Gas shortage
-
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగమద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.బీర్ కొరత పొంచి ఉందా?వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్లో డిమాండ్కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.ఇన్వెంటరీయే రక్షణ కవచంప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
గ్యాస్ కొరత.. దూసుకుపోతున్న ధరలు
-
గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు
-
ఏపీలో గ్యాస్ కొరత... దాన్ని కూడా సంపద సృష్టిగా మార్చిన బాబు
-
ఫుడ్ బిల్లులో గ్యాస్ చార్జీలు చట్టవిరుద్ధం
న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరతను సాకుగా చూపించి హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులపై అధిక చార్జీలు విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులో ఎల్పీజీ రుసుము, గ్యాస్ సర్చార్జి, ఇతర చార్జీలు జోడిస్తున్నారు. అసలు బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వినయోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం నిర్దేశిత రుసుములు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అధిక చార్జీలపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు సీసీపీఏ వెల్లడించింది. మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చినట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై మెనూలో ప్రదర్శించిన రుసుములే ఫైనల్ అని పేర్కొంది. వాటిపై వర్తించే పన్నులు మినహా అదనంగా వసూలు చేయకూడదని హోటళ్లు, రెస్టారెంట్లను ఆదేశించింది. -
గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ నేతలు.. గన్పార్క్ దగ్గర భారీ నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని ప్రజలకు నమ్మబలుకుతోందని.. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని మండిపడ్డారు.‘‘కేంద్రం అధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ సైజ్ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్ను 10 కిలోలకు తగ్గిస్తారంట. సామాన్య ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఆంబోతు కొట్లాటలో లేగలు బలైనట్లు సామాన్యుల పరిస్థితి. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత చర్చనీయాంశంగా మారింది. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. గ్యాస్ కొరత పై ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రకటన చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
మళ్లీ కట్టెల పొయ్యి..!
భద్రాద్రి కొత్తగూడెం: గ్యాస్ కొరతతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గృహావసరాలకు గ్యాస్ కొరత లేదని అధికార యంత్రాంగం ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీకి కనీసం పదిరోజుల సమయం పడుతోంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న 45 రోజుల తర్వాతనే గ్యాస్ తిరిగి బుక్ చేసుకోవాలని నిబంధనలు విధించారు. ఈలోగా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి వెలిగించాలి్సందే. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లకు మరింత కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవటంతో కొన్ని హోటళ్లను మూసేశారు. కొందరు కట్టెల పొయ్యిలతో తంటాలు పడుతున్నారు.వేధిస్తున్న కొరతగ్యాస్ కొరతతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు అవసరాల కోసం గ్యాస్ను బుక్ చేసుకునేందుకు తొందరపడుతున్నారు. ఇదే అదనుగా కొందరు.. వినియోగదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. గ్యాస్ కొరత కారణంగా పల్లె ప్రజలు మళ్లీ కట్టెల కోసం వెతుకుతున్నారు. పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లి ఎండిన చెట్లు, కొమ్మలను వంట చేసుకునేందుకు తెచ్చుకుంటున్నారు. కొందరు కూలీలు కట్టెలు తీసుకువచ్చి గ్రామాలు, పట్టణాల్లో అమ్ముతున్నారు. గతంలో కట్టెల మోపు రూ.200 ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారు. ఎడ్లబండ్లతో కట్టెలు తీసుకువస్తే రూ.2,500 నుంచి రూ.3,000 తీసుకుంటున్నారు.