breaking news
Gautam Gambhir
-
లైవ్లోనే గంభీర్కు ఇచ్చిపడేసిన హిట్ మ్యాన్..!
-
గంభీర్ చేతుల్లో అతడి కెరీర్ కూడా నాశనమేనా!
టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ఆరో స్థానంలో పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ను ఆరో స్థానంలో కాకుండా ఇషాన్ కిషన్ స్థానంలో పంపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. Photo Credit: BCCI Twitterరాహుల్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 36 బంతుల్లో 84 పరుగులు కావాలి. కానీ రాహుల్ ఔటైతే ఆ తర్వాత స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎవరూ లేరని, దీంతో ఒత్తిడికి లోనయ్యి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఇది ముమ్మాటికి గంభీర్ తప్పిదమేనని, కేఎల్ రాహుల్ ఏమైనా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చేవాడిలా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆలోచనలేమితో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ కెరీర్లు భ్రష్టు పట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరీర్ను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి మూడో వన్డేలో 387 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్కు బట్లర్లాగే ఆ స్థానంలో మనకు కీ ప్లేయర్ ఉండాలి. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే.. అప్పుడు నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్కు బదులు కేఎల్ రాహుల్ను పంపించాల్సింది. Photo Credit: BCCI Twitter2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా ఐదో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చి కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. నిన్నటి మ్యాచ్లో అది జరిగి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్ను ఆరో స్థానంలో ఆడించడం వల్ల మరో ఉపయోగం కూడా ఉండేది. ఆఖర్లో ధాటిగా ఆడాల్సిన సమయంలో అక్షర్ పటేల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను నడిపించగలడని పేర్కొన్నాడు. నిజానికి టాప్ క్లాస్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ శైలిని మార్చుకోగల నేర్పరి అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక 2023 వన్డే ప్రపంచకప్లో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ను ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్కు పంపుతున్నాడు. అక్షర్ పటేల్ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీమ్ మేనేజ్మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా.. ఇంగ్లండ్ సిరీస్లో మాత్రం తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం రాహుల్ బ్యాటింగ్ స్థానం, టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.ఇక ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో 2 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. Before recording this video, I honestly thought KL RAHUL might get out, and here he is..... Bowled😭 pic.twitter.com/fjrGLx96Vo— Vipin Tiwari (@Vipintiwari952) July 19, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
రంగంలోకి జైషా..ఒక్క ఫోన్ కాల్ తో వణికిపోయిన గంభీర్, అగార్కర్
-
ODI WC: రోహిత్ విఫలం.. ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది.రో- కో విఫలంఅయితే, ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచారు. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 21 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసి.. సామ్ కరన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ కోహ్లి.. ఆరు బంతుల్లో ఒక ఫోర్ బాది.. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో రో-కో ఆడటంపై మరోసారి చర్చమొదలైంది.ప్రయోగాలు చేస్తాంఇప్పటికే ప్రయోగాలు చేస్తామంటూ కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పష్టం చేసిన తరుణంలో.. రోహిత్- కోహ్లిని పక్కనపెట్టే సాహసం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ రోహిత్ విషయంలో మేనేజ్మెంట్ వైఖరి గురించి కీలక విషయాలు వెల్లడించాయి.ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ ఇప్పటికే ఎంతో గొప్పగా సేవ చేశాడు. కాబట్టి కోచ్ (గంభీర్) అతడికి స్వేచ్ఛనిచ్చాడు. ఇన్నాళ్లుగా ఎలా ఆడాడో.. ఇప్పుడు కూడా అలాగే ఆడేమని స్వేచ్ఛగా వదిలేశాడు.అయితే, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కోచ్ అతడి పట్ల సానుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా రోహిత్ ఒత్తిడి లేకుండా.. ప్రశాంతమైన మనసుతో మ్యాచ్ ఆడేలా చూస్తున్నారు. అలా అయితేనే రోహిత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడని యాజమాన్యం నమ్ముతోంది.మేనేజ్మెంట్కు ఆ విషయం తెలుసునిజానికి రోహిత్ ఒత్తిడిలో ఉంటే ఏం జరిగిందో చూశాం కదా!.. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ అతడి ప్రతి ఇన్నింగ్స్ను భూతద్దంలో పెట్టి చూడాలనుకోవడం లేదు. అతడి స్థాయి ఏమిటో యాజమాన్యానికీ తెలుసు. రోహిత్ ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా ఆడితే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి మేనేజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. టెక్నిక్లో ఉన్న చిన్నపాటి లోపాలు సరిచేసుకుంటే హిట్మ్యాన్కు తిరుగు ఉండదు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా హెడ్కోచ్ గౌతం గంభీర్ రోహిత్ శర్మ పట్ల సానుకూలంగానే ఉన్నట్లు దీనిని బట్టి తెలుస్తోంది. అతడి అనుభవం, దూకుడైన ఆట జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న గంభీర్.. వరల్డ్కప్లో హిట్మ్యాన్ను ఆడించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: IND vs ENG: అతడిని ఆరో స్థానంలో ఆడిస్తారా? -
మాట తప్పిన బీసీసీఐ!?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా అంశంలో బిగ్ ట్విస్ట్..! వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు తన పదవి నుంచి తప్పుకొన్నాడని తొలుత వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్తో జరుగుతున్న వన్డే సిరీస్ తర్వాత డస్కటే తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది.మాట తప్పిన బీసీసీఐ!అయితే, కేవలం వ్యక్తిగత కారణాలు కాకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యాజమాన్యం తనకు ఇచ్చిన మాట తప్పినందు వల్లే డస్కటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం. కాగా రెండేళ్ల క్రితం గౌతం గంభీర్ భారత హెడ్ కోచ్గా నియమితుడైన తర్వాత డస్కటే టీమ్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికైన సంగతి తెలిసిందే. గంభీర్ ఏరికోరి తెచ్చుకుంటే..గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ.. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కలిసి పని చేసిన అనుభవంతో డస్కటేను గంభీర్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికీ తన బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో డస్కటే జట్టుకు దూరం కావడమే సరైందిగా భావిస్తున్నట్లు తెలిసింది. టీమ్తో చేరినప్పుడు తనకు స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారట. కానీ హైదరాబాద్కు చెందిన టి.దిలీప్ను చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కొనసాగించడంతో డస్కటేకు ఆ అవకాశం దక్కలేదు.పని లేదు.. అందుకే‘బ్యాటింగ్ బాధ్యతలను గంభీర్తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ చూస్తున్నారు. పేసర్ల కోసం మోర్నీ మోర్కెల్, స్పిన్నర్లకు సాయిరాజ్ బహుతులే కోచ్లుగా ఉన్నారు. ఇక డస్కటేకు పని ఏముంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు.. లండన్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న డస్కటే తన కుటుంబంతో తగిన సమయం గడిపేందుకు కూడా భారత జట్టును వీడాలని భావిస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది.అంతర్జాతీయ జట్టుకంటే ఫ్రాంచైజీ లీగ్లతో కలిసి పని చేయడం తనకు సౌకర్యంగా ఉంటుందని కూడా డస్కటే అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు లీగ్ల యాజమాన్యాలు డస్కటేను సంప్రదించినట్లు సమాచారం. ఇక డస్కటే నిజంగా తప్పుకొంటే దిలీప్ను బీసీసీఐ మరికొంత కాలం పాటు ఫీల్డింగ్ కోచ్గా కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్ కంచుకోట బద్దలు.. గిల్ రికార్డు -
వాళ్లిద్దరికి అస్సలు పడట్లేదు!.. డీకే సంచలన వ్యాఖ్యలు
గతంలో ఎన్నడూ లేని విధంగా పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు ఇటీవల ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా ఐర్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత్.. పసికూన అయిన ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.తీవ్రస్థాయిలో విమర్శలుఅనంతరం ఇంగ్లండ్కు వెళ్లి అక్కడా ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్వాష్కు గురైంది. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తుదిజట్టులో తరచూ మార్పులు, వరల్డ్కప్ హీరో సంజూ శాంసన్ను పక్కనపెట్టడం విమర్శలకు కారణమయ్యాయి.అంతేకాదు.. అంతకుముందు టీ20 జట్టు కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే విషయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రధాన పాత్ర పోషించినట్లు.. హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో ఈ విషయం కూడా మరోసారి తెరమీదకు వచ్చింది.దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్- అగార్కర్ మధ్య విభేదాల వల్లే భారత జట్టుకు ఈ దుస్థితి వచ్చిందని పరోక్షంగా దుయ్యబట్టాడు. వీరి వైఖరి కారణంగా ఆటగాళ్లలో ఒక రకమైన గందరగోళం నెలకొందని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పటిష్ట జట్టును తయారు చేయాలని భావిస్తున్నాడు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం అలా కాదు. ప్రతి ఒక్క మ్యాచ్, ప్రతి ఒక్క సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాడు.ఆటగాళ్లకు మంచిది కాదుఒకరేమో దీర్ఘకాలిక ప్రయోజనాలు.. మరొకరు ఇప్పటికిప్పుడు వచ్చే ఫలితాల గురించి ఆలోచించడం వల్ల బహుశా ఇద్దరి మధ్య ఒక రకమైన ఘర్షణ జరిగి ఉంటుంది. దీంతో ఆటగాళ్ల మనసుల్లో గందరగోళం నెలకొంది. చీఫ్ సెలక్టర్, కోచ్ ఆలోచనల మధ్య వ్యత్యాసం ఆటగాళ్లకు మంచిదేనా? అంటే అస్సలు కాదనే చెప్తాను.ఇలాంటి సమయంలో వారికి జట్టులో తమ స్థానం గురించి అభద్రతాభావం ఏర్పడుతుంది. అది ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విభేదాలు పరిష్కరించుకుంటే జట్టుకు మంచిది’’ అని దినేశ్ కార్తిక్ చెప్పుకొచ్చాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
ఇంగ్లాండ్ తో ఓటమికి వైభవే కారణం
-
శ్రేయస్ అయ్యర్ను తొలగించండి.. ఈజీ ఆప్షన్ అదే!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియాకు.. విదేశీ గడ్డ మీద ఘోర పరాభవం ఎదురైంది. మెగా టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత తొలి ప్రయత్నంగా ఐర్లాండ్తో తలపడ్డ భారత్ ఊహించని రీతిలో.. ఆతిథ్య జట్టు చేతిలో 2-0తో క్లీన్స్వీప్నకు గురైంది.శ్రేయస్ అయ్యర్కు చేదు అనుభవంఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ అయింది. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం మిగిలింది. ఈ రెండు టీ20 సిరీస్లలో భారత్ క్లీన్స్వీప్ కావడంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈజీ ఆప్షన్ అదే!అదే సమయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ రెండు సిరీస్లలో టీమిండియా ఘోర ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను తొలగించడమనేది అత్యంత సులువైన ఆప్షన్.అయితే, ఆ విషయం పక్కనపెట్టి భారత జట్టు ఓటమికి అసలు కారణాలు ఏమిటో ముందు విశ్లేషించండి. నిజానికి ఐర్లాండ్, ఇంగ్లండ్.. అంటే విదేశీ గడ్డ మీద ఈ మ్యాచ్లు జరగడమే భారత్ ఓటమికి ప్రధాన కారణం.వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు విదేశీ పిచ్ల మీద ఆడేందుకు ఏమాత్రం సన్నద్ధం కాలేదు. ఎందుకంటే.. మన సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వీరిని విదేశీ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ మన బ్యాటర్లకు ఓ కవచం వంటిది. ఇక్కడ రాణిస్తే చాలు జాతీయ జట్టులోకి వచ్చేస్తామనే నమ్మకం కుదిరింది.అయితే, ఐపీఎల్ రూపొందించినటువంటి ఫ్లాట్ పిచ్లను నేను జీవితంలో ఇంత వరకు చూడనేలేదు. వికెట్ ఇలా ఉంది కాబట్టే మన బ్యాటర్లు.. ముఖ్యంగా టాపార్డర్లో వచ్చిన వాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు రాబడుతున్నారు.మరి విదేశాల్లో వికెట్లు ఇలా ఉండవు కదా. అక్కడ మార్బుల్ షీట్పై బ్యాటింగ్ చేయడం కుదరదు. ఇలాంటపుడే సెలక్టర్లు మరింత తెలివిగా ఆలోచించాల్సింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ గడ్డ మీద రాణించిన శుబ్మన్ గిల్ వంటి ఆటగాళ్లను సెలక్ట్ చేయాల్సింది.దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన వారిపైనే వేటుఈ పరాజయాల నేపథ్యంలో లోతుగా విచారణ, విశ్లేషణ జరపాలి. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు రూపొందించమని బీసీసీఐకి సలహా ఇచ్చిన వారిని ముందుగా తొలగించాలి. ఐపీఎల్ను మరింత పాపులర్ చేయాలని.. వాణిజ్యపరంగా లాభాలు పొందాలని చూస్తే పరిస్థితులు ఇలాగే దిగజారిపోతాయి’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా వరుస సిరీస్లలో వైట్వాష్ నేపథ్యంలో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని ఇంగ్లండ్కు కోల్పోయింది.చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్కోచ్గా ద్రవిడ్? -
గంభీర్ కోటరీని వీడనున్న హైదరాబాదీ?
