Gautam Gambhir
-
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్స్టార్లో వీక్షించవచ్చు.గంభీర్తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆ ఇద్దరి విషయంలో అగార్కర్తో గంభీర్ గొడవ.. ఆఖరికి!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టు విషయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)- హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) మధ్య విభేదాలు తలెత్తాయా? ఇద్దరు ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చే అంశమై ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదా? అదే వాగ్యుద్దానికి దారి తీసిందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది.కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నమెంట్ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియాను అక్కడికి పంపడం లేదు. యశస్వి జైస్వాల్పై వేటుఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం తటస్థ వేదికైన దుబాయ్లో భారత్ తమ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు జనవరి 18న తమ ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 11న ఫైనల్ టీమ్ను ఖరారు చేసింది. తొలుత ఈ జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై వేటు వేసిన యాజమాన్యం.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది. మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదనఅదే విధంగా వెన్నునొప్పి కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కాగా.. హర్షిత్ రాణాను జట్టులో చేర్చింది. అయితే, వికెట్ కీపర్ విషయంలో మాత్రం గంభీర్- అగార్కర్ మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... సీనియర్ అయిన కేఎల్ రాహుల్కు మొదటి ప్రాధాన్యం దక్కాలని గంభీర్ వాదించగా.. అగార్కర్ మాత్రం రిషభ్ పంత్కు పెద్దపీట వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆఖరికి గంభీర్ తన మాటను నెగ్గించుకున్నట్లు ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ ద్వారా నిరూపితమైనట్లు తెలుస్తోంది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల్లోనూ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా బరిలోకి దిగగా.. పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా ఈ సిరీస్ను 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన తర్వాత గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మా నంబర్ వన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పగలను.రిషభ పంత్కు కూడా అవకాశాలు వస్తాయి. అయితే, కేఎల్ రాహుల్ రికార్డు బాగుంది. అందుకే అతడి వైపు మొగ్గుచూపాం. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లను ఒకేసారి ఆడించలేము కదా!’’ అని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలోనూఇక కేఎల్ రాహుల్తో పాటు శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ గంభీర్.. అగార్కర్తో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన ఈ ముంబై బ్యాటర్ను తప్పక ఎంపిక చేయాలని గౌతీ పట్టుబట్టగా.. అగార్కర్ మాత్రం అతడి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఇంగ్లండ్తో తొలి వన్డే తర్వాత శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి కూడా! తాను తొలుత తుదిజట్టులో లేనని.. విరాట్ కోహ్లి మోకాలి నొప్పి కారణంగానే తనకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కిందని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.ఏది ఏమైనా ఇంగ్లండ్తో వన్డేలో సిరీస్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వన్డేల్లో వరుసగా 59, 44, 78 పరుగులు సాధించాడు. ఇక జట్టుకూర్పులో తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న గంభీర్.. అగార్కర్తో విభేదించినప్పటికీ ఘన విజయం సాధించడం జట్టుకు సానుకూలాంశంగా మారింది.అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసం అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి ప్రమోట్ చేసి.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ ఆటగాడిగా పంపడం బెడిసికొట్టింది. దీంతో మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో పంపగా.. 29 బంతుల్లోనే 40 పరుగులతో దంచికొట్టాడు.చదవండి: చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!? -
దుబాయ్కు పయనమైన టీమిండియా.. రోహిత్, కోహ్లి, గంభీర్లతో పాటు..
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫీవర్ మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్లో పాల్గొనేందుకు టీమిండియా దుబాయ్కు పయనమైంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో పాటు రోహిత్ సేన శనివారం ముంబై నుంచి బయల్దేరింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో టీమిండియా సభ్యులు కనిపించడంతో అభిమానులు వారి ఫొటోలు తీసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా 2017లో చివరిసారిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. నాడు ఫైనల్ చేరుకున్న భారత జట్టు అనూహ్య రీతిలో దాయాది పాకిస్తాన్ చేతి(India vs Pakistan)లో ఓటమిపాలై.. టైటిల్ను చేజార్చుకుంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చింది.తటస్థ వేదికపైపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ మొదలుకానుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లడం లేదు. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి తప్పక రావాలని పట్టుబట్టగా...బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జోక్యంతో తటస్థ వేదికపై టీమిండియా మ్యాచ్లు ఆడేందుకు మార్గం సుగమమైంది.ఈ నేపథ్యంలో ఐసీసీ నిర్ణయం మేరకు రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడనుంది. ఇందుకోసం జనవరి 18న ప్రాథమిక జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇటీవలే రెండు మార్పులతో తమ జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే పదిహేను మంది సభ్యుల వివరాలు మంగళవారం వెల్లడించింది.రెండు మార్పులుయువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను తప్పించి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన యాజమాన్యం.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది. ఇక ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.అనంతరం దాయాది పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న తలపడనున్న రోహిత్ సేన.. లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్ను మార్చి 2న ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో స్వదేశంలో సిరీస్ ద్వారా ఈ వన్డే టోర్నీకి టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది.మరో సానుకూలాంశంసొంతగడ్డపై ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్కు.. కెప్టెన్ రోహిత్ శర్మ(సెంచరీ), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(అర్ధ శతకం) ఫామ్లోకి రావడం మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే క్రమంలో రోహిత్ సేన శనివారమే దుబాయ్కు పయనమైంది. రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ తదితరులు ఎయిర్పోర్టులో తళుక్కుమన్నారు.వీరితో పాటు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ సహా సహాయక సిబ్బంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయల్దేరారు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ #WATCH | Mumbai: The first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy.All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC Champions Trophy will begin on February 19 and will… pic.twitter.com/C4VdRPddyn— ANI (@ANI) February 15, 2025#WATCH | Mumbai: Cricketer Hardik Pandya arrives at the airport as the first batch of the Indian Cricket team departs for Dubai to participate in the ICC Champions Trophy. All matches of Team India will be held in Dubai, while the rest will take place in Pakistan. The ICC… pic.twitter.com/CmIjdDrRtW— ANI (@ANI) February 15, 2025 -
తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీరుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విషయంలో గౌతీ అనుసరిస్తున్న వ్యూహాలు సరికావని విమర్శించాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)ను ప్రమోట్ చేయడం బాగానే ఉన్నా.. అందుకోసం కేఎల్ రాహుల్(KL Rahul)ను బలి చేయడం సరికాదని హితవు పలికాడు.వరుసగా రెండింట గెలిచి.. సిరీస్ సొంతంకాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డేలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలో ఇప్పటికే రెండు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది రోహిత్ సేన. అయితే, ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్ను కాదని సీనియర్ కేఎల్ రాహుల్కు పెద్దపీట వేసిన యాజమాన్యం.. బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం అతడిని డిమోట్ చేసింది.అతడికి ప్రమోషన్.. రాహుల్కు అన్యాయం?స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఐదో స్థానంలో ఆడిస్తూ.. కేఎల్ రాహుల్ను ఆరో నంబర్ బ్యాటర్గా పంపింది. ఈ క్రమంలో నాగ్పూర్, కటక్ వన్డేల్లో అక్షర్ వరుసగా 52, 41 నాటౌట్ పరుగులు చేయగా... రాహుల్ మాత్రం విఫలమయ్యాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో పది పరుగులకే పరిమితమయ్యాడు.ఇది చాలా దురదృష్టకరంఈ పరిణామాలపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అయితే, కేఎల్ రాహుల్ పరిస్థితి చూసి నాకు బాధ కలుగుతోంది.ఇది చాలా దురదృష్టకరం. అక్షర్ పటేల్ 30, 40 పరుగులు చేస్తున్నాడు. మంచిదే.. కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయం. ఐదో స్థానంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం.ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదుకాబట్టి.. హేయ్.. గంభీర్ నువ్వు చేస్తున్నది తప్పు. పరిస్థితులకు అనుగుణంగా అక్షర్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు పంపవచ్చు. కానీ ఎల్లప్పుడూ ఇదే వ్యూహం పనికిరాదు. ఇలాంటి వాటి వల్ల దీర్ఘకాలం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకూ తెలుసు. కీలకమైన మ్యాచ్లో ఇలాంటి వ్యూహాలు బెడిసికొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రిషభ్ పంత్ విషయంలోనూ ఇలాగే చేస్తారా?అక్షర్ పటేల్తో నాకు ఎలాంటి సమస్యా లేదు. అతడికి ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అందుకోసం రాహుల్ను ఆరో నంబర్లో ఆడిస్తారా? అలాగే చేయాలని అనుకుంటే రిషభ్ పంత్ను కూడా ఆరోస్థానంలోనే పంపండి. రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? వరల్డ్క్లాస్ ప్లేయర్గా పేరొందిన అద్భుతమైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్ విధానాన్ని ఎండగట్టాడు. చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన -
టీ20లు సరే.. గంభీర్కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
‘ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు’
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు. పరుగుల సునామీకాగా ఇంగ్లండ్తో నామమాత్రపు ఐదో టీ20(India vs England)లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. పదిహేడు బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి.. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏకంగా పదమూడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో అభిషేక్ పరుగుల వరద పారిస్తుంటే వాంఖడేలో నేరుగా ఈ అద్బుతాన్ని వీక్షించిన ప్రేక్షకులతో పాటు.. టీవీలు, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేమికులూ ఆనందంతో మురిసిపోయారు.ప్రశంసల వర్షంఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయాడు. ‘అభిషేక్ నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కొత్త తరం ఆటగాళ్లు భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తాం.ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదుఇంగ్లండ్ బౌలర్లు 140–150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అభిషేక్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీనికంటే గొప్ప టీ20 శతకాన్ని చూడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తే అంత సవ్యంగా సాగుతుంది. పరాజయాలు ఎదురైనప్పుడే జట్టుపై విమర్శలు వస్తాయి. అలాంటి కష్ట కాలాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం.వన్డేల్లోనూ ఇదే దూకుడుఈ జట్టు చాలా కాలంగా కలిసి ఆడుతోంది. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎలా ఉంటుందో మా ఆటగాళ్లకు తెలుసు. వన్డేల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తాం’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్లో భాగంగా కోల్కతా, చెన్నై మ్యాచ్లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్కోట్లో జరిగిన మూడో టీ20లో ఓటమిపాలైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్లో విజయం సాధించి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది.247 పరుగులు ఈ క్రమంలో వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై భారత జట్టు నీళ్లు చల్లింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. అభిషేక్ శర్మ సునామీ శతకం కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో.. తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది.ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్(23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించినా.. మిగతా వాళ్లలో జాకొబ్ బెతల్(10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. రవి బిష్ణోయి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్ను 4-1తో ముగించింది. తదుపరి ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
గంభీర్ వ్యూహం అదే.. ఇకపై కూడా మార్పు ఉండదు: అసిస్టెంట్ కోచ్
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై వచ్చిన విమర్శలపై అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే(Ryan Ten Doeschate) స్పందించాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) వ్యూహాలకు అనుగుణంగానే తమ ప్రణాళికలు ఉంటాయని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా.. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఇక ముందు కూడా ప్రయోగాలు కొనసాగిస్తామని పేర్కొన్నాడు.కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(India vs England)తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ మొదలుకాగా.. ఇరుజట్ల మధ్య ఇప్పటికే మూడు మ్యాచ్లు జరిగాయి.బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూకోల్కతా, చెన్నైలలో వరుస విజయాలు సాధించిన.. రాజ్కోట్లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం పరాజయం పాలైంది. తద్వారా ఇంగ్లండ్పై సూర్య సేన ఆధిక్యం 2-1కు తగ్గింది. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు.స్పెషలిస్టు బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో ఆడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతడిని కాదని.. కేవలం లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసమని ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్- అక్షర్ పటేల్లను ముందుగా బ్యాటింగ్కు పంపడాన్ని తప్పుబట్టారు. ఇక ఈ మ్యాచ్లో జురెల్ రెండు పరుగులకే పరిమితం కాగా.. వాషింగ్టన్ సుందర్ 6, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు.మిగతా వాళ్లు కూడా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ విధించిన 172 పరుగుల టార్గెట్ను పూర్తి చేసే క్రమంలో 145 పరుగుల వద్ద నిలిచి.. 26 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వచ్చాయి. మా వ్యూహాల్లో భాగమే..ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందిస్తూ.. ‘‘ధ్రువ్ జురెల్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు ఎందుకు పంపించారని మీరు వాదించవచ్చు. అయితే, కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ముఖ్యంగా టీ20 క్రికెట్లో గౌతం గంభీర్ బ్లూప్రింట్ ఎలా ఉందో ఓ సారి గమనిస్తే విషయం మీకే అర్థమవుతుంది.ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండేలా అతడు సెట్ చేస్తాడు. ఇక ధ్రువ్ ఎనిమిదో స్థానంలో వచ్చినపుడు అతడి అత్యుత్తమ ప్రదర్శన చూస్తామని నేను అనుకోలేదు. ఏదేమైనా అతడిని అలా లోయర్ ఆర్డర్లో పంపించడం మా వ్యూహాల్లో భాగమే.వీలైనన్ని అవకాశాలు ఇస్తాంఫలితం ఎలా ఉన్నా... మా ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాం. సుదీర్ఘకాలంలో జట్టు ప్రయోజనాల దృష్ట్యా వారికి వీలైనన్ని అవకాశాలు ఇస్తాం. తప్పక తమను తాము నిరూపించుకుని. తమ విలువేంటో చాటుకుంటారు’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నాలుగో టీ20 జరుగనుంది. పుణె ఇందుకు వేదిక. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్లను తప్పించి..వారి స్థానంలో శివం దూబే, అర్ష్దీప్ సింగ్లను ఆడించాలని సూచించాడు. చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్కు భారీ షాక్! విధ్వంసకర వీరుడు దూరం -
షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్తో సమస్యా?
సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని సమాచారం. పూర్తి ఫిట్గా ఉన్నా ఇంగ్లండ్తో మూడో టీ20లో(India vs England 3rd T20I)నూ అతడిని ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.కాగా దశాబ్ద కాలంగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్గా షమీకి పేరుంది. అయితే, వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా గాయపడ్డ ఈ బెంగాల్ పేసర్ కోలుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టింది. చీలమండ గాయం వేధిస్తున్నా.. వరల్డ్కప్ టోర్నీని పూర్తయ్యేదాకా పంటిబిగువన నొప్పిని భరించిన షమీ.. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.శస్త్ర చికిత్స తర్వాతతద్వారా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బెంగాల్ తరఫున దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగాడు. నిలకడగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసిన షమీ... ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు.ఈ క్రమంలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20తో అతడు రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. తుదిజట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా స్పిన్నర్లకు పెద్దపీట వేసిన క్రమంలో అతడికి మొండిచేయి ఎదురైంది.పూర్తి ఫిట్గా ఉన్నాడుఅదే విధంగా.. చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ షమీని ఆడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్కోట్లో జరిగే మ్యాచ్లోనూ అతడిని మేనేజ్మెంట్ పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ స్పందించాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘కోల్కతాలో జరిగిన తొలి టీ20కి ముందే షమీ నన్ను తన దగ్గరకు పిలిపించాడు.అంతా బాగానే ఉందని.. తాను పూర్తి ఫిట్గా ఉన్నట్లు చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. కాబట్టి షమీ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.గంభీర్తో సమస్యా?అయితే, ఇంగ్లండ్తో ఆఖరి రెండు టీ20లలో మాత్రం అతడిని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా.. వన్డే సిరీస్లోనూ షమీకి అవకాశం ఇస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మేరకు మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా యాజమాన్యం నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. కోచ్ గౌతం గంభీర్, షమీ మధ్య సమన్వయ, సమాచార లోపం లేదనే అనుకుంటున్నా’’ అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సూర్యకుమార్ సేన.. రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కింది. తద్వారా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రాజ్కోట్లో మంగళవారం ఇంగ్లండ్తో మూడో టీ20లో తలపడనుంది.చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
Ind vs Eng: షమీని తప్పించడానికి కారణం అతడే?
ఇంగ్లండ్తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్లో సిరీస్లో శుభారంభం చేసింది. అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్దీప్ సింగ్తో రంగంలోకి దిగింది.షమీ ఎందుకు ఆడలేదు? కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది. మరి ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ ఓపెనర్లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.ఫిట్గా లేడేమో?కాగా షమీ చివరిసారి 2023 నవంబర్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది. అర్ష్దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్లైన్ పేసర్ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.పరిస్థితులకు అనుగుణంగానేఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.గంభీర్ నిర్ణయమేనా?ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి. ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి. -
CT 2025: గంభీర్కు అతడంటే ఇష్టం.. తుదిజట్టులో చోటు పక్కా: అశ్విన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఆడే భారత తుదిజట్టులో వాషింగ్టన్ సుందర్కు తప్పక స్థానం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను లోయర్ ఆర్డర్లో కాకుండా.. టాప్-5లో బ్యాటింగ్కు పంపించాలని అశూ మేనేజ్మెంట్కు సూచించాడు.పాకిస్తాన్- యూఏఈ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20 నుంచి తమ వేట మొదలుపెట్టనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్ ఆడుతుంది. ఆ నలుగురుఆ తర్వాత న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ఇక టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో స్పిన్ విభాగంలో ముగ్గురు ఆల్రౌండర్లు, ఒక స్పెషలిస్టు బౌలర్కు చోటు దక్కింది. ఆ నాలుగు ఎవరంటే.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్.. కుల్దీప్ యాదవ్.వీరిలో కుల్దీప్ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా ఎడమచేతి వాటం బౌలర్లే. అయితే, ఇందులో రైటార్మ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఒక్కడే. అందునా అతడు ఆఫ్ స్పిన్నర్. ఈ ప్రత్యేకతే అతడికి చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో చోటు దక్కేలా చేస్తుందని స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.అంతేకాదు.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు వాషీ అంటే ఎంతో ఇష్టమని.. అది కూడా అతడికి ప్లస్ పాయింట్గా మారుతుందని అశూ పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో రైట్- లెఫ్ట్ కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.కానీ మనకు ఎక్కువ మంది ఆఫ్ స్పిన్నర్లు లేరు. లెఫ్టార్మ్ స్పిన్నర్లే ఎక్కువ ఉన్నారు. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు రెండు కారణాలున్నాయి.. నాకు తెలిసినంత వరకు గంభీర్కు అతడంటే చాలా ఇష్టం.అతడి ఆటతీరును దగ్గరగా గమనించడంతో పాటు.. కచ్చితంగా అండగా నిలబడతాడు. ఇక వాషీ ఆఫ్ స్పిన్నర్ కావడం కూడా కలిసి వస్తుంది. అయితే, అతడు ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్ చేస్తే మాత్రం జట్టు సమతూకంగా ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో అతడిని ముందుకు పంపాలి.టాప్ 5లో ఉంటేసమర్థవంతంగా బౌలింగ్ చేయడంతో పాటు నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడే ఆల్రౌండర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. అదీ ఆఫ్ స్పిన్నర్ టాప్ 5లో ఉంటే ఇంకా బాగుంటుంది’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా అశ్విన్ మాదిరే వాషీ కూడా తమిళనాడుకు చెందినవాడే. ఈ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడిన భారత జట్టులో అశూ- వాషీ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, పెర్త్ టెస్టులో అనుభవజ్ఞుడైన అశూను కాదని.. మేనేజ్మెంట్ వాషీని ఆడించింది. అందుకు తగ్గట్లుగానే అతడు రాణించాడు కూడా!అశూ ఆకస్మిక రిటైర్మెంట్అయితే, ఆ తర్వాత మరో రెండు టెస్టుల్లోనూ అశూకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా అయిన తర్వాత అతడు సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మేనేజ్మెంట్ తీరు నచ్చకే అశూ రిటైర్మెంట్ ప్రకటించాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంభీర్కు వాషీ ఆట అంటే ఇష్టమంటూ అశూ చేసిన వ్యాఖ్యలు సందేహాలకు తావిస్తున్నాయి.కాగా రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వాషింగ్టన్ సుందర్.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 22 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 468, 315, 161 పరుగులు చేయడంతో పాటు.. 25, 23, 47 వికెట్లు తీశాడు.చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’ -
‘గంభీర్కు ఏం అవసరం?.. ఎవరి పని వాళ్లు చేస్తేనే బాగుంటుంది’
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్కోచ్కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.గంభీర్ సూచనల మేరకు!కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది. హెడ్కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది. ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.పది సూత్రాలు ఇవేదేశవాళీ మ్యాచ్లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది. వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.ఇక మ్యాచ్లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది. అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయిఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.ఎవరి పని వారు చూసుకుంటే మంచిదిఅయినా.. హెడ్కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది. అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
అతడి కెరీర్ను నాశనం చేస్తారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన సందర్భంగా భారత్ డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగింది. భారత్ జట్టు సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం సహజమే.అదీ భారత్ జట్టు వరసగా పరాజయం పాలవడం, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు పేలవమైన ఫామ్తో విఫలం కావడం, చివరి మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలు బయటికి పొక్కడానికి.. ఒక యువ క్రికెటర్ కారణమని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. స్వయంగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ.. నిజంగా గంభీర్ ఈ విషయాన్నీ బీసీసీఐకి తెలియజేసాడా అంటే.. దీని గురించి బీసీసీఐ అధికారులు ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. మరి భారత డ్రెస్సింగ్ రూమ్ నుండి ఇలాంటి లీకులకు భాద్యులు ఎవరు? ఈ విషయాన్నీ బీసీసీఐ స్పష్టం చేయాలి. గంభీర్ పేలవమైన రికార్డుగౌతమ్ గంభీర్ను భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమించిన తర్వాత నుంచి భారత్ జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తోంది. గత జూలైలో శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు రావడానికి ముందు గంభీర్ను హెడ్కోచ్గా నియమించారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ 3-0 విజయంతో గంభీర్ కోచ్గా తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఆ తరువాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 0-2తో భారత్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ తరువాత బంగ్లాదేశ్పై 2-0 టెస్ట్ సిరీస్ విజయంతో జట్టు కొద్దిగా పుంజుకున్నట్టు కనిపించినా న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ను 0-3 తో కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో 3-1 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్కు ముందు గంభీర్ సీనియర్ ఆటగాళ్లను మందలించాడని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు భారత్ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కొత్త వివాదాన్ని రేకెత్తించాడు. ఈ లీకులు భారత్ జట్టు నుంచి మాత్రమే కాక భారత్ బోర్డు నుంచి కూడా వస్తున్నాయని చోప్రా ఎత్తి చూపడమే కాక ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించాడు. అతడి కెరీర్ నాశనం చేస్తారా? లీకులకు బాధ్యులు ఎవరు?తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన వీడియోలో, ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. లీకుల ఆధారంగా వచ్చే కథనాలు ఒక ఆటగాడి కెరీర్కు హాని కలిగిస్తాయని పేర్కొన్నాడు. యువ ఆటగాడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసే లీక్ అయిన వాదనలను వ్యాప్తి చేయకుండా ఉండాలని అతను బీసీసీఐని, క్రికెట్ అభిమానుల్ని కోరాడు."ఇలాంటి లీకులు ఒక యువ ఆటగాడి క్రికెట్ కెరీర్ ను ప్రమాదంలో పడేశాయి. ఈ లీకులు వాస్తవమే అని మరో లీకు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఇది ఆ అతగాడి కెరీర్ కు ఎంత ప్రమాదమో ఆలోచించారా" అని ప్రశ్నించాడు. బుమ్రా మంచి పనిచేశాడుఅదే వీడియోలో జస్ప్రీత్ బుమ్రా కు సంబంధించిన మరో సంఘటనని చోప్రా ఉదహరించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ చివర్లో, మళ్ళీ రెండవ ఇన్నింగ్స్లో బుమ్రా వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు.అయితే బుమ్రా తనకు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు సలహా ఇచ్చారని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు సరికాదని బుమ్రా స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఖండించాడని చోప్రా ఎత్తి చూపాడు. బుమ్రా ఈ ట్వీట్ చేయని పక్షంలో దాన్ని నిజమని నమ్మేవారు. ఇలాంటి వార్తలను జట్టుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఖండించాలి అని చోప్రా సూచించాడు.బీసీసీఐ జాగ్రత్త పడాలిఅయితే భారత్ జట్టు బ్యాటింగ్ కోచ్ గా సీతాన్షు కోటక్ నియమించబోతున్నారని కూడా వార్త బీసీసీఐ అధికారిక ప్రకటనకు ముందే మీడియా లో రావడాన్ని ఇక్కడ ఉదహరించాడు. మీడియాకు ఈ వార్త తెలియకముందే బీసీసీఐ ముందస్తుగా వ్యవహరించి వారి నియామకాలను ముందుగానే ప్రకటించాలని చోప్రా సూచించాడు. "భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా సీతాన్షు కోటక్ నియమిస్తున్నారనేది పెద్ద వార్త. ఈ విషయాన్నీ బీసీసీఐ అధికారికంగా ప్రకటించవచ్చు కదా. మీరు ముందస్తుగా చెప్పడం ప్రారంభిస్తే.. లీకులకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుంది’’ అని చోప్రా సూచించాడు. మరి బోర్డు అధికారులు ఈ విషయాన్ని గ్రహిస్తారో లేదో చూడాలి.చదవండి: ఫామ్లో ఉన్నా కరుణ్ నాయర్ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే -
కోచ్లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్ను రోల్ చేయడం సహా కోచ్లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్ను రోల్ చేయడం, కోచ్ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్తో కలిసి జోరావర్కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
ఇలాంటి కెప్టెన్ను చూడలేదు: రోహిత్పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్గా విఫలం కావడంతో పాటు కెప్టెన్గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
BCCI: అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!.. వారి మ్యాచ్ ఫీజులలో కోత?!
టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆటగాళ్ల పట్ల కఠిన వైఖరి అవలంబించనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఇచ్చిన నివేదిక మేరకు కఠినమైన నిబంధనలు తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు సమాచారం.ముఖ్యంగా ఆటలో భాగంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడం, టూర్ ఆసాంతం వారిని అట్టిపెట్టుకుని ఉండటం ఇకపై కుదరదని తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న భారత జట్టు.. వన్డే, టెస్టుల్లో మాత్రం ఇటీవలి కాలంలో ఘోర పరాభవాలు చవిచూసింది.ఘోర ఓటములుశ్రీలంక పర్యటనలో భాగంగా గతేడాది వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. అనంతరం.. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్లోనూ 3-1తో ఓటమిపాలైంది. తద్వారా పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో ఇంటాబయట టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ టూర్ తర్వాత బీసీసీఐ హెడ్కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.క్రమశిక్షణ లేదు.. అసంతృప్తి వెళ్లగక్కిన గంభీర్!ఈ రివ్యూ మీటింగ్లో చర్చకు వచ్చిన అంశాల గురించి బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం.. ‘‘సమీక్షా సమావేశం(BCCI Review Meeting)లో గౌతం గంభీర్ ప్రధానంగా.. ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం గురించి ప్రస్తావించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ సమయంలో డ్రెసింగ్రూమ్లో అసలు సానుకూల వాతావరణం కనిపించలేదు. అందుకే.. ప్రి-కోవిడ్ నిబంధనలను తిరిగి తీసుకురానున్నారు. ఇకపై విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు.. వారితో కేవలం రెండు వారాలు మాత్రమే గడిపే వీలుంటుంది. 45 రోజుల పాటు టూర్ సాగినా వారు రెండు వారాల్లోనే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఈ విషయంలో ఆటగాళ్లతో పాటు కోచ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.వారి మ్యాచ్ ఫీజులలో కోత?ఇక ఓ సీనియర్ ఆటగాడు కూడా గంభీర్, అగార్కర్తో కలిసి రివ్యూ మీటింగ్లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఫీజులను వెంటనే ఆటగాళ్లకు పంచేయకూడదని అతడు ఓ సలహా ఇచ్చాడు. ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును చెల్లించాలని సూచించాడు.కొంతమంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు.. జాతీయ జట్టు విధుల పట్ల కూడా నిబద్ధత కనబరచడం లేదన్న విషయాన్ని తాను గమనించినట్లు తెలిపాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు.. ప్రధాన బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా విఫలమయ్యాడు. వీరిద్దరి వరుస వైఫల్యాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో రోహిత్ తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు ముంబై తరఫున రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కోహ్లి మాత్రం రంజీల్లో ఆడే విషయమై ఇంత వరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై తరఫున, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్ ఆడేందుకు సమాయత్తమవుతున్నారు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు. తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్ దీప్(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్- మనోజ్ తివారి కలిసి ఆడారు. గతంలో దేశవాళీ క్రికెట్లోనూ ఢిల్లీ తరఫున గంభీర్- బెంగాల్ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్కోచ్గా ఎంపికైన గౌతం గంభీర్కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.గంభీర్ హయాంలో చేదు అనుభవాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో మనోజ్ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్ తివారిని తప్పుబడుతూ.. గంభీర్కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.హర్షిత్ రాణాను ఎందుకు ఆడించారు?ఈ విషయాలపై మనోజ్ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని నితీశ్, హర్షిత్లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.ఎందుకంటే పెర్త్ టెస్టులో ఆకాశ్ దీప్ను కాదని హర్షిత్ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.ఒక ఫాస్ట్ బౌలర్గా తనకు సహకరించే పిచ్లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్ కోసం ఆకాశ్పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్ ఫస్ట్క్లాస్ క్రికెట్ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్ దీప్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్ జరిగినపుడు గౌతం గంభీర్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.అతడిని తొక్కేయాలని చూశారుహర్షిత్ కంటే ఆకాశ్ దీప్ బెటర్ అని మేనేజ్మెంట్ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది. పాపం ఆకాశ్ దీప్ తన సెలక్షన్ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్కోచ్ వ్యాఖ్యలు వైరల్ -
‘గంభీర్ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్ నాదే అంటాడు.. కానీ’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్లోకి తీసుకున్నాడుఅసలు గంభీర్ నాయకత్వంలోని కోచింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్ తివారి విమర్శించాడు. కాగా రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్ స్టాఫ్లో చేర్చుకున్నాడు.ఘోర వైఫల్యాలుఅయితే, గంభీర్ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ 3-0తో వైట్వాష్కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మనోజ్ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ అభిషేక్ నాయర్.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్ను ముందుకు నెట్టేలా ప్లాన్ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్ కోచ్ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?వారి వల్ల ఏం ఉపయోగం?ప్రధాన కోచ్ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్ కోచ్ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్ నాయర్ కోల్కతా నైట్ రైడర్స్కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్తో కలిసి పనిచేశారు. గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్ హాయిగా తనదైన కంఫర్ట్జోన్లో ఉన్నాడు’’ అని న్యూస్18 బంగ్లా చానెల్తో పేర్కొన్నాడు.సమన్వయం లేదుఅదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మతో గంభీర్కు సమన్వయం లోపించిందన్న మనోజ్ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్ ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్. మరోవైపు.. గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా, మెంటార్గా టైటిల్స్ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు.క్రెడిట్ అంతా తనకే అంటాడుకాగా ఐపీఎల్-2024లో గంభీర్ మెంటార్గా వ్యవహరించిన కోల్కతా నైట్ రైడర్స్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్కోచ్గా పదవిని ఇచ్చింది. ఈ విషయం గురించి మనోజ్ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్కతాకు టైటిల్ అందించలేదు. జాక్వెస్ కలిస్, సునిల్ నరైన్.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం? -
గంభీర్, రోహిత్తో అగార్కర్ భేటీ!.. గుర్రుగా ఉన్న యాజమాన్యం!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) గురించే చర్చ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత ఈమేర ఘోర పరాభవం ఎదుర్కోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ జట్టు లోని అగ్రశ్రేణి క్రికెటర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా విఫలమవడం అందుకు ప్రధాన కారణం. ఈ సిరీస్ ముగించి భారత్ కి తిరిగిరాక ముందే జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. భారత్ క్యాంప్లో విభేదాలు ఉన్నాయని, జట్టు ఓటమికి ఇదే ముఖ్య కారణమని విమర్శలు వచ్చాయి. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ టీం మేనేజిమెంట్ జట్టు కూర్పులో సరైన నిర్ణయాలు తీసుకోలేదనేది ఈ విమర్శల సారాంశం.గుర్రుగా ఉన్న అగార్కర్!ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా జట్టు వైఫల్యాన్ని సమీక్షించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను కలవడానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు, బోర్డులోని ప్రధాన అధికారుల మధ్య అనేక అధికారిక, అనధికారిక సమావేశాలు జరుగుతాయని.. భారత్ టెస్ట్ క్యాలెండర్, జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన గురించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గంభీర్ బాధ్యత ఎంత?భారత్ జట్టు వైఫల్యానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు ఒక కారణమని, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భారత్ జట్టు పతనం ప్రారంభమైందని భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టు టి 20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ద్రావిడ్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు. 'గత ఆరు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ T20 ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. అయితే గంభీర్ పదవిని చేప్పట్టినుంచే భారత్ జట్టు పతనం ప్రారంభమైంది," అని భజ్జీ వ్యాఖ్యానించాడు.'ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి'జాతీయ సెలెక్టర్లు ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ కోరుతున్నాడు. “మీరు పేరు ప్రతిష్టల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఇతర మ్యాచ్ విన్నర్లను జట్టులో చేర్చుకోండి. బీసీసీఐ, సెలక్టర్లు సూపర్ స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలి' అని భజ్జీ హితవు పలికాడు. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందనేది భజ్జీ వాదన.సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. "అభిమన్యు ఈశ్వరన్ను ఆస్ట్రేలియా టూర్కు తీసుకెళ్లారు, కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా సరైనా రీతిలో రాణిస్తున్నాడో లేదో తెలుస్తుంది. సర్ఫరాజ్ విషయంలోనూ అదే తప్పిదం జరిగిందని," హర్భజన్ పేర్కొన్నాడు.ఇక ఇంగ్లండ్ పర్యటన(టెస్టులు)కు ఏడు నెలల వ్యవధి ఉన్నందున భారత్ జట్టు పునర్నిర్మాణానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా" అని హర్భజన్ ముగించాడు.చదవండి: ‘బుమ్రాను అస్సలు కెప్టెన్ చేయకండి.. కెప్టెన్సీకి వాళ్లే బెటర్ ఆప్షన్’ -
BCCI: గంభీర్పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..!
దశాబ్ద కాలం తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా ముందు తలవంచింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని కంగారూ జట్టుకు సమర్పించుకుంది. ఆసీస్ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ ఓడిపోయి ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. అంతేకాదు.. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాన్నీ చేజార్చుకుంది.భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియాకు ఎదురైన మూడో ఘోర పరాభవం ఇది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలగగా.. గంభీర్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా కోచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు.మాయని మచ్చలుగతంలో ఏ స్థాయిలోనూ కోచ్గా పనిచేయని గంభీర్కు శిక్షకుడిగా తొలి ప్రయత్నం(టీ20 సిరీస్)లో విజయం వరించినా.. వన్డే సిరీస్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక చేతిలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వన్డే సిరీస్లో భారత్ ఓడిపోయింది. అనంతరం సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మునుపెన్నడూ లేని పరాభవం చవిచూసింది. స్వదేశంలో ప్రత్యర్థితో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన భారత జట్టుగా గంభీర్ మార్గదర్శనంలోని రోహిత్ సేన నిలిచింది.అనంతరం.. ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశాజనక ఫలితమే వచ్చింది. తద్వారా కోచ్గా గంభీర్ కెరీర్లో ఆరంభంలోనే ఈ మూడు మాయని మచ్చలుగా నిలిచిపోయాయి. ఆటగాళ్ల వైఫల్యం.. ముఖ్యంగా బ్యాటర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఈ మూడు సిరీస్లలో టీమిండియా ఓటమిపాలైనా.. కోచ్గా గౌతీ కూడా విమర్శలు ఎదుర్కోకతప్పదు.గంభీర్పై వేటు వేయాలంటూ డిమాండ్లు!ఈ నేపథ్యంలో ఇప్పటికే గంభీర్ కోచ్ పదవికి సరిపోడని.. జట్టును సరైన దిశలో నడిపించే సామర్థ్యం అతడికి లేదంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. రవిశాస్త్రి, ద్రవిడ్ హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. గంభీర్ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.రోహిత్- కోహ్లిల సంగతేంటి?ఇక గౌతం గంభీర్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ఆటగాళ్లు, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీలేదు. తొలుత కివీస్తో టెస్టుల్లో.. అనంతరం ఆసీస్ గడ్డపై ఈ ఇద్దరూ విఫలం కావడం వల్లే ఇంతటి చేదు అనుభవాలు ఎదురయ్యాయనడంలో సందేహం లేదు. తమ ఆట తీరుతో యువకులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన విరాహిత్ ద్వయం.. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకున్న తీరు అభిమానులకు సైతం కోపం తెప్పించింది.ఈ నేపథ్యంలో గంభీర్తో పాటు.. రోహిత్, కోహ్లిలపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కఠిన చర్యలకు సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర అవమానం నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్, కోహ్లి భవిష్యత్తుపై మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు.. గంభీర్తో పాటు అతడి సహాయ సిబ్బంది అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డష్కటేలకు కూడా ఇప్పటికే గట్టిగానే చివాట్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాల గురించి బీసీసీఐ వర్గాలు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. IANSతో మాట్లాడుతూ.. ‘‘అవును.. రివ్యూ మీటింగ్ కచ్చితంగా ఉంటుంది.గంభీర్ కోచ్గా కొనసాగుతాడు.. ఇక రోహిత్, కోహ్లిఅయినా.. ఒక సిరీస్లో బ్యాటర్లు వైఫల్యం చెందిన కారణంగా కోచ్పై వేటు వేస్తారా?.. అలా జరగనే జరుగదు. గౌతం గంభీరే ఇక ముందు కూడా కోచ్గా కొనసాగుతాడు. అదే విధంగా విరాట్, రోహిత్ ఇంగ్లండ్తో సిరీస్లో ఆడతారు. ప్రస్తుతం టీమిండియా దృష్టి చాంపియన్స్ ట్రోఫీపైనే కేంద్రీకృతమై ఉంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీమిండియా జనవరి 22 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుపెట్టనుంది. తొలుత ఇరుజట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్.. అనంతరం మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ ఐసీసీ టోర్నీ జరుగనుంది.ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇక దాయాది పాకిస్తాన్ను ఫిబ్రవరి 23న ఢీకొట్టనుంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడనుంది.చదవండి: బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. కోహ్లి చాలా మంచోడు.. అతడితో ఎందుకు గొడవపడ్డానంటే.. -
పరిస్థితి గంభీరం!