భారంగా హోటళ్ల నిర్వహణప్రస్తుతం వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ భారంగా మారింది. టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లు గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. సిలిండర్లు దొరకక కొందరు హోటళ్లను బంద్ చేసుకుంటున్నారు. కొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎడ్లబండ్లు, సైకిళ్లపై కూలీలతో కట్టెలు తెప్పించుకుని వంట చేస్తున్నారు. పోడుసాగుతో అడవుల విస్తీర్ణం తగ్గిపోవటంతో కట్టెలకు కూడా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. కట్టెల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో రేటు బాగా పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో కట్టెలతో చేసిన వంటల ఖర్చు గ్యాస్తో చేసిన ఖర్చును మించిపోతుండటంతో ధరలూ పెంచేశారు. గతంలో ఉన్న ధరలకు అదనంగా 30 శాతం ధరలను పెంచి టిఫిన్లు, భోజనం విక్రయిస్తున్నారు. పట్టణాల్లో కర్రీ పాయింట్లు కూడా గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. కొన్ని కర్రీ పాయింట్లలో ధరలను రెట్టింపు చేశారు. టీ, కాఫీ సెంటర్లపై కూడా గ్యాస్ కొరత ప్రభావం చూపింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న టీని రూ.15 చేశారు. రూ.20 ఉన్న కాఫీని రూ.25 చేశారు. స్వీట్లు తయారు చేసే నిర్వాహకులు కూడా గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంటే తక్కువగా తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఖర్చులు పెరిగిపోవటంతో స్వీట్లు, తినుబండారాల రేట్లను పెంచుతున్నారు.ప్రత్యామ్నాయం ఏమిటో?గతంలో వరిపొట్టు, బొగ్గుతో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని హోటళ్లు నడిపేవారు. పొట్టు, బొగ్గు ధరలు బాగా పెరగటంతో అందరు గ్యాస్పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఆహార సంబంధిత వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత పెద్దగా ఏమీ లేదని, దానివల్ల ఇబ్బందులు ఏమీ లేవని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఈ కొరత ఎంతకాలముంటుందో, ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయాలను చూపుతుందో వేచిచూడాలి. -
గ్యాస్ తంటాలు.. విద్యుత్ మంటలు
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. సాగర నగరంలో ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుంటేం మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఇళ్లల్లో ‘విద్యుత్ మంటలు’ రేపుతున్నాయి. ఈ అసాధారణ పరిస్థితుల ప్రభావంతో నగరంలో విద్యుత్ వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ఓవైపు ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతుండగాం మరోవైపు యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌవ్ల వినియోగం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత పది రోజులుగా రోజువారీ వినియోగంలో సుమారు 16 శాతం అదనపు లోడు నమోదవుతోంది. మార్చిలోనే మండుతున్న ఎండలు నగరంలో ఎండల ప్రభావం మంటపుట్టిస్తోంది. నడివేసవి రాకముందే ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. గాలిలో ఉష్ణోగ్రతలు 32–34 డిగ్రీల లోపే నమోదవుతున్నా.. ఉక్కబోత మాత్రం 40 డిగ్రీల ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈసారి వేసవి మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజల్లో ఇప్పుడే గుబులు పుట్టిస్తున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ఈసారి మార్చి మొదటి వారం నుంచే డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. 