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు కోచింగ్ స్టాప్లో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. టీమిండియాను వీడేందుకు హెడ్కోచ్ గంభీర్ కోటరీలోని ఒకరు సిద్దంగా ఉన్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.అయితే ఇందుకు సంబంధించి తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. "జట్టును వీడబోతున్న ఆ సభ్యుడు మరెవరో కాదు, ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్" అని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ నిఖిల్ నాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దిలీప్ కోల్కతా నైట్ రైడర్స్ కోచింగ్ స్టాప్లో చేరే అవకాశం ఉందని నిఖిల్ నాజ్ అంచనా వేశాడు. కాగా హైదరాబాద్కు చెందిన దిలీప్ వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నాడు. తొలుత రాహుల్ ద్రవిడ్ హయంలో ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన దిలీప్.. దాదాపుగా ఐదేళ్ల నుంచి భారత జట్టుతో కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అతడి కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించలేదు. కానీ విదేశీ కోచ్ కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికి, సరైన వ్యక్తి దొరకపోవడంతో మళ్లీ దిలీప్నే ఫీల్డింగ్ కోచ్గా భారత క్రికెట్ బోర్డు నియమించింది. అయితే ఈసారి మాత్రం ఫీల్డింగ్ కోచ్గా అతడు అంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. తాజాగా భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలపై మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సైతం కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్లో ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యంత దారుణంగా పడిపోయాయని అతడు మండిపడ్డాడు. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లల సిరీస్లో భారత ఫీల్డర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రెండు మ్యాచ్లలో కలిపి మొత్తంగా 6 క్యాచ్లు జారవిడిచారు. అంతకుముందు టీ20 ప్రపంచకప్లోనూ భారత ఫీల్డర్లు 13 క్యాచ్లను విడిచిపెట్టారు."ఐర్లాండ్ వంటి చిన్న జట్టు చేతిలో భారత్ ఓడిపోవడాన్ని ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. దారుణమైన క్రికెట్ ఆడి సిరీస్ను కోల్పోయారు. అయితే గత రెండేళ్లగా భారత పురుషుల, మహిళల జట్లలో ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఐర్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆ రెండు, మూడు క్యాచ్లు పట్టి ఉంటే వారు 180 ప్లస్ పరుగులు చేసేవారు కాదు. రెండో మ్యాచ్లోనూ అదే రిపీట్ అయింది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం వల్ల భారత్ మ్యాచ్లను చేజార్చుకుంటోంది" అని పటేల్ పేర్కొన్నాడు. -
వాళ్లిద్దరినీ తొలగించారు.. గంభీర్పైనా వేటు వేయండి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో బీసీసీఐ అతడి స్థానాన్ని గౌతం గంభీర్తో భర్తీ చేసింది. అయితే, గంభీర్ మార్గదర్శనంలో తొలుత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ను గెలిచిన భారత్.. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను లంకకు కోల్పోయింది.ఇక ఆ తర్వాత కూడా గంభీర్ మార్గదర్శనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచినప్పటికీ.. అందుకు ద్రవిడ్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని.. నాటి కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.ఆ రెండూ మినహా...ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లోనూ టీమిండియా విజేతగా నిలిచినప్పటికీ.. స్వదేశంలో సిరీస్ జరగడం సానకూలంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు మెగా టోర్నీలు గెలిచినప్పటికీ.. గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా అత్యంత ఘోర పరాభవాలు చవిచూసింది.సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడం.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరకపోవడం ఇందులో ప్రధానమైనవి. అంతేకాదు స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కూడా భారత్ కోల్పోయింది.వ్యంగ్యాస్త్రాలు తాజాగా టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐర్లాండ్లో అడుగుపెట్టి.. పసికూన చేతిలో ఏకంగా 2-0తో వైట్వాష్ అయింది. అనంతరం ఇంగ్లండ్కు కూడా 0-3తో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ గంభీర్, జట్టు యాజమాన్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.‘‘అయినా అతడి (గంభీర్)ని ప్రశ్నించేందుకు ఎవరైనా ఉన్నారా?.. అతడిని తప్పుకోమని చెప్పగల ధైర్యం ఉందా?.. ఈరోజు ఇంతజరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే అతడు ప్రపంచకప్ గెలిచాడని చెబుతారు.వాళ్లిద్దరినీ తొలగించారు.. అతడిపైనా వేటు వేయండి!మరి సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్గా కప్పు గెలిచాడు. అయినా సరే అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. జట్టు చాంపియన్గా నిలవడంలో సంజూ శాంసన్ది కీలక పాత్ర. అయినా కూడా అతడిని తుదిజట్టు నుంచి తప్పించారు.మరి వాళ్లిద్దరిలాగే గంభీర్పై వేటు వేయలేరా?.. మీ ఆలోచనా విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందా?’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ యాజమాన్యం తీరును తూర్పారబట్టాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓడిపోయినప్పటికీ గంభీర్ ముఖంలో కాస్తైనా బాధ కనిపించలేదని చిక్కా మండిపడ్డాడు.కొంచెం కూడా బాధ లేదు‘‘తననూ ఎవరు టచ్ చేయలేరని అతడికి తెలుసు. అందుకే డగౌట్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నాడు. అసలు జట్టు ఓడిపోతోందన్న బాధ అతడిలో కొంచెం కూడా కనిపించలేదు. ఎన్నో సిరీస్లలో వైట్వాష్లు, ఘోర పరాభవాలు.అయినా సరే అతడిని కదిలించేవారే లేరు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకంతోనే అతడు ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాటి గురించి నిర్భయంగా మాట్లాడుతున్నాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IND vs ENG 5th T20I: భారత తుదిజట్టు ఇదే! -
కోచ్గా గంభీర్ అవుట్.. అదే నిజమైతే టీమిండియానే WORLD NO1
-
ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి.. తొలి వేటు అతడి మీదేనా?
టీమిండియా ప్రస్తుతం గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. నాలుగు నెలల క్రితం పొట్టి ఫార్మాట్లో మూడోసారి చాంపియన్గా నిలిచిన టీమిండియా ఇప్పుడు మాత్రం వరుస ఓటములు చవిచూస్తోంది. ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-3తో సిరీస్ను కోల్పోయింది. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమితో బీసీసీఐ కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో ఇప్పటికే తీవ్ర అసంతృత్తితో ఉన్న బీసీసీఐ అతడిని తొలగించడానికి ముందు కోచింగ్ జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. ఈ మేరకు గంభీర్ టీంలో కీలకంగా ఉన్న వ్యక్తులను తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సపోర్ట్ స్టాఫ్లో ఒక వ్యక్తిని పదని నుంచి తొలగించాలని చూస్తున్న బీసీసీఐకి ఒక వార్త అందింది. గంభీర్ కోచింగ్ స్టాఫ్లో ఒక కీలక వ్యక్తి తనంతట తానుగా బయటికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. మరి సదరు వ్యక్తి నిష్క్రమణ వ్యక్తిగత కారణాలతోనా లేక తన పాత్రకు న్యాయం చేయకపోవడంతో తప్పుకున్నాడా అనేది స్పష్టంగా తెలియదు. మొత్తానికి రెండు వరుస సిరీస్ ఓటములు టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇక నేడు సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్తో టీమిండియా చివరి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి వైట్వాష్ గండం నుంచి బయటపడాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది.ఇప్పటికే ఆసియా గేమ్స్తో పాటు జింబాబ్వేతో టీ20 సిరీస్కు గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలోని కోచింగ్ స్టాఫ్ను పంపించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. దీంతో గంభీర్తో పాటు అతడి సపోర్ట్ స్టాఫ్పై కూడా త్వరలో వేటు పడే అవకాశముంది. చదవండి: వింబుల్డన్లో ఓటమి.. రిటైర్మెంట్పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు -
BCCI సంచలన నిర్ణయం? అప్పుడు గిల్.. ఇప్పుడు తిలక్
-
తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!.. గంభీర్కు గండం!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చాంపియన్గా నిలిచిన టీమిండియా.. మెగా ఈవెంట్ తర్వాత దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ ఐసీసీ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారిగా టీ20 సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.అత్యంత చేదు అనుభవంవరల్డ్కప్లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై అనూహ్యంగా వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఈ టూర్ నుంచి శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. అయితే, శ్రేయస్కు సారథిగా తొలి ప్రయత్నంలోనే అత్యంత చేదు అనుభవం ఎదురైంది.ఇంగ్లండ్ పర్యటనలోనూఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ అయింది. ఐరిష్ జట్టు చేతిలో ఓటమి చెందడం.. సిరీస్ను భారత్ చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇక ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితం పునరావృతమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లలో టీమిండియా ఓటమి పాలైంది.తీవ్ర స్థాయిలో విమర్శలుఈ క్రమంలో ఇంగ్లండ్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుదిజట్టు ఎంపికలో గంభీర్దే అంతిమ నిర్ణయం అని.. తరచూ మార్పులు చేస్తూ కెప్టెన్ను సైతం గందరగోళానికి గురిచేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం గంభీర్కు ఇష్టం లేదని.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడితోనే అతడు ఇందుకు అంగీకరించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా రెండు టీ20 సిరీస్లు కోల్పోవడం సందేహాలకు తావిస్తోంది.తీవ్ర అసంతృప్తిలో బీసీసీఐ!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం వరుస ఓటములపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ సేనతో పాటు.. గంభీర్ టీమ్పైనా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.వేటు పడుతుందా?ఈ విషయాల గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ANIతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా స్వదేశానికి తిరిగి రాగానే వరుస ఓటములపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. గంభీర్పై కూడా స్క్రుటినీ ఉంటుంది’’ అని తెలిపాయి. కాగా గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్గా ర్యాన్ టెన్ డష్కాటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఉన్నారు.ఇక తాజా సిరీస్లలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ విఫలం కావడంతో ఎవరిపైనైనా వేటు పడుతుందా? లేదంటే గంభీర్ చెప్పినట్లు సంధి దశ కాబట్టి పదవీకాలం పూర్తయ్యేంత వరకు వీరిని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా గంభీర్ కాంట్రాక్టు 2027 వరకు ఉన్న సంగతి తెలిసిందే.గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా డిజాస్టర్లు ఇవే👉స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్👉పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో)ని చేజార్చుకున్న భారత్👉పాతికేళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్ 👉అరంగేట్రం నుంచి మూడు సీజన్లలో డబ్ల్యూటీసీ ప్రపంచకప్ ఫైనల్కు చేరకపోవడం ఇదే తొలిసారి (2023-25)👉సొంతగడ్డపై న్యూజిలాండ్కు తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్👉ఐర్లాండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్👉ఇంగ్లండ్కు తొలిసారి టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా👉అంతర్జాతీయ టీ20లలో పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి (ఇంగ్లండ్తో రెండో టీ20లో 125 పరుగుల తేడాతో చిత్తు) etc.చదవండి: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ -
‘శ్రేయస్ను నిందించొద్దు.. అదే అసలు సమస్య’
ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అదే దారుణ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. తొలి టీ20 వర్షార్పణం కాగా, ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన టీమిండియా 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ను కోల్పోయింది. కనీసం చివరి టీ20లోనైనా విజయం సాధించి గౌరవప్రదంగా సిరీస్ను ముగించాలని టీమిండియా భావిస్తోంది. ఇక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటర్గా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్గా వరుస ఓటములు అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓటమి (ఒక మ్యాచ్ రద్దు) పాలయ్యింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా టీ20ల్లో ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. అటు టీమిండియా కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈసారి అయ్యర్తో పాటు కోచ్ గంభీర్పై కూడా కత్తి వేలాడుతోందనే వార్తలు వస్తున్నాయి. అదీగాక జింబాబ్వే టూర్తో పాటు ఆసియా గేమ్స్కు హెడ్కోచ్ గంభీర్కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ను టీమిండియా వెంట పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ రెయాన్ టెన్డెస్కటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో టెన్ డస్కటే మాట్లాడాడు. 'టీమిండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. అతడి కెప్టెన్సీలో టీమిండియాకు వెంటనే విజయాలు రావాలంటే ఎలా? కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. మ్యాచ్ ఓటములకు శ్రేయస్ను నిందించడం ఆపండి. అతడు కెప్టెన్గా నిలుదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పుడు వచ్చే ఓటములే తర్వాత గెలుపుకు బాటలు వేస్తాయి. నిజానికి శ్రేయస్ తన నాయకత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం కొన్ని మ్యాచ్లకే అతడు కెప్టెన్గా వైఫల్యం చెందాడని పేర్కొనడం సరికాదు. అంతకముందు సూర్యకుమార్ కూడా ఆరంభంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకాలం ఒక కెప్టెన్సీలో ఆడి ఇప్పుడు మరో కొత్త కెప్టెన్తో ఆడుతుండడంతో జట్టులో సమతుల్యం లోపించింది. రాబోయే రోజుల్లో అది చక్కబడి మళ్లీ అంతా సవ్యంగా సాగుతుంది. ఇక జట్టులో పాండ్యా, బుమ్రా లోటు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ బాగా రాణిస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్లు కలిపి 190 పరుగులు సాధించడమే గాక కోహ్లీ రికార్డును కూడా సమం చేశాడు. టీమిండియా మ్యాచ్లు ఓడుతున్నప్పటికీ అయ్యర్ మాత్రం బ్యాటర్గా విఫలం కాలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సౌతాంప్టన్ వేదికగా ఆడనున్నాయి. 🔴 STOP BLAMING SHREYAS IYER – COACH SAYS HE NEEDS TIME 🤯🎙️: Ryan ten Doeschate backed Shreyas, saying he deserves time as captain. He praised Iyer's leadership, accountability, and batting, urging everyone not to judge him after just a few matches.pic.twitter.com/tqNDEQAXEm— Sam (@cricsam02) July 10, 2026Read: అరుదైన ఫీట్తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె -
సంజూను తప్పించలేదు.. వైభవ్ కోసం తప్పుకున్నాడు.. సెలక్షన్ వెనుక అసలు కథ
-
‘సామ్సన్కు పూర్తిగా స్పష్టతనిచ్చాం’
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో రెండో టి20 నుంచి సంజు సామ్సన్ను తప్పించడం తీవ్ర చర్చకు దారి తీసింది. టి20 ప్రపంచకప్లో వరుసగా 97, 89, 89 స్కోర్లతో భారత్ను గెలిపించడంతో పాటు సామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. అయితే ఐర్లాండ్తో తొలి రెండు మ్యాచ్లు, ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టి20లో అతను వరుసగా 5, 0, 1 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. అయితే కేవలం మూడు మ్యాచ్లలో విఫలం కావడంతోనే ఒక అగ్రశ్రేణి బ్యాటర్ను పక్కన పెట్టడంతో మేనేజ్మెంట్పై విమర్శలు వచ్చాయి. దీనిపై మొదటిసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ విషయంలో తాను స్వయంగా సామ్సన్కు అన్ని అంశాలు వివరించానని అతను వెల్లడించాడు. ‘సంజు సామ్సన్కు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వాలో అదంతా చెప్పాం. ఇది ఒక ఆటగాడికి, హెడ్ కోచ్కు మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వాటి వివరాలు సహజంగానే మేం బయటకు చెప్పం. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రపంచ కప్లో సామ్సన్ ఎంత అద్భుతంగా ఆడాడో మాకూ బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల తాజా ఫామ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.అయినా ఈ సిరీస్లో అతను మళ్లీ ఆడలేడనే నిబంధన ఏమీ లేదు కదా. అంతర్జాతీయ క్రికెట్లో అన్నింటికంటే ఫలితాలు ముఖ్యం. ఏ 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల బృందం మాకు ఫలితాలు అందిస్తుందనే నమ్ముతామో వారినే ఆడిస్తాం. భారత్ తరఫున ఆడగల హక్కును జట్టులోని ప్రతీ ఒక్కరు తమంతట తామే సంపాదించుకోవాలనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను’ అని గంభీర్ వివరించాడు. ఇంగ్లండ్తో మూడో టి20లో చిత్తుగా ఓడిన తర్వాత తమ పరాజయానికి కారణాలను కోచ్ విశ్లేషించాడు. టి20ల్లో భారత జట్టు సుదీర్ఘ కాలంగా ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు జట్టు మారిందని, కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంగ్లండ్లో పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇటీవల టీమ్లో పలు మార్పుచేర్పులు జరిగాయి. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమ్ నుంచి కొందరు మాత్రమే ఇక్కడున్నారు. కెప్టెన్ మారాడు, ఓపెనర్ మారాడు. పాండ్యా, బుమ్రా ఆడటం లేదు. కాబట్టి ఇంకా టీమ్ పూర్తిగా కుదురుకోలేదు. జట్టులోకి పలువురు ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమయం పడుతుంది. మా ఆటగాళ్లంతా రిస్్కతో కూడిన క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలూ వస్తాయి. ప్రపంచకప్లోనూ మా టాపార్డర్ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. అయితే అప్పుడు మిడిలార్డర్ నిలకడగా ఆడి ఆదుకుంది. ఈసారి అది కనిపించలేదు’ అని భారత మాజీ ప్లేయర్ వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్లు ఓడినంత మాత్రం భారత్ చెత్త టీమ్గా మారిపోదని కూడా అతను అన్నాడు. -