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్స్వీప్... ఇన్నింగ్స్లో 46కే ఆలౌట్... ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి. ఒక్క బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ విజయం మినహా హెడ్ కోచ్గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే. అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్... గతంలో జట్టుకు కోచ్గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగంభారత జట్టుకు హెడ్ కోచ్గా ఎంపిక కాకముందు గంభీర్ ఏ స్థాయిలో కూడా కోచ్గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత మూడు ఐపీఎల్ సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ టీమ్లకు మెంటార్గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్గా వ్యవహరించినప్పుడు కోల్కతా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు. ప్రాక్టీస్ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్ చూపించలేదు. ఒక టి20క్లబ్ టీమ్కు మెంటార్గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు. అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది. ఆ ముగ్గురు ఏం పని చేశారో?నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్గా పని చేయలేదనే విషయం గంభీర్కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా), అభిషేక్ నాయర్ (భారత్), టెన్ డస్కటే (నెదర్లాండ్స్) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్కు అవకాశం ఇచ్చింది. అయితే ఆటగాడిగా మోర్కెల్కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్ సిరీస్లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్ మొదలు ఆడే షాట్ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు. దిగితే కానీ లోతు తెలీదు... కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్ వ్యాఖ్యానించాడు. అయితే శాస్త్రి కోచ్గా ఉన్నప్పుడే భారత్ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు. ‘అడిలైడ్ 36 ఆలౌట్’ తర్వాత టీమ్ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్ స్పీచ్’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.కోచ్గా ఎంత వరకు! గంభీర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్కు అలవాటుగా మారింది. కోచ్గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా. 140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది. అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్ 2027 వరల్డ్కప్ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్తో జరగబోయే సిరీస్ను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీ కోచ్గా గంభీర్కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ -
ఆసీస్తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్కోచ్గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్స్టార్ ఆటిట్యూడ్ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్మన్ గిల్పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు
టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఘాటు విమర్శలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరులు అనిపించుకుంటే సరిపోదని.. టెస్టుల్లో కూడా సత్తా చాటితేనే విలువ ఉంటుందని పేర్కొన్నాడు. తదుపరి పాకిస్తాన్ మీద వన్డే మ్యాచ్ గెలిచేసి.. ఆహా ఓహో అని పొగిడించుకునేందుకు భారత క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని.. అయితే, అంతకంటే ముందు టెస్టుల్లో ఎలా మెరుగుపడాలో ఆలోచించాలంటూ కైఫ్ చురకలు అంటించాడు.అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ ట్రోఫీకాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2019-21 సీజన్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అనంతరం.. 2021-23 సీజన్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలో తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ముచ్చటగా మూడోసారీ ఫైనల్ చేరి.. ఈసారి కచ్చితంగా డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధిస్తుందని అభిమానులు భావించగా.. రోహిత్ సేన తీవ్రంగా నిరాశపరిచింది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురై.. అనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లోనూ 3-1తో ఓడిపోయింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.చాంపియన్లమని అంతా పొగుడుతారుఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ఫిబ్రవరి 23న.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ను ఓడించడం ద్వారా టీమిండియా ప్రశంసలు అందుకుంటుంది.అపుడు.. మనం వైట్బాల్ క్రికెట్లో చాంపియన్లమని అంతా పొగుడుతారు. అయితే, భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ గెలవాలంటే మాత్రం మనకొక పటిష్టమైన టెస్టు జట్టు అవసరం ఉంది. సీమింగ్ ట్రాకులపై ఎలా ఆడాలో మనవాళ్లు నేర్చుకోవాలి.చేదుగా ఉన్నా ఇదే నిజంమనం కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే వీరులం అనిపించుకుంటున్నాం. చేదుగా ఉన్నా ఇదే నిజం. కానీ.. మనం టెస్టుల్లో బాగా వెనుకబడి ఉన్నాం. ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ గెలవాలనుకుంటే మాత్రం ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలి.టర్నింగ్ ట్రాకుల(స్పిన్ పిచ్)పై సత్తా చాటడంతో పాటు.. సీమింగ్ ట్రాకులపై కూడా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే.. డబ్ల్యూటీసీ టైటిల్ గురించి మర్చిపోవాల్సిందే’’ అని కైఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గంభీర్ తప్పేమీ లేదుఅదే విధంగా.. కివీస్, కంగారూ జట్ల చేతిలో ఘోర పరాభవాలకు కేవలం హెడ్కోచ్ గౌతం గంభీర్ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని కైఫ్ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి... మనకొక మేలుకొలుపు లాంటిది. ఇప్పటి నుంచి టెస్టు క్రికెట్పై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి. ఈ ఓటములకు గౌతం గంభీర్ ఒక్కడే బాధ్యుడు కాడు. ఆటగాళ్లంతా రంజీల్లో ఆడాలి. కానీ అలా చేయకుండా.. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండా.. నేరుగా బరిలోకి దిగుతామంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’’ అంటూ కైఫ్ ఆటగాళ్లపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. అనంతరం .. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్కు ఛాన్స్!Khari khari baat.. Kadwa sach#TestCricket #BGT #AUSvIND#CricketWithKaif11 pic.twitter.com/WXFJY9aLSq— Mohammad Kaif (@MohammadKaif) January 5, 2025 -
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: టీమిండియా దిగ్గజం
టెస్టు క్రికెట్లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.పేలవ ప్రదర్శన.. ఇక ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు. ఎవరికీ మినహాయింపు వద్దు‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలిరంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్తో పాటు న్యూజిలాండ్పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు. ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్ల సమయంలోనే ఇంగ్లండ్తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.గంభీర్దీ అదే మాటవరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది. జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్కు ఛాన్స్! -
గౌతమ్ గంభీర్పై వేటు..?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తొమ్మిదేళ్ల ఆధిపత్యానికి తెర పడింది. బీజీటీ 2024-25ని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (జనవరి 5) ముగిసిన చివరి టెస్ట్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి టెస్ట్ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యింది. భారత్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై కాలేకపోయింది.డబ్ల్యూటీసీ ఓటమి నేపథ్యంలో పలువురు సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడపై కత్తి వేలాడుతుంది. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ను తక్షణమే తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గంభీర్ ఓ చెత్త కోచ్ అని భారత క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గంభీర్ వచ్చి టీమిండియాను నాశనం చేశాడని వారంటున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన గంభీర్.. చెత్త వ్యూహాలతో టీమిండియాను భ్రష్ఠుపట్టించాడని అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుస వైఫల్యాలకు గంభీరే పరోక్ష కారణమని మండిపడుతున్నారు.కాగా, గంభీర్ రాక ముందు టీమిండియా ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉండింది. రాహుల్ ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ 2024 టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచింది. ఆ వెంటనే గంభీర్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. గంభీర్ హెడ్ కోచ్గా టీమిండియా తొలి సిరీస్లో గెలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి గంభీర్ వైఫల్యాలకు బీజం పడింది. గంభీర్ ఆథ్వర్యంలో భారత్ రెండో సిరీస్నే కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.ఆతర్వాత భారత్ బంగ్లాదేశ్పై టెస్ట్, టీ20 సిరీస్ల్లో విజయాలు సాధించింది. అనంతరం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఇంత చిత్తుగా ఓడటం భారత్కు ఇదే మొదటిసారి. కివీస్ చేతిలో ఘోర పరాభవాన్ని మరిచిపోయేలోపే భారత్ బీజీటీలో బొక్కబోర్లా పడింది. బీజీటీలో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్ను డ్రాగా ముగించుకుని మిగిలిన మూడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, సిడ్నీ టెస్ట్లో భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు.నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది. రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్స్టర్ 39 పరుగులు చేశారు. -
BGT: చాలానే చేశారు.. ఇక చాలు.. మండిపడ్డ గంభీర్!
టీమిండియా ఆటగాళ్ల తీరుపట్ల హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమైనందుకు అందరికీ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా చేశారని.. ఇకముందైనా జాగ్రత్తగా ఉండాలని గౌతీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.కాగా గంభీర్ ప్రధాన కోచ్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వన్డే, టీ20లలో బాగానే రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవాలు ఎదుర్కొంటోంది. గౌతీ మార్గదర్శనంలో స్వదేశంలో బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేయడం మినహా ఇంత వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది.దారుణ వైఫల్యాలుసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో వైట్వాష్ కావడం.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) చేజార్చుకునే స్థితికి చేరడం విమర్శలకు దారి తీసింది. ఆసీస్తో తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం దారుణమైన ప్రదర్శనతో ఓటములు చవిచూస్తోంది.స్టార్ బ్యాటర్ల వైఫల్యంముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి స్టార్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్లో ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టులు పూర్తి కాగా భారత జట్టుపై కంగారూలు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆఖరిదైన ఐదో టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.అదే విధంగా.. ఐదు టెస్టుల సిరీస్ను కూడా టీమిండియా 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. లేదంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఇంతదాకా తీసుకువచ్చిన టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్లపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.చాలా ఎక్కువే చేశారుఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత జట్టు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న గంభీర్.. డ్రెసింగ్రూమ్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘కోచ్గా నాకు కావాల్సినంత దక్కింది.. చాలా ఎక్కువే చేశారు’’ అంటూ అతడు మండిపడినట్లు తెలిపాయి. కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెర్త్లో జరిగిన తొలి టెస్టు తర్వాత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడాన్ని ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గంభీర్తో రోహిత్కు సమన్వయం కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో జనవరి 3న ఐదో టెస్టు మొదలుకానుంది. ఇందులో గనుక విఫలమైతే రోహిత్ కెప్టెన్సీతో పాటు.. టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?
టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. గత తొమ్మిది టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కేవలం మూడే విజయాలు సాధించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్తో సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత చేదు అనుభవాలు చవిచూసింది.స్వదేశంలో ఘోర పరాభవంస్వదేశంలోనే న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 0-3తో వైట్వాష్కు గురైంది. తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై తొలిసారి ఇంతటి ఘోర పరాభవం చవిచూసిన జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ పరాభవాన్ని మరిపించేలా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో రాణించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది.ఆసీస్లో శుభారంభం చేసినా..ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా పెర్త్లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఆసీస్ను ఎదుర్కొన్న టీమిండియా.. 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తిరిగి ఫామ్లోకి వచ్చిందనే సంకేతాలు ఇచ్చింది. కానీ.. రోహిత్ శర్మ జట్టుతో చేరిన తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.వరుస ఓటములతోఆసీస్తో అడిలైడ్ టెస్టులో ఓడిన టీమిండియా.. బ్రిస్బేన్లో వర్షం వల్ల మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది. అయితే, మెల్బోర్న్ టెస్టులో మాత్రం చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుని.. 184 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలని.. గంభీర్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలగాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణం కూడా హీటెక్కినట్లు సమాచారం. రోహిత్, గంభీర్పై చర్యలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపక్రమించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.అతడి కోసం పట్టుబట్టిన గంభీర్..ఆసీస్ పర్యటనకు టీమిండియా వెటరన్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను ఎంపిక చేయాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. అయితే, సెలక్టర్లు మాత్రం అతడి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పెర్త్ టెస్టు తర్వాత అయినా.. పుజారాను పిలిపిస్తే బాగుంటుందని గంభీర్ సూచించినా.. మేనేజ్మెంట్ మాత్రం అతడి మాటను పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది.ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్రకాగా పుజారాకు ఆసీస్ గడ్డపై ఘనమైన చరిత్ర ఉంది. 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్లో పుజారా 1258 బంతులు ఎదుర్కొని.. 521 పరుగులు చేశాడు. తద్వారా భారత్ తరఫున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచి.. టీమిండియా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020-21 సీజన్లోనూ రాణించాడు. ఇక ఓవరాల్గా కంగారూ గడ్డపై పుజారా పదకొండు మ్యాచ్లు ఆడి 47.28 సగటుతో 993 పరుగులు చేశాడు.ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆఖరిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పుజారా.. 14, 27 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల ఈ సౌరాష్ట్ర బ్యాటర్ ఆ తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీల్లో, దేశీ రంజీల్లో రాణిస్తున్నాడు. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు?ఈ నేపథ్యంలోనే పుజారా గురించి గంభీర్ ప్రస్తావించగా.. సెలక్టర్లు మాత్రం అతడి పేరును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి గౌతీ మాట చెల్లడం లేదని.. త్వరలోనే అతడిపై వేటు తప్పదనే వదంతులు వ్యాపిస్తున్నాయి.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
ఎందుకీ మౌనం సారూ.. తప్పు గంభీర్ దేనా ?
-
Kohli- Gambhir: మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ సైతం..
గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్ నైట్ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్ను ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) విఫలమైనా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్.. విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.రాహుల్, జడేజా విలువైన అర్ధ శతకాలుఇక కేఎల్ రాహుల్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగే సమయానికి భారత్ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఆకాశ్ దీప్ బ్యాట్తో అదరగొట్టాడు.గట్టెక్కించిన పేసర్లుమరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.మ్యాచ్ గెలిచినంత సంబరంహెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్ను చీర్ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్కు సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్), ఆకాశ్ దీప్27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడం ఆఖర్లో హైలైట్గా నిలిచింది.గబ్బాలో కనీసం డ్రా కోసంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.ఈ క్రమంలో బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బౌలింగ్ చేయగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం Moment hai bhai, moment hai ft. #ViratKohli! 😂#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/3s0EOlDacC— Star Sports (@StarSportsIndia) December 17, 2024Read the lips of Gambhir and Kohli, follow-on bach gaya bc 😂 pic.twitter.com/ibIRSQTwEK— Prayag (@theprayagtiwari) December 17, 2024THE MOMENT AKASH DEEP & BUMRAH SAVED FOLLOW ON..!!!! 🇮🇳- The celebrations and Happiness of Virat Kohli, Rohit Sharma & Gautam Gambhir was priceless. ❤️ pic.twitter.com/i0w0zRyNPa— Tanuj Singh (@ImTanujSingh) December 17, 2024 -
‘గంభీర్తో రోహిత్కు విభేదాలు?.. ద్రవిడ్తో చక్కగా ఉండేవాడు.. కానీ’
ఆస్ట్రేలియా పర్యటనలో శుభారంభం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించలేకపోతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్లో మాత్రం ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక మూడో టెస్టులోనూ రోహిత్ సేన పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.బ్రిస్బేన్లో శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టీమిండియా పీకల్లోతు కష్టాలో కూరుకుపోయింది. గబ్బా మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్కు ఆసీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక బ్యాటింగ్లోనూ టీమిండియా తేలిపోతోంది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 51 పరుగులు చేసింది. వర్షం గనుక అడ్డుపడకపోయి ఉంటే.. పరిస్థితి ఇంకాస్త దిగజారేదే! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గంభీర్తో రోహిత్కు విభేదాలు?టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అవగాహన లేదని బసిత్ అన్నాడు. వీరిద్దరి భిన్నాభిప్రాయాల కారణంగానే భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన రోహిత్కు.. గౌతీతో అంతటి కో ఆర్డినేషన్ ఉన్నట్లు కనిపించడం లేదన్నాడు.‘‘రోహిత్ శర్మ, గౌతం గంభీర్ ఆలోచనలు ఒకే విధంగా లేవని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్లో.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టుల్లో భారత్ పరాభవం ఎదుర్కొంది. బంగ్లాదేశ్ వంటి పసికూనపై మాత్రం గెలవగలిగింది.ద్రవిడ్తో చక్కగా ఉండేవాడుఇక ఆస్ట్రేలియాలో రెండో టెస్టులో ఓడిన భారత్.. మూడో టెస్టులోనూ ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ కూడా రోహిత్- గౌతీ మధ్య ఏకాభిప్రాయం లేదని తుదిజట్టును ఎంపికను చూస్తే అర్థమైపోతుంది. ఎందుకో ద్రవిడ్ మాదిరి గౌతీతో రోహిత్ ఇమడలేకపోతున్నాడని అనిపిస్తోంది.వారిని ఎందుకు తీసుకోలేదు?బ్రిస్బేన్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎందుకు చేసినట్లు? ఇక ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురి దాకా లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. అయినా.. మీరెందుకు వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్ను తీసుకోలేదు? క్రికెట్ గురించి జ్ఞానం ఉన్నవాళ్లకు ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఆస్ట్రేలియాలో టీమిండియా ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. జట్టులో ఒక్కరు కూడా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ లేరు. అదే టీమిండియాకు ఉన్న అతిపెద్ద బలహీనత. ఈ మ్యాచ్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా, ట్రవిస్ హెడ్ వర్సెస్ టీమిండియా అన్నట్లుగా అనిపించింది’’ అంటూ బసిత్ అలీ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ -
ఆసీస్తో రెండో టెస్ట్కు ముందు స్వదేశానికి పయనమైన టీమిండియా హెడ్ కోచ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 104 పరుగులకే (తొలి ఇన్నింగ్స్లో) కుప్పకూలింది.46 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 238 పరుగులకు ఆలౌట్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ ఓటమి ఖరారైనా ట్రవిస్ హెడ్ (89), మిచెల్ మార్ష్ (47) కొద్దిసేపు పోరాడారు.తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.స్వదేశానికి గంభీర్తొలి టెస్ట్లో ఘన విజయం అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల చేత గంభీర్ భారత్కు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అతను బీసీసీఐ వద్ద అనుమతులు కూడా తీసుకున్నట్లు సమాచారం. గంభీర్.. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ సమయానికి తిరిగి జట్టుతో చేరతాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ మధ్యలో భారత్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కాన్బెర్రా వేదికగా నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఈ మ్యాచ్కు గంభీర్ అందుబాటులో ఉండడు. అడిలైడ్లో జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ కావడంతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో వార్మప్ మ్యాచ్ను కూడా పింక్ బాల్తోనే నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో హిట్మ్యాన్ తొలి టెస్ట్కు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియాకు విందుభారత క్రికెట్ జట్టు బుధవారం రోజున కాన్బెర్రాకు బయల్దేరనుంది. ఆ రోజు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వచ్చినందుకు గానూ భారత ఆటగాళ్లకు ఇది వెల్కమ్ పార్టీ. -
Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కు ఇదే లాస్ట్ సిరీస్ అవుతుందా?
-
‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’: అతడి మాటలే నితీశ్ రెడ్డికి స్ఫూర్తి
టీమిండియా యువ సంచలనం, ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు అరంగేట్రం కల శుక్రవారం(నవంబరు 22) నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డ మీద పెర్త్ వేదికగా ఈ 21 ఏళ్ల విశాఖ కుర్రాడు.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకున్నాడు. దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడుఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కంగారూ గడ్డపై మ్యాచ్కు ముందు కాస్త ఒత్తిడిలో ఉన్న సమయంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యాఖ్యలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని తెలిపాడు. ‘దేశం కోసం బుల్లెట్ తీసుకునేందుకు సిద్ధపడు’ అంటూ గంభీర్ తనతో చెప్పినట్లు నితీశ్ పేర్కొన్నాడు. కాగా పేస్కు సహకరిస్తున్న పెర్త్ పిచ్పై సీనియర్ ఆటగాళ్లే విఫలమైన చోట నితీశ్ రెడ్డి బ్యాట్తో విజృంభించడం విశేషం. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ వంటి పేసర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి సత్తా చాటాడు. 41 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు.మ్యాచ్ అనంతరం నితీశ్ మాట్లాడుతూ... ‘పెర్త్ గురించి చాలా విన్నా. దీంతో మ్యాచ్కు ముందు కాస్త ఆందోళన చెందాను. బౌన్సర్లను ఎదుర్కోవడం కష్టం అనిపించినా... ఆ సమయంలో కోచ్ గంభీర్ నెట్స్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నా.అదొక గొప్ప అనుభూతి‘ప్రత్యర్థి బౌలర్లు బౌన్సర్లు సంధిస్తే... అది దేశం కోసం బుల్లెట్ అనుకో’ అని కోచ్ చెప్పారు. మ్యాచ్ ఆరంభానికి ఒకరోజు ముందే అరంగేట్రం చేయనున్నట్లు తెలిసింది. విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకోవడం గొప్ప అనుభూతి. చిన్నప్పటి నుంచి కోహ్లి ఆట చూస్తూ పెరిగా... అలాంటిది ఇప్పుడు విరాట్ భాయ్తో కలిసి ఆడే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది.భారత్ ‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడటం ఎంతో ఉపకరించింది. ఇక్కడి పిచ్లపై ఒక అవగాహన ఏర్పడింది. భారత్తో పోల్చుకుంటే పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. అందుకే అతడిని టార్గెట్ చేశాపిచ్ నుంచి స్పిన్నర్లకు పెద్దగా సహకారం లేకపోవడంతో లియాన్ను లక్ష్యంగా చేసుకొని వేగంగా పరుగులు రాబట్టా. పంత్తో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంది. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయని ముందే అనుకున్నాం. బుమ్రా, సిరాజ్, హర్షిత్ అదే చేసి చూపెట్టారు. ప్రస్తుతానికి వికెట్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది’ అని నితీశ్ వివరించాడు. పేస్ ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్కు తొలి రోజు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా బోర్డర్- గావస్కర్ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడనుంది.చదవండి: IND vs AUS: బ్రో అక్కడ ఉన్నది డీఎస్పీ.. లబుషేన్కు ఇచ్చిపడేసిన సిరాజ్! వీడియో -
గౌతమ్ గంభీర్కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
గౌతమ్ గంభీర్కు ఇదే లాస్ట్ మ్యాచ్ అవుతుందా?
-
వంద శాతం ఫిట్గా ఉన్నా.. మేనేజ్మెంట్ నుంచి పిలుపు రాలేదు: టీమిండియా స్టార్
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతవరకు తనకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపురాలేదని.. కానీ.. త్వరలోనే తాను జాతీయ జట్టు తరఫున పునగామనం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శార్దూల్ ఠాకూర్కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే.నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశంఈ ముంబై ఆటగాడికి బదులు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో సీనియర్ అయిన శార్దూల్ను కాదని.. టెస్టు అరంగేట్రం చేయని నితీశ్ను సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. తాము గతాన్ని మరిచి సరికొత్తగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ముంబై తరఫున రంజీ బరిలోఇదిలా ఉంటే..కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న శార్దూల్ ఠాకూర్ ఇటీవలే మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరిలోకి దిగాడు. తాజాగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా సర్వీసెస్తో మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సర్వీసెస్పై ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.వంద శాతం ఫిట్నెస్ సాధించానుఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన శార్దూల్ ఠాకూర్ టీమిండియా రీ ఎంట్రీ గురించి స్పందించాడు. ‘‘రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఆరంభ మ్యాచ్లలో కాస్త ఆందోళనకు గురయ్యా. సర్జరీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం వెంటాడింది. అయితే, క్రమక్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు వంద శాతం ఫిట్నెస్ సాధించాను.బౌలింగ్లో నేను రాణించిన తీరు ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగు మ్యాచ్లను గమనిస్తే బౌలింగ్ బాగానే ఉంది. కొన్నిసార్లు క్యాచ్లు మిస్ చేశాను. అయితే, ఐదు మ్యాచ్లలో కలిపి దాదాపు 20 వికెట్ల దాకా తీశాను. నా ఫిట్నెస్, బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.ఇప్పటి వరకు పిలుపు రాలేదుటీమిండియా మేనేజ్మెంట్ నుంచి నాకైతే ఇప్పటి వరకు పిలుపు రాలేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడబోతోంది. కాబట్టి నాకు అవకాశం వస్తుందనే భావిస్తున్నా. ఇప్పుడైతే ఫిట్నెస్పై మరింత దృష్టి సారించి.. బౌలింగ్లో రాణించడమే నా ధ్యేయం’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్)జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)యశస్వి జైస్వాల్అభిమన్యు ఈశ్వరన్శుభ్మన్ గిల్విరాట్ కోహ్లీకేఎల్ రాహుల్రిషభ్ పంత్ (వికెట్ కీపర్)సర్ఫరాజ్ ఖాన్ధృవ్ జురెల్ (వికెట్కీపర్)రవిచంద్రన్ అశ్విన్రవీంద్ర జడేజామహ్మద్ సిరాజ్ఆకాశ్ దీప్ప్రసిద్ కృష్ణహర్షిత్ రాణానితీశ్ కుమార్ రెడ్డివాషింగ్టన్ సుందర్ చదవండి: BGT 2024: టీమిండియాకు గుడ్న్యూస్ -
టీమిండియా తదుపరి హెడ్కోచ్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్గా లక్ష్మణ్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.శుభారంభమే అయినాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా అవతరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్కప్ హీరో గౌతం గంభీర్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్లో క్లీన్స్వీప్ విజయం అందుకున్నాడు.అయితే, లంకతో వన్డే సిరీస్లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్వాష్ విజయం అందుకుంది. బంగ్లాదేశ్ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్కు అసలైన సవాలుఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ మాత్రంమరోవైపు.. ప్రధాన కోచ్ల గైర్హాజరీలో టీమిండియా హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్కప్ తర్వాత జింబాబ్వే టూర్లో లక్ష్మణ్ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్ జట్టుపై కూడా సూర్యకుమార్ సేన సత్తా చాటుతోంది.సెంచూరియన్లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ లక్ష్మణ్పై ప్రశంసలు కురిపించాడు.టీమిండియా హెడ్కోచ్గా అతడే హాట్, హాట్, హాట్ కేకు‘‘ఈరోజు వీవీఎస్ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్కోచ్గా అతడే హాట్, హాట్, హాట్ కేకు అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ను మూడో నంబర్లో బ్యాటింగ్కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్ గనుక విఫలమైతే.. వీవీఎస్ తదుపరి కోచ్గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.11 పరుగుల తేడాతో టీమిండియా విజయంకాగా సెంచూరియన్లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ సూర్యకుమార్కు బదులు తిలక్ వర్మ మూడో నంబర్లో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా ఘనత -
సంధి కాలం కాదు... సత్తా చాటాల్సిన సమయం!