16 మిలియన్ యూనిట్లు అదనం ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలలో ప్రతి రోజూ సగటున 78 నుంచి 81 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటుంది. అయితే భానుడి ప్రతాపంతో ఈ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా రోజువారీ సగటు విద్యుత్ వినియోగం కంటే 14 నుంచి 16 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదవుతోంది. ప్రతి రోజూ వినియోగం సెంచరీకి (100 మిలియన్ యూనిట్లు) చేరువలో ఉండటం గమనార్హం. ఈ నెల 7వ తేదీన 96.50 మిలియన్ యూనిట్లు, 12వ తేదీన 96.37 మిలియన్ యూనిట్లుగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘ఇండక్షన్’ వినియోగం పెరుగుదల విద్యుత్ వినియోగం పెరగడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు.. విదేశాల్లో జరుగుతున్న యుద్ధం కూడా పరోక్షంగా ఈపీడీసీఎల్పై భారం వేసింది. యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో అనిశి్చతి, పెరిగిన సిలిండర్ ధరల ప్రభావం నేరుగా సామాన్యుడి వంటగదిపై పడింది. చాలామంది వినియోగదారులు వంటగ్యాస్కు బదులుగా ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్లు, ఇమ్మెర్షన్ హీటర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గృహ వినియోగంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో వినియోగించే ఇండక్షన్ స్టౌవ్లు గ్రిడ్పై తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నాయి. అధికారుల కసరత్తు శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు జిల్లాలతో పోలిస్తే విశాఖ నగరంలో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా విశాఖలో ఈ సమయంలో 25 నుంచి 28 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండాలి.. కానీ ఈసారి అది 31 మిలియన్ యూనిట్లు దాటుతోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఏపీఈపీడీసీఎల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సాయంత్రం వేళల్లో (పీక్ అవర్స్) గరిష్ట డిమాండ్ 4800 మెగావాట్ల మార్కును దాటుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తలెత్తకుండా తనిఖీలు చేపట్టడంతో పాటు, నిరంతర సరఫరా కోసం గ్రిడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. విద్యుత్ పొదుపు పాటించాలి డిమాండ్ పెరుగుతున్నా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నిరంతరం సర్కిల్స్ వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులు కూడా అనవసరమైన విద్యుత్ వాడకాన్ని తగ్గించి సహకరించాలి. – పృథ్వితేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ -
హైబ్రీడ్ వంట..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత, దాని ధరల పెరుగుదల కారణంగా వంట విధానంలో పెనుమార్పు కనిపిస్తోంది. ఇంతకాలం గ్యాస్కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించిన ఇండక్షన్ స్టవ్లు ఇప్పుడు గ్యాస్తో సమానంగా వంటగదిలో స్థానం సంపాదిస్తున్నాయి. దీంతో ‘హైబ్రిడ్ వంట’ (గ్యాస్, ఇండక్షన్) అనే కొత్త ధోరణి వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం గృహాల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.2 వేలు దాటడంతో పాటు, సాధారణ సరఫరాకు 10 రోజులపైనే పడుతోంది. దీంతో ప్రజలు వంటకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్లుతున్నారు. ఫలితంగా వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరాల్లో పెరిగిన అమ్మకాలు..విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఇండక్షన్ స్టవ్ అమ్మకాలు 50 శాతం వరకు పెరిగాయని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు పట్టణాల్లో ప్రతి 10 ఇళ్లకుగాను కనీసం మూడు ఇళ్లల్లో ఇండక్షన్ స్టవ్ ఉందంటే ఆతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 15 శాతం ఇళ్లల్లో ఈ స్టవ్ల వినియోగం ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో వీటికి డిమాండ్ పెరగడంతో ఇప్పుడివి చాలాచోట్ల అందుబాటులో ఉండటంలేదు. ఈ–కామర్స్ సైట్లలోనూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రజలు ఎక్కడ ఇండక్షన్ స్టవ్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఇకపై చాలా ఇళ్లల్లో గ్యాస్తో పాటు సమానంగా ఇండక్షన్ స్టవ్ని కూడా ఉపయోగించడం (హైబ్రీడ్ వంట) సాధారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఖర్చు తక్కువే, కానీ..