యాగింగ్..
కరీంనగర్: వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి ఓటరు జాబితా రూపొందిస్తుండగా పోలింగ్ స్టేషన్ల జియోట్యాగింగ్కు చర్యలు చేపట్టింది. 2018 శాసనసభ ఎన్నికల్లోనే సదరు ప్రక్రియ చేపట్టగా మళ్లీ పరిశీలన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ఘటనలకు తావులేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్(ఏరోనెట్) విధానంలో బోగస్ ఓట్లను ఏరివేయగా నివాస ప్రాతిపదికన ఓటు హక్కు కల్పిస్తున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో.. జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలుండగా వీటి పరిధిలో 20మండలాలున్నాయి. జిల్లాలో 1,338 పోలింగ్ కేంద్రాలుండగా పోలింగ్ జియోట్యాగింగ్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేంద్రాల మార్పు, పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్ నియోజకవర్గంలో 11 కేంద్రాలను మార్పు చేయగా, 19 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేశారు. చొప్పదండి 25 పోలింగ్ కేంద్రాల మార్పు, 18 పేర్లు మార్పుచేశారు. మానకొండూర్ 6 కేంద్రాల మార్పు, ఒకటి పేరు మార్పు, హుజూరాబాద్లో ఒకకేంద్రాన్ని మార్పు చేయగా 6 పేర్లు మార్చారు. ఆధునిక సాంకేతికతను వాడి టీఎస్ సీవోపీ ప్రత్యేక యాప్ ద్వారా గుగూల్ మ్యాపును అనుసరించి పోలింగ్ కేంద్రం చిత్రాలు సహా ఇతర విషయాల్ని పొందుపరుస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిల.. నియోజకవర్గాల వారీగా కేంద్రాలు జియోట్యాగ్తో ప్రయోజనం.. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు నేరుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా ఆయా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. ఆయా కేంద్రాలకు మధ్య ఉన్న దూరం తదితర విషయాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. జిల్లాకేంద్రంతో పాటు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంగా ఇవి ఉండటంతో పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. ఏవైనా గొడవలు జరిగినా వెనువెంటనే అక్కడికి చేరుకునేందుకు సులువవనుంది. ఏరోనెట్తో బోగస్కు చెక్.. కుటుంబం మొత్తానికి ఒకేచోట ఓటుహక్కు కల్పించేందుకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్ (ఎరోనెట్) విధానాన్ని అనుసరించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటుహక్కు ఉందో తేలనుంది. సదరు వివరాలు ఆధారంగా అధికారులు విచారణ చేసి ఎక్కడ నివాసం ఉంటారో అక్కడనే ఓటుహక్కు కల్పిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పులులేని ఓటరు జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. -
ముదురుతున్న చేరికల పంచాయితీ! అంతర్గత 'హస్త'వ్యస్తం!
మహబూబ్నగర్: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల పోరుకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్లో చేరికలు చిచ్చురేపుతున్నాయి. కీలక నేతల చేరికలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పెద్దలు అడుగులు వేయగా.. ఉమ్మడి పాలమూరులో పాత, కొత్త నాయకుల మధ్య పంచాయితీకి ఆజ్యం పోసింది. అభ్యర్థిత్వాలపై ఎవరికి వారు పట్టు కొనసాగిస్తుండగా.. అసమ్మతి రాజుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో ఇరువర్గాల నేతల అనుచరులు పరస్పర విమర్శలకు దిగుతుండడం రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరికి వారు ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తుండడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. సర్వేఫలితాలే ఫైనల్ అంటూ అధిష్టానం మిన్నకుండిపోవడంపై హస్తం శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. -
డ్రీమ్ గర్ల్ పై కోడ్ ఉల్లంఘన కేసు
నటి హేమామాలిని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆమె పై అధికారులు కేసును నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర లోకసభ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన నియోజకవర్గంలోని బేరా గ్రామంలో అల్కేశ్వర్ దేవాలయంలో ఏప్రిల్ 7 న ఎన్నికల ప్రచారం చేశారు. ఆమె గుడిలో ఒక ఎన్నికల సభను కూడా నిర్వహించారు. దేవాలయం అరుగునే వేదికగా ఉపయోగించుకుని ఆమె ప్రసంగించారు కూడా. ఇప్పటికే హేమామాలినిపై మూడు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అయితే హేమామాలిని రాజకీయ ప్రత్యర్థులు కూడా కోడ్ ను ఉల్లంఘించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అనుజ్ గార్గ్, బిఎస్ పి అభ్యర్థి యోగేశ్ ద్వివేది, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి మహారామ్ సింగ్ లపై కూడా కేసులు నమోదు చేశారు.