సొంతగడ్డపై టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా చిత్తయిన తర్వాత భారత క్రికెట్ జట్టు అతి పెద్ద సమరానికి సిద్ధమైంది. ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఆ్రస్టేలియాకు బయలదేరింది. స్వదేశంలో ప్రదర్శన తర్వాత జట్టుపై అంచనాలు తక్కువగానే ఉన్నా... కంగారూ గడ్డపై గత రెండు సిరీస్లూ నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన తమ ఆటతీరు స్ఫూర్తిగా కొత్త ఆశలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఓటమిని మరచి ఆసీస్పై సత్తా చాటుతామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెబుతున్నాడు. రోహిత్, కోహ్లి ఫామ్లోకి వచ్చి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తారని అతను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. విరాట్ కోహ్లితో కలిపి జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ముందే ఆ్రస్టేలియాకు చేరుకోగా... కెపె్టన్ రోహిత్ శర్మ మినహా మిగతా వారంతా సోమవారం బయలుదేరి వెళ్లారు. నవంబర్ 22 నుంచి పెర్త్లో తొలి టెస్టు జరుగుతుంది. ముంబై: భారత జట్టు సంధి దశలో ఉందా లేదా అనే విషయాన్ని తాను పట్టించుకోనని, ప్రస్తుతానికి ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్పైనే తన దృష్టి ఉందని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరే అంశాన్ని కూడా పట్టించుకోవడం లేదని అతను వ్యాఖ్యానించాడు. కోచ్గా తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్న గంభీర్ ఆ్రస్టేలియాకు బయలుదేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. విశేషాలు అతని మాటల్లోనే... కోచ్గా ఒత్తిడి ఎదుర్కోవడంపై... న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై నన్ను విమర్శించ డంలో తప్పు లేదు. వాటిని స్వీకరించేందుకు నేను సదా సిద్ధం. మా ఓటమికి సాకులు వెతకడం లేదు. కివీస్ అన్ని రంగాల్లో చాలా బాగా ఆడింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాపై విరుచుకుపడటంలో అర్థం లేదు. దాని వల్ల మా జీవితాల్లో ఏమైనా తేడా వస్తుందా? నేను ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడే చాలా కష్టమైన పని అని తెలుసు. ఒత్తిడి బాగా ఉంటుందనేది కూడా తెలుసు. నా బాధ్యతను నేను నిజాయితీలో నిర్వర్తిస్తున్నా. కాబట్టి ఒత్తిడి నాకు సమస్య కాదు. భారత జట్టుకు కోచ్గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రోహిత్, కోహ్లి ఫామ్పై... ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ఫామ్పై ఎలాంటి ఆందోళన లేదు. వారిద్దరూ మానసికంగా చాలా దృఢమైన వారు. ఇప్పటికే భారత్ తరఫున ఎంతో సాధించిన వారిద్దరు మరిన్ని ఘనతలకు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇంకా ఎంతో తపన మిగిలి ఉంది. దాని కోసం చాలా కష్టపడుతున్నారు. గత సిరీస్ వైఫల్యం తర్వాత పరుగులు సాధించాలనే కసి వారిలో కనిపిస్తోంది. దేశం తరఫున వారి అంకితభావాన్ని ఎప్పుడూ ప్రశి్నంచవద్దు. ఇది పూర్తిగా కొత్త సిరీస్. కాబట్టి అక్కడ బాగా ఆడి సిరీస్ గెలవడమే అందరి లక్ష్యం. టీమిండియా సంధి దశపై... ఎంతో సాధించాలనే ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో మా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు. జట్టుకు సంబంధించి ఇది సంధి కాలం అనే మాటను నేను నమ్మను. బయటి వారు ఎలా అనుకున్నా నేను అలాంటి పదాలను వాడను. పేరు ఏం పెట్టుకున్నా మార్పు అనేది సహజం. గతంలోనూ భారత జట్టులో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇక ముందూ జరుగుతాయి. నా ధ్యాసంతా ప్రస్తుతం ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్పైనే ఉంది. ఇప్పుడు నాకు అన్నింటికంటే అదే ముఖ్యం. ఆసీస్లో పరిస్థితులపై... మా ముందు అన్నింటికంటే పెద్ద సవాల్ అక్కడి పరిస్థితులకు అలవాటు పడటమే. వచ్చే పది రోజులు అందుకే చాలా కీలకం. ఈ సమయంలో తగిన విధంగా సన్నద్ధమైతే తొలి మ్యాచ్కు ముందు అంతా బాగుంటుంది. గతంలో ఆ్రస్టేలియాలో ఆడిన అనేక మంది అనుభవజు్ఞలు జట్టులో ఉండటం సానుకూలాంశం. వారి అనుభవం యువ ఆటగాళ్లకు కూడా పనికొస్తుంది. ఈ పది రోజులు సన్నాహాలు బాగా సాగితే 22న ఉదయం తొలి బంతి నుంచే చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. వారు ఎలాంటి పిచ్లు ఇస్తారనేది అనవసరం. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. పిచ్ ఎలా ఉన్నా మా సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఎవరినైనా ఓడించగలం. జట్టులోని యువ ఆటగాళ్లపై... గతాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడం అవసరం కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వీరిని ఎంపిక చేశారు. విజయానికి ఉపయోగపడగలరనే నమ్మకంతో అత్యుత్తమ జట్టునే ఎంపిక చేశాం. వ్యక్తిగత రికార్డులకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని జూనియర్లకు గట్టిగా చెప్పాను. నితీశ్ కుమార్ రెడ్డి మంచి ప్రతిభావంతుడు. అవకాశం లభిస్తే అతను సత్తా చాటగలడు. సుదీర్ఘ టెస్టు సిరీస్కు ముందు పేసర్లు అలసట లేకుండా ఉండాలనే కారణంతోనే హర్షిత్ రాణాను ‘ఎ’ జట్టుతో పంపలేదు. రంజీ ట్రోఫీలో అతను తగినంత బౌలింగ్ కూడా చేశాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఐదుగురు పేసర్లూ భిన్నమైన శైలి కలవారు కాబట్టి బౌలింగ్లో మంచి పదును ఉంది. ఓపెనర్గా రాహుల్! కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడటంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్ సమయానికే దీనిపై స్పష్టత వస్తుంది. అయితే ఓపెనర్గా భారత్కు తగినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని గంభీర్ చెప్పాడు. అయితే అభిమన్యు ఈశ్వరన్తో పోలిస్తే అనుభవజ్ఞుడైన రాహుల్కే అవకాశం దక్కవచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ‘అటు ఓపెనర్గా, ఇటు మిడిలార్డర్లోనూ ఆడగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్లు ప్రపంచ క్రికెట్లో చాలా తక్కువ మంది ఉంటారు. రాహుల్ అలాంటి వారిలో ఒకడు. తనకు ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
BCCI: గంభీర్ను ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్కు పంపకండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడిని మరోసారి మీడియా సమావేశానికి పంపవద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాడు. గంభీర్కు బదులు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్నే ప్రెస్ కాన్ఫరెన్స్కు పంపాలని సూచించాడు.టీమిండియా వైట్వాష్కు గురైన తర్వాతకాగా న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్వాష్కు గురైన తర్వాత.. గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్న గౌతీ.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.నష్టమేమీ లేదుఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఫామ్ గురించి తమకు ఆందోళన లేదంటూ.. వారిని విమర్శిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్కు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. ఇక కివీస్ చేతిలో పరాభవం నుంచి పాఠాలు నేర్చకుంటామని.. విమర్శలను స్వీకరిస్తూనే ముందడుగు వేస్తామని పేర్కొన్నాడు. అంతేకాదు.. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు. అయితే, కొన్నిసార్లు మీడియా ప్రశ్నలకు గంభీర్ దూకుడుగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణి అవలంబించినట్లుగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘‘ఇందాకే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అతడిని ఇలాంటి పనులకు దూరంగా ఉంచితేనే బీసీసీఐకి మంచిది.అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం. మీడియాతో మాట్లాడేటపుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పదాలు వాడాలో అతడికి తెలియదు. రోహిత్, అగార్కర్ అతడి కంటే చాలా బెటర్. వాళ్లిద్దరినే మీడియా ముందుకు పంపిస్తే మంచిది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నాలుగు గెలిస్తేనేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో చివరగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. ఇందులో భాగంగా భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుంది.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the seriesHead Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL— BCCI (@BCCI) November 11, 2024 -
అసలు అతడికి మాతో ఏం పని?: రిక్కీ పాంటింగ్పై గంభీర్ ఫైర్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్పై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడికి భారత క్రికెట్తో పనేంటని.. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడే ముందు తమ ఆటగాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలని హితవు పలికాడు. కాగా టెస్టుల్లో టీమిండియా ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలవాలంటేసొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది రోహిత్ సేన. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)2023-25 ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కనీసం నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.ఇక కివీస్తో సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ చేతిలో చారిత్రాత్మక ఓటమికి ఒకరకంగా వీరిద్దరి వైఫల్యమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఆసీస్ పర్యటన భారత జట్టుకు మరింత కఠినతరంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కోహ్లిపై పాంటింగ్ విమర్శలుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అగ్రశ్రేణి బ్యాటర్గా కొనసాగుతూ గత ఐదేళ్లలో టెస్టుల్లో కేవలం రెండు శతకాలే బాదడం ఏమిటని ప్రశ్నించాడు. కోహ్లి ఆట తీరు ఇలాగే ఉంటే టీమిండియాకు తిప్పలు తప్పవని.. అతడి బ్యాటింగ్ గణాంకాలు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్తో సిరీస్కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పాంటింగ్ వ్యాఖ్యలను విలేఖరులు ప్రస్తావించగా గౌతీ ఫైర్ అయ్యాడు. ‘‘అసలు పాంటింగ్కు భారత క్రికెట్తో ఏం పని? అతడు.. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను.భారత క్రికెట్తో అతడికి ఏం పని?అయినా, విరాట్, రోహిత్ గురించి అతడికి ఆందోళన ఎందుకు? నా దృష్టిలో వాళ్లిద్దరు అద్భుతమైన ఆటగాళ్లు. కఠిన సవాళ్లకు సమర్థవంతంగా ఎదురీదగల సత్తా ఉన్నవాళ్లు. భారత క్రికెట్ తరఫున ఎన్నో విజయాలు సాధించారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతారు’’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను సమర్థిస్తూ పాంటింగ్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభం కానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. కివీస్తో సిరీస్లో ఆరు ఇన్నింగ్స్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1.ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.భారత్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్ , మిచెల్ మార్ష్, మెక్స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. చదవండి: ఆసీస్తో తొలి టెస్టుకు రోహిత్ దూరం! భారత కెప్టెన్ అతడే? గంభీర్ క్లారిటీ -
గంభీర్కు బీసీసీఐ షాక్!.. సొంతగడ్డపైనే ఇంతటి ఘోర అవమానం.. ఇకపై..
దూకుడుకు మారుపేరు.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆటగాడు.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త.. ఇలాంటి వ్యక్తి హెడ్కోచ్గా వస్తే జట్టు విజయపథంలో నడవడం ఖాయం.. గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా నియమితుడు కాగానే అతడి అభిమానులతో పాటు విశ్లేషకులూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇవి.అందుకు తగ్గట్టుగానే శ్రీలంక పర్యటనలో భాగంగా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్ను.. 3-0తో క్లీన్స్వీప్ చేసింది. దీంతో హెడ్కోచ్గా గంభీర్కు శుభారంభం లభించింది. కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుతో ఉన్నా వన్డే సిరీస్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్లో భారత్ ఓటమిని చవిచూసింది.సొంతగడ్డపై ఘోర అవమానంఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను 2-0తో, టీ20 సిరీస్ను 3-0తో భారత్ క్లీన్స్వీప్ చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ.. న్యూజిలాండ్ రూపంలో ఎదురైన కఠిన సవాలును గౌతీ అధిగమించలేకపోయాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా సొంతగడ్డపై టీమిండియా కివీస్తో టెస్టుల్లో 0-3తో వైట్వాష్కు గురైంది.ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!న్యూజిలాండ్తో బెంగళూరు టెస్టులో పిచ్ను తప్పుగా అంచనావేసి తొలుత బ్యాటింగ్ చేయడం, పుణెలో స్పిన్ పిచ్ రూపొందించి బొక్కబోర్లా పడటం.. ముంబై టెస్టులోనూ గెలిచే మ్యాచ్ను చేజార్చుకోవడం..కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గంభీర్పై విమర్శల కారణమైంది. ఇక కివీస్ చేతిలో ఈ ఘోర ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ అవకాశాలనూ దెబ్బతీసింది.గంభీర్ చేసిన తప్పులు ఇవేఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గనుక జట్టు ప్రదర్శన ఇలాగే సాగితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్పై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయం. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని రోహిత్ ఎంత చెబుతున్నా... మేనేజ్మెంట్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ప్రధాన ప్లేయర్లే తడబడుతున్న సమయంలో సిరాజ్ను నైట్ వాచ్మన్గా పంపిన మేనేజ్మెంట్... మిడిలార్డర్లో అనుభవమున్న ‘లోకల్ బాయ్’ సర్ఫరాజ్ ఖాన్ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దింపింది.ఆ విషయంలో ద్రవిడ్ పర్ఫెక్ట్ఇవే కాకుండా గతంలో ద్రవిడ్ ప్రాక్టీస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేవాడని పలువురు ప్లేయర్లు అభిప్రాయపడగా... గంభీర్లో ఆ తీవ్రత లోపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు హెడ్ కోచ్ గంభీర్లకు అగ్ని పరీక్షగా నిలువనుంది.రెక్కలు కత్తిరించేందుకు సిద్ధం!ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. గంభీర్ ‘ అధికారాల రెక్కలు’ కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై అతడిని సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్లకు లేని వెసలుబాటును బీసీసీఐ గౌతం గంభీర్కు కల్పించింది.నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోచ్లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. కానీ.. ఆస్ట్రేలియా పర్యటనకు పంపే జట్టు విషయంలో ఈ రూల్ను మినహాయించారు. హెడ్కోచ్ను మీటింగ్కు అనుమతించారు’’ అని పేర్కొన్నాయి. అయితే, స్వదేశంలోనే గంభీర్ అంచనాలు తప్పి.. ఘోర అవమానం ఎదురైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
Ind vs NZ: టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలం: గంభీర్
న్యూజిలాండ్తో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు విఫలమైన తీరు మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేసింది. బెంగళూరు మ్యాచ్లో 46 పరుగులకే ఆలౌట్ కావడం సహా.. పుణెలోనూ నామమాత్రపు స్కోర్లు(156, 245) చేయడం విమర్శలకు తావిచ్చింది. మఖ్యంగా.. రెండో టెస్టులో కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన భారత బ్యాటర్ల కారణంగా ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.పరువు కోసం.. ఫైనల్ కోసంపన్నెండేళ్ల తర్వాత తొలిసారి టీమిండియా స్వదేశంలో టెస్టు సిరీస్లో ఓటమిపాలైంది. జూనియర్లతో పాటు సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ బౌలింగ్లో తడబడ్డారు. భారత బ్యాటర్ల పుణ్యమా అని అతడు తన టెస్టు కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(13/157) నమోదు చేశాడు.ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. కివీస్తో కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని కఠినంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ భారత బ్యాటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలంముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్కు ఆదరణ పెరిగింది. అందుకే చాలా మంది బ్యాటర్లు డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే, విజయవంతమైన ఆటగాళ్లలో ఫార్మాట్లకు అతీతంగా మూడింటిలో స్ట్రాంగ్గా డిఫెన్స్ చేసుకునే వారే ఎక్కువ.వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటానికి ఉన్న ప్రాధాన్యాన్ని మనం మరచిపోకూడదు. ప్రతిసారి ఆటగాళ్లకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. తద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. టెస్టుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ దూకుడు తగ్గించి ఆచితూచి ఆడాలని పరోక్షంగా బ్యాటర్లకు హితవు పలికాడు.బుమ్రా ఆడకపోవచ్చుఅదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్తో మూడో టెస్టు ఆడకపోవచ్చని గంభీర్ సంకేతాలు ఇచ్చాడు. కివీస్ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనున్న నేపథ్యంలోనే మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవంబరు 1 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా నామమాత్రపు మూడో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ -
Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?
హర్షిత్ రాణా త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నాడా? ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలపడంలో తనవంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆల్రౌండ్ షోతో అదరగొట్టిఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనా ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు హర్షిత్ రాణా. భారత-ఎ జట్టులో భాగమైన యువ క్రికెట్లరు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లగా హర్షిత్ మాత్రం రంజీ మ్యాచ్ కోసం భారత్లోనే ఉన్నాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన హర్షిత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. మొత్తంగా ఏడు వికెట్లు తీయడంతో పాటు ధనాధన్ హాఫ్ సెంచరీ(4 ఫోర్లు, 3 సిక్స్లు- 59 రన్స్)తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాను కివీస్తో మూడో టెస్టులో బరిలోకి దించాలని హెడ్కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.ఆకాశ్ దీప్పై వేటు?ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం సహా ఫామ్లేమితో సతమతమవుతున్న మహ్మద్ సిరాజ్ను పక్కనపెట్టాలనే యోచనలో కోచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ను తప్పించి హర్షిత్ రాణాను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి ఘనుడైనా తనదైన శైలిలో బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టగల సత్తా ఈ స్పీడ్స్టర్ సొంతం.అప్పుడు వాషీ.. ఇప్పుడు రాణాఇక కేకేఆర్ మెంటార్గా హర్షిత్ను దగ్గరగా గమనించిన గంభీర్.. ఈ ఢిల్లీ పేసర్కు కివీస్తో మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్లో రోహిత్ సేన ఇప్పటికే రెండు ఓడిపోయింది. సిరీస్ కోల్పోయినా పరువు నిలబెట్టుకోవాలంటే నవంబరు 1 నుంచి ముంబైలో జరిగే ఆఖరి టెస్టులో గెలుపు తప్పనిసరి!ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేసిన చేసిన విషయం తెలిసిందే. పుణె టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ పదకొండు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడిక హర్షిత్ రాణా వంతు వచ్చిందేమో?!చదవండి: గంభీర్ సర్ వల్లే ఆరోజు అలా.. టెస్టుల్లోనూ రాణిస్తా: నితీశ్ రెడ్డి -
గంభీర్ సర్ చెప్పడం వల్లే.. ఆరోజు అలా: నితీశ్ రెడ్డి
క్రికెట్లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు అరుదుగా ఉంటారు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ఆ కోవకు చెందిన వాడే. ప్రస్తుతం భారత్ తరఫున టాప్ క్లాస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఈ బరోడా క్రికెటర్ కొనసాగుతున్నాడు. అయితే, అతడి సేవలు పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాయి. ఫిట్నెస్ దృష్ట్యా వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రమే ఆడుతున్న హార్దిక్.. టెస్టులకు ఎప్పుడో దూరమయ్యాడు. ఇటీవల మరోసారి రెడ్బాల్తో ప్రాక్టీస్ చేసినా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జట్టులో మాత్రం అతడి పేరు లేదు.తెలుగు కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డికే ఓటుఈ క్రమంలో మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను కాదని మరీ సెలక్టర్లు తెలుగు కుర్రాడు నితీశ్కుమార్ రెడ్డికి ఓటు వేశారు. పొట్టి ఫార్మాట్లో రాణిస్తున్న ఈ ఆంధ్ర ఆల్రౌండర్ను ఆసీస్ టూర్కు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్బాల్ క్రికెట్లో నిలకడైన పేస్తో రాణించడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు. గంటకు 140- 145 కిలోమీటర్ల వేగం కంటే.. 130- 135 మధ్య వేగంతో బౌలింగ్ చేస్తూ పేస్పై ఎక్కువగా దృష్టి పెడతానని తెలిపాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ విలువైన సూచనలు ఇచ్చాడని.. ఆయన మార్గదర్శనంలో అనుకున్న ఫలితాలు రాబట్టగలనని ధీమా వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన నితీశ్రెడ్డి.. ఇటీవల బంగ్లాతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. రెండో టీ20లో మాత్రం దుమ్ములేపాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి పరుగుల వరద పారించాడు.4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడికేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడి ఏకంగా 74 పరుగులు రాబట్టాడు. అదే మ్యాచ్లో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఆ మ్యాచ్లో తన ప్రదర్శన గురించి తాజాగా గుర్తుచేసుకున్న నితీశ్రెడ్డి గంభీర్ వల్లే తను స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగానని తెలిపాడు. ఈ మేరకు హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘ఆరంభంలో నాకేమీ అర్థం కాలేదు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం దూకుడుగా ఆడమని చెప్పింది. ఐపీఎల్లో ఎలా ఆడానో అచ్చం అలాగే ప్రత్యర్థి బౌలింగ్పై అటాక్ చేయాలని చెప్పారు. అదే మైండ్సైట్తో ఇక్కడా ఆడాలని సూచించారు. పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయమన్నారు. నాకింకా గుర్తుంది.. ఆరోజు డ్రింక్స్ బ్రేక్కు ముందు నేను రివర్స్ స్వీప్ షాట్ ఆడాను.నీకు ఆ పవర్ ఉందిఅయితే, ప్రత్యర్థి జట్టు డీఆర్ఎస్కు వెళ్లగా అంపైర్స్ కాల్ ద్వారా నాటౌట్గా నిలిచాను. అప్పుడు గౌతం సర్ నా దగ్గరికి వచ్చారు. ‘నితీశ్ నువ్వు బలంగా బంతిని బాదగలవు. నీకు ఆ పవర్ ఉంది. బంతిని బౌండరీ లైన్ను ఈజీగా దాటేలా చేయగలవు. అలాంటపుడు రివర్స్ షాట్తో నీకు పనిలేదు. ముఖ్యంగా ఇలాంటి వికెట్ల(ఢిల్లీ)పై అలా ఆడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.ఆయన మాటలు నాలో ఉత్సాహం నింపాయి. నా బ్యాట్ పవరేంటో చూపించాను. ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్కు వచ్చినప్పుడు నేను మరింత దూకుడుగా ఆడాను’’ అని నితీశ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకూ సిద్ధంగా ఉన్నానన్న 21 ఏళ్ల ఈ ఆల్రౌండర్ బౌలింగ్లోనూ నిలకడ ప్రదర్శించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూ జిలాండ్తో టెస్టులతో బిజీగా ఉన్న టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో నితీశ్ సహా పలువురు యువ ఆటగాళ్లు ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టారు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
Ind vs NZ: రోహిత్, గంభీర్.. కామన్సెన్స్ లేదా?