ఇండక్షన్ స్టవ్ సాధారణంగా 1.5 నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ వినియోగిస్తుంది. రోజుకు రెండు గంటలు వాడితే మూడు యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే.. నెలకు సుమారు 90 యూనిట్లు. ఈ లెక్కన రూ.500–600 వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే, ఇది గ్యాస్ ఖర్చుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. వంట కూడా త్వరగా అవుతుంది. పైగా గ్యాస్తో పోలిస్తే సురక్షితం.ఇబ్బందులూ ఉన్నాయి..అయితే, ఈ ఇండక్షన్ స్టవ్లవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. అవి..» కరెంట్ లేకపోతే పనిచేయదు..» ప్రత్యేక పాత్రలు అవసరం. వీటికోసం రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది..» గ్రామాల్లో వోల్టేజ్ సమస్యవల్ల ఇండక్షన్ స్టవ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది..» అదీగాక.. ఇవి చిన్న కుటుంబాలకు సరిపోవచ్చుగానీ పెద్ద కుటుంబాల్లో వీటితో కష్టం..» అయినా గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తోంది. మొత్తం మీద గ్యాస్ కొరతతో ప్రారంభమైన ఈ మార్పు ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారుతోంది. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. -
వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం
-
తిరుమలలో తీవ్రంగా గ్యాస్ కొరత
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో కూడా గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, టీ స్టాళ్లు గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో సుమారు 40 ఫాస్ట్ ఫుడ్హోటళ్లు, 30 టీస్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి, కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో భక్తులకు తగినంత ఆహారం దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాయి. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రంలో ఈ పరిస్థితి కొనసాగితే భక్తుల సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
వంట... వనరులు
‘గ్యాస్ మామ రావే...జాబిల్లి రావే’ అని పిల్లలు పాడుకుంటున్నారట! ఈ సరదా సరదా పాటల సంగతి ఎలా ఉన్నా, ఎల్పీజీ గ్యాస్ అనే మాట బాంబులా భయపెడుతూనే ఉంది. గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడల్లా... ‘అయ్యో!’ అనుకోవడం కాకుండా...కాస్త ముందు చూపుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏర్పాటు చేసుకుంటే సమస్యే ఉండదు కదా! ‘స్మార్ట్ ప్లానింగ్ ఉంటే శాశ్వత పరిష్కారం మన సొంతం’ అని నిరూపించింది ప్రభాత్ స్కూల్...మహారాష్ట్ర అకోలాలోని ‘ప్రభాత్ డే అండ్ బోర్డింగ్ స్కూల్’లో వ్యవసాయ వ్యర్థాలతో పనిచేసే ‘ఫ్లేమ్ లెస్ సిస్టమ్’ను ఉపయోగించి రోజుకు పదిహేను వందల మంది విద్యార్థులకు వంటవార్పు చేస్తున్నారు. స్మార్ట్ ప్లానింగ్ శాశ్వత పరిష్కారాలకు ఎలా ఉపయోగపడుతుందో ‘ప్రభాత్ స్కూల్’ నిరూపించింది.మంట లేకుండా వంటప్రభాత్ స్కూల్ కిచెన్లో ‘మంట లేకుండా వంట’ అనేది నిన్నా మొన్నటి కాన్సెప్ట్ కాదు. దశాబ్ద కాలం క్రితమే వచ్చిన దీర్ఘకాలిక ఆలోచన. సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం. ఆ దూరదృష్టి ఊరకే పోలేదు. ఎంతోమంది కి స్ఫూర్తి ఇస్తోంది.స్కూల్ వంటగదిలో సంప్రదాయ వంటగ్యాస్కు బదులు థర్మిక్ ఫ్లూయిడ్ హీటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తారు. సరళంగా చె΄్పాలంటే ఆయిల్ పైపుల ద్వారా వేడి సర్క్యులేట్ అవుతుంది.. మంట లేకుండా స్థిరమైన వేడి వంట పాత్రలకు చేరుతుంది. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారైన బయోమాస్– ఆధారిత ఇంధన గుళికలు(ఫ్యూయెల్ పిల్లెట్స్) ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. పెద్ద వంట గదిలోకి అడుగు పెట్టేవారికి గ్యాస్ స్టవ్ల నుండి వచ్చే వేడి ఎంత ఉంటుందో తెలుసు. ముఖ్యంగా వేసవిలో ఆ వేడి మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే ఈ మంట రహిత వంట గదిలో అధిక వేడితో ఇబ్బంది పడడం అనేది ఉండదు.బయోగ్యాస్ బాటలో...