IND vs ENG: హర్షిత్ రాణాపై ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు హర్షిత్ రాణాపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు గొప్పగా ఆడుతున్నాడని కొనియాడాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇటు బంతితోనూ.. అటు బ్యాట్తోనూ రాణిస్తున్నాడని ప్రశంసించాడు.గంభీర్కు ప్రియశిష్యుడిగా పేరుఅయినప్పటికీ హర్షిత్ రాణాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోందని ఆకాశ్ చోప్రా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియశిష్యుడిగా హర్షిత్ రాణాకు పేరు. గంభీర్ అండతోనే అతడు అరంగేట్రం చేయగలిగాడని.. అర్హులను కాదని మరీ హర్షిత్కు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా కొనసాగుతున్నాయి.ఇక తాజాగా ఇంగ్లండ్తో మూడో టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో శివం దూబేను కాదని.. హర్షిత్ను పంపించారు. అతడు 13 బంతుల్లో 9 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. దూబే 2 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ను ముందుగా ఎందుకు పంపించారనే ప్రశ్నలు వచ్చాయి.అవకాశం వచ్చిన ప్రతిసారీఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘హర్షిత్ రాణా గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అతడిని మనందరం చాలాసార్లు చాలా రకాలుగా ట్రోల్ చేశాము. కానీ అతడు మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు.క్లిష్ట పరిస్థితుల్లో బంతిని అతడి చేతికిచ్చినా మెరుగ్గానే రాణిస్తున్నాడు. బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. అయితే, కొన్నిసార్లు విఫలం కావడం సహజం. ఏదేమైనా నిందలు, తిట్లకు హర్షిత్ అర్హుడు కాదు.నిజానికి ఐర్లాండ్తో రెండో టీ20లో దాదాపు అతడు జట్టును గెలిపించినంత పని చేశాడు. పది బంతుల్లో 21 పరుగులు చేశాడు (ఈ మ్యాచ్లో టీమిండియా ఒకే ఒక్క పరుగుతో ఓడి వైట్వాష్ అయింది). హర్షిత్ రాణా కొత్త, పాత బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయర్ ఆర్డర్ నుంచి కాస్త టాప్నకు ప్రమోట్ చేసినా బ్యాట్తో రాణించగలడు.సెలక్షన్లో అతడి తప్పేమీ లేదే!తుదిజట్టుకు ఎంపిక కావడం అతడి తప్పేమీ కాదే. అతడిని తరచూ విమర్శించే వారు బాగా ఆడినప్పుడు ఎందుకు ప్రశంసించడం లేదు. అనవసరంగా ట్రోల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు’’ అని ఆకాశ్ చోప్రా ట్రోలర్స్కు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో హర్షిత్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: గంభీర్ -
గంభీర్పై జనాగ్రహం
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల భారత జట్టు బయలుదేరుతున్న సమయంలో అభిమానులు "వీ వాంట్ సంజూ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంజూ శాంసన్ను జట్టులోకి తిరిగి తీసుకోవాలంటూ గంభీర్ను లక్ష్యంగా చేసుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘We want Sanju’ chants outside the stadium when team India leaves. pic.twitter.com/bzqljBakTG— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2026ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్, ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అతని స్థానంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది.అయితే ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో సంచలన ప్రదర్శనలతో భారీ అంచనాలు పెంచుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూను తప్పించి వైభవ్కు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సు వైపు వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్, తిలక్ వర్మతో పాటు ఆటగాళ్లు స్టేడియం వెలుపల అభిమానుల నినాదాల మధ్య బయటకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.ఇదిలా ఉంటే, సంజూ శాంసన్కు జట్టు తలుపులు పూర్తిగా మూసేయలేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి రాకూడదనే ఎలాంటి నిబంధన లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని వ్యాఖ్యానించాడు. -
గంభీర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కార్తీక్
ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఛేదనలో శివమ్ దూబే కంటే ముందు పేసర్ హర్షిత్ రాణాను బ్యాటింగ్కు పంపడంపై మాజీ భారత వికెట్కీపర్, వ్యాఖ్యాత దినేశ్ కార్తీక్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కామెంట్రీ సమయంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టాడు."శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణా బ్యాటింగ్కు రావడమా..? నిజంగానేనా..? దేశవాళీ క్రికెట్లో కూడా హర్షిత్ రాణా పవర్ప్లేలో బ్యాటింగ్ చేసిన సందర్భం నాకు గుర్తులేదు. ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్ కోసం కొన్ని మార్పులు చేయొచ్చు. కానీ అందుకే శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను పంపడం సమంజసం కాదు" అని వ్యాఖ్యానించాడు.గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వకపోగా.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ కేవలం 76 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టుకు రెండో అత్యల్ప స్కోరు కాగా, 125 పరుగుల తేడాతో ఓడిపోవడం టీమిండియా చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నమోదైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 44 బంతుల్లో 70 పరుగులతో రాణించగా, భారత బౌలర్లు పరుగులను నియంత్రించలేకపోయారు.202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే కుప్పకూలింది. జోఫ్రా ఆర్చర్ కొత్త బంతితో చెలరేగగా, జోష్ టంగ్ మధ్య, చివరి వరుస బ్యాటర్లను కట్టడి చేశాడు. పవర్ప్లే ముగిసేలోపే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది.ఈ దశలో అందరూ శివమ్ దూబే బ్యాటింగ్కు వస్తాడని భావించినా, జట్టు యాజమాన్యం అనూహ్యంగా హర్షిత్ రాణాను పంపింది. ఈ నిర్ణయంపైనే దినేశ్ కార్తీక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్లో నిలవాలంటే బ్రిస్టల్లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అందుకే వైభవ్ను ఆడిస్తున్నాం: కుండబద్దలు కొట్టిన గంభీర్
విదేశీ గడ్డ మీద భారత టీ20 జట్టు వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తాజాగా మూడో టీ20లో మరీ ఘోరంగా ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ముందంజ వేయగా.. మిగిలిన రెండు మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూ గురించి నాకు క్లారిటీ ఉందిముఖ్యంగా సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. వరల్డ్కప్ హీరోనే పక్కనపెట్టడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై హెడ్కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా సంజూ గురించి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. హెడ్కోచ్, ఆటగాడి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ బయటకు రాదు.సంజూ విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉంది. అతడు టీమిండియా కోసం ఏం చేశాడో మాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు ఫామ్ విషయంలో ఏ ఆటగాడికైనా ఇబ్బందులు తప్పవు. దానర్థం అతడు ఇక జట్టులోకి తిరిగి రాడని కాదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కుండబద్దలు కొట్టిన గంభీర్ఇక వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఫలితాలు అత్యంత ముఖ్యమైనవి. అనుకున్న ఫలితం రాబట్టడం కోసమే అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేసుకుంటాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను’’ అని గంభీర్ సమర్థించుకున్నాడు. కొత్త కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని.. అందుకే వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తు న్నామంటూ కుండబద్దలు కొట్టాడు.అందుకే ఓడిపోతున్నాంఇక విదేశీ గడ్డ మీద పిచ్లకు తాము ఇంకా పూర్తిగా అలవాటు పడలేదని.. అందుకే వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నామని గంభీర్ జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో కలిపి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడాన్ని బట్టే తమ ఆట తీరు ఎలా ఉందో తెలుస్తోందన్నాడు. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో ఉండగా.. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఇందుకు బ్రిస్టల్ వేదిక. చదవండి: టీమిండియా ఆట తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం -
గంభీర్ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్కోచ్!
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్లు పూర్తి చేసుకుంది శ్రేయస్ అయ్యర్ సేన. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.జింబాబ్వే పర్యటనకుఇక టీ20 సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగం కానుంది. అనంతరం భారత టీ20 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు- 2026 టోర్నీలో పాల్గొంటుంది. అదే సమయంలో టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్ ఆడనుంది.ఈ నేపథ్యంలో కోచింగ్ సిబ్బందిలో బీసీసీఐ మార్పులు చేయనున్నట్లు సమాచారం. జర్నలిస్టు గౌరవ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా అందించిన సమాచారం ప్రకారం.. జింబాబ్వే టూర్, ఆసియా క్రీడల్లో హెడ్కోచ్ గౌతం గంభీర్ బదులు.. వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది.గంభీర్ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్కోచ్!అదే సమయంలో గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో భాగమవుతాడని సమాచారం. కాగా ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్గా ఉన్న లక్ష్మణ్.. గతంలో కూడా టీమిండియా హెడ్కోచ్ల గైర్హాజరీలో.. సీనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వీళ్లు కూడా..ఇక జింబాబ్వే టూర్లో లక్ష్మణ్తో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ సునిల్ జోషి కోచింగ్ సిబ్బందిలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్గా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సమాచారం. మరోవైపు.. భారత మాజీ బ్యాటర్ హృషికేశ్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జట్టు, సిబ్బంది బృందం ఆసియా క్రీడల్లోనూ భాగం కానున్నట్లు సమాచారం.కాగా ఆసియా క్రీడలు సెప్టెంబరు 19- అక్టోబరు 4 మధ్య జపాన్లో జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్తో టీమిండియా సొంతగడ్డపై సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా ఐర్లాండ్లో పర్యటించింది. ఈ క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీ20 సిరీస్లో 2-0తో వైట్వాష్ అయింది. దీంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్కు గాయం! -
వైభవ్ కోసం శాంసన్పై వేటు.. మైదానంలోనే ఓదార్చిన గంభీర్!
జెంటిల్ మ్యాన్ గేమ్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎన్ని సెంచరీలు చేసినా.. సిక్సర్లు కొట్టినా.. రికార్డులు తిరగరాసినా.. ఒక్క రెండు మ్యాచ్లలో విఫలమైతే జట్టులో చోటు కోల్పవాల్సిందే. ఇప్పుడు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ విషయంలో అదే జరిగింది.టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పుడు తుది జట్టులో తన స్ధానాన్ని కోల్పోయాడు. ఇటీవల ఐర్లాండ్ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన సంజూ.. ఆ తర్వాత ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా అదే తీరును కనబరిచాడు.దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టీ20కు సంజూను టీమ్ మేనెజెమెంట్ తుది జట్టు నుంచి తప్పించింది. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకు అవకాశమిచ్చారు. సూర్యవంశీ కూడా తనకు లభించిన ఛాన్స్ను సద్వినియోగపరుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో 14 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.శాంసన్ను ఓదార్చిన గంభీర్కాగా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవడంతో సంజూ శాంసన్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓదార్చాడు. టాస్ తర్వాత కోచ్ గంభీర్, శాంసన్తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సీఎస్కే వికెట్ కీపర్ బ్యాటర్ భుజంపై గంభీర్ చేయి వేసి ధైర్యం చెబుతూ కనిపించారు.శాంసన్ ఐపీఎల్-2026లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలతో 477 పరుగులు చేశాడు. అయినప్పటికి వరుసగా మూడు మ్యాచ్లలో ఫెయిల్ కావడంతో సంజూ బెంచ్కే పరిమితమయ్యాడు.Good to see Gautam Gambhir having a chat with Sanju Samson. That's always one thing you need from the management. pic.twitter.com/woihQi2l82— Pitch Perfect (@_pitch__perfect) July 4, 2026 -
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై రచ్చ.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా తరపున అరంగేట్రం కోసం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణ కొనసాగుతోంది. ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన వైభవ్.. ఇప్పుడు ఇంగ్లండ్ టూర్లోనూ డెబ్యూ చేసే సూచనలు కనిపించడం లేదు. వర్షం కారణంగా రద్దు అయిన తొలి టీ20లో వైభవ్కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లనే ఓపెనింగ్ జోడీగా టీమ్ మేనెజ్మెంట్ కొనసాగిస్తోంది. సంజూ వరుసగా మూడు మ్యాచ్లలో విఫలం కావడంతో సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు మాత్రం సీనియర్ ప్లేయర్లకే మద్దతు ఇస్తున్నారు. దీంతో గంభీర్, అయ్యర్ తీరుపై చాలా మంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్, కోచ్ విమర్శలు చేయడం సరికాదని శుక్లా అన్నారు.వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. జట్టు మేనేజ్మెంట్పై వస్తున్న విమర్శలు నా వరకు వచ్చాయి.నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. మ్యాచ్ పరిస్థితిని బట్టి కోచ్, కెప్టెన్ తుది నిర్ణయం తీసుకుంటారు. సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్కు ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది. అంతవరకు ఇలాంటి అనవసర విమర్శలు చేయడం ఆపాలి." అని 'టైమ్స్ నౌ'తో శుక్లా పేర్కొన్నారు.చదవండి: IND vs ENG: భారత్తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్లు వచ్చేశారు -
వైభవ్ సూర్యవంశీకి పెరుగుతున్న మద్దతు
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లకు నామమాత్రంగా ఎంపిక చేశారే తప్పిస్తే, ఇప్పటివరకు అతడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. పసికూన ఐర్లాండ్పైనే అతడు అరంగేట్రం చేస్తాడని అంతా అనుకున్నా.. అక్కడ అది జరగలేదు. ఇంగ్లండ్లో అయినా అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా అంటే, అదీ లేనట్లే కనిపిస్తుంది.తాజాగా ముగిసిన తొలి టీ20లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మున్ముందు జరిగే నాలుగు మ్యాచ్ల్లో దక్కుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి మద్దతు పెరుగుతుంది. అతడిని ఎట్టిపరిస్థితుల్లో రెండో టీ20లో ఆడించాలని అభిమానులు సహా చాలామంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు.ఈ జాబితాలోకి కొత్తగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చేరాడు. రవిశాస్త్రి ఈ డిమాండ్ను వినిపించే క్రమంలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై పరోక్ష విమర్శలు గుప్పించాడు. అనుభవం పేరుతో వరుసగా విఫలమవుతున్నా, సంజూ శాంసన్కు అవకాశాలు ఇస్తున్నారన్నట్లు మాట్లాడాడు.వాస్తవానికి వైభవ్కు ఐర్లాండ్ సిరీస్లోనే అవకాశం ఇవ్వాల్సిందని, చిన్న గ్రౌండ్స్లో అతని భయం లేని బ్యాటింగ్ బాగా ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ ఇప్పటికే ఐపీఎల్లో అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడని.. ఇంగ్లండ్ అండర్-19 పర్యటనలో కూడా అతని ప్రదర్శనలు బలంగా ఉన్నాయని.. ఇప్పటికైనా వైభవ్ అవకాశాలు ఇవ్వడం సమంజసమని అభిప్రాయపడ్డాడు.శాస్త్రి సహా చాలామంది మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అనుభవం, పరిస్థితులు, బ్యాటింగ్ కాంబినేషన్ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్కు వరుసగా విఫలమవుతున్నా, అవకాశాలు వస్తున్నాయి. మరి రెండో టీ20లోనైనా వైభవ్కు అవకాశమిస్తారో లేదో చూడాలి. -
గంభీర్కు గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్! "వైభవ్ను ఆడించండి"
-
ఇతను ఒక కోచేనా?.. Gautam Gambhirపై వైరల్ పోస్టు!