న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి టెస్టు తాలుకు పొరపాట్లు పునరావృతం చేయకుండా.. రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. పుణెలో గురువారం నుంచి మొదలుకానున్న ఈ టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన సిరీస్ బరిలో నిలుస్తుంది. లేదంటే.. పర్యాటక జట్టుకు 0-2తో ట్రోఫీని సమర్పించుకోకతప్పదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కివీస్ చేతిలో సొంతగడ్డపై దాదాపు 36 ఏళ్ల తర్వాత ఓటమికి ప్రధాన కారణం టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్చి నిర్ణయాలే అని ఘాటు విమర్శలు చేశాడు.కామన్సెన్స్ లేదా?ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో కొన్నిసార్లు అర్థమే కాదు. కామన్సెన్స్ లోపించిందేమో అనిపిస్తుంది. అసలు ఆ కోచ్, కెప్టెన్ ఏం నిరూపించాలనుకుంటున్నారనేది నాకైతే అంతుపట్టడం లేదు. కొత్త కోచ్ వచ్చినా.. కొత్త కెప్టెన్ వచ్చినా.. తమను తాము నిరూపించుకునే ప్రయత్నంలో ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు’’ అని మనోజ్ తివారి విమర్శించాడు.కోచ్ ఏం చేస్తున్నాడు?బెంగళూరు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్కు ఎక్కువగా బంతిని ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితిని బట్టి స్పిన్నర్లతో తక్కువ బంతులు వేయిస్తారని తెలుసు. అయితే, అందుకోసం ఏకంగా అశ్విన్నే పక్కనపెడతారని అనుకోలేదు. టెస్టుల్లో ఐదు వందలకు పైగా అతడు వికెట్లు తీశాడు. 107 రూపంలో కనిపిస్తున్న స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జస్ప్రీత్ బుమ్రాతో కలిపి అశ్విన్ను కూడా ఆడించాల్సింది.గొప్ప కెప్టెన్లుగా పేరొందిన వారు కూడా తప్పులు చేస్తారు. అలాంటి సమయంలో కోచ్ ముందుకు రావాలి. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు నడిపించాలి. కానీ ఇప్పుడెందుకో ఇక్కడ అలా జరుగలేదు అనిపిస్తోంది’’ అని మనోజ్ తివారి గంభీర్ను తప్పుబట్టే ప్రయత్నం చేశాడు. కాగా కివీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచినప్పటికీ పిచ్ను తప్పుగా అంచనా వేసి తాము భారీ మూల్యం చెల్లించినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే, సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్ల మధ్య పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు విశేషాలు👉షెడ్యూల్: అక్టోబరు 16- అక్టోబరు 20👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, కర్ణాటక👉వర్షం కారణంగా బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు👉రెండో రోజు మొదలైన ఆట👉టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా👉టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 46 ఆలౌట్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 402 ఆలౌట్👉టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 462 ఆలౌట్👉న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 110/2👉ఫలితం: టీమిండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రచిన్ రవీంద్ర(134, 39*).చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్కు హెడ్కోచ్ గౌతం గంభీర్ అండగా నిలిచాడు. ఈ కర్ణాటక బ్యాటర్ ఆటతీరు పట్ల తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపాడు. బయటవాళ్లు ఏమనుకుంటున్నారో అన్న అంశాలతో తమకు సంబంధం లేదని.. జట్టులోని ఆటగాళ్లకు అన్ని వేళలా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాడు. అద్భుత శతకంకాగా భారత టెస్టు జట్టు మిడిలార్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్గా ఉన్న శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడుతుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదోస్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లతో సర్ఫరాజ్ ఖాన్ సైతం రేసులో ఉన్నాడు. అయితే, ఇప్పటికే అయ్యర్ జట్టుకు దూరం కాగా.. రాహుల్, సర్ఫరాజ్ పేర్లు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టుకు గిల్ దూరం కావడంతో.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఇద్దరికీ తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరు డకౌట్ అయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుత శతకం(150)తో కదం తొక్కగా.. రాహుల్ కేవలం 12 పరుగులకే పరిమితయ్యాడు.ఈ నేపథ్యంలో పుణె వేదికగా గురువారం కివీస్తో మొదలుకానున్న రెండో టెస్టుకు జట్టు ఎంపిక గురించి సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ రాహుల్ను విమర్శిస్తూ.. సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గుచూపుతున్నారు చాలా మంది విశ్లేషకులు. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు.ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో..‘‘ప్లేయింగ్ ఎలెవన్ను సోషల్ మీడియా నిర్ణయించలేదు. విశ్లేషకులు, నిపుణులు ఏమనుకుంటున్నారోనన్న విషయాలతోనూ మాకు సంబంధం లేదు. టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదే ముఖ్యం. ఇటీవల బంగ్లాదేశ్తో మ్యాచ్లో కాన్పూర్ పిచ్పై పరుగులు రాబట్టడం కష్టమైనా కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాడు.యాజమాన్యం అతడికి అండగానే ఉందితన ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మార్చుకోవాల్సి ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతడికి అండగానే ఉంది’’ ప్రి మ్యాచ్ కాన్ఫరెన్స్లో గౌతీ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు గిల్ తిరిగి వస్తున్నాడు కాబట్టి.. రాహుల్కు ఛాన్స్ ఇచ్చి, సర్ఫరాజ్ను తప్పిస్తారనే వాదనలు బలపడుతున్నాయి.ఇంతకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సైతం మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్కు గంభీర్ మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. కివీస్తో తొలి టెస్టు తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభవార్త పంచుకున్న విషయం తెలిసిందే.తండ్రిగా ప్రమోషన్తాను తండ్రినయ్యానని.. తన భార్య మగబిడ్డను ప్రసవించిందని ఈ ముంబైకర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో కుటుంబానికి సమయం కేటాయించాలనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్కు లైన్క్లియర్ చేసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పర్యాటక న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాపై మొదటి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ టీమ్కు కొత్త కెప్టెన్ -
టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్ భయ్యా చెప్పారు: సంజూ
కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను రెడ్బాల్ క్రికెట్ ఆడించేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంజూ శాంసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సంజూ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20ల సందర్భంగా అరంగేట్రం చేసిన అతడికి ఆరేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 33 టీ20లు ఆడిన సంజూ శాంసన్.. ఆయా ఫార్మాట్లలో 510, 594 పరుగులు చేశాడు.టీమిండియా తరఫున టీ20 సెంచరీఇక వన్డేల్లో ఓ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లో శతకం నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల జట్టులోనే ఇప్పటి వరకు సంజూకు నిలకడైన స్థానం లేదు. అయినప్పటికీ టెస్టుల్లోనూ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. మేనేజ్మెంట్ పిలిచి మరీ రెడ్బాల్ క్రికెట్పై దృష్టి పెట్టాలని చెప్పడంతో లక్ష్యానికి చేరువవుతున్నాడు.మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందిఈ విషయాల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. రెడ్బాల్ క్రికెట్లో రాణించగలననే నమ్మకం నాకుంది. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనేది నా చిరకాల కోరిక.దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు నాకు నాయకత్వ బృందం(కెప్టెన్, కోచ్) నుంచి సందేశం వచ్చింది. రెడ్బాల్ క్రికెట్ జట్టులోనూ నా పేరును పరిశీలిస్తున్నామని మేనేజ్మెంట్లోని ముఖ్యులు చెప్పారు. రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని.. రెడ్బాల్ క్రికెట్ను సీరియస్గా తీసుకోవాలని చెప్పారు’’ అని పేర్కొన్నాడు.గంభీర్ భయ్యా మద్దతు ఉంది అదే విధంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గౌతం భయ్యా నాకెల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డాడు. నిజానికి టీమిండియాకు ఆడుతున్నపుడు బ్యాటింగ్ స్థానం సుస్థిరంగా ఉండదు. మూడు వారాల ముందే చెప్పారు!అయితే, బంగ్లాతో సిరీస్కు మూడు వారాల ముందే నేను ఓపెనర్గా రావాలని మేనేజ్మెంట్ చెప్పింది. కొత్త పాత్రలో ఇమిడిపోయేలా నేను మానసికంగా సిద్ధపడేందుకు తగిన సమయం ఇచ్చింది’’ అంటూ 29 ఏళ్ల సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ స్టార్తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.సంజూకు అంత ఈజీ కాదుకాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో సంజూ శాంసన్ ఇప్పటి వరకు 64 మ్యాచ్లు ఆడి 38.96 సగటుతో 3819 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-డి జట్టుకు ఆడిన అతడు మెరుపు సెంచరీ(101 బంతుల్లో 106) సాధించాడు. అయితే, టెస్టుల్లో వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ పాతుకుపోగా.. ధ్రువ్ జురెల్ బ్యాకప్గా ఉన్నాడు. సంజూ కూడా రేసులోకి రావాలంటే వికెట్ కీపింగ్ స్కిల్స్తో పాటు బ్యాటింగ్ పరంగానూ మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అలా అయితే, జురెల్ను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్’ -
Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..
టీమిండియా క్రికెటర్లు ఎవరైనా సరే తమ సహజ శైలిలో చెలరేగుతుంటే... జట్టు వ్యూహాల పేరుతో వారి దూకుడుకు హద్దులు పెట్టబోమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్ కింగ్’ విరాట్ కోహ్లి ఫామ్పై తమకెలాంటి ఆందోళనా లేదని, అతని పరుగుల దాహం ఎప్పటికీ తీరదని గంభీర్ తెలిపాడు. అయితే, బుధవారం నుంచి న్యూజిలాండ్తో జరిగే మూడు టెస్టుల సిరీస్లో టీమిండియాకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు.ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్ సహ కివీస్తో టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలపై గంభీర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో జరిగే సిరీస్లకంటే ప్రస్తుత సిరీస్పైనే తమ దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...అడ్డు ఎందుకు? ‘‘భారత బ్యాటింగ్కు నిర్దిష్టమైన శైలి ఇదని, ఇలాగే ఆడాలనే కచ్చితమైన ప్రణాళికలేమీ లేవు. ఆటగాళ్లు దూకుడుగా ఆడితే ఆడని... చెలరేగితే చెలరేగని ఇందులో అడ్డుకట్టలెందుకు పెట్టాలి. వారి సహజశైలిని వారు కొనసాగించే స్వేచ్ఛ ఇవ్వాలి కదా! గట్టిగా చెప్పాలంటే... మేం ఒక రోజులో 400–500 పరుగులైనా చేయాలనుకుంటాం. తప్పదు అవసరమనుకుంటే రెండు రోజుల పాటు జిడ్డుగా ఆడి ‘డ్రా’ అయినా చేసుకోగలుగుతాం.ఎందుకంటే కొన్నిసార్లు 100 పరుగులకే ఆలౌటయ్యే ప్రమాదం రావొచ్చు. అప్పుడు క్రీజులో నిలబడే ఓపిక, గంటల తరబడి ఆడే సామర్థ్యం కూడా అవసరం. టీమిండియా ఇలా తయారుకావడమే ముఖ్యం. అప్పుడే దూకుడైన ఆటతో అభిమానులకు మజా దక్కుతుంది. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఈ సిరీస్లో ఇలా ఆడాలని, ఆ ప్రత్యర్థిని అలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళికలపైనే ఆధారపడటం కుదరదు. వీలును బట్టి, అప్పటి పరిస్థితులు, పిచ్లో ఎదురయ్యే సవాళ్లు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయి. దీనికి పక్కా ప్రణాళికంటూ అమలు కాదు... అప్పటి పరిస్థితులే ప్రామాణికం. దాన్నిబట్టే ఆటతీరు మారుతుంది. ఆడే శైలి మరో దశకు చేరుకుంటుంది.కివీస్తో గట్టిపోటీ న్యూజిలాండ్ సాదాసీదా ప్రత్యర్థి కానేకాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్లు తప్పవు. సొంతగడ్డ అనే అనుకూలతలు, గత సిరీస్ గెలిచాం... ఇదీ గెలుస్తామనే ధీమా తప్పు. బంగ్లాదేశ్తో పోల్చితే కివీస్ పూర్తిగా భిన్నమైన ప్రత్యర్థి. ఆ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నాణ్యమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.కాబట్టి ప్రతీ మ్యాచ్లోనూ మాకు సవాళ్లు తప్పవు. అయితే ప్రత్యర్థి కివీసా లేదంటే ఆసీసా అని చూడం. జట్టు గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. వచ్చే నెలలో మొదలయ్యే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్ బెర్తే లక్ష్యంగా కివీస్ను ఓడించేపనిలో ఉంటాం .వరల్డ్క్లాస్ ప్లేయర్కోహ్లిపై నా ఆలోచనలు సుస్పష్టం. అతనో విశ్వవిఖ్యాత క్రికెటర్. సుదీర్ఘకాలంగా గొప్పగా రాణిస్తున్న బ్యాటర్. కోహ్లి అరంగేట్రం చేసినపుడు ఎలాంటి పరుగుల దాహంతో ఉన్నాడో... ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఇప్పటికి అలాంటి ఆకలితోనే ఉన్నాడు. కివీస్తో జరిగే మూడు టెస్టుల సిరీస్లో తప్పకుండా రాణిస్తాడనే ఆశిస్తున్నాను.ఇకపైనా అదే ఆటతీరును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాను. వరుసగా కొన్ని మ్యాచ్ల్లో... లేదంటే ఒకట్రెండు సిరీస్లలోనే విఫలమైనంత మాత్రాన అతడిబ్యాటింగ్లో సత్తా లేదని కాదు. ఆటగాళ్లు కదా... ఎవరికైనా వైఫల్యాలు సహజం. అలాగే వాటిని అధిగమించడం కూడా జరుగుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
కోహ్లి వైఫల్యాలు.. స్పందించిన గంభీర్! ఇకపై..
‘‘విరాట్ కోహ్లి ప్రపంచస్థాయి క్రికెటర్.. అతడి పరుగుల దాహం ఎప్పటికీ తీరదు’’ అని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న ఈ రన్మెషీన్కు పూర్తి మద్దతుగా నిలిచాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టుల్లో పాత కోహ్లిని చూడబోతున్నామంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొంతకాలంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. చివరగా 2023లో దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో ఈ కుడిచేతి వాటం అర్ధ శతకం(76) సాధించాడు. తాను ఆడిన గత ఎనిమిది ఇన్నింగ్స్లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోరు.కోహ్లి ఆట తీరుపై విమర్శలు ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్టుల్లోనూ కోహ్లి ఆకట్టుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో కేవలం 23 పరుగులే చేసిన అతడు.. రెండో టెస్టు(47, 29*)లో ఫర్వాలేదనిపించాడు. అయితే, టాప్ బ్యాటర్గా తన పాత్రకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ స్పందిస్తూ.. ‘‘కోహ్లి వరల్డ్క్లాస్ క్రికెటర్. విరాట్ గురించి నేనెప్పుడూ ఇదే మాట చెబుతూ ఉంటాను. సుదీర్ఘకాలంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న బ్యాటర్ అతడు. అరంగేట్రం చేసినపుడు అతడి పరుగుల దాహం ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది.కోహ్లి లాంటి ఆటగాళ్లను...అందుకే అతడు ప్రపంచస్థాయి క్రికెటర్గా ప్రసిద్ధి చెందాడు. న్యూజిలాండ్తో సిరీస్తో పాటు ఆస్ట్రేలియాలోనూ పరుగులు రాబట్టేందుకు కోహ్లి ఎదురుచూస్తున్నాడు. కోహ్లి లాంటి ఆటగాళ్లను ఒక్క మ్యాచ్ లేదంటే ఒక్క సిరీస్లో వైఫల్యం కారణంగా జడ్జ్ చేయవద్దు.ఎవరి కెరీర్లోనైనా ఎత్తుపళ్లాలు సహజం. అయినా.. ప్రతిసారీ వారిని వేలెత్తిచూపడం మంచిది కాదు. ఆటలో వైఫల్యాలు ఉంటాయి. అయితే, వాటిని అధిగమించి ముందుకు వెళ్తే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ప్రతి ఒక్కరు ప్రతిరోజు అత్యుత్తమంగా రాణించలేరు.ఎవరినీ తప్పించాలనే ఉద్దేశం ఉండదుఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ.. తగిన సూచనలు ఇవ్వడం నా విధి. జట్టుకు ఉపయోగపడే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను మాత్రమే మేము ఎంచుకుంటాం. అంతేగానీ.. ఎవరినీ తప్పించాలనే ఉద్దేశం మాకు ఉండదు.వరుసగా ఎనిమిది టెస్టులు ఆడబోతున్నాం. మా వాళ్లంతా పరుగుల ఆకలి మీద ఉన్నారు. ప్రతి మ్యాచ్లోనూ రాణించాలని పట్టుదలగా ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్తో బుధవారం నుంచి టీమిండియా టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ సోమవారం ఈ మేరకు విలేకరులతో మాట్లాడాడు. చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్లో లంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్లలో బంగ్లా బౌలింగ్ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
గంభీర్ సూచించాడు నేను పాటించాను: నితీశ్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్పై రెండో టి20లో చెలరేగేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ కిటుకులు దోహదం చేశాయని చెప్పాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శన క్రెడిట్ అంతా కోచ్కే దక్కుతుందన్నాడు. పవర్ప్లేలోనే టాపార్డర్ను కోల్పోయిన దశలో నితీశ్, హిట్టర్ రింకూ సింగ్లు మెరుపు అర్ధశతకాలతో బంగ్లా బౌలర్లను చితగ్గొట్టారు. నాలుగో వికెట్కు వీరిద్దరు కేవలం 49 బంతుల్లోనే 108 పరుగులు జోడంచడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆంధ్ర హిట్టర్ ఏకంగా ఏడు సిక్సర్లు బాదడం విశేషం. 34 బంతుల్లోనే 74 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే! భాగస్వామ్యంపై అతను మాట్లాడుతూ ‘మా ఇద్దరి మధ్య సానుకూల సంభాషణ జరిగింది. ఎలాంటి ఒత్తిడికి గురవొద్దని నిర్ణయించుకున్నాం. మా దృష్టి ఎదుర్కొనే స్పిన్నర్లపైనే ఉండింది. స్కోరుపై కాదు! ఈ ఓవర్ మనకు కీలకమని అనుకున్నాం. అదే అదనుగా దంచేశాం. నిజం చెప్పాలంటే ఈ మెరుపు ప్రదర్శనకు కారణం కోచ్ గంభీరే. అతను నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ముఖ్యంగా బౌలింగ్పై బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు. బౌలింగ్ చేసేటపుడు బౌలర్గానే ఆలోచించాలని బ్యాటర్గా కాదని చెప్పాడు. ఇది నాకు బాగా పనిచేసింది. యథేచ్చగా ఆడేలా, స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా ఉపకరించింది’ అని బీసీసీఐ వీడియోలో నితీశ్ వెల్లడించాడు. భారత్ తరఫున ఆడుతూ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానని తెలిపాడు. రింకూ సింగ్ మాట్లాడుతూ... ‘నితీశ్, నేను బ్యాటింగ్లో చెలరేగడాన్ని ఆస్వాదించాను’ అని చెప్పాడు. ఇలా బాదడం బహుశా భగవంతుడి ప్రణాళిక కావొచ్చని నితీశ్కు చెప్పినట్లు రింకూ పేర్కొన్నాడు. టాపార్డర్ కూలినపుడు, ఒత్తిడిలోనే ఇలాంటి భాగస్వామ్యాలు సాధ్యమైనట్లు చెప్పాడు. తాను భారత్కు ఎంపికైన ప్రతీసారి సిరీస్ గెలుపొందడం చెప్పుకోదగ్గ విశేషమన్నాడు. కెపె్టన్ సూర్యకుమార్ తమదైన శైలిలోనే ఆడేందుకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పాడు. -
నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్
ఢిల్లీ ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.కాస్త ఆందోళనగానే ఉన్నాఇక ఈ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.డైరెక్ట్గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.అందుకే స్లో బాల్స్ వేశానుకాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.ఆందోళన చెందకుండా కూల్గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20వేదిక: శ్రీమంత్ మాధవ్రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)టీమిండియా స్కోరు: 132/3 (11.5)ఫలితం: బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్దీప్ సింగ్(3/14).చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు: మయాంక్ యాదవ్
తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.లక్నోకు ఆడిన మయాంక్టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.స్పీడ్కు గాయాల బ్రేక్వరుసగా రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. నెట్స్లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు మయాంక్ను ఎంపిక చేశారు.గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడుఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..నన్ను నేను నిరూపించుకున్నానుఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది. అరంగేట్రం ఖాయమే!వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే! లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా స్టార్లంతా రెండు నెలలు ఆటకు దూరం -
బంగ్లాతో టీ20లు.. టీమిండియాలోకి పేస్ గన్ ఎంట్రీ!
భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు.మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్టలక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్టాపిక్గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా రికార్డులకెక్కాడు.మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు!అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాడు.టీమిండియా సెలక్టర్ల ఆరాఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.స్వదేశంలో వరుస టెస్టు సిరీస్లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్బాల్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.గంభీర్, మోర్కెల్లకు తెలుసుఅయినా.. మయాంక్ను కేవలం టీ20 ఫార్మాట్కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్తో ఉన్న సమయంలో మయాంక్ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: లివింగ్స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్ -
‘చెత్తగా ఆడండి.. అప్పుడు అసలైన గంభీర్ను చూస్తారు’
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును విజయపథంలో నడపగల సత్తా గౌతీకి ఉందని.. అయితే, అతడి కోచింగ్ స్టైల్ గురించి ఇప్పుడే అంచనాకు రాలేమన్నాడు. టీమిండియా చెత్తగా ఆడినపుడు గంభీర్ ‘నిజ స్వరూపం’ బయటపడుతుందని వ్యాఖ్యానించాడు.ద్రవిడ్ తర్వాతటీ20 ప్రపంచకప్-2024లో రోహిత్ సేన చాంపియన్గా నిలిచిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా హెడ్కోచ్గా నియమించింది బీసీసీఐ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జెయింట్స్(రెండుసార్లు ప్లే ఆఫ్స్) జట్టుకు మార్గదర్శనం చేయడంతో పాటు.. కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలిపిన మెంటార్గా ఘనత వహించిన అతడికి భారత జట్టు బాధ్యతలు అప్పగించింది.తన దూకుడు వైఖరికి విరుద్ధంగాశ్రీలంక పర్యటన సందర్భంగా జూలైలో కోచ్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన గంభీర్కు శుభారంభం దక్కింది. సూర్యకుమార్ సేన ఆతిథ్య జట్టు టీ20 సిరీస్లో 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్లో మాత్రం రోహిత్ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ ఓడిపోయింది. రెండో ప్రయత్నంలోనే గంభీర్కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనా.. తన దూకుడు వైఖరికి విరుద్ధంగా ప్రశాంతంగానే కనిపించాడు. ఈ క్రమంలో స్వదేశంలో తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్తో టెస్టుల ప్రయణాన్ని మొదలుపెట్టిన గంభీర్కు.. రోహిత్ సేన ఘన విజయంతో స్వాగతం పలికింది. చెన్నై టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో చిత్తు చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. గంభీర్ విశ్వరూపం చూస్తారుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా సిరీస్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న తమీమ్ ఇక్బాల్ జియో సినిమా షోలో మాట్లాడుతూ గంభీర్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘మీరు(టీమిండియా) వరుసగా గెలుస్తూ ఉంటే.. అతడి మనసులో నిజంగా ఏం దాగుందో బయటకు రాదు. మీరు ఎప్పుడైతే ఓ సిరీస్ కోల్పోతారో.. ఆ వెంటనే మరొకటి ఓడిపోతారో.. అప్పుడు తన నిజ స్వరూపం బయటపడుతుంది. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించగల సామర్థం అతడికి ఉంది. అయితే, ఇప్పుడే తన కోచింగ్ స్టైల్పై నిశ్చితాభిప్రాయానికి రాకూడదు. టీమిండియా ఒక్క చెత్త మ్యాచ్ ఆడనివ్వండి.. అప్పుడు తెలుస్తుంది’’ అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. గంభీర్ మరీ అంత కూల్ కాదని.. జట్టు ఓటములపాలైతే ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడడని అభిప్రాయపడ్డాడు.గంభీర్ ముందున్న సవాళ్లువరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరడం సహా చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026, వన్డే వరల్డ్కప్-2027 రూపంలో గంభీర్కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
తుదిజట్టులో వారికి చోటు లేదు: కారణం చెప్పిన గంభీర్
బంగ్లాదేశ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టులో చోటు కోసం.. యువకులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. చెన్నై టెస్టులో ఆడబోయే ప్లేయింగ్ ఎలెవన్లో ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లకు చోటు దక్కదని సంకేతాలు ఇచ్చాడు.బంగ్లాదేశ్కు వార్నింగ్ఇక చెపాక్లో ఈసారి మ్యాచ్ జరుగబోయేది ఎర్రమట్టి పిచ్ మీదే అయినప్పటికీ.. తమ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపుతారని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ త్రయంతో బంగ్లాదేశ్ జట్టు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ జరుగనుంది.పంత్ జట్టులోకి వచ్చాడు.. కాబట్టిఈ క్రమంలో గురువారం చెన్నై వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై హెడ్కోచ్ గౌతం గంభీర్ బుధవారం మాట్లాడుతూ.. ‘‘మేము ఎవరినీ జట్టు నుంచి తప్పించం. అయితే, ప్లేయింగ్ ఎలెవన్లో ఫిట్ అయ్యే ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటాం. జురెల్ అద్భుతమైన ఆటగాడు. అయితే, పంత్ జట్టులోకి వచ్చాడు.కాబట్టి.. కొన్నిసార్లు కొంతమంది ఎదురుచూడకతప్పదు. సర్ఫరాజ్కూ ఇదే వర్తిస్తుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. కానీ ఓపికగా ఎదురుచూడటం అవసరం’’ అని పేర్కొన్నాడు. తద్వారా వికెట్ కీపర్గా రిషభ్ పంత్, మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ ఆడటం ఖాయమని చెప్పకనే చెప్పాడు.మాకు అశూ, జడ్డూ ఉన్నారుఇక స్పిన్దళం అశ్విన్, జడేజా, కుల్దీప్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా స్పిన్నర్లు మొదటి రోజు నుంచి ఐదో రోజు వరకు ప్రభావం చూపగలరు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆటగాళ్లను తుదిజట్టులోకి తీసుకోలేము కదా. అదృష్టవశాత్తూ మాకు అశ్విన్, జడేజా ఉన్నారు. వాళ్లు డిఫెన్సివ్గా ఆడగలరు. అదే సమయంలో దూకుడూ ప్రదర్శించగలరు’’ అని గంభీర్ ప్రశంసించాడు. కాగా చెపాక్లోని ఎర్రమట్టి పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో.. తమ స్పిన్ దళం నుంచే ప్రత్యర్థికి ఎక్కువ ప్రమాదమని గౌతీ చెప్పడం విశేషం.బంగ్లాదేశ్తో తొలి టెస్టు భారత తుదిజట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: విరాట్ కోహ్లినే భయపెట్టాడు..! ఎవరీ గుర్నూర్ బ్రార్? -
నాకంటే నీకే బాగా తెలుసు: కోహ్లికి షాకిచ్చిన గంభీర్!
‘‘గౌతం గంభీర్కు.. విరాట్ కోహ్లికి అస్సలు పడదు. ఇక ముందు ముందు ఎలాంటి గొడవలు చూడాల్సి వస్తుందో!?.. కోహ్లికి చెక్ పెట్టేందుకు గౌతీ కచ్చితంగా ప్రయత్నాలు చేస్తాడు. కోహ్లి కూడా అందుకు గట్టిగానే బదులిస్తాడు’’... మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ను టీమిండియా హెడ్కోచ్గా ప్రకటించగానే ఇలాంటి వదంతులు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లలో గౌతీ- కోహ్లి గొడవపడ్డ ఘటనలు ఇందుకు కారణం. ఆటలో ఇవన్నీ సహజమని.. తాము వాటి గురించి ఎప్పుడో మర్చిపోయామని చెప్పినా రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే, ఇలాంటి ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో గంభీర్- కోహ్లి తమ అనుబంధాన్ని చాటేలా ఎన్నో సరదా విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి టీమిండియాకు ఆడిన జ్ఞాపకాలతో పాటు మైదానంలో గొడవపడ్డ సందర్భాలనూ గుర్తు చేసుకున్నారు. వన్డే ప్రపంచకప్-2011 ఫైనల్లో ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్లు కలిసి బ్యాటింగ్ దృశ్యాలతో మొదలైన వీడియో.. వారి మధ్య సంభాషణతో ముగిసింది.గౌతం గంభీర్: ఆస్ట్రేలియాలో నాటి సిరీస్(2014-15)లో నువ్వు పరుగులు రాబడుతూనే ఉన్నావు. అంతేకాదు.. ప్రతి డెలివరీకి ముందు ఓం నమఃశివాయ అని స్మరించుకుంటున్నావని నాతో చెప్పావు. ఆరోజు నువ్వలా బ్యాట్తో చెలరేగడానికి కారణం అదేనేమో!నాకు కూడా నేపియర్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో నేను రెండున్నర రోజుల పాటు బ్యాటింగ్ చేశాను. అప్పుడంతా హనుమాన్ చాలిసా వింటూనే ఉన్నా..విరాట్ కోహ్లి: మీరు చెప్పండి.. బ్యాటింగ్ చేస్తున్నపుడు.. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లతో అప్పుడప్పుడూ మాట్లాడేవారు. దాని వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినేదా? మీరు అవుటయ్యే వారా? లేదంటే.. ఎదుటి వారి కవ్వింపు చర్యల వల్ల మీరు మరింత స్ఫూర్తి పొందేవారా?గౌతం గంభీర్: నాకంటే నువ్వే ఎక్కువసార్లు గొడవలు పెట్టుకున్నావు కదా!.. ఈ ప్రశ్నకు నా కంటే నువ్వే సరైన సమాధానం చెప్పగలవు.విరాట్ కోహ్లి(నవ్వుతూ): నేను చెప్పే విషయాలతో ఏకీభవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా. అలా చేయడం(ప్రత్యర్థి రెచ్చగొడితే స్పందించడం) తప్పేమీ కాదు. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే అని చెప్పేవారు కనీసం ఒక్కరైనా ఉండాలి(గంభీర్ను ఉద్దేశించి).స్లెడ్జింగ్ కారణంగా లాభమే చేకూరిందికొన్నిసార్లు నేనైతే కావాలనే గొడవలకు దిగేవాడిని. ఆటను రసవత్తరంగా మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి. అయితే, నన్ను మార్చే అవకాశం ఎవరికీ ఇవ్వను. నిజానికి స్లెడ్జింగ్ కారణంగా నాకు నష్టం కంటే లాభమే ఎక్కువ వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు స్కోరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.మసాలాకు చెక్ ఇక ఆఖర్లో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. మేము చాలా దూరమే వచ్చాము. మసాలాకు చెక్ పెట్టామనే అనుకుంటున్నాము’’ అని పేర్కొనడం విశేషం. కాగా శ్రీలంకలో వన్డే సిరీస్ సందర్భంగా గంభీర్ మార్గదర్శనంలో తొలిసారి బరిలో దిగిన కోహ్లి.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో మొదలుకానున్న టెస్టు సిరీస్లో పాల్గొనున్నాడు. గంభీర్కు హెడ్కోచ్గా ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం విశేషం.చదవండి: పాక్లో ఐసీసీ బృందం పర్యటన.. టీమిండియా మ్యాచ్లు అక్కడేనా?A Very Special Interview 🙌Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat. You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy— BCCI (@BCCI) September 18, 2024 -
Ind vs Ban: కోహ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్.. జట్టుతో చేరిన కొత్త కోచ్
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్తో సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్కు చెన్నైలోని ఎంఏ చిదంబరం(చెపాక్) స్టేడియం వేదిక. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడుకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది.సీనియర్లంతా వచ్చేశారుభారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా శుక్రవారం నాటి నెట్ సెషన్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లికాగా శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత లండన్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లి.. నెల రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే యాక్షన్లో దిగాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్ సమక్షంలో కోహ్లి తొలి రోజు దాదాపుగా 45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసినట్లు సమాచారం.మూడేళ్ల తర్వాత తాను తొలిసారిగా చెన్నైలో తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో.. అభిమానులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కోహ్లి ఇలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చెపాక్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు టెస్టులు ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్... ఒక సెంచరీ సాయంతో 267 పరుగులు చేశాడు.టీమిండియాతో చేరిన మోర్నీ మోర్కెల్నూతన బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమిండియాతో చేరాడు. హెడ్కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్లు అభిషేక్ నాయర్, డష్కాటేలతో కలిసి రోహిత్ సేన ప్రాక్టీస్ను గమనించాడు. కాగా స్వదేశంలో ఓ సిరీస్కు ముందు భారత జట్టు వారం రోజుల పాటు ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొనడం ఇదే తొలిసారి.బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. బంగ్లాదేశ్ టెస్టు జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, జాకీర్ హసన్, మోమినుల్, ముష్ఫికర్, షకీబుల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, మెహమూదుల్ హసన్, నయీమ్, ఖాలిద్ అహ్మద్. చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్ -
లక్నోకు కొత్త మెంటార్.. కేఎల్ రాహుల్పై గోయెంకా కామెంట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్ పేరును ప్రకటించింది. టీమిండియా రివర్స్ స్వింగ్ కింగ్ జహీర్ ఖాన్ తమ జట్టుకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లు తెలిపింది. ఈ దిగ్గజ పేసర్తో జతకట్టడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్-2023లో లక్నో మెంటార్గా ఉన్న భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఈ ఏడాది ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గౌతీ తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ గూటికి చేరుకోగా.. లక్నో అతడి స్థానాన్ని అలాగే ఖాళీగా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా జహీర్ ఖాన్ను తమ మెంటార్గా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా జహీర్కు లక్నో జెర్సీ(నంబర్ 34)ని ప్రదానం చేశాడు.రివర్స్ స్వింగ్ కింగ్కు 102 వికెట్లుకాగా మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జహీర్ ఖాన్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్... పది సీజన్లలో 100 మ్యాచ్లు ఆడి 7.58 ఎకానమీతో 102 వికెట్లు పడగొట్టాడు.అనంతరం కోచ్ అవతారమెత్తిన జహీర్ ఖాన్.. తొలుత ముంబై ఇండియన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పనిచేశాడు. 2018- 2022 మధ్య కాలంలో ఆ ఫ్రాంఛైజీతో ప్రయాణం చేసిన ఈ దిగ్గజ బౌలర్.. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కాగా లక్నో బౌలింగ్ కోచ్గా ఉన్న సౌతాఫ్రికా స్పీడ్స్టర్ మోర్నీ మోర్కెల్ ఇటీవలే టీమిండియా బౌలింగ్ శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.కేఎల్ రాహుల్పై గోయెంకా కామెంట్ఈ నేపథ్యంలో లక్నో మెంటార్గా వ్యవహరించడంతో పాటు ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని కూడా జహీర్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక జస్టిన్ లాంగర్ ఈ జట్టుకు హెడ్కోచ్గా ఉండగా.. లాన్స్ క్లూస్నర్, ఆడం వోగ్స్ అతడికి డిప్యూటీలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లక్నో కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్బై చెప్తున్నాడనే వార్తల నడుమ.. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. అతడు తమ కుటుంబంలోని వ్యక్తి లాంటివాడని తెలిపాడు. అయితే, తమ కెప్టెన్ మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు.. కోల్కతా నైట్ రైడర్స్ను ఈ ఏడాది చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.చదవండి: భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..Zaheer, Lucknow ke dil mein aap bohot pehle se ho 🇮🇳💙 pic.twitter.com/S5S3YHUSX0— Lucknow Super Giants (@LucknowIPL) August 28, 2024 -
గంభీర్ ఎదుర్కొన్న ఆల్టైమ్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ముగ్గురికి చోటు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాను ఎదుర్కొన్న ఆల్టైమ్ వరల్డ్ బెస్ట్ టీమ్ వివరాలను స్పోర్ట్స్కీడాతో పంచుకున్నాడు. ఈ టీమ్లో గంభీర్ ఆసక్తికరంగా ముగ్గురు పాకిస్తానీ మాజీలకు చోటిచ్చాడు. అలాగే ముగ్గురు ఆసీస్ మాజీలకు, ఇద్దరు సౌతాఫ్రికా మాజీలకు, విండీస్, ఇంగ్లండ్, శ్రీలంక నుంచి చెరో మాజీకి చోటిచ్చాడు. ఈ జట్టులో గంభీర్ తన జమానాలో కఠినమైన ప్రత్యర్థులైన రికీ పాంటింగ్, గ్లెన్ మెక్గ్రాత్కు చోటివ్వకపోవడం విశేషం. గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్థి టీమ్లో ప్రస్తుత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా చోటివ్వడం మరో విశేషం.గంభీర్ తన ఫేవరెట్ ప్రత్యర్ధి జట్టు ఓపెనర్లుగా ఆడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హేడెన్లను ఎంపిక చేశాడు. వన్డౌన్లో ఏబీ డివిలియర్స్, నాలుగో స్థానంలో బ్రియాన్ లారా, ఐదో ప్లేస్లో ఇంజమామ్ ఉల్ హాక్ను ఎంపిక చేశాడు. ఆల్రౌండర్ల కోటాలో గంభీర్ ఆసక్తికరంగా పాక్ మాజీ అబ్దుల్ రజాక్కు చోటిచ్చాడు. మిగతా ఇద్దరు ఆల్రౌండర్లుగా ఆండ్రూ ఫ్లింటాఫ్, ఆండ్రూ సైమండ్స్లను ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ముత్తయ్య మురళీథరన్కు అవకాశం ఇచ్చిన గంభీర్.. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్గా షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేశాడు. గంభీర్ తన జట్టులో ముగ్గురు కెప్టెన్లుగా పని చేసిన వారిని ఎంపిక చేసినప్పటికీ ఎవ్వరికీ ఆ హోదా ఇవ్వలేదు. గంభీర్ తన ప్రత్యర్ధి జట్టులో న్యూజిలాండ్, బంగ్లాదేశ్లకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా చోటివ్వలేదు.గంభీర్ వరల్డ్ ఎలెవన్: ఆడమ్ గిల్క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్-ఉల్-హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ముత్తయ్య మురళీధరన్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్. -
Ind vs Ban: రోహిత్ శర్మ ఇంకో 18 పరుగులు చేస్తే..