వంటగది వ్యర్థాలు... ఆవు పేడతో తయారయ్యే ఇంధన అద్భుతం... బయోగ్యాస్. తాజా ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో బయోగ్యాస్ మళ్లీ తెర మీదికి వచ్చింది. బయోగ్యాస్ అనేది మీథేన్, కార్బన్ డయాక్సైడ్ల మిశ్రమం. ఆక్సిజన్ లేని వాతావరణంలో సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్ను వంట కోసమే కాకుండా లైట్లు, జనరేటర్లకు కూడా ఉపయోగించవచ్చు. గృహ అవసరాలు, బడ్జెట్ను బట్టి తమకు అనుకూలమైన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించుకోవచ్చు. వాటిలో కొన్ని... 1. ఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: ఫిక్స్డ్ గ్యాస్ స్పేస్తో నిర్మించే అండర్గ్రౌండ్ చాంబర్. ∙మెయింటెనెన్స్కు తక్కువ శ్రమతో మెయింటెనెన్స్ ∙లీక్–ప్రూఫ్ కోసం నిపుణుల సలహాలు తీసుకోవాలి.2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: గ్యాస్ వాల్యూమ్తో కదిలే ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ ∙పర్యవేక్షించడం సులభం, తక్కువ శ్రమ.3. ఫ్లెక్సీ–బ్యాగ్/ ప్లాస్టిక్ డైజెస్టర్: పీవీసీ టార్పాలిన్తో తయారు చేస్తారు కాబట్టి కొత్తగా ప్రారంభించే వారికి, అద్దె ఇంటిలో నివసించేవారికి అనుకూలమైనది.లైఫ్ స్పాన్: 1. íఫిక్స్డ్ డోమ్ డైజెస్టర్: 15–20 సంవత్సరాలు 2. ఫ్లోటింగ్ డ్రమ్ డైజెస్టర్: 8–10 సంవత్సరాలు...‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉ పాయాలు’ అన్నట్లు వంటగ్యాస్ ఎంత భయపెడితే మాత్రం ఏం? దాని నుంచి బయటపడడానికి, పర్యావరణ అనుకూల ఇంధన వనరులను అన్వేషించడానికి బోలెడు ఉ పాయాలు. మీదే ఆలస్యం!ఆదా–ఆదాయం⇒ గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, సేంద్రియ వంటగది వ్యర్థాలు సులభంగా అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాలలో కూడా బయోగ్యాస్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తుంది⇒ బయోగ్యాస్ ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు, ఆదాయం పొందవచ్చు. బయోగ్యాస్ ప్లాంట్ నుండి వచ్చే ‘లిక్విడ్ స్లర్రీ’ సేంద్రియ ఎరువుగా పనికొస్తుంది.⇒ ప్రస్తుతం దేశీయ బయోగ్యాస్ మార్కెట్ 20 శాతానికి పైగా వార్షిక వృద్ధితో దూసుకుపోతోంది⇒ కేంద్రప్రభుత్వం జాతీయ జీవశక్తి కార్యక్రమం కింద గృహ బయోగ్యాస్ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందిస్తోంది. -
ఉగాది, రంజాన్ కు బిగ్ షాక్... నో గ్యాస్.. నో ఇండక్షన్..
-
గ్యాస్ కష్టాలకు చెక్.. భారత్ కు LPG గ్యాస్ నౌక
-
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను సవరిస్తున్నాయి. టిఫిన్¯ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్పై రూ.50 వరకు పెంచేశాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలుతుండడంతో పాటు కొందరు డీలర్లు కృత్రిమ కొరత సష్టిస్తున్నారు. దీంతో హోటల్ నిర్వహకులు ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.300–500 చెల్లించాల్సి వస్తోంది. కాగా, గ్యాస్ మాత్రమే కాక రవాణా చార్జీలు కూడా పెరగడంతో కిరాణం సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇది హోటల్ యజమానులకు భారంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేశారు. మూడు పూటలా భోజనమే వడ్డిస్తున్నారు. బావర్చి... పార్సిళ్లకే పరిమితం హైదరాబాద్ బిర్యానీ అంటే.. బావర్చి అనేంతగా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్పైనా సిలిండర్ కొరత ప్రభావం పడింది. నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టమేనని బావర్చి హోటల్ నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా ఉంది. క్రాస్ రోడ్స్లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా మూతపడింది. రైల్వేస్టేషన్లో పెరుగుతున్న రద్దీ సికింద్రాబాద్: ఎండలు ముదరడం.. గ్యాస్ కొరత వల్ల వీధి వ్యాపారాలు మూతపడటం.. కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగియడం, శుభముహూర్తాలకు అనువైన వాతావరణం ఉండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రెండు రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరతతో ఫుట్పాత్ వ్యాపారాలు ఇప్పటికే మూతపడ్డాయి. హాస్టళ్లు, హోటళ్లు కూడా మెను ఐటమ్స్ను తగ్గించి నేడోరేపో మూసివేసే స్థితికి చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కారి్మకులు సైతం సొంత ఊర్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వస్తున్నారు. జనరల్ ప్రయాణికులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
సిలిండర్ల కోసం ఉక్కిరిబిక్కిరి.. భయంతో బుకింగ్స్ చేస్తున్న జనం
-
గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు
తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ -
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
-
ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం
-
Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి
-
చిన్న చిట్కాలతో ప్రయోజనాలెన్నో!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ప్రభావం దేశీయంగా ఎల్పీజీ సరఫరాపై పడుతోంది. దాంతో పలు ప్రాంతాల్లో సిలిండర్ల కొరత తలెత్తుతోంది. ఈ తరుణంలో సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే గ్యాస్ పొదుపు ఒక్కటే మార్గమని కొందరు చెబుతున్నారు.వంట పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా 25 శాతం వరకు గ్యాస్ ఆదా చేయవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సూచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్న స్మార్ట్ చిట్కాలు కింద చూద్దాం.మంటను తగ్గించండి..చాలామంది నీళ్లు మరిగే వరకు లేదా వంట పూర్తయ్యే వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోనే ఉంచుతారు. కానీ, నీరు ఒకసారి మరిగిన తర్వాత వేడిని తగ్గించడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. దాంతో గ్యాస్ వృధా కాదు. ఇలా సిమ్లో వండటం వల్ల 25 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుందని ఇండియన్ ఆయిల్ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.ప్రెజర్ కుక్కర్..సాంప్రదాయ పాత్రలతో పోలిస్తే ప్రెజర్ కుక్కర్ వాడకం వల్ల చాలా సమయం, గ్యాస్ కలిసొస్తుంది. బియ్యంతో అన్నం వండేప్పుడు 20% ఆదా, పప్పు ధాన్యాలు.. 46% ఆదా, మాంసాహారం.. 41.5% ఆదా అవుతుంది.నానబెట్టడం మర్చిపోవద్దుపప్పులు, బియ్యం లేదా శనగలు వంటి గట్టి పదార్థాలను వండే ముందు కనీసం గంట సేపు నానబెట్టాలి. ఉదాహరణకు, శనగలను రాత్రిపూట నానబెట్టడం వల్ల వండేటప్పుడు 22 శాతం గ్యాస్ వినియోగం తగ్గుతుంది.మీ గ్యాస్ బర్నర్ మంట నీలి రంగులో ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే బర్నర్ రంధ్రాల్లో చెత్త లేదా కార్బన్ పేరుకుపోయిందని అర్థం. వెంటనే వాటిని శుభ్రం చేయాలి.పాత్రలను కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టకండి. ముందుగా పొడి గుడ్డతో పాత్రలు తుడిచి ఆ తర్వాతే స్టవ్ మీద పెట్టండి. ఆ నీటిని ఆవిరి చేయడానికి కూడా గ్యాస్ వృధా అవుతుందని గుర్తుంచుకోండి.చిన్న పాత్రలకు పెద్ద బర్నర్ వాడటం వల్ల వేడి పక్కల నుంచి వృధాగా పోతుంది. చిన్న బర్నర్లను ఉపయోగించడం వల్ల పెద్ద వాటితో పోలిస్తే 6% నుంచి 10% తక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.పొయ్యి వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం, మసాలాలు వెతుక్కోవడం వంటివి చేయకండి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగిస్తే అనవసరపు వేచి చూసే సమయం తగ్గుతుంది.అంతర్జాతీయ పరిణామాలు గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతున్న తరుణంలో బుకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ఇంటి బడ్జెట్ను కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు -
సిలిండర్ వెంటనే వస్తుంది... ఇలా సింపుల్గా బుక్ చేసుకోండి...
-
ఏపీలో పూర్తిగా మూతపడిన హోటల్స్
-
గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై హాస్టళ్ల నిర్వాహకులు వంటలు
-
ఏపీలో పొంచి ఉన్న వంట గ్యాస్ కొరత
సాక్షి, విజయవాడ: ఏపీలో వంట గ్యాస్ కొరత పొంచి ఉంది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. ఇక 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 1.61 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉండగా గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మంత్రుల కమిటీలో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులు ఉన్నారు. -
గ్యాస్ కొరత.. మూత పడుతున్న హోటళ్లు..
ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్ కొరత తీవ్రంగా పెరిగి హోటల్ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై (AHAR) హెచ్చరించింది.ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్ అసోసియేషన్ కోరింది.ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. -
గ్యాస్కు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్ఎన్పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
భాగ్యనగరంలో గ్యాస్ కొరత
హైదరాబాద్: అంతా అద్భుతం.. అన్నీ చాలా సజావుగా జరిగిపోతాయి అని ప్రచారం జరుగుతున్నా, మరోవైపు.. ఇటీవలి కాలంలో జనం మరచిపోయిన 'గ్యాస్ కొరత' నగరంలోని కొన్ని ప్రాంతాల వాసులకు మళ్లీ సమస్యగా మారుతోంది. వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో రాకపోవడం, ప్లాంటులోనే గ్యాస్ కొరత ఉన్నదని, తామేమీ చేయలేమని ఏజన్సీలు చెబుతుండడంతో.. వినియోగదారులు ఖంగు తింటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న మాదాపూర్ ప్రాంతంలోనే వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదు. సిలిండర్ బుక్ చేసి నెల రోజులైందని, ఎస్సెమ్మెస్ మాత్రం పది రోజుల కిందటే వచ్చేసిందని.. తీరా ఏజన్సీకి ఫోన్ చేస్తే ఇప్పట్లో రాదని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అయ్యప్ప సొసైటీ ప్రాంతానికి ప్రణీత్ గ్యాస్ ఏజన్సీ వారు హెచ్పీ సరఫరాదారులుగా ఉన్నారు. నెల రోజుల కిందట గ్యాస్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజి వచ్చిందని, డెలివరీకి వస్తున్నట్లు వారం కిందటే మెసేజి వచ్చిందని, తీరా ఏజన్సీకి ఫోను చేస్తే స్టాకు లేదని చెబుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. సిలిండర్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని ఏజన్సీ వారు అంటున్నారని, గ్యాస్ ప్లాంట్ లోనే ప్రాబ్లం ఉంది, వస్తే తప్ప పంపలేం.. వెయిట్ చేయాల్సిందే.. అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు. నెలకిందట బుక్ చేసి.. ఇళ్లలో ఉన్న రెండో సిలిండర్ కూడా అయిపోవడంతో నానా యాతన పడుతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. -
కరెంటు కష్టాలకు ఢిల్లీ పరిష్కారం!
గ్యాస్ పూలింగ్ విధానంపై కేంద్రం కసరత్తు అన్ని గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తికి కార్యాచరణ దేశీయ, విదేశీ గ్యాస్తో కొరత తీర్చే యోచన రూ. 5.50కే యూనిట్ విద్యుత్ దక్కే అవకాశం తెలంగాణకు తక్షణ ఉపశమనం హైదరాబాద్: విద్యుత్ కష్టాలతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఉపశమనం లభించేలా ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) కేంద్రంగా రూపొందుతున్న గ్యాస్ పూలింగ్ ధరల విధానంతో తక్కువ ధరకే విద్యుత్ లభించనుంది. గ్యాస్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రూ. 5.50కే యూనిట్ చొప్పున అందించేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం గ్యాస్ కొరతతో నిరుపయోగంగా ఉన్న విద్యుత్ ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం ప్లాంట్ లోడు ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో ఉత్పత్తిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా లభించే గ్యాసుకు తోడు విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని తక్కువ ధరకే విద్యుత్ను అందించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకయ్యే అదనపు భారాన్ని వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్-వ్యత్యాస నిధి)గా భరించాలని కూడా యోచిస్తోంది. ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు 23 నుంచి 28 మిలియన్ యూనిట్ల(ఎంయూ) మేర విద్యుత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీంతో విద్యుత్ కష్టాలు కొంత తీరుతాయన్న ఆశాభావం ఇంధన శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలా మొదలైంది.. దేశీయ, విదేశీ గ్యాస్ను రెండింటినీ కలిపి విద్యుత్ను ఉత్పత్తి చేసి తక్కువ ధరకే విద్యుత్ను అందించేందుకు ఉద్దేశించిందే గ్యాస్ పూలింగ్ విధానం. ఈ విధానంపై కేంద్ర విద్యుత్, ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో గత ఆగస్టు 19న పీఎంవో అంతర్గతంగా సమావేశమైంది. యూనిట్ విద్యుత్ను రూ. 5.50 కే అందించాలంటే ఏం చేయాలనే కార్యాచరణను తమకు సమర్పించాలని ఈ మూడు శాఖలను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఆ శాఖలు పీఎంవో ముందు తాజాగా ఓ నివేదికను ఉంచాయి. దీని ప్రతిని ‘సాక్షి’ సంపాదించింది. దీని ప్రకారం గ్యాసు పూలింగ్ విధానం అమలు చేసేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలను తీసుకోవాలని ఆ శాఖలు స్పష్టం చేశాయి. దేశంలోని గ్యాస్ ప్లాంట్లను 50 నుంచి 60 పీఎల్ఎఫ్తో నడిపితే తక్షణ విద్యుత్ కష్టాలు తీర్చవచ్చునని తెలిపాయి. దీనికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ సరఫరా సంస్థలు, ప్లాంట్ల యాజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించాయి. అంద రూ చేతులు కలిపితేనే..! గ్యాసు పూలింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అన్ని వర్గాలూ చేయూతనివ్వాల్సి ఉంటుంది. పీఎంవోకి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ► రాష్ట్ర ప్రభుత్వం సహజగ్యాస్పై ఎటువంటి వ్యాట్ వసూలు చేయరాదు. ప్రస్తుతం ఇది 14 శాతం వరకూ ఉంది. ► గ్యాస్ ప్లాంట్ల యాజమాన్యాలు కూడా తమ స్థిర చార్జీలను యూనిట్కు 85 పైసలకే పరిమితం చేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ చార్జీలు రూపాయి నుంచి రూ. 1.10 వరకూ ఉన్నాయి. ► ప్రజలు కూడా గ్రీన్ఎనర్జీ సెస్ కింద కొంత చెల్లించాల్సి ఉంటుంది. ► రిలయన్స్ సంస్థ గ్యాస్ సరఫరా చార్జీలను సుమారు 20 శాతం మేర తగ్గించుకోవాలి. ► కేంద్రం వీజీఎఫ్ కింద 2015-16లో సుమారు రూ. 3027 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ మన ప్లాంట్ల పరిస్థితి! కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ రోజురోజుకీ తగ్గించడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కష్టాలు వచ్చిపడ్డాయి. వాస్తవానికి రిలయన్స్ షెడ్యూల్ మేరకు 2015 నాటికి రోజుకు 120 ఎంఎంఎస్సీఎం (మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల) గ్యాస్ ఉత్పత్తి కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం కేవలం రోజుకు 30 ఎంఎంఎస్సీఎంలే ఉత్పత్తవుతోంది. ఫలితంగా ఏకంగా 2233 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. అదేవిధంగా నిర్మాణం పూర్తయి, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 4061 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు ప్లాంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో పాత విద్యుత్ ప్లాంట్లు ఆరు మాత్రమే(1285 మెగావాట్లు) నడుస్తున్నాయి. ఇవి కూడా కేవలం సగటున 32 శాతం ప్లాంటు లోడు ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో మాత్రమే నడుస్తున్నాయి. ఈ గ్యాసు ప్లాంట్లతో తెలంగాణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ పూలింగ్ విధానం అమల్లోకి వస్తే 7579 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లలో కనీసం 50 నుంచి 60 శాతం పీఎల్ఎఫ్తో 3,789 మెగావాట్ల నుంచి 4,547 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఇందులో తెలంగాణకు సగం విద్యుత్ అందినా ప్రస్తుత కొరత తీరిపోతుంది. ఇక దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ప్లాంట్ల సామర్థ్యం 24,149 మెగావాట్లు. ఈ ప్లాంట్లకు రోజుకు 41.7 ఎంఎంఎస్సీఎం గ్యాస్ అవసరం కాగా కేవలం 18.8 ఎంఎంఎస్సీఎం గ్యాస్ మాత్రమే సరఫరా అవుతోంది. గ్యాస్ దిగుమతి చేసుకుని వీటిని కనీసం 50 శాతం పీఎల్ఎఫ్తో నడిపితే అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీరుతాయని కేంద్రం భావిస్తోంది.