-
IND vs IRE: గంభీర్పై ఐస్లాండ్ క్రికెట్ పోస్ట్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు.. అనూహ్య రీతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది. ఆటలో గెలుపోటములు సహజం.. రెండో మ్యాచ్లోనైనా తప్పు దిద్దుకుంటారని భావించిన అభిమానులకు మరోసారి భంగపాటే ఎదురైంది.ఒక్క పరుగు తేడాతో..తాజాగా రెండో టీ20 మ్యాచ్లోనూ శ్రేయస్ అయ్యర్ సేన ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై.. సిరీస్ను చేజార్చుకుంది. ఇక ఐర్లాండ్ తొలిసారి టీమిండియాను 2-0తో క్లీన్స్వీప్ చేసి తమ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్ మరోసారి విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. ఆల్రౌండర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటే ఫలితం ఇలాగే ఉంటుందంటూ గంభీర్కు మాజీ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు.మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ కావాలిఐర్లాండ్ చేతిలో టీమిండియా పరాభవం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టాడు. ‘‘గంభీర్ మార్గదర్శనంలో ఇది జరిగింది. అయితే, ఇప్పుడే ఓ అంచనాకు రాకూడదు. కానీ ఇక్కడ ఆల్రౌండర్లకే ప్రాధాన్యం కదా!..నిజానికి టీమిండియాకు మిడిలార్డర్లో నిఖార్సైన బ్యాటర్ అవసరం ఉంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను అలరించే ఐస్లాండ్ క్రికెట్ సైతం ఈసారి గంభీర్ పట్ల కాస్త వ్యంగ్యంగానే స్పందించింది.మాకు కోచ్గా వద్దు‘‘గౌతం గంభీర్ను మా జట్టుకు హెడ్కోచ్గా కోరుకోవడం లేదని ధ్రువీకరిస్తున్నాం. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అయినప్పటికీ మాకైతే వద్దు. ఐర్లాండ్లో ఏదైతే జరిగిందో.. నిజంగా ఆ ఫలితాలు నిజంగా చిరకాలం గుర్తుండిపోయే బహుమతులు’’ అంటూ ఐస్లాండ్ క్రికెట్ సెటైర్లు వేసింది.ఛీ.. ఆఖరికి వీళ్లకూ లోకువైపోయాం!దీంతో.. ‘ఛీ.. ఆఖరికి అనామక క్రికెట్ బోర్డు చేతిలోనూ మాటలు పడేలా చేశారు’ అంటూ గంభీర్, ఆటగాళ్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కాగా బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా.. ఐర్లాండ్ను 154 పరుగులకు కట్టడి చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన భారత్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట We can confirm that we don't wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.— Iceland Cricket (@icelandcricket) June 28, 2026 -
నువ్వు అద్భుతాలు చేస్తావని నమ్ముతున్నా: గంభీర్
భారత టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. నూతన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్తో బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం అతడు తొలిసారి టీమిండియా టీ20 సారథిగా బరిలోకి దిగబోతున్నాడు.కేవలం ఆటలోనే కాదు..ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనను ఆరంభించే ముందు.. టీమిండియా కొత్త కెప్టెన్గా నియమితుడైన శ్రేయస్కు నా శుభాకాంక్షలు. జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం.నువ్వు ఈ బాధ్యతను చక్కగా నెరవేరుస్తూ.. అద్భుతంగా రాణించగలవని కచ్చితంగా చెప్పగలను. కేవలం ఆటలోనే కాదు.. మైదానం వెలుపలా నువ్వు గొప్పగా పనిచేయగలవు’’ అని గంభీర్.. శ్రేయస్ అయ్యర్ను ప్రశంసించాడు. కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసి మరీ.. యాజమాన్యం శ్రేయస్కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే.దాదాపు మూడేళ్ల తర్వాతఈ క్రమంలో దాదాపు మూడేళ్ల తర్వాత శ్రేయస్.. ఏకంగా సారథిగా టీ20 జట్టులో పునరాగమనం చేయనున్నాడు. ఇక ఈ ముంబైకర్ను కెప్టెన్గా నియమించడంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ది కీలక పాత్ర అని సమాచారం. గంభీర్ వద్దన్నా పట్టుబట్టి మరీ శ్రేయస్నే కెప్టెన్గా నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.గంభీర్తో విభేదాలు?కాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుకు టైటిల్ అందించాడు. అయితే, అతడి కంటే కూడా.. అప్పుడు ఆ జట్టు మెంటార్గా ఉన్న గౌతం గంభీర్కే ఈ విషయంలో ఎక్కువగా క్రెడిట్ దక్కింది. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.కోల్కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులుఅనంతరం గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. శ్రేయస్ కోల్కతా ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. ఇక 2025లో బ్యాటర్గా.. సారథిగా సత్తా చాటి తొలి ప్రయత్నంలోనే పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు శ్రేయస్.పంజాబ్ సారథిగా సూపర్ హిట్ అయినా..అయితే, ఈ ఏడాది ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ పరాజయాలతో చతికిలపడింది. దీంతో ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరుకుండానే పంజాబ్ నిష్క్రమించింది. అయితే, ఆటగాడిగా శ్రేయస్ మాత్రం రాణించాడు. ఇక ఐపీఎల్తో పాటు దేశీ క్రికెట్లోనూ రాణించిన ఈ ముంబైకర్కు టీమిండియా యాజమాన్యం ఏకంగా కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చి.. తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం.చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలి చేయలేము -
వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము: టీమిండియా కోచ్
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో సరికొత్త సంచలనం. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ చిచ్చరపిడుగు.. ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో శుక్రవారం నాటి తొలి టీ20 మ్యాచ్తో వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడతాడా? లేదంటే బెంచ్కే పరిమితమవుతాడా? అన్న చర్చ మొదలైంది. ఐర్లాండ్తో మ్యాచ్ కాబట్టి వైభవ్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. వైభవ్ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగించాడు. హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానుసారమే తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము‘‘ఈ విషయంలో మా కెప్టెన్, హెడ్కోచ్దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ ఆడితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అతడు ఆడకపోయినా నాకు గొప్పే. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతడు టీమిండియాకు ఎంపికయ్యాడు కదా!వైభవ్కు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే, కేవలం అతడిని ఆడించేందుకు ఇప్పటికే పరుగులు రాబడుతూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లను తప్పించలేము కదా!.. అలా చేయడం కూడా సరికాదు.ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, భారత టీ20 జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ ఓపెనర్లుగా పాతుకుపోయారు.ఆడతాడా? లేదా?కొన్నిసార్లు అభిషేక్ విఫలమైనా యాజమాన్యం అతడిని కొనసాగించింది. కానీ సంజూ బ్యాటింగ్ ఆర్డర్ను మాత్రం చాలాసార్లు మార్చడమే కాకుండా.. కొన్నిసార్లు అతడిని పక్కనపెట్టింది కూడా!.. అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో నాకౌట్ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా 94*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.తద్వారా భారత్ ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు. దీంతో గతంలో మాదిరి సంజూను తప్పించేందుకు ఆస్కారం లేదు. ఇక వన్డౌన్లో ఇషాన్ కిషన్ ప్రపంచకప్లో తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతడిపైనా వేటు పడదు.దీంతో వైభవ్కు టాపార్డర్లో చోటు దక్కదు కాబట్టి.. ఇప్పట్లో అరంగేట్రం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఐర్లాండ్తో సిరీస్కు అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి వైభవ్ను ఆడించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే.. కాగా ఇంగ్లండ్తో టీ20లతో పాటు వన్డేలకూ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతినిచ్చి.. సంజూను వన్డౌన్కు డిమోట్ చేసి.. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఓపెనర్గా పంపే అవకాశాలనూ కొట్టిపారేయలేము.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్- ‘ఎ’ జట్టును విజేతగా నిలిపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్లు! -
రోహిత్ శర్మకు గుడ్బై?
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరుకుందా?... వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందే అతడిని తప్పించాలని యాజమాన్యం భావిస్తోందా? అంటే జాతీయ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ధోని సారథ్యంలో ఓపెనర్గా ప్రమోట్ అయ్యి జట్టులో పాతుకుపోయాడు. అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన రోహిత్ 2024లో భారత్కు టీ20 ప్రపంచకప్ అందించాడు.ఆ వెంటనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. గతేడాది టెస్టులకూ రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. ఇక 2025లో కెప్టెన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది.ఇంగ్లండ్తో సిరీస్ ఆఖరిది?కాగా వన్డే వరల్డ్కప్-2027లో ఆడాలనే కలతో రోహిత్ శర్మ ముందుకు సాగుతుండగా.. సెలక్టర్లు మాత్రం అతడిని కొనసాగించేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం. స్పోర్ట్స్ టాక్ చర్చలో భాగంగా రోహిత్ అంశం తెరమీదకు రాగా.. ఇంగ్లండ్తో సిరీస్ హిట్మ్యాన్ కెరీర్లో ఆఖరిదంటూ అక్కడున్న వారు బాంబు పేల్చారు.ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు రోహిత్ గాయపడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ కష్టపడి ఫిట్నెస్ సాధించి మూడు మ్యాచ్లలోనూ భాగమయ్యాడు. అయితే, తొలి వన్డేలో 16 పరుగులకే నిష్క్రమించిన రోహిత్.. రెండో వన్డేలో 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మూడో వన్డేలో 78 పరుగులతో సత్తా చాటాడు.అఫ్గానిస్తాన్తో సిరీస్కు ముందేనిజానికి అఫ్గానిస్తాన్తో సిరీస్కు ముందే సెలక్టర్లు రోహిత్ శర్మ వన్డే కెరీర్ గురించి అతడికి స్పష్టతనిచ్చినట్లు సమాచారం. ఇదే ఆఖరి సిరీస్ అని రోహిత్కు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తుదిజట్టు నుంచి అతడిని పక్కనపెట్టాలనే యోచన చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఆ ఆలోచన మార్చుకున్న యాజమాన్యం.. ఇంగ్లండ్ సిరీస్ రూపంలో హిట్మ్యాన్కు మరో అవకాశం ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డ మీద విఫలమైతే.. అదే అతడి కెరీర్లో ఆఖరి సిరీస్ అవుతుందని సెలక్టర్లు స్పష్టం చేసినట్లు సమాచారం.కాగా అఫ్గాన్తో వన్డే సిరీస్కు విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు అవకాశం వచ్చింది. రోహిత్ శర్మతో కలిసి రెండు, మూడో వన్డేలో ఓపెనింగ్ చేసిన జైసూ 4, 110 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లో రోహిత్ శర్మ వారసుడిగా జైసూను పూర్తిస్థాయి ఓపెనర్గా బరిలోకి దించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.నిజమేనా?కానీ ఇంగ్లండ్తో సిరీస్కు రోహిత్ శర్మనే ఎంపిక చేయడం చూస్తుంటే మాత్రం ఈ ఊహాగానాలు నిజం కాదనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. వరల్డ్కప్నకు ముందు మరికొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నందున జైస్వాల్ను తీసుకొచ్చి రిస్క్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అఫ్గానిస్తాన్తో సిరీస్లో రోహిత్- జైస్వాల్ ఓపెనర్లుగా రాగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడాడు. దీనిని బట్టి రోహిత్ను ఇంకొంతకాలం కొనసాగిస్తారనే చర్చా నడుస్తోంది.అగార్కర్, గంభీర్ కఠిన నిర్ణయంఏదేమైనా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం రోహిత్ను పక్కనపెట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్కప్ నాటికి రోహిత్కు 40 ఏళ్లు వస్తాయి. ఈ క్రమంలోనే ఫిట్నెస్ దృష్ట్యా ఈ వెటరన్ ప్లేయర్ను పక్కనపెట్టాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 285 వన్డేలు ఆడి 11720 పరుగులు సాధించాడు. అంతేకాదు వన్డేల్లో ఓవరాల్గా మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా హిట్మ్యాన్ కొనసాగుతున్నాడు. ఇలాంటి దిగ్గజ ఆటగాడికి యాజమాన్యం ఎటువంటి వీడ్కోలు ఇస్తుందో చూడాలి మరి!!చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్మార్! -
‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్పై శ్రీశాంత్ ఆరోపణలు
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మాటలతో సంచలనాల పరంపరకు తెరతీశాడు. శుక్రవారం మాజీ స్పిన్నర్ హర్భజన్కు సవాల్ విసిరిన శ్రీశాంత్, ఆ తర్వాత గంభీర్ కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని మెంటార్ లేదా కోచ్గా ఎంపిక చేయాలని పేర్కొన్నాడు. తాజాగా గంభీర్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. 2023లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా గంభీర్ తనను దేశద్రోహి అని తిట్టినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలోనే శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘2023 లెజెండ్ లీగ్ టోర్నీలో మేమిద్దరం ప్రత్యర్థులుగా ఆడాము. నేను వేసిన తొలి బంతినే గంభీర్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. అయితే అతడి గేమ్ ఏంటో నాకు తెలుసు. ఆ వెంటనే నేను బౌన్సర్ను సంధించాను. ఆ సమయంలోనే గంభీర్ నన్ను ఒక ఫిక్సర్గా పిలిచాడు. దీంతో గంభీర్ దగ్గరకు వచ్చి భయ్యా నువ్వు బాగానే ఉన్నావా? అని అడిగాను. ఎందుకంటే నేను వేసిన బౌన్సర్ అతడికి తాకింది. కానీ గంభీర్ మాత్రం ఒక అసభ్య పదజాలం వాడడంతో పాటు మళ్లీ ఒకసారి ఫిక్సర్, దేశద్రోహి అని పిలిచాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్,శ్రీశాంత్ సభ్యులుగా ఉండడం విశేషం. అయితే క్రికెట్ నుంచి దూరమైన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్పై నిషేధం పడిన సమయంలో గంభీర్ అతడిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడేళ్ల నిషేధం తర్వాత 2020లో శ్రీశాంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆకట్టుకోలేక ఆటకు వీడ్కోలు పలికాడు. ఆటకు గుడ్బై చెప్పిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా వచ్చాడు. అతడి పర్యవేక్షణలో టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.Read: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. -
గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్!
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ లాంటి వ్యక్తి కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో ధోని లాంటి ఫ్రెండ్లీ వ్యక్తిని కోచ్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. 'లల్లన్టాప్' వెబ్సైట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.'ముందు కోచ్ను మార్చండి. భారత్కు ఇప్పుడు కావాల్సింది కోచ్ కాదు, ఒక మంచి మెంటార్. ఒక షో సజావుగా సాగడానికి డైరెక్టర్ ఎంత ముఖ్యమో, జట్టుకు కోచ్ కూడా అంతే ముఖ్యం. నాకు సాధారణంగా కోచ్లపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ అంతర్జాతీయ జట్లకు సాంప్రదాయ కోచ్ల కంటే మెంటార్ల అవసరమే ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా గంభీర్ అనుసరిస్తున్న కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఫెయిల్ అయితే జట్టు నుంచి తీసేస్తామనే భయాన్ని కల్పించి, ఆటగాళ్లను ఒక కఠినమైన వ్యవస్థలోకి నెట్టే కోచ్ జట్టుకు అవసరం లేదు.' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని గురించి శ్రీశాంత్ ప్రస్తావించాడు.'జనాలు ఏమైనా చెప్పుకోవచ్చు.. కానీ ధోని ఆలోచనా విధానం, అతను ఆటగాళ్లలో నింపిన ఆత్మవిశ్వాసమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. గంభీర్ స్థానంలో ధోనికి కోచ్ బాధ్యతలు అప్పగించాలి.' అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలవడంలో గంభీర్కు అధిక క్రెడిట్ ఇవ్వడం సరికాదని శ్రీశాంత్ వ్యాఖ్యనించాడు. మైదానంలో చెమటోడ్చి ఆడేది ఆటగాళ్లు, కాబట్టి ఆ గుర్తింపు, క్రెడిట్ వారికే దక్కాలని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాళ్ల ప్రదర్శనే అక్కడ అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఒకవేళ సంజూ శాంసన్ రాణించకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సరిగ్గా చేయకపోయినా, లేదా సమయానికి బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్లమా? మైదానంలోకి వచ్చి కోచ్ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా? చెప్పండి అంటూ గంభీర్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నలు వేశాడు.అంతకముందు మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు శ్రీశాంత్ సవాల్ విసిరాడు. ఐపీఎల్ చెంపదెబ్బ ఘటన గుర్తుచేసుకున్న శ్రీశాంత్ తన వెనుక స్క్రీన్పై ఉన్న హర్భజన్ను చూపిస్తూ.. 'నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్లోకి రా.. అక్కడ తేల్చుకుందాం' అని భజ్జీకి సరదాగా సవాల్ విసిరాడురు. తాను ప్రస్తుతం 'బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్'తో సంబంధం కలిగి ఉన్నానని.. కోనర్ మెక్ గ్రోర్ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. SREESANTH BACKS DHONI-TYPE LEADERSHIP OVER STRICT COACHING 👀🎙️: "India doesn't need a coach who forces players to follow instructions and drops them if they don't. Even MS Dhoni never operated that way. What the team needs is a mentor, and Mahi bhai would be the perfect fit… pic.twitter.com/kbGt6EjHot— Faruk (@uf2151593) June 19, 2026Read: ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు -
ముంబైకి సూర్య గుడ్బై!.. గంభీర్తో కలిసి ఆ జట్టులోకి?!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా ఘనత సాధించాడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఆ ఆనందం మూణ్ణెళ్ల ముచ్చటే అయింది. అనూహ్య రీతితో సూర్యను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. జట్టులో చోటే లేకుండా చేసింది యాజమాన్యం.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు తొలుత సూర్యనే సారథ్యం వహిస్తాడనే ప్రచారం జరగ్గా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేసింది. బ్యాటర్గా విఫలమవుతున్న సూర్యను జట్టు నుంచి కూడా తప్పించింది.బ్యాటర్గా విఫలం ఇక టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్-2026 సీజన్లోనూ 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా దారుణ ప్రదర్శన కనబరిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్లలో కలిపి కేవలం 270 పరుగులే చేశాడు. ఈ పరిణామాల క్రమంలో భారత టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూర్యకుమార్ భవితవ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబైకర్ 40 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఐపీఎల్ ఆడతాడని.. అయితే, టీమిండియాలో మాత్రం అతడు తిరిగి చోటు దక్కించుకోలేడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు అతడి ముంబై ఇండియన్స్ను వీడితే బాగుంటుందని సూచించాడు.ముంబైని వీడి...ఈ మేరకు కామ్బాక్స్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి సూర్య తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జట్టుకడితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది జరిగే అవకాశం లేకపోలేదు.వన్డే వరల్డ్కప్-2027 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడు కేకేఆర్ హెడ్కోచ్, మెంటార్గా తిరిగి వస్తాడు. అప్పుడు కేకేఆర్కు సూర్య కెప్టెన్ అవుతాడు. గంభీర్ తప్పక సూర్యకు మద్దతుగా ఉంటాడు’’ అని రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు.గతంలో ఆ జట్టుకే ఆడాడుకాగా 2014- 2017 మధ్య కాలంలో గంభీర్ కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించాడు. తాను పదవి నుంచి వైదొలిగే కంటే ముందు నాయకత్వ బృందంలో సూర్యను చేర్చేలా గంభీర్ మద్దతు ఇచ్చాడు. అతడిని వైస్ కెప్టెన్గా నియమించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఊతప్ప ఈ మేరకు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉంటాడు. కాగా గంభీర్ మార్గదర్శనంలో సూర్య సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: డబుల్ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్ -
గంభీర్తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
అఫ్గనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్ సేన స్వదేశంలో అఫ్గన్తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్కు దూరం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు.. లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గంభీర్, అగార్కర్ విముఖత?వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్కప్ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.తలవంచనుఅయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.గంభీర్తో మాకు సంబంధం లేదు‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్- గిల్ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్రూమ్లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
కెప్టెన్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత టీ20 కెప్టెన్గా నియమితుడయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.గంభీర్-అయ్యర్ గతంలో ఐపీఎల్లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్లో (మెంటార్-కెప్టెన్) కేకేఆర్ టైటిల్ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు.అయ్యర్ శైలి ప్రత్యేకంఅయ్యర్ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ప్రభ్సిమ్రన్ సింగ్ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు. -
భువీని కాదని హర్షిత్కు చోటు.. గంభీర్పై ఆగ్రహజ్వాలలు
భారత సీనియర్ క్రికెట్ జట్టులో కెప్టెన్లకే గ్యారెంటీ లేని రోజుల్లో, ఓ ఆటగాడు కోచ్ అండదండలతో దాదాపు ప్రతి జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆ ఆటగాడి పేరే హర్షిత్ రాణా. ఈ 24 ఏళ్ల కేకేఆర్ పేసర్కు గంభీర్తో సత్సంబంధాలు ఉన్నాయి. గంభీర్ కేకేఆర్ కోచ్గా పని చేసే సమయంలో హర్షిత్ను బాగా వెనకేసుకొచ్చాడు. టీమిండియా కోచ్గా ఎంపికయ్యాక భారీ లాబీయింగ్ జరిపి హర్షిత్కు ఏకంగా భారత జట్టులోనే చోటు ఇప్పించాడు.అది కూడా ఏదో ఒక ఫార్మాట్కే అనుకుంటే పొరపాటే. మూడు ఫార్మాట్ల జట్లలో ఎవరున్నా, లేకపోయినా హర్షిత్ పేరు ఉంటుంది. బుమ్రా అయినా ఏదో ఒక సిరీస్ జట్టులో ఉండడేమో కానీ, హర్షిత్ మాత్రం దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతాడు. హర్షిత్కు ఇంతలా అవకాశాలు వస్తున్నాయంటే, అతడేదో భారీ టాలెంటెడ్ అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటివరకు అతడు టీమిండియా తరఫున 2 టెస్ట్లు, 14 వన్డేలు, 9 టీ20లు ఆడినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేదు.ఇలాంటి ఆటగాడికి భారత సెలెక్టర్లు ఏం చూసి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఏదో కోచ్ అండదండలతో నెట్టుకొస్తున్నాడు కానీ, హర్షిత్ దేశవాలీ జట్లకు కూడా చాలా ఎక్కువే. ఇది చాలామంది టీమిండియా అభిమానుల "అభిప్రాయం". తాజాగా గంభీర్-హర్షిత్ బంధం మరోసారి సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో హర్షిత్కు చోటు దక్కింది. ఇతగాడు గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా సెలెక్టర్లు నేరుగా జాతీయ జట్టులో మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీమిండియాకు ఎంపిక కావడానికి ఐపీఎల్ ప్రదర్శనలు కొలమానం కానప్పటికీ.. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఇదే తంతు కొనసాగుతుంది.Look at the hypocrisy of Agarkar and Gambhir. They picked Harshit Rana, who was injured for 2-3 months, but left out Bhuvneshwar Kumar, the highest wicket-taker of this year's IPL. pic.twitter.com/BLS7ySwP6l— Aryan (@MStark_56) June 6, 2026ఐపీఎల్ ప్రదర్శనలనే పరిగణలోకి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు మొదటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్లో భువీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా టోర్నీ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.భువీ లాంటి ఇన్ ఫామ్ బౌలర్ను కాదని గాయపడి 2-3 నెలుల ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ లాంటి అన్ ఫిట్ బౌలర్కు ఏకంగా మూడు భారత జట్లలో అవకాశం ఇవ్వడాన్ని ప్రతి భారత క్రికెట్ అభిమాని తప్పుబడుతున్నాడు. హర్షిత్ ఎంపికలో ప్రతిసారి చక్రం తిప్పే కోచ్ గంభీర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. గంభీర్-చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అర్హతలేని ఆటగాళ్లను ఎంపిక చేసే మాఫియా నడుపుతున్నారని ఫైరవుతున్నాడు.కాగా, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను తప్పించి శ్రేయస్కు కొత్త టీ20 కెప్టెన్గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపందింది. మూడు వేర్వేరు జట్లలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో హర్షిత్ రాణా ఒకరు. -
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్! -
పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!
బీసీసీఐ తన పంథా మార్చేసిందా? ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసే వారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతః అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెర లేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తోన్న వైఖరి ఇందుకు ఉదాహరణ.బీసీసీఐ నుంచి ఘనంగా వీడ్కోలు అందుకన్న క్రికెటర్లలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అయితే ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కనీస వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే వాళ్లు రిటైర్ ఇవ్వడం జరిగిపోతున్నాయి. తాజాగా సూర్యకుమార్ను ముందు టీ20 కెప్టెన్గా తొలగించిన బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్లో స్టార్ హోదా పొందాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను నిలుపుకోవడం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు. గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలకు సాధ్యం కాని ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండడం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్కు, కేవలం టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముంది. అంతేకాని పొమ్మనలేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగ2ఇంచారు కాబట్టి కనీసం ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అతడిని పరిగణలోకి తీసుకొని సెండాఫ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.గతంలో అలా..భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 1986లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. కానీ అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్.. తమతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని గావస్కర్ను కోరాడు. దీనికి గావాస్కర్ ఒప్పుకోవడం, బీసీసీఐ కూడా ఓకే అనడంతో 1987లో పాక్తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఘనంగా వీడ్కోలు పలికాడు. పనిలో పనిగా గావస్కర్ 10వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. అలా గావస్కర్ తన వీడ్కోలు మ్యాచ్ను ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అతడి వందో సెంచరీ కోసం కొన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చినా బీసీసీఐ అతడిని పక్కకు పెట్టలేదు. 2014లో ముంబైలోని తన హొంగ్రౌండ్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్కు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ మధురానుభూతులు ఇప్పటికీ తన కళ్ల ముందు ఉన్నాయని సచిన్ చాలాసార్లు పేర్కొన్నాడు.షాక్ ఇచ్చిన ధోని..భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోనికి పేరుంది. రెండు ప్రపంచకప్లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోనికి 2019 వరల్డ్కప్లో సెమీస్ మ్యాచ్ చివరిది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2019లో ఆటకు దూరమైన ధోని.. తాను తలచుకుంటే బీసీసీఐకి చెప్పి ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడడం పెద్ద విషయం కాదు. కానీ ధోని అలా చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో 2020 ఆగస్టు 15 సాయంత్రం ఏడు గంటలకు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒక పోస్టు పెట్టి ప్రకటించాడు.గంభీర్ రాక.. మారిన పరిస్థితులుటీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనుభవానికి ప్రాధాన్యమివ్వకుండా ఫామ్లో ఉన్న ఆటగాడికే తన మద్దతు ఉంటుందని గంభీర్ వచ్చిన కొత్తలోనే కుండబద్దలు కొట్టాడు. తన సమకాలీన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇలాంటి వైఖరినే వ్యవహరించాడు. 2024లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో తాము టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించిన రోహిత్, కోహ్లీలు స్వల్ప వ్యవధిలో గుడ్బై చెప్పేశారు. అలా కాదని వీళ్లిద్దరు బీసీసీఐకి తమకు ఒక చివరి టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని అడిగి ఉంటే సమాధానం ఎలా వచ్చి ఉండేదో. ఇప్పుడు సూర్యకుమార్ వంతు వచ్చింది. ఒకప్పుడు మిస్టర్ 360 డిగ్రీస్ క్రికెటర్గా పేరు పొందిన సూర్యకుమార్ ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా మిగిలిపోయాడు. టీమిండియా క్రికెట్కు అతడు అందించిన రెండు కప్పులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అతడికి ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కల్పించాలని కోరుకుందాం.చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
అతడికి అన్యాయం.. ఛాన్సులు ఇవ్వలేదు: గంభీర్
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది.వన్డౌన్లో ఎవరు?శుబ్మన్ గిల్ సారథ్యంలోని టెస్టు జట్టులో కొత్తగా మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే కొత్తగా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో స్థానం కోసం సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ మధ్య పోటీ నెలకొంది. సాయి సుదర్శన్ చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తరఫున బరిలో దిగాడు.ఈ మ్యాచ్లో సాయి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 15 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లో 14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్తో టెస్టులో సాయికి కాకుండా పడిక్కల్కు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు.న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలిఅఫ్గన్తో శనివారం నాటి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్కు సరైన అవకాశాలు లభించలేదు. అతడు ఎక్కువగా ఇంగ్లండ్లోనే ఆడాడు. అతడికి న్యాయంగా మరొక్క ఛాన్స్ ఇవ్వాలని నేను బలంగా విశ్వసిస్తున్నా.ఏదేమైనా మేము పదకొండు మందిని మాత్రమే తుదిజట్టులోకి ఎంపిక చేస్తాము కదా!.. సాయి ఫామ్ కూడా మరీ అంత చెత్తగా ఏమీ లేదు. ఇటీవల ఐపీఎల్లో అతడు 700కు పైగా పరుగులు సాధించాడు. కేవలం 4-5 మ్యాచ్ల ద్వారా సాయి ఆట తీరుపై నిర్ణయానికి రాకూడదు’’ అని గంభీర్ పేర్కొన్నాడు.పడిక్కల్ మరోసారి బెంచ్కే తద్వారా అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో సాయి సుదర్శన్లో వన్డౌన్లో ఆడిస్తామని గంభీర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో పడిక్కల్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.కాగా కర్ణాటక బ్యాటర్ పడిక్కల్ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో 543 పరుగుల సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే, గంభీర్ మాత్రం సాయి వైపే మొగ్గుచూపడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చివరగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా.. ప్రత్యర్థి చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో టెస్టు ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ సైకిల్లో భాగం కాదు. అయితే, ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా తమ బలాన్ని పరీక్షించుకునే వీలు దొరికింది. కాగా టెస్టు తర్వాత టీమిండియా అఫ్గన్తో మూడు వన్డేలు ఆడనుంది.చదవండి: ‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు నచ్చదు’ -
పంత్కు గంభీర్ క్లాస్.. లీక్ చేసిన అసిస్టెంట్ కోచ్!
అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. గతేడాది రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలను చేపట్టిన గిల్కు డిప్యూటీగా పంత్ ఎంపికయ్యాడు. కానీ ఆ తర్వాత అతడి ఫామ్ దారుణంగా పడిపోయింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో రిషబ్ పేలవమైన ప్రదర్శనలు కనబరిచాడు. దీంతో అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో పంత్తో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అఫ్గాన్తో జరిగే టెస్టు మ్యాచ్లో ఒక సీనియర్ ఆటగాడిగా ఎలా వ్యవహరించాలనే విషయంపై గంభీర్ పంత్తో మాట్లాడాడు. ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ వెల్లడించాడు."రిషబ్ ఒక సీనియర్ ప్లేయర్గా జట్టులో బాధ్యతాయుతమైన పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నాడు. యువ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై గంభీర్, పంత్ మధ్య చర్చ జరిగింది. జట్టులో ఒక రోల్ మోడల్గా పంత్ నిలుస్తాడని ఆశిస్తున్నాను" అని డెష్కాట్ పేర్కొన్నాడు. కాగా 2025లో రిషబ్ మొత్తం 7 టెస్టులు ఆడి, 48.38 సగటుతో 629 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా రికార్డు బాగున్నప్పటికీ, సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 27, 2, 7, 13 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో కూడా అదే తీరును కనబరిచాడు. ఐపీఎల్లో 12 మ్యాచ్లు ఆడి కేవలం 27.88 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం లక్నో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకొన్నాడు.చదవండి: AUS vs PAK: షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే -
BCCI సంచలన నిర్ణయం టీ20 కెప్టెన్సీ నుండి సూర్య ఔట్?
-
టీ20 కొత్త కెప్టెన్గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్వన్ బ్యాటర్గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్లను కాదని శ్రేయస్ అయ్యర్కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే! -
గంభీర్ తప్పుకోనున్నాడా? టీమిండియాకు కొత్త కోచ్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా అఫ్గానిస్తాన్తో సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లకు సంబంధించి జట్టును ప్రకటించారు. గంభీర్ హెడ్కోచ్గా టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సహా 2026 టీ20 ప్రపంచకప్ నెగ్గింది. 2027 వన్డే వరల్డ్కప్ వరకు గంభీరే టీమిండియాకు హెడ్కోచ్గా కొనసాగనున్నాడు. అయితే టీ20 క్రికెట్లో గంభీర్ను కోచ్గా తప్పించి వేరే వాళ్లకు అవకాశమివ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఊహాగానాలే అయినప్పటికీ ఇప్పటికిప్పుడు గంభీర్ స్థానంలో టీమిండియాకు కొత్త టీ20 కోచ్గా ఎవరు వస్తే బాగుంటుందనే దానిపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయం వెల్లడించాడు. గంభీర్ స్థానంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా ఉన్న ఆశిష్ నెహ్రా కోచ్ స్థానానికి సరైన వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడాడు. ‘ఆశిష్ నెహ్రా చాలా స్మార్ట్ క్రికెటర్. క్రికెట్ గురించి అతడితో మాట్లాడితే కచ్చితంగా ఎమెషనల్ అవుతాము. అతడు ఎప్పుడు జట్టు గురించే ఆలోచిస్తాడు. ఆశిష్ నెహ్రా చాలా నిక్కచ్చిగా ఉండే కోచ్. ఆటను చాలా సూక్ష్మంగా అంచనా వేస్తాడు. ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడం, వారి కెరీర్ ఎదుగుదలకు నెహ్రా సహయపడుతాడు. ఒక కోచ్గా జట్టును చాలా ప్రభావితం చేయగలడు. ఆటగాళ్లందరినీ ఒకే తాటిపై నడిపించగల సత్తా అతని సొంతం. బీసీసీఐ ఒకవేళ టీ20 క్రికెట్కు కొత్త కోచ్ను చూస్తున్నట్లయితే ఆ పాత్రకు ఆశిష్ నెహ్రా న్యాయం చేయగలడు. నెహ్రాను కేవలం బౌలింగ్ కోచ్గా చూడడం ఆపేయాలి. ఎందుకంటే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు హెడ్కోచ్గా విజయవంతమయ్యాడు. అంతేగాక చాలాకాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆశిష్ నెహ్రాకు వేర్వేరు కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడిన అనుభవముంది. ఒకవేళ టీమిండియాకు కోచ్ పాత్రలో వస్తే హెడ్కోచ్గానే రావాలని కోరుకుంటున్నా’అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్లో ఆశిష్ నెహ్రా హెడ్కోచ్గా గుజరాత్ టైటాన్స్ను విజయవంతంగా నడిపించాడు. 2022లో చాంపియన్స్గా నిలిచిన గుజరాత్ ఆ తర్వాతి సీజన్లో రన్నరప్గా నిలిచింది. 2024 సీజన్లో విఫలమైనప్పటికీ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ ఈ ఏడాది సీజన్లో ఫైనల్ చేరి మరోసారి రన్నరప్గా నిలిచింది.చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే యోచనలో బీసీసీఐ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీ పదవి పోయినప్పటికీ సూర్యకుమార్ బ్యాటర్గా తుదిజట్టులో కొనసాగుతాడని బీసీసీఐ పేర్కొంది. అయితే తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటర్గా పూర్తిగా విఫలమైన సూర్యకుమార్ తుది జట్టు నుంచే తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లో సూర్యకుమార్ భవితవ్యం ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ను తుదిజట్టులో ఆడించాలా వద్దా అనేది గంభీర్తో పాటు సెలెక్షన్ కమిటీ సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. ఫామ్లేమి దృశ్యా సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, గంభీర్తో సూర్యకు ఉన్న సఖ్యత కారణంగా అదంత సులువు కాదనిపిస్తోంది. ఎందుకంటే సూర్య సారథ్యంలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్తో పాటు ఆసియాకప్ను గెలుచుకుంది.అయితే దాదాపు ఏడాదిగా భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ స్థానంపై తీవ్రమైన పరిశీలన కొనసాగుతోంది, ఐదుగురు సెలెక్టర్లు కూడా అతడిని తుది జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా కెప్టెన్గా సూర్యకుమార్ జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటర్గా మాత్రం రాణించడంలో విఫలమయ్యాడు. అయితే భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ను జట్టు నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్లో నిలకడగా రాణిస్తే సూర్యకుమార్కు చివరి చాన్స్ ఇద్దామని బీసీసీఐ భావించింది. కానీ సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్లో దారుణ ప్రదర్శన కనబరచడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం, గంభీర్ నాయకత్వంలోని ఈ పరివర్తన దశలో భవిష్యత్ ప్రణాళిక, అధికార సమీకరణాలు మారుతుండటంతో భారత క్రికెట్ ఒక సంధి దశలో నిలబడి ఉంది. గణాంకాలు సూర్యకుమార్కు అనుకూలంగా లేనప్పటికీ, గౌతమ్ గంభీర్కు అతనిపై ఉన్న విశ్వాసం, అతనితో ఉన్న సంబంధం భారత టీ20 కెప్టెన్సీ భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.చదవండి: ఆర్సీబీకి షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ ఆటగాడు! -
వన్డే వరల్డ్కప్ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగానే చెబుతున్నారు.తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.మౌనం వీడిన కోహ్లిఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్కప్ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.As I said, if Kohli feels the team management or BCCI wants him to prove his worth, he’ll retire the next day and that’s exactly what he said.He added "Ofc I want to play 2027 WC " 😭♥️ pic.twitter.com/eOv07nN6fc— Gaurav (@Melbourne__82) May 15, 2026ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనేనాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా.వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్కాస్ట్లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గంభీర్, అగార్కర్ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్-2026 సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడి 484 పరుగులు సాధించాడు.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.టైటిల్ గెలిచిన తర్వాతఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే భారత్ వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేరింది.ఇక ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని నాటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్కు క్రెడిట్ ఇచ్చాడు.కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్కు కారణమా?ఇదిలా ఉంటే.. గంభీర్ టీమిండియాలో సూపర్స్టార్ సంస్కృతిని పారద్రోలి.. సూపర్ టీమ్గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, సూపర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉందిఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై స్పందించాడు. స్కూప్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.వారే స్ఫూర్తి దాతలుకాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ లేదంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే! -
‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్పై సంచలన ఆరోపణలు!
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ అతుల్ వస్సన్ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ దూకుడు స్వభావం, అతడి కఠిన వైఖరితో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వస్సన్ ఆ ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరించాడు. అతుల్ వస్సన్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జరగాలి, ఇంకేమీ చేయకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. మొదటి నుంచి గంభీర్ స్వభావం అలాగే ఉంటుంది. ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గంభీర్ ఆటలో మంచి టెక్నిక్ ఉండడంతో పాటు మంచి తెలివిమంతుడు. అయితే అతనికి ఉండే ఈగో వేరే లెవెల్లో ఉంటుంది. అదెలా అంటే అతను ఏదైనా అనుకుంటే అవతలి వ్యక్తుల కూడా తనకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్లో అలాగే కొనసాగడం ఆటగాళ్లతో గొడవలు పడేలా చేసింది. అందుకే ఐపీఎల్లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి పట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్రవర్తనతో కచ్చితంగా సంతోషంగా లేరని చెప్పగలను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా! -
పంత్పై వేటు.. సంజూకు చోటు!.. రేసులో అతడు కూడా!
ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కొనసాగుతున్నాడు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, పంత్ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.వైఫల్యాల పరంపరగతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు పంత్ (Rishabh Pant). సారథిగా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 189 పరుగులే చేశాడు పంత్. ఇక లక్నో ఎనిమిదింట కేవలం రెండు గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.భవిష్యత్ ప్రశ్నార్థకంఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో పంత్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచకప్-2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్కు.. 2026 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు.పంత్పై వేటు.. సంజూకు చోటు!తాజాగా ఐపీఎల్లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 జట్టు ఎంపికలో పంత్ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వన్డేల్లో కేఎల్ రాహుల్కు బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్గా సంజూ శాంసన్ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ ఫిక్సైంది.ధ్రువ్ జురెల్ కూడా..ఇక ఈ రేసులో ధ్రువ్ జురెల్ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజూ టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాకౌట్ మ్యాచ్లలో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలిచాడు. ఐపీఎల్-2026లో ఇప్పటికే రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు.ఈ నేపథ్యంలో సంజూకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా సంజూ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కాగా 2027 వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ మొతలుపెట్టనున్నారు. ఇక పరిమిత ఓవర్ల జట్టులో స్థానం గల్లంతైనప్పటికీ.. టెస్టుల్లో మాత్రం పంత్ చోటుకు ఢోకా ఏమీలేదు.చదవండి: రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలు -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్గా గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లు భారత్ గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
‘గంభీర్.. మొరటుతనం తగ్గించుకో’
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే కోచ్గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్గా గంభీర్కు అసలైన సవాల్ ముందుంది.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్బాల్క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్కు ఒక ఉదాహరణ. కోచ్గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు. భారత ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. ఇం2్లండ్లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లతో సిరీస్లు ఆడనుంది.చదవండి: ‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’! -
‘సంజూకు మామయ్యలాంటి వాడిని’
భారత జట్టు స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు శశిథరూర్ వెల్లడించారు. అయితే సంజూ శాంసన్తో బంధం ఈనాటిది కాదని, అతడికి తాను మామయ్యలాంటి వాడినని తెలిపారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026లో సంజూ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీలో 321 పరుగులు చేసిన శాంసన్ ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శశిథరూర్ సంజూ శాంసన్తో తనకున్న అనుబంధాన్ని, సంజూ విషయంలో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నాడు. ‘సంజూని మొదటిసారి 14 ఏళ్ల వయసులో చూశాను. ఆ సమయంలో అతడికి నేను ఎందుకో అంకుల్గా ఫీలయ్యాను. ఆ సమయంలోనే శాంసన్ టాలెంట్ స్పష్టంగా కనిపించింది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడు నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని శాంసన్కు చెప్పాను. కానీ తర్వాత గంభీర్తో ఈ విషయమై చర్చకు వచ్చినప్పుడు, ఆయన ‘లేదండీ శాంసన్ తర్వాతి ధోనీ కాదు..వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’ అని చెప్పినట్లు గుర్తుంది. ఇవాళ గంభీర్ మాటలు నిజమయ్యాయి.సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరం లేదు. అతడిని అతడిలానే ఉండనిద్దాం. సంజూ శాంసన్ ఎంతో వినయంగా ఉంటాడు.మంచి నాయకుడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను సమర్థంగా నడిపించాడు. ఇప్పుడు చెన్నై జట్టులోనూ తనకంటే ప్రత్యేకతను సాధించుకుంటాడు. జట్టుకు అవసరమైనప్పుడు స్వార్థం లేకుండా ఆడతాడు. శతకం కోసం ఆడకుండా టీమ్ కోసం పెద్ద షాట్లు ఆడాడు. అదే అతని గొప్పతనం. శాంసన్ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. సంజూ శాంసన్కు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్గా ఆడించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది’ అని శశిథరూర్ వెల్లడించారు. ఇంతకాలం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఈ సీజన్ నుంచి చెన్నై సూపర్కింగ్స్కు ఆడనున్నాడు. తన ఫెవరెట్ క్రికెటర్ అయిన ఎంఎస్ ధోనితో కలిసి ఆడనుండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శాంసన్ ఇటీవలే సీఎస్కే ప్రాక్టీస్లో జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించాడు.చదవండి: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్.. సంచలనం రిపీటయ్యేనా? -
అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్కప్-2027 వరకు తానే చీఫ్ సెలక్టర్గా ఉంటానని అగార్కర్ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.అతడికి ఆ అవసరం లేదుఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్ ప్యానెల్లోని సబ్ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.అజిత్ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్ వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్లో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు.సాహసోపేత నిర్ణయాలు సెలక్షన్ కమిటీ చైర్మన్గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్ అగార్కర్ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్కప్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఆసియా టీ20 కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లను భారత్ గెలుచుకుంది.ఇక అజిత్ అగార్కర్కు తోడుగా హెడ్కోచ్గా మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్కప్ గెలిచాడు. సీనియర్ల రిటైర్మెంట్ఇక వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక 2024లో వరల్డ్కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్కప్-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ? -
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్! -
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచింది.ఇక దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.సాహసోపేత నిర్ణయాలుఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.ఫలితంగా జూన్, 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్పై కూడా విమర్శలు వచ్చాయి.రో-కో ఆడటం కష్టమంటూఅంతేకాదు వన్డే వరల్డ్కప్-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్ గిల్ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.మరోసారి..ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.వన్డే వరల్డ్కప్-2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలక్టర్గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్జోన్ నుంచి ఓ మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్ -
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్ మ్యాచ్లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఆ తర్వాత ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్రూమ్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’ -
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్మన్ గిల్కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్లపై టెస్టు సిరీస్లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026 -
టీమిండియా హెడ్కోచ్గా ధోని రావాలి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ నవ్వడం అరుదు. ఎల్లప్పుడూ గంభీరంగానే కనిపించే ఈ ఢిల్లీ స్టార్ ముఖంపై అప్పుడప్పుడు మాత్రమే చిరునవ్వులు చూడగలం. ఇటీవల భారత్ టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన సందర్భంగా గౌతీ నవ్వులు చిందించడం అభిమానులకు కనువిందు చేసింది.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్, భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన వీరుడు మహేంద్ర సింగ్ ధోని సైతం గౌతీ నవ్వు గురించి కామెంట్ చేశాడు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఒకప్పటి సహచర ఆటగాడు గంభీర్ను ఉద్దేశించి ధోని పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.గంభీరమైన ముఖంలో ఆ నవ్వు..‘‘కోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు’’ అంటూ ధోని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నవ్వులు చిందించేందుకు ఇంతకంటే గొప్ప కారణం ఉంటుందా!.. నిన్ను చూడటం సంతోషంగా ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ధోని ఈసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు హాజరైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ను ఓడించి భారత్ మరోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ను ముద్దాడిన దృశ్యాలను ధోని ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ నేపథ్యంలో గంభీర్ ధోనిని కలుసుకోవడం సంతోషమంటూ కామెంట్ చేశాడు.అతడు నా స్థానంలో ఉండాలిఇక తాజాగా రెవ్స్పోర్ట్స్తో మాట్లాడిన గంభీర్కు ధోని ‘స్మైల్ కామెంట్’ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రపంచకప్ ఫైనల్ చూసేందుకు ధోని అక్కడికి రావడం సంతోషంగా అనిపించింది. తను నన్ను నవ్వమని అడగటం కూడా నచ్చింది.ఏదో ఒకరోజు అతడు నా స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా ధోని గురించి అదే కోట్ రాస్తాను. అతడు కూడా డగౌట్లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. తనలాగే ధోని టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టి.. కోచ్ హోదాలో ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆకాంక్షించాడు.ధోని సారథ్యంలో గౌతీకాగా 2007లో ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక 2011లో ధోని కెప్టెన్సీలోనే సొంతగడ్డపై శ్రీలంకను ఓడించి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.ఈ రెండు సందర్భాల్లోనూ గౌతం గంభీర్ భారత జట్టులో సభ్యుడు. ఇక ధోని 2013లో కెప్టెన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాడు. మరోవైపు.. 2024లో టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ను భారత్ గెలుచుకుంది.ఇక తాజా విజయంతో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా మూడోసారి, వరుసగా రెండోసారి, సొంతగడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. చదవండి: T20 WC: ఆ ఒక్క ఎంపిక విషయంలోనే మా మధ్య విభేదాలు: సూర్య -
ఆ ఒక్క ఎంపిక విషయంలోనే గౌతీ భాయ్తో విభేదాలు: సూర్య
టీమిండియాకు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ గెలవడంతో సూర్యకు ఈ అరుదైన గౌరవం దక్కింది.మరోవైపు.. ఈ విజయంతో హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిపించిన గౌతీ.. తాజాగా సూర్యతో కలిసి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమయ్యాడు.ఒకటీ రెండు విషయాల్లో విభేదాలుఈ నేపథ్యంలో గౌతం గంభీర్తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ఆలోచనలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని తెలిపాడు. అయితే, ఒకటీ రెండు విషయాల్లో తమ మధ్య విభేదాలు తలెత్తిన మాట వాస్తవమే అయినా.. అవి అంతగా పట్టించుకోదగ్గ విషయాలు కావని పేర్కొన్నాడు.వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. ‘‘జట్టును ఎంపిక చేసే సమయంలో 15 మంది పేర్లలో పద్నాలుగు మేమిద్దరం కలిసి చెప్పినవే ఉంటాయి. మేము ఒకే విధంగా ఆలోచిస్తున్నామనడానికి ఇది నిదర్శనం.చర్చ మాత్రమే ఉంటుందిమా లక్ష్యాలు కూడా ఒక్కటే. అందుకే ఆ ఒక్క పేరు విషయంలో మా మధ్య వాదనలు కాకుండా చర్చ మాత్రమే ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇప్పటికీ తాను గంభీర్ను గౌతీ భాయ్ అనే పిలుస్తానని.. తమది అన్నాదమ్ముల అనుబంధం అని తెలిపాడు.పరిస్థితికి తగినట్లేఇక వరల్డ్కప్లో తాము ఆడిన విధానంపై స్పందిస్తూ.. ‘‘ధైర్యంగా ఆడటానికి, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్లు హై రిస్కీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. కానీ ప్రతిసారి అలాగే చేయలేము. పరిస్థితికి తగినట్లే ఆడి అనుకున్న ఫలితం రాబట్టడమే మా ప్రధాన లక్ష్యం’’ అని సూర్య చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ -
అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్ అన్నాడు. భారత్ ఇటీవల వరుసగా సీనియర్, అండర్–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్ స్థాయిలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్ను చూస్తే మన జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్ వరల్డ్ కప్ చివరి మూడు మ్యాచ్లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’ -
‘ఇది ఆరంభం మాత్రమే’
న్యూఢిల్లీ: భారత జట్టు వచ్చే కొన్నేళ్లలో అన్ని విధాలుగా ప్రపంచ క్రికెట్ను శాసిస్తుందని బ్యాటర్ సంజు సామ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన జట్టు చూపిస్తున్న ప్రదర్శన అన్ని చోట్లా పునరావృతమవుతుందని అతను అన్నాడు. 321 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్... భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ‘మన దేశంలో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. వీరిని చూస్తే మన విజయపరంపర కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో మరింత గొప్ప ఆటను మన క్రికెటర్ల నుంచి చూడవచ్చు. ఇటీవల వరల్డ్ కప్ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని విజయాలు దక్కడం ఖాయం’ అని ఆదివారం జరిగిన బీసీసీఐ వార్షిక పురస్కారాల సందర్భంగా సామ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరిందని అతను ఉద్వేగంగా చెప్పాడు. ‘ఎవరికైనా పెద్ద కలలు ఉంటాయి. అయితే అవి అంత సులువుగా నిజం కావు. రెండేళ్ల క్రితమే దేశానికి ప్రపంచ కప్ను అందించాలని అనుకున్నా.నేను బలంగా కోరుకున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్లో ఇబ్బందులు వచ్చాయి. మానసికంగా సమస్యల్లో ఉన్నా. కానీ జట్టుకు నేను అవసరమై పిలుపు వచ్చినట్లుగా మళ్లీ అవకాశం దక్కింది. టీమ్లో ప్రతీ ఒక్కరి నేను బాగా ఆడాలని, జట్టుకు ఉపయోగపడాలని కోరుకున్నారు. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగా. ఇదంతా ఒక సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగి నిజంగా మారింది’ అని సామ్సన్ వివరించాడు. -
‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభ దశ నుంచి సెమీస్ వరకు అభిషేక్ డకౌట్లు లేదా తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయినా కూడా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అభిషేక్కు అవకాశాలిస్తూ అతడికి వెన్నుదన్నుగా నిలుస్తూనే వచ్చాడు. మ్యాచ్ల్లో వరుసగా విఫలమవుతున్నా జట్టులో చోటు కల్పించడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే గంభీర్ మాత్రం అభిషేక్పై పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అభిషేక్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి అంతకముందు తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం చెప్పాడు. ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్ను వెనుకేసుకు రావడానికి గల కారణాన్ని కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా వెల్లడించాడు. ‘2014 ఐపీఎల్ సమయంలో నేను చాలా బ్యాడ్ఫేస్ను ఎదుర్కొన్నాను. అప్పట్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో వరుసగా మూడు డకౌట్లు కావడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఒక ఆటగాడు పరుగులు చేయలేదంటే అతని స్కోర్ కంటే ఫామ్ గురించే మాట్లాడుకుంటారు. కానీ నిజానికి అభిషేక్ అక్కడ ఫామ్ కోల్పోలేదు.. కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అతడికి వివరించాను. అయితే అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అతను తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని ఆరాట పడుతుంటాడు. కానీ ఒక బ్యాటర్ 20 నుంచి 30 బంతులు ఆడినప్పుడు మాత్రమే అతని ఫామ్ను అంచనా వేయగలం. అయితే అభిషేక్ పట్టుమని 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అందుకే అవకాశమొచ్చిన ప్రతీసారి మరింత అగ్రెసివ్గా ఆడాలని చెప్పేవాడిని. అదీగాక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంతిని గ్రౌండ్ అవతలికి పంపించాలనుకోవడం అభిషేక్ నైజం. ఇది ఒక రకంగా మంచిదే.అంతిమంగా బయట ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు.. డ్రెస్సింగ్రూమ్లో అతడి గురించి ఏమీ ఆలోచిస్తున్నారన్నదే ఇక్కడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో మాత్రం 21 బంతుల్లో 52 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియా కప్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: అభిషేక్ను చూసి అసూయపడేవారు! -
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ను హెడ్కోచ్ గౌతం గంభీర్ సమర్థించాడు. డారిల్ మిచెల్ విషయంలో అర్ష్దీప్ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్లో జరిగిన టైటిల్ పోరులో క్రీజులో ఉన్న కివీస్ స్టార్ డారిల్ మిచెల్కు బౌలింగ్ చేసిన అర్ష్దీప్ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్ కోపంగా అర్ష్దీప్ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్దీప్ కూడా మిచెల్ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్దీప్నకు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్దీప్ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ ANI పాడ్కాస్ట్కు హాజరు కాగా అర్ష్దీప్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్లో బాదితే ఏ బౌలర్కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్ అర్ష్దీప్ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. -
టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్కు ఇచ్చిపడేసిన గంభీర్
భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్కు టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడతారని.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవడంలో అర్థం లేదన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ట్రోఫీ కైవసం చేసుకుంది. తద్వారా మూడోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ చైర్మన్ జై షా స్టేడియానికి సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించారు.కీర్తి ఆజాద్ వివాదాస్పద ట్వీట్ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ‘‘టీమిండియా సిగ్గుపడు!.. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచినపుడు.. ఆ జట్టులో హిందు, ముస్లిం, సిక్కు ఉన్నారు. నాడు మేము ఆ ట్రోఫీని మాతృభూమి భారత్=హిందుస్థాన్= ఇండియాకు తీసుకువచ్చాము.కానీ ఇప్పటి క్రికెట్ జట్టు ట్రోఫీని ఎందుకిలా చేస్తోంది. మసీదు లేదంటే చర్చి లేదంటే గురుద్వారకు తీసుకువెళ్లవచ్చు కదా!.. ఈ జట్టు ఇండియా మొత్తానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇదేమీ సూర్యకుమార్ యాదవ్ లేదంటే జై షా కుటుంబానికి చెందినది కాదు.సిరాజ్ ఎప్పుడూ ట్రోఫీని మసీదుకు తీసుకువెళ్లలేదు. విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ చర్చికి తీసుకువెళ్లలేదు. ఇది 140 కోట్ల భారతీయులకు చెందినది. అంతేగానీ ఓ మతానికి చెందినది కాదు’’ అని కీర్తి ఆజాద్ పోస్టు చేశాడు. ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చుఈ విషయంపై స్పందించాల్సిందిగా ANI గంభీర్ను కోరగా.. ‘‘అలాంటి వాళ్ల మాటలకు స్పందించడం కూడా దండగే. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అతి పెద్ద సంబరం ఇది. వరల్డ్కప్ విజేతగా నిలిచిన జట్టును అందరూ అభినందిస్తున్నారు.కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు ఆ విజయాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడతారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా జట్టులోని ఆటగాళ్లు వీటిని సీరియస్గా తీసుకోరు.సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారీ ఓటమి తర్వాత మా వాళ్లు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజేతలుగా నిలిచారు. అయితే, కొంతమంది మాత్రం సొంత దేశ ఆటగాళ్లను, జట్టును కించపరుస్తున్నారు. ఇది సరికాదు’’ అని గంభీర్ కీర్తి ఆజాద్కు చురకలు అంటించాడు.#WATCH | On TMC MP & former cricketer Kirti Azad's statement, Head Coach of Team India, Gautam Gambhir says in an interview with ANI, "...It is not even worth answering this question...These kinds of statements just degrade the players and team, which should not be done."Watch… pic.twitter.com/gIWtMpIbm8— ANI (@ANI) March 11, 2026 -
గంభీర్కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్కోచ్గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా ఉన్న శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్లో ఆడతాడు.మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
కావాల్సింది భారత్ విజయాలు
⇒ భారత జట్టు ప్రదర్శన, టోర్నీ అసాంతం ఆడిన తీరు అద్భుతం. అహ్మదాబాద్లో మన జట్టు చరిత్ర సృష్టించింది. (ఎప్పుడు గంభీరంగా ఉండే గౌతీని ఉద్దేశించి) కోచ్ సాబ్... మీ ముఖంపై ఈ చిరునవ్వు బాగుంది. గెలుపు కోసం తపించిన మీ పట్టుదల, ఈ చిద్విలాసం రెండు కిల్లర్ కాంబినేషన్. బుమ్రా చాంపియన్ బౌలర్. అతని గురించి ఓ ముక్కలో సరిపెట్టలేను. ఓ వాక్యంలో పూర్తి చేయలేను. ⇒ రెండేళ్ల తర్వాత ధోని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ పోస్ట్కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ధోని, గంభీర్ అభిమానులైతే తెగ రీట్వీట్ చేసుకుంటున్నారు.అహ్మదాబాద్: తాజా ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే భారత జట్టు ఘనవిజయాలే ముఖ్యమని అన్నాడు. విజయానంతరం కోచ్ మాట్లాడుతూ ‘మన జట్టు ట్రోఫీలతో సంబరాలు చేసుకోవాలి... వ్యక్తిగత ఘనతలతో కాదు’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తను పదవిలో ఉన్నంత కాలం సమష్టి విజయాలపైనే దృష్టి ఉంటుందని అన్నాడు. ఒకట్రెండు మెగా ట్రోఫీలతో, లేదంటే విజయాలతో భారత శకం మొదలైనట్లుగా భావించనన్నాడు. సోషల్ మీడియా చెత్తని పట్టించుకోనని తేలిగ్గా తీసిపారేశాడు. నమ్మకంతోనే జట్టును నిర్మించాలి, అంచనాలతో కాదని స్పష్టం చేశాడు. పలు అంశాలపై మీడియాతో గంభీర్ పంచుకున్న అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఉండాల్సింది నమ్మకం ఏదైనా జట్టు నమ్మకంతో ఎదగాలి. అంచనాలతో కాదు. అంటే ఆటగాళ్ల ఎంపికైనా... జట్టు నిర్మాణమైనా... ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఒకటే. అదే రాణిస్తారనే నమ్మకం. ఈ పునాదితోనే జట్టును నిర్మిస్తాం. అంతే కానీ ఫలానా ఆటగాడు ఈ పూటకు మెరిపిస్తాడు లేదంటే ఈ మ్యాచ్లో గట్టెక్కిస్తాడనే అంచనాలతో జట్టును నిర్మించడం సాధ్యపడదు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఒకటి అర వైఫల్యంతో కూలిపోదు. సంజూ సామ్సన్, అభిõÙక్, ఇషాన్ కిషన్లు కూడా విఫలమయ్యారు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అందువల్లే జట్టులో కొనసాగారు. విజయవంతమయ్యారు. సోషల్ మీడియాను పట్టించుకోను అదేపనిగా విమర్శల్ని లేదంటే ప్రతికూల వార్తల్ని వైరల్ చేసే సోషల్ మీడియాను, పనికిరాని నెటిజన్ల పోస్టుల్ని పట్టించుకోను. కోచ్గా నేను జవాబుదారీగా ఉండాలనుకునేది ఈ 30 మందికే (డ్రెస్సింగ్ రూమ్లో భాగమయ్యే ప్లేయర్లు)! పరిమిత ఓవర్ల శకం మాదే అనుకోను అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ శకం మొదలైందని నేను అనుకోను. మా ఆధిపత్యం మొదలైనట్లయితే మేం గత మూడు వన్డే సిరీస్లలో రెండు ఎలా ఓడిపోతాం. ప్రత్యేకించి ఐసీసీ క్రికెట్ టోర్నిల్లో మాత్రం భారత్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాను. 2024లో టి20 ప్రపంచకప్, 2025లో చాంపియన్స్ ట్రోఫీ, 2026లో టి20 వరల్డ్కప్ ఇలా ఏడాదికో ఐసీసీ ట్రోఫీ చొప్పున భారత్ గెలుచుకుంది. లక్ష్మణ్, ద్రవిడ్లకు థ్యాంక్స్ముఖ్యంగా ఈ తాజా కప్ను నా కన్నా ముందు హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్కు, బీసీసీఐ ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితమిస్తున్నా. కొన్నేళ్లపాటు అంకితభావంతో శ్రమించిన ద్రవిడ్ టీమిండియాను ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా మార్చాడు. అలాగే ఆటగాడిగా భారత్కు విజయాలందించిన లక్ష్మణ్ ఇప్పుడు బెంగళూరులో కుర్రాళ్లకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు.2028లో ‘హ్యాట్రిక్’, బంగారమాయేనా... భారత జట్టు సభ్యులందరూ గెలుచుకున్న వరుస ప్రపంచకప్లతో అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత జట్టు సభ్యుల సగటు వయసు 30. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే మెగా ఈవెంట్కు దాదాపు వీరే ఉండటం ఖాయం. నిజానికి కెపె్టన్ సూర్యకుమార్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వినిపించినా విజయానంతరం స్వయంగా అతనే వాటిని తోసి పుచ్చాడు. ప్రస్తుతానికి పక్కన బెట్టినా... 2028 వరకైతే సూర్య కొనసాగడం ముమ్మాటికి కష్టమే! ఇక ఆ ఏడాది (2028) భారత క్రికెట్కు అత్యంత కీలకం కానుంది.ఓవైపు ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ ఊరిస్తుంటే... ప్రతిష్టాత్మక లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కూడా జరుగనున్నాయి. ఇందులోనూ చాంపియన్ అయితే మాత్రం 2028 మనకి బంగారమవుతుంది! ఆదివారం రాత్రి కప్తో పిచ్పై కూర్చున్న కెపె్టన్ సూర్యకుమార్ ఫొటోలకు పోజులిస్తూ తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణం, మరో టి20 ప్రపంచకప్ గెలవడమనే చెప్పాడు. ఆదివారం రాత్రి విన్నర్స్ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవం తర్వాత భారత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో మైదానంలో ఉల్లాసంగా గడపడంతోపాటు ట్రోఫీతో ఫొటోలు దిగారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి పలువురు ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు. -
ఈ విజయం వారిద్దరికీ అంకితం: గంభీర్
టీమిండియా సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు అతడిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేనని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్దరు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజయాల వెనుక వీరిద్దరూ ఉన్నారని మీడియా ముఖంగా ప్రకటించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్. టీమిండియా టి20 ప్రపంచకప్ విజయాన్ని ఎవరికి అంకితం చేస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చాడు. ఎవరూ ఊహించని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్. టీమిండియా విజయాల్లో వీరిద్దరి పాత్ర ఎంతో ఉందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు."టి20 ప్రపంచకప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను లక్ష్మణ్ క్రమపద్ధతిలో నడిపిస్తూ జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నార"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్కోచ్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వారిద్దరికీ కృతజ్ఞతలుఐసీసీ ప్రస్తుత చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా తనకు కష్టకాలంలో అండగా నిలిచారని వెల్లడించారు. గతేడాది స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జైషా దన్నుగా నిలిచారని తెలిపాడు. ఎన్ని విమర్శలు వచ్చినా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ను పొగిడారు. వీరిద్దరికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.భయాన్ని వదులుకోవాలితాను తన జట్టుకు జవాబుదారిగా ఉంటానని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్పష్టం చేశాడు. టీమ్ వల్లే తాను కోచ్ కాగలిగానని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయపడ్డాడు. సెమీస్, ఫైనల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేనన్నారు. ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డుల కంటే ట్రోఫీలు గెలవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తానేప్పుడు నమ్మకం ఆధారంగానే జట్టు సభ్యులను ఎంపిక చేస్తానని చెప్పాడు. చదవండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే! -
అబ్బా.. అదొక కిల్లర్ కాంబో: ధోని పోస్ట్ వైరల్
టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది.ఈ నేపథ్యంలో యావత్ భారతావని సూర్య సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్, టీమిండియాకు తొలి టీ20 వరల్డ్కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు.. ఒకప్పటి సహచర ఆటగాడు, ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ఆసక్తికర పోస్టు చేశాడు.కన్నులపండుగ‘‘అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నులపండుగగా సాగింది.అబ్బా అదొక కిల్లర్ కాంబోకోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్. ఇక బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా.. అతడొక చాంపియన్ బౌలర్’’ అని ధోని ఇన్స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫొటో జతచేశాడు. ధోని షేర్ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆరు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఏకైక కెప్టెన్గాకాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్కప్ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్కప్ (ఇందులోనూ గంభీర్ సభ్యుడే), 2013లో చాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. తద్వారా భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 255/5(20)👉న్యూజిలాండ్ స్కోరు: 159(19)👉ఫలితం: 96 పరుగుల తేడాతో భారత్ జయభేరిచదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్The ICC Men's #T20WorldCup 2026 Champions, everyone! ⭐️ ⭐️ ⭐️#INDvNZ #TeamIndia #Champions pic.twitter.com/5FFrQvYcww— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
-
సక్సెస్ఫుల్ కోచ్
భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోరీ్నల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోరీ్నకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెపె్టన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెపె్టన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగి
భయం లేదు, బెదురు లేదు... మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన మాత్రమే ఉంది. ఒక వికెట్ పడితే నెమ్మదించిపోయే తత్వం ఎప్పుడో అంతరించిపోయింది. ఒకడు పోతే మరొకడు అన్నట్లుగా అవుటైన బ్యాటర్ తర్వాత వచ్చే ఆటగాడు అంతకంటే ఎక్కువ కసితో చెలరేగిపోయేందుకు సిద్ధం... గత రెండేళ్ళలో భారత టి20 జట్టు బ్యాటింగ్ ప్రతాపం ఇదే తరహాలో సాగింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లి, జడేజా ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. కానీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. ఐపీఎల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్న వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కడా తగ్గకుండా అదే స్థాయిని ప్రదర్శించారు. ఓపెనర్గా ప్రతీ మ్యాచ్కు కొత్త రికార్డు నెలకొల్పుతూ వచ్చిన అభిషేక్ ఇచ్చిన ఆరంభాలు టీమిండియా విజయాలు సులువు చేస్తే, మిడిలార్డర్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కీలకంగా మారాడు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అతను ఆడిన ఇన్నింగ్స్ జట్టులో తిలక్ విలువను చూపించింది. ఇక అనూహ్యంగా టీమ్కు దూరమై తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ మరింత చెలరేగిపోయాడు. అసాధారణ ఫామ్తో అతను వరల్డ్ కప్లోకి అడుగు పెట్టాడు. టోర్నీలో కూడా పాకిస్తాన్పై మ్యాచ్తోపాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కీలక సమయంలో భారత జట్టు వ్యూహం మార్చిన తీరు టోర్నీలో మన రాతను మార్చింది. టాప్–3లో అభిషేక్, కిషన్, తిలక్లవంటి ముగ్గురు ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో ప్రత్యర్థులు ఆఫ్స్పిన్నర్ను ప్రయోగించి జట్టును దెబ్బ తీస్తూ వచ్చారు. దీనిని గుర్తించిన యాజమాన్యం సామ్సన్ను మళ్లీ ఆడించి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. అంతే... ఆ తర్వాత టీమ్ ప్రదర్శన ఒక్కసారిగా మారిపోయింది. జింబాబ్వేపై 256 పరుగులు, విండీస్పై 196 పరుగుల అలవోక ఛేదన, ఇంగ్లండ్పై 253, న్యూజిలాండ్పై 255... ఇలా పరుగుల వరద పారింది. ఒక్క అమెరికాపై మ్యాచ్ మినహా బ్యాటర్గా సూర్యకుమార్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. కానీ సహచరుల ప్రదర్శనలతో భారత్ వరుస విజయాలు సాధించడం సారథిగా అతనిపై ఒత్తిడిని తగ్గించింది. ఇక అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా విలువ వెలకట్టలేనిది. బ్యాటింగ్లో భారీ హిట్టింగ్తో పరుగులు రాబట్టిన అతను బౌలర్గా అటు కొత్త బంతితో, ఇటు చివరి ఓవర్లలో కూడా సత్తా చూపించాడు. ఇంగ్లండ్పై సెమీస్లో అతను వేసిన 19వ ఓవర్ ఎంత కీలకంగా మారిందో చెప్పనవసరం లేదు. ఈసారి జట్టు విజయంలో శివమ్ దూబే కూడా తోడయ్యాడు. స్లాగ్ ఓవర్లలో మొత్తం 17 సిక్సర్లతో దూబే చూపించిన దూకుడు జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. బౌలింగ్లో బుమ్రా ఒంటి చేత్తో జట్టుతో నడిపించిన తీరు అతను ‘ఆల్టైమ్ గ్రేట్’ ఎందుకో చెబుతుంది. 2024 టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన బుమ్రా ఈసారి కూడా వన్నె తగ్గకుండా తన పదునును చూపించాడు. ఏడుకంటే తక్కువ ఎకానమీతో అతను పరుగులు ఇచ్చిన తీరు ప్రత్యర్థి బ్యాటర్లను ఏమాత్రం కోలుకోకుండా చేసింది. ఫైనల్లో తీసిన 4 వికెట్లు బుమ్రా స్పెషల్. తనదైన శైలిలో