శ్రీలంక పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్లీ బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అతడు బిజీ కానున్నాడు. అంతకంటే ముందు టీమిండియా స్టార్లు దులిప్ ట్రోఫీ రూపంలో రెడ్బాల్ టోర్నీ ఆడనున్నా.. కెప్టెన్ సాబ్ మాత్రం సెలవులోనే ఉండనున్నాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న బంగ్లాతో సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ ఇంకో 18 పరుగులు చేస్తే చాలు.. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ను అధిగమిస్తాడు. మాజీ ఓపెనర్ గౌతీ.. టీమిండియా తరఫున 58 టెస్టులు ఆడి 4154 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి.గంభీర్ను దాటేయనున్న రోహిత్ఇక రోహిత్ శర్మ ఇప్పటి వరకు 59 టెస్టులు పూర్తి చేసుకుని 4138 రన్స్ సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 18 పరుగులు సాధిస్తే.. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక రన్స్ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో గౌతీని వెనక్కినెట్టేస్తాడు.కాగా భారత్ తరఫున టెస్టుల్లో సచిన్ టెండుల్కర్(ఓవరాల్గానూ) 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ 13265, సునిల్ గావస్కర్ 10122, విరాట్ కోహ్లి 8848 టాప్-5లో కొనసాగుతున్నారు. 37 ఏళ్ల రోహిత్ టెస్టుల్లో ఐదు వేల పరుగుల మార్కు దాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.వరుస టెస్టులుఇక చెన్నై వేదికగా సెప్టెంబరు 19- 23, కాన్పూర్ వేదికగా సెప్టెంబరు 27- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు జరుగనున్నాయి. ఈ సిరీస్ తర్వాత భారత్ న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాబట్టి గంభీర్ రికార్డు బ్రేక్ చేయడానికి రోహిత్కు ఎంతో కాలం పట్టదు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన రోహిత్.. అంతర్జాతీయ టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ తర్వాత లంక పర్యటనలో వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయి కెప్టెన్గా చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. -
గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?: జై షా
ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.గంభీర్కు చెప్పడానికి నేనెవరిని?ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్ను హెడ్కోచ్గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్లు అవసరం లేదనే భావిస్తున్నాం.ఎన్సీఏ కోచ్లు ఉన్నారు కదా!అంతేకాదు.. ఒకవేళ హెడ్కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్కోచ్గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది. చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’ -
గంభీర్ ప్లాన్: బౌలింగ్ కోచ్గా అతడే ఎందుకంటే?!
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. టీమిండియా మాజీలను కాదనిఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.అతడి నైపుణ్యాల గురించి గంభీర్కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.వచ్చే ఏడాది ఇంగ్లండ్తోనూ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.మూడు దేశాలకు కోచ్గా... మోర్కెల్కు గంభీర్కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్కు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు. వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్రఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది. -
టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్.. జై షా ప్రకటన
టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా క్రిక్బజ్కు తెలిపాడు. మోర్కెల్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని షా పేర్కొన్నాడు. కాగా, టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్కెల్కు తొలి అసైన్మెంట్ బంగ్లాదేశ్ సిరీస్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బంగ్లాదేశ్ రెండు టెస్ట్లు, మూడు టీ20ల కోసం భారత్లో పర్యటించనుంది. ఈ సిరీస్ల నుంచి మోర్నీ భారత బౌలింగ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా ఛార్జ్ తీసుకున్నాడు. ఆ సిరీస్లలో భారత తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే వ్యవహరించాడు.గంభీర్ తన సహాయ బృందం ఎంపిక విషయంలో బీసీసీఐని ఒప్పించి మరీ తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేయించుకున్నాడు. గంభీర్ టీమ్లో ప్రస్తుతం అసిస్టెంట్ కోచ్గా అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ ఉన్నారు. తాజాగా గంభీర్ తాను రెకమెండ్ చేసిన మోర్నీ మోర్కెల్కు భారత బౌలింగ్ కోచ్ పగ్గాలు అప్పజెప్పి తన పంతం నెగ్గించుకున్నాడు. గంభీర్, మోర్కెల్ గతంలో లక్నో సూపర్ జెయింట్స్కు కలిసి పని చేశారు. ఈ పరిచయంతోనే గంభీర్ మోర్కెల్ పేరును ప్రతిపాదించాడు. -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్లతో సిరీస్ల నేపథ్యంలో తాను కోచ్గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
రోహిత్- కోహ్లి విషయంలో గంభీర్ నిర్ణయం సరికాదు: మాజీ బౌలర్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను జట్టులోకి పిలిపించడం సరైన నిర్ణయం కాదేమోనని టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వకుండా నూతన కోచ్ గౌతం గంభీర్ తప్పుచేశాడని అభిప్రాయపడ్డాడు. రోహిత్- కోహ్లి గంభీర్కు కొత్త కాదని.. వారి ఆట తీరు గురించి అతడికి అవగాహన ఉందని నెహ్రా పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. ఈ టోర్నీ తర్వాత సెలవులు తీసుకున్నారు. భార్య రితిక, కూతురు సమైరాలతో కలిసి రోహిత్ అమెరికాకు వెళ్లిపోగా.. కోహ్లి లండన్లో ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్ల దగ్గరకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో వీరిద్దరు శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. కుటుంబాలతో మరికొన్నాళ్లు ఎక్కువ సమయం గడపాలని భావించిన కోహ్లి- రోహిత్.. ఈ విషయాన్ని ముందుగానే బీసీసీఐతో చర్చించినట్లు సమాచారం. అయితే, చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాకు శ్రీలంక, ఇంగ్లండ్తో మాత్రమే మ్యాచ్(3+3)లు మిగిలి ఉండటంతో.. గంభీర్ వీరిద్దరిని వెనక్కిపిలిపించాడని తెలిసింది.సీనియర్లు జట్టులో ఉండాలని అతడు భావించాడని.. తన ఆలోచనను కోహ్లి- రోహిత్లతో పంచుకోగా వారు లంక పర్యటనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు 2- 3 నెలల సమయం ఉంది. నిజానికి ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.అంతకంటే ముందు టెస్టు, టీ20 సిరీస్లు జరుగనున్నాయి. అలాంటపుడు రోహిత్, కోహ్లిలను హడావుడిగా రప్పించాల్సిన అవసరం లేదు. నిజానికి శ్రీలంక సిరీస్ ద్వారా ఇతర ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తే బాగుండేది. గంభీర్ కొత్తగా కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో అతడు ఎక్కువ సమయం గడపాలని భావించడం సహజం.అయితే, రోహిత్- కోహ్లి గురించి అతడికి ముందే తెలుసు కదా! ఈ ఇద్దరితో ఎక్కువ సమయం గడిపి వారి ఆట తీరును పరిశీలించిందేకు తనేమీ విదేశీ కోచ్ కాదు. స్వదేశీ సిరీస్లు మొదలైన తర్వాత కోహ్లి- రోహిత్ ఎలాగో ఆడతారు. అప్పటిదాకా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ విషయంలో నేను గంభీర్ను తప్పుబట్టడం లేదు. అయితే, ఇలాంటి వ్యూహాల వల్ల జట్టుకు మేలే చేకూరుతుంది’’ అని ఆశిష్ నెహ్రా సోనీ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా శ్రీలంకతో ఇప్పటిదాకా రెండు వన్డేల్లో రోహిత్ 122 పరుగులతో రాణించగా.. కోహ్లి మాత్రం కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
‘ఇంత చెత్తగా ఆడతారా?.. గంభీర్కు ఇలాంటివి నచ్చవు’
టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త షాట్ సెలక్షన్తో గెలవాల్సిన మ్యాచ్ను ‘టై’ చేశాడంటూ భారత జట్టు అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేయాలనే సరదానా? లేదంటే ప్రత్యర్థి అంటే లెక్కలేనితనమా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.కాగా హెడ్కోచ్గా గౌతం గంభీర్ నియమితుడైన తర్వాత తొలిసారిగా.. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో శుక్రవారం వన్డే సిరీస్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చిన టీమిండియా.. ‘టై’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆతిథ్య లంక విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ గెలుపొందాలంటే.. 18 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమీకరణానికి చేరుకుంది. చేతిలో అప్పటికి రెండు వికెట్లు ఉన్నాయి.ఈ దశలో.. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక 48వ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అప్పటికి శివం దూబే, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. అయితే, అసలంక ఓవర్లో మొదటి రెండు బంతుల్లో దూబే పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ క్రమంలో మూడో బంతికి ఫోర్ కొట్టగా ఇరు జట్ల స్కోరు సమమైంది. అయితే, అనూహ్య రీతిలో ఆ మరుసటి బంతికి దూబనే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు అసలంక.ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ బౌలింగ్లో దూబే ముందుకు వచ్చి ఆడబోగా.. బంతి ముందుగా ప్యాడ్ను తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా దూబే పెవిలియన్ చేరగా.. అర్ష్దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అయితే, వచ్చీ రాగానే అసలంక బౌలింగ్లో భారీ స్లాగ్స్వీప్ షాట్ ఆడబోయిన అర్ష్దీప్.. పూర్తిగా విఫలమయ్యాడు. అసలంక బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ పదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ టై గా ముగిసింది.నిజానికి.. ఇంకా 14 బంతులు మిగిలి ఉండి.. విజయానికి ఒక్క పరుగు తీయాల్సిన సమయంలో అర్ష్దీప్ డిఫెన్స్ ఆడాల్సింది. కానీ అలా చేయకుండా బ్యాటర్ మాదిరి భారీ షాట్కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ షాట్ సెలక్షన్పై విమర్శలు వస్తున్నాయి. మాజీ పేసర్ దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెయిలెండర్ల నుంచి పరుగులు ఆశించలేం.కానీ కనీస క్రికెట్ ప్రమాణాలు తెలిసి ఉండాలి కదా! అర్ష్దీప్ షాట్ సెలక్షన్ కచ్చితంగా గంభీర్కు నచ్చి ఉండదు. ఏదేమైనా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ఆడారు. అండర్డాగ్స్గా బరిలోకి దిగిన శ్రీలంకకు ఈ ఫలితం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. టీమిండియా అభిమానులు సైతం దొడ్డ గణేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అర్ష్పై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో లెఫ్టార్మ్ మీడియం పేసర్ అర్ష్దీప్ సింగ్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.What a dramatic turn of events! 😲Back-to-back wickets for skipper Asalanka turned the game on its head, with the match tied! 😶🌫️Watch #SLvIND ODI series LIVE on #SonyLIV 🍿 pic.twitter.com/qwu5rmlZIQ— Sony LIV (@SonyLIV) August 2, 2024Hard to digest Arshdeep Singh's last-over mistake. With just 1 run needed off 14 balls, conceding a six is tough to watch.Was it fearless cricket or a blunder? Either way, it stings. #ArshdeepSingh #INDvsSL #RohitSharma𓃵pic.twitter.com/3ghC56p38r— Sagar Lohatkar (@sagarlohatkar) August 3, 2024 -
భారీ సిక్సర్లు బాదిన కోహ్లి- రోహిత్.. గంభీర్ రియాక్షన్ వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియా సన్నద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్తో పునరాగమనం చేయనున్నారు. వీరితో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సైతం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అదే విధంగా.. ఐపీఎల్-2024 తర్వాత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వీరంతా ఇప్పటికే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. ఆతిథ్య శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి వన్డే పూర్తి స్థాయిలో సిద్దమయ్యారు.ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. నెట్స్లో శ్రమిస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వారి ప్రాక్టీస్ను గమనించాడు. ఇక ఈ ఇద్దరు స్టార్లు భారీ సిక్సర్లతో చెలరేగగా.. గంభీర్ నవ్వుతూ వారెవ్వా అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీమిండియా అభిమానులను ఆకర్షిస్తోంది.వీడియోపై స్పందిస్తూ.. ముగ్గురు లెజెండ్స్ని ఇలా చూస్తూ ఉంటే కళ్లు సరిపోవడం లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గౌతం గంభీర్ హెడ్కోచ్గా నియమితుడు కాగానే సీనియర్లకు షాకివ్వడం ఖాయమని.. ముఖ్యంగా కోహ్లికి కష్టాలు మొదలైనట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తన తొలి ప్రెస్ మీట్లోనే గంభీర్ వీటిని కొట్టిపారేశాడు. రోహిత్, కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్లని.. ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్కప్-2027 దాకా ఆడగలరంటూ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరు జట్టుకు బలం అని.. వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న సమయంలో గంభీర్- కోహ్లి మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇద్దరు ఆలింగనం చేసుకోవడంతో ఆ వివాదం సమసిపోయినట్లయింది. ఇక ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా ఉన్న గంభీర్ ఆ జట్టును విజేతగా నిలిపి.. ఆపై భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. T20I Series ✅It's now time for ODIs 😎🙌#TeamIndia | #SLvIND pic.twitter.com/FolAVEn3OG— BCCI (@BCCI) August 1, 2024 -
Ind vs SL: ఆ విషయం గంభీర్తో చర్చిస్తా: రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్.. ఈ కర్ణాటక బ్యాటర్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 వన్డేల్లో వికెట్ కీపర్గా వ్యవహరించాడు. సగటు 58.91తో మొత్తంగా 1355 పరుగులు సాధించాడు ఈ కుడిచేతివాటం బ్యాటర్. ఇందులో రెండు శతకాలు, పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. 48 స్టంపింగ్స్లోనూ భాగమయ్యాడు 32 ఏళ్ల కేఎల్ రాహుల్. ఓవరాల్గా ఇప్పటి వరకు 75 వన్డేలు ఆడిన రాహుల్ ఖాతాలో 2820 పరుగులు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్-2023 జట్టులోనూ అతడే వికెట్ కీపర్గా వ్యవహరించాడు.సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరంమరోవైపు.. రిషభ్ పంత్.. 26 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 30 వన్డేలు ఆడి 865 పరుగులు సాధించాడు. టెస్టులు(సగటు 43.67- 2271 రన్స్), టీ20(1209 రన్స్)లతో పోలిస్తే వన్డేల్లో ఈ ఉత్తరాఖండ్ ప్లేయర్ రికార్డు గొప్పగా ఏమీ లేదు. 2022 డిసెంబరులో ఘోర కారు ప్రమాదం తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు.రీ ఎంట్రీలో అదుర్స్ ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024 నాటికి పునరాగమనం చేసిన రిషభ్ పంత్ కారణంగా.. వరల్డ్కప్ జట్టులో కేఎల్ రాహుల్కు చోటు కరువైంది. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ వన్డే సిరీస్లో భాగంగా తుదిజట్టులో స్థానానికై వీరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.పంత్.. రాహుల్.. ఇద్దరిలో ఎవరు?ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన రాహుల్ వైపు మొగ్గుచూపుతారా.. లేదంటే పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తారా అన్న అంశం చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడగా.. ఈ విషయమై ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్ కీపర్ బ్యాటర్లు రాహుల్- పంత్ల మధ్య ఒకరినే ఎంచుకోవాలంటే కష్టమే. ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లే. ఇద్దరు సమర్థులే. మ్యాచ్ విన్నర్లు కూడా!హెడ్కోచ్తో చర్చిస్తానుగతంలో ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. అలాంటివాళ్లలో ఒకరినే ఎంచుకోవాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటివి సమస్యలుగా పరిణమిస్తాయి. అయితే, ఒకందుకు ఇది కూడా మంచిదే. కెప్టెన్గా నాకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉండటం మంచి విషయమే.రాహుల్- పంత్ల గురించి హెడ్కోచ్తో చర్చిస్తాను. మేము రేపు మ్యాచ్ ఆడేటపుడు మీకు ఈ విషయంపై స్పష్టత వస్తుంది. భారత క్రికెట్ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆడటం ముఖ్యం. ప్రయోగాలు సహజమే అయినా అందుకు ఓటమి రూపంలో మూల్యం చెల్లించాల్సి వస్తే మా ప్రయత్నం విరమించుకోవడమే ఉత్తమమని భావిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శుక్రవారం మధ్యాహ్నం తొలి వన్డే జరుగనుంది. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ సిరీస్తోనే టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ ప్రయాణం మొదలుపెట్టాడు. తాజాగా వన్డేల్లోనూ తన మార్కు చూపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: వన్డే వరల్డ్కప్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్! -
Ind vs SL: గంభీర్ గైడెన్స్.. కోహ్లి- రోహిత్ ప్రాక్టీస్
శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్ధమవుతున్నారు. వీరితో పాటు లంకతో వన్డేలకు ఎంపికైన కుల్దీప్, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్లు ఇప్పటికే కొలంబో చేరుకొని సోమవారం నుంచి నెట్స్లో చెమటోడ్చుతున్నారు. గత నెల వెస్టిండీస్ గడ్డపై భారత్ రెండో టీ20 ప్రపంచకప్ గెలిచిన రోజే భారత స్టార్లు రోహిత్, కోహ్లి పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పారు.ఇప్పుడు మళ్లీ.. దాదాపు నెలరోజుల తర్వాత అంతర్జాతీయ వన్డేలు ఆడేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కొలంబోలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ట్రెయినింగ్లో వీళ్లంతా ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. తాజాగా.. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.కోహ్లితో చర్చరోహిత్- కోహ్లి కలిసి నెట్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. గంభీర్ దగ్గరుండి వీక్షించాడు. ఈ క్రమంలో కోహ్లితో చాలా సేపు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసిన నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ వన్డే సిరీస్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దిగ్గజాలతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ సహా మిగిలిన ఆటగాళ్ల సన్నద్ధతపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.కాగా జూలై 27, 28, 30 తేదీల్లో పల్లెకెలె వేదికగా టీమిండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ సేన 3-0తో ఆతిథ్య శ్రీలంక జట్టును క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. మూడు వన్డేలు(ఆగస్టు 2, 4, 7) కొలంబోలని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి. శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. Great to see two old Delhi teammates connecting over a long chat after a batting session in Colombo. pic.twitter.com/VfjdjANkxa— Vimal कुमार (@Vimalwa) July 31, 2024 -
టీ20 సిరీస్ క్లీన్స్వీప్: ఇది చాలదు.. ఇంకా కావాలి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్కు ఘనమైన ఆరంభం లభించింది. అతడి మార్గదర్శనంలోని టీమిండియా శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. లంక పర్యటనలో భాగంగా మూడు టీ20లలోనూ గెలుపొంది మరోసారి తమ స్థాయిని చాటుకుంది. ఈ నేపథ్యంలో జట్టును ఉద్దేశించి గంభీర్ ప్రసంగించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.‘‘అద్భుతమైన విజయం ఇది. సిరీస్ గెలిచినందుకు మీ అందరికీ అభినందనలు. అత్యద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు విజయం అందించిన సూర్యకు శుభాకాంక్షలు. బ్యాటర్గానూ అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సిరీస్ ఆరంభానికి ముందు నేను ఏం కోరుకుంటున్నానో మీకు చెప్పాను.అయితే, మీరు అంతకంటే ఎక్కువే సాధించారు. అయితే, ఇలాంటి వికెట్లపై రాణించాలంటే మన నైపుణ్యాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పిచ్ స్వభావం, ఎంత మేర స్కోరు చేయవచ్చో ముందుగానే అంచనా వేస్తున్నాం. అయితే, కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చు. ఈ మ్యాచ్ ద్వారా మనమెన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నాం. సిరీస్ గెలుపు కంటే కూడా ఇదే గొప్ప విషయం’’ అని గౌతం గంభీర్ టీమిండియాను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా మంగళవారం నాటి మూడో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ చెత్తగా సాగింది.నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగుల నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆతిథ్య లంక గట్టిపోటీనివ్వడంతో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. అయితే, భారత బౌలర్ల కారణంగా మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సూపర్ ఓవర్ వేయగా.. శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. ఇక 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ తొలి బంతికే బౌండరీ బాది ఛేదించింది.𝗧𝗵𝗶𝘀 𝗧𝗲𝗮𝗺 💙 Head Coach Gautam Gambhir 🤝 Hardik Pandya address the dressing room as the action now shifts to the ODIs in Colombo #TeamIndia | #SLvIND | @GautamGambhir | @hardikpandya7 pic.twitter.com/PFrTEVzdvd— BCCI (@BCCI) July 31, 2024 -
పదేళ్ల పాటు టీమిండియా కెప్టెన్ అతడే.. కానీ!
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియాలో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. అంతేకాదు.. ఊహించని రీతిలో భారత టీ20 జట్టు కెప్టెన్గానూ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ వారసుడిగా.. పూర్తిస్థాయి కెప్టెన్గా తొలి సిరీస్లోనే విజయం అందుకున్నాడు ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టేఅయితే, సూర్య పదవి తాత్కాలికమే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని ఎంచుకోలేదని అభిప్రాయపడ్డాడు. కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్కు ఇప్పటికిప్పుడు గొప్ప ఆప్షన్లు లేవు కాబట్టే.. సూర్య వైపు మొగ్గుచూపారని పేర్కొన్నాడు. సీనియర్లు రిటైర్ కావడం, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలు సూర్యను కెప్టెన్గా నియమించడానికి దోహదం చేశాయని స్టైరిస్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.రెండేళ్లపాటు మాత్రమేఏడాది లేదంటే రెండేళ్లపాటు మాత్రమే సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్గా ఉంటాడని స్టైరిస్ అంచనా వేశాడు. అతడి స్థానంలో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ భారత జట్టు పగ్గాలు చేపడతాడని.. అతడిని పూర్తిస్థాయి సారథిగా తీర్చిదిద్దేందుకే సూర్య డిప్యూటీగా నియమించారని పేర్కొన్నాడు. గంభీర్కు- భవిష్య కెప్టెన్కు మధ్య సూర్య కేవలం ఓ వారథి లాంటివాడు మాత్రమే అని స్టైరిస్ చెప్పుకొచ్చాడు.పదేళ్ల పాటు అతడేటీమిండియా భవిష్య కెప్టెన్ శుబ్మన్ గిల్ మాత్రమే అని.. 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతాడని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇప్పుడే భారత జట్టు పగ్గాలు చేపట్టేందుకు తగిన అనుభవం అతడికి లేదని.. అందుకే సూర్య రూపంలో తాత్కాలిక ఏర్పాటు చేశారని పేర్కొన్నాడు. ఒకవేళ సూర్య ద్వైపాక్షిక సిరీస్లలో టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపిస్తే.. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడే సారథిగా కొనసాగుతాడని స్టైరిస్ అంచనా వేశాడు.భారత క్రికెట్ను ఏలుతాడుశుబ్మన్ గిల్ రోజురోజుకు తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడని.. అయితే, మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడటం ముఖ్యమని స్టైరిస్ పేర్కొన్నాడు. అలా అయితేనే, వరుస అవకాశాలు దక్కించుకుని కెప్టెన్ రేసులో ముందుంటాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరని.. అయితే, తన దృష్టిలో మాత్రం రానున్న దశాబ్దంలో గిల్ భారత క్రికెట్ను ఏలుతాడని స్కాట్ స్టైరిస్ పేర్కొన్నాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఇద్దరూ విజయవంతంగాకాగా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో 33 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై, సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియాను విజేతగా నిలిపాడు. తాజాగా రెగ్యులర్ కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే శ్రీలంక టూర్లో భారత్కు 2-0తో సిరీస్ను అందించాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్మన్ గిల్ సారథ్యం వహించాడు. 4-1తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ గెలిచాడు.చదవండి: ‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’ -
‘ద్రవిడ్ వల్లే కాలేదు.. ఇక్కడ నేనే బాస్ అంటే కుదరదు’
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ శుభారంభం చేశాడు. శ్రీలంకపై సిరీస్ విజయంతో తన ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టాడు. గతంలో కోచ్గా పనిచేసిన అనుభవం లేకున్నా తొలి ప్రయత్నంలోనే విజయవంతమయ్యాడు. టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ జట్టుతో అనుకున్న ఫలితం రాబట్టాడు.‘సూపర్స్టార్ల’తో అంత వీజీ కాదుఅయితే.. ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నా వన్డే సిరీస్ రూపంలో గంభీర్కు గట్టి సవాల్ ఎదురుకానుంది. ప్రత్యర్థి శ్రీలంక బలాబలాలను పక్కనపెడితే.. ‘సూపర్స్టార్ల’ను అతడు ఏ మేరకు డీల్ చేయగలడన్నది ఆసక్తికరంగా మారింది. వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అందుబాటులోకి వచ్చాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీ నేపథ్యంలో లంకతో సిరీస్కు ప్రాధాన్యం ఏర్పడగా.. సెలవులు ముగించుకుని జట్టుతో చేరారు. అసలే దూకుడు స్వభావం ఉన్న గంభీర్.. వీరిద్దరిని ఎలా కలుపుకొనిపోతాడన్నది క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సన్నిహిత వర్గాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘‘ఇది అంత సులువేమీ కాదు. ఫ్రాంఛైజీ క్రికెట్లో లాగా నేను బాస్ను... నువ్విది చేయాల్సిందే అంటే కుదరదు. ఇక్కడి వాతావరణం వేరుగా ఉంటుంది. ఇండియన్ డ్రెస్సింగ్రూం విషయానికొస్తే.. ప్రతి ఒక్క ప్లేయర్తో ఓపికగా మాట్లాడాల్సి ఉంటుంది. అవసరమైతే స్వయంగా ఫోన్ చేయాల్సి ఉంటుంది. అందరూ లక్షాధికారులేద్రవిడ్ కూడా అలాగే చేసేవాడు. హెడ్కోచ్గా వచ్చిన కొత్తలో అతడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పటికి.. ఇప్పటికి భారత క్రికెట్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ఉన్న ఆటగాళ్లలో అందరూ లక్షాధికారులే. అంతేకాదు ఐపీఎల్లో కెప్టెన్లుగా పనిచేస్తున్న వారూ ఉన్నారు. వాళ్లందరినీ సాఫీగా డీల్ చేయడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఐపీఎల్లో సత్తా చాటికాగా టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలిచిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన గంభీర్.. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్గా కొనసాగాడు. కోల్కతా నైట్ రైడర్స్ను రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్గా నిలిపిన ఈ ఢిల్లీ బ్యాటర్.. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది కోల్కతా ఫ్రాంఛైజీ మెంటార్గా బాధ్యతలు స్వీకరించి.. జట్టు మూడోసారి ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆగష్టు 2 నుంచి మొదలుఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. కోచ్గా శ్రీలంక పర్యటనతో కెరీర్ మొదలుపెట్టిన గౌతం గంభీర్.. 2-0తో టీ20 సిరీస్ గెలిచాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం నామమాత్రపు మూడో టీ20 జరుగనుండగా.. ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. కాగా రోహిత్, కోహ్లిలు వరల్డ్క్లాస్ క్రికెటర్లు అంటూ ప్రశంసించిన గంభీర్.. వారితో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: గిల్ కంటే ఆ విషయంలో అతడే బెటర్.. ఇద్దరినీ ఆడిస్తే తప్పేంటి? -
రింకూ కాదు!.. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ అతడే: సూర్య
శ్రీలంకతో సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్ను నంబర్ వన్గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్ కెప్టెన్ హోదాలో తన తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జట్టులో అతడే కీలకంఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ టీమిండియా యువ క్రికెటర్పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్ ఫ్యాక్టర్) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్ మరెవరో కాదు అసోం ఆల్రౌండర్ రియాన్ పరాగ్. దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సందర్భంగా శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్ పరాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్లో మూడు మ్యాచ్లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. అతడే ఎందుకంటూ విమర్శలుఅంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్ను సెలక్ట్ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్రౌండర్ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా మారిపోయాడుఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రియాన్ పరాగ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్ అనేది కామన్. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్ పరాగ్ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్ ఫ్యాక్టర్ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కాగా రియాన్ పరాగ్ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్ లేదు! -
నువ్వు తేలిగ్గా తలొగ్గే రకం కాదు: గంభీర్కు ద్రవిడ్ సందేశం
‘‘హలో గౌతం.. భారత క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన విధుల నిర్వహణకు సమాయత్తమైన నీకు స్వాగతం పలుకుతున్నా. మూడు వారాల క్రితం.. టీమిండియా హెడ్కోచ్గా నేను కన్న కలలు బార్బడోస్లో నెరవేరాయి. ఇక ముంబైలో అందుకు సంబంధించిన సంబరాల సాయంత్రాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.అయితే, జట్టుతో నా స్నేహం, నేను పోగు చేసుకున్న మధుర జ్ఞాపకాలు మరెన్నో ఉన్నాయి. భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించబోతున్న నీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు లభించాలని కోరుకుంటున్నాను. నీ హయాంలోప్రతి జట్టులోనూ నువ్వు కోరుకున్న ఆటగాళ్లు పూర్తి ఫిట్గా ఉండి.. నీ ప్రణాళికలకు అనుగుణంగా అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదునిజానికి కోచ్ అంటే.. మనం సాధారణంగా ఆలోచించే దానికంటే కూడా మరింత తెలివిగా.. ఇంకాస్త స్మార్ట్గా ఉండాలి. నీకు ఇవన్నీ తెలుసుననుకో. నీ సహచర ఆటగాడిగా మైదానంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు. నీ బ్యాటింగ్ పార్ట్నర్గా.. తోటి ఫీల్డర్గా నీ నైపుణ్యాలు దగ్గరగా చూశాను. ప్రత్యర్థి ముందు నువ్వు తేలికగా తలొగ్గేరకం కాదు.ఐపీఎల్లోనూ నీలో ఇలాంటి ఆటతీరునే చూశాను. గెలుపు కోసం నువ్వు ఎంత పరితపిస్తావో నాకు తెలుసు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి వారిలో విజయకాంక్ష రగిల్చే తీరు అద్భుతం. టీమిండియా కోచ్గానూ నువ్విలాగే ఉండాలి. భారీ అంచనాల నడుమ కీలక బాధ్యత తీసుకోబోతున్నావు.జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు, సహాయక సిబ్బంది.. గెలిచినా.. ఓడినా నీ వెన్నంటే ఉంటారు. విజయాల్లోనే కాదు.. చేదు అనుభవాలను సమంగా పంచుకుంటారు. కొన్నిసార్లు మనం వెనకడుగు వేయాల్సి వస్తుంది. నీ స్వభావానికి ఇది విరుద్ధమని నాకు తెలుసు. అయితే, చిరునవ్వుతో అన్నింటినీ జయించగలవు.ఇక్కడ ఏ చిన్న సంఘటన అయినా అభిమానులకు ఆసక్తికరమే. కాబట్టి నీ కదలికలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏదేమైనా భారత క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగల సత్తా నీకు ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ గౌతం’’ అంటూ టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ గౌతం గంభీర్కు ప్రత్యేక సందేశం పంపించాడు.గంభీర్ భావోద్వేగంశ్రీలంక పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన కోచ్గా గంభీర్ ప్రస్థానం మొదలుకానున్న వేళ.. తన వారసుడిని ప్రత్యేకంగా విష్ చేశాడు. ఇందుకు స్పందించిన గౌతీ.. ద్రవిడ్కు ధన్యవాదాలు తెలిపాడు. తాను ఇంత వరకు చూసిన నిస్వార్థమైన క్రికెటర్లలో ఒకడైన రాహుల్ భాయ్ నుంచి మెసేజ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నాడు. సాధారణంగా తాను ఎమోషనల్కానని.. అయితే, రాహుల్ భాయ్ మాటలు విని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యానని తెలిపాడు.నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరిస్తూ ద్రవిడ్ విడిచి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. దేశంతో పాటు రాహుల్ భాయ్ను కూడా సగర్వంగా తలెత్తుకునేలా చేస్తానని గంభీర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాగా శ్రీలంక- టీమిండియా మధ్య శనివారం నాటి తొలి టీ20తో ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. 𝗣𝗮𝘀𝘀𝗶𝗻𝗴 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗯𝗮𝘁𝗼𝗻 𝘄𝗶𝘁𝗵 𝗰𝗹𝗮𝘀𝘀 & 𝗴𝗿𝗮𝗰𝗲! 📝To,Gautam Gambhir ✉From,Rahul Dravid 🔊#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/k33X5GKHm0— BCCI (@BCCI) July 27, 2024 -
ఐపీఎల్ ఫ్రాంఛైజీకి గుడ్బై.. టీమిండియా బౌలింగ్ కోచ్గా!
టీమిండియా బౌలింగ్ కొత్త కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ ఎంపిక ఖరారైనట్లు సమాచారం. నూతన హెడ్కోచ్ గౌతం గంభీర్ సహాయక సిబ్బందిలో చేరేందుకు మోర్కెల్ మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రొటిస్ పేస్ దళంలో కీలక బౌలర్గా సేవలు అందించిన మోర్నీ మోర్కెల్.. గత కొన్నేళ్లుగా ఐపీఎల్తో బంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా గౌతం గంభీర్ వ్యవహరించిన సమయంలో ఆ జట్టు కీలక పేసర్లలో మోర్కెల్ ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ లక్నో సూపర్ జెయింట్స్లో కలిసి పనిచేశారు. లక్నో మెంటార్గా గంభీర్ వ్యవహరించగా.. బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ఉన్నాడు.అనంతరం గంభీర్ కేకేఆర్ మెంటార్గా మారగా.. మోర్కెల్ మాత్రం ఐపీఎల్-2024లోనూ లక్నోతోనే కొనసాగాడు. తాజాగా ఫ్రాంఛైజీతో బంధం తెంచుకునేందుకు మోర్నీ మోర్కెల్ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యే క్రమంలోనే 39 ఏళ్ల మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత జట్టు కోచ్గా పనిచేయాలంటే.. ఇతర బాధ్యత(క్రికెట్కు సంబంధించిన)ల నుంచి సదరు వ్యక్తులు వైదొలగాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే గంభీర్ కేకేఆర్ను వీడగా.. ఇప్పుడు మోర్నీ మోర్కెల్ కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్సైడ్స్పోర్ట్ వెల్లడించింది. టీమిండియా శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్గా మోర్నె మోర్కెల్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా మోర్కెల్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానుంది. ఇరు జట్ల మధ్య తొలుత మూడు టీ20లు.. తర్వాత మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరుగనుంది. ఈ టూర్తో టీమిండియా ప్రధాన కోచ్గా గౌతం గంభీర్ ప్రస్థానం ఆరంభం కానుంది. ఇక ఈ పర్యటనలో టీమిండియా బౌలింగ్ తాత్కాలిక కోచ్ సాయిరాజ్ బహుతులే ఎంపికయ్యాడు. కేకేఆర్లో గౌతీ సహచరులు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటే అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనుండగా.. ఫీల్డింగ్ కోచ్గా టి.దిలీప్ రీఎంట్రీ ఇచ్చాడు. -
సమరానికి సిద్ధం.. రేపటి నుంచి భారత్-శ్రీలంక టీ20 సిరీస్ (ఫొటోలు)
-
‘కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ స్పృహతప్పడం ఖాయం’
విరాట్ కోహ్లి.. రోహిత్ శర్మ.. దశాబ్దకాలంగా భారత క్రికెట్ ముఖచిత్రంగా నీరాజనాలు అందుకుంటున్న స్టార్ బ్యాటర్లు. టీమిండియా తరఫున ఎన్నో రికార్డులు సాధించిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఇటీవలే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించారు.వరల్డ్కప్-2027 వరకు జట్టులోఈ నేపథ్యంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్- బ్యాటర్ కోహ్లి భవితవ్యం గురించి చర్చలు తెరమీదకు రాగా.. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడతామని ఇద్దరూ స్పష్టం చేశారు. టీమిండియా కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం రోహిత్- కోహ్లి ఫిట్నెస్ కాపాడుకుంటే వన్డే వరల్డ్కప్-2027 వరకు జట్టులో కొనసాగుతారని పేర్కొన్నాడు.అయితే, అదేమీ అంత తేలికకాదంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్. వచ్చే వరల్డ్కప్ ఈవెంట్లో కోహ్లి ఆడగలిగినా.. రోహిత్ ఆడటం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. ‘విరాహిత్’ విషయంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన చిక్కా..కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ స్పృహతప్పడం ఖాయం‘‘రోహిత్ గొప్ప ఆటగాడు. అయితే, ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు. వచ్చే వన్డే వరల్డ్కప్ నాటికి ఇంకో మూడేళ్లు పెరుగుతుంది. అంటే.. 40 ఏళ్లు. ఈ ఏజ్లో ఓ క్రికెటర్ వరల్డ్కప్ ఆడలేడు. అయితే, విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు భిన్నం.అతడికి 2027 వరల్డ్కప్ వరకు ఆడగల సత్తా ఉంది.అయితే, రోహిత్ మాత్రం అప్పటిదాకా కొనసాగలేడని కచ్చితంగా చెప్పగలను. అతడి విషయంలో మిస్టర్ గంభీర్ కాస్త ఎక్కువే ఊహించుకుంటున్నాడు. నిజానికి రోహిత్ను సౌతాఫ్రికా తీసుకువెళ్తే అతడు అక్కడ బ్యాటింగ్ చేయలేక స్పృహతప్పిపోవడం ఖాయం’’ అని పేర్కొన్నాడు. 35 ఏళ్ల కోహ్లి మాత్రం అక్కడ కూడా రాణించగలడని శ్రీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా ఫిట్నెస్కు మారుపేరైన కోహ్లి.. ఫిట్గా లేని కారణంగా ఇంత వరకు ఒక్కసారి కూడా జట్టుకు దూరం కాలేదు. అయితే, రోహిత్ పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ నేపథ్యంలోనే క్రిష్ణమాచారి శ్రీకాంత్ పైవిధంగా స్పందించినట్లు చెప్పవచ్చు.ఇక 2027 వరల్డ్కప్ టోర్నీకి సౌతాఫ్రికా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. అక్కడ మూడు టీ20 ,మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది.చదవండి: అందుకే హెడ్కోచ్ పదవికి అప్లై చేయలేదు.. హార్దిక్ విషయంలో..: నెహ్రా -
‘అందుకే అప్లై చేయలేదు.. నేను గంభీర్లా కాదు’
శ్రీలంక తాజా పర్యటనతో భారత క్రికెట్లో నూతన శకం ఆరంభం కానుంది. ఇంతవరకు కోచ్గా అనుభవం లేని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటర్మెంట్ తర్వాత భారత్ తొలిసారి టీ20 సిరీస్లో పాల్గొననుంది.ఇక ఈ జట్టుకు నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిస్థాయికి కెప్టెన్గా నియమితుడైన విషయం తెలిసిందే. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు టీ20 పగ్గాలు అప్పగించడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సైతం తన అభిప్రాయం వ్యక్తపరిచాడు.ఆశ్చర్యం కలిగించలేదు‘‘హార్దిక్ పాండ్యా మూడు ఫార్మాట్లు ఆడలేకపోతున్నాడు. టెస్టులకు దూరమైన అతడు యాభై ఓవర్ల క్రికెట్లోనూ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. అలాంటి ఆటగాడి సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనుకోవడం కత్తిమీద సాము లాంటిదే.అయినా క్రికెట్లో ఇవన్నీ సహజం. హార్దిక్పై వేటు వేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని ఇలా అకస్మాత్తుగా రేసు నుంచి తప్పించడం మాత్రం ఆశ్చర్యకరం. అయితే, కొత్త కోచ్ ఆలోచనలేమిటో మనకు తెలియదు. ప్రతి కోచ్, కెప్టెన్ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కదా’’ అని ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోలేదని 45 ఏళ్ల నెహ్రా తెలిపాడు. ఇందుకు గల కారణాలు కూడా వెల్లడించాడు.నేను గంభీర్లా కాదు‘‘ఈ విషయం గురించి నేను ఎన్నడూ ఆలోచించనేలేదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. గౌతం గంభీర్ పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అయితే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు.ప్రస్తుతం నా పనులతో నేను బిజీగా, సంతోషంగా ఉన్నాను. జట్టుతో కలిసి తొమ్మిది నెలల పాటు ప్రయాణించే ఓపిక నాకు లేదు’’ అని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. కాగా ఆశిష్ నెహ్రా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో కలిసి పనిచేస్తున్నాడు.టైటాన్స్తో అనుబంధంఐపీఎల్-2022లో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు నెహ్రా మార్గదర్శనంలోని హార్దిక్ పాండ్యా సారథ్యంలో చాంపియన్గా అవతరించింది. మరుసటి ఏడాది కూడా ఫైనల్ చేరింది. అయితే, ఐపీఎల్-2024లో పాండ్యా టైటాన్స్తో బంధం తెంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు.చదవండి: ‘ప్రేమ’తో నటాషా పోస్ట్.. హార్దిక్ పాండ్యా కామెంట్ వైరల్ -
ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. అతడిపై గంభీర్ ఫోకస్!
శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. కొత్త కోచ్ గౌతం గంభీర్ మార్గ నిర్దేశనంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.కోచ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు హార్దిక్ పాండ్యా, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివం దూబే తదితర ఆటగాళ్లంతా సోమవారమే కొలంబోకు చేరుకున్నారు. వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తదితరులు కాస్త ఆలస్యంగా లంకకు వెళ్లనున్నారు.కాగా శనివారం(జూలై 27) టీ20 మ్యాచ్తో శ్రీలంక- టీమిండియా సిరీస్కు తెరలేవనుంది. ఇందుకోసం సూర్య సేన మంగళవారం నుంచే నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కాండీలో జరుగుతున్న ఈ సెషన్ను గౌతం గంభీర్ దగ్గరుండి మరీ వీక్షించాడు. వ్యక్తిగతంగా ఒక్కో ఆటగాడి దగ్గరకు వెళ్లి మరీ సూచనలు, సలహాలు ఇచ్చాడు. సంజూ శాంసన్పై ప్రత్యేక దృష్టిపెట్టాడు.𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc— BCCI (@BCCI) July 23, 2024 ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కోచ్ అవతారంలో గౌతీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గంభీర్ హయాంలో భారత క్రికెట్ మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని మురిసిపోతున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ను టీమిండియా శిక్షకుడిగా నియమించింది బీసీసీఐ. కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా ఈ ఏడాది ఆ జట్టు చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతీకి భారత జట్టు బాధ్యతలు అప్పజెప్పింది. Now watching: #TeamIndia's new T20I captain 🇮🇳💙Go well, Surya Dada 👏#SonySportsNetwork #SLvIND | @surya_14kumar pic.twitter.com/aXSic8Z4PS— Sony Sports Network (@SonySportsNetwk) July 23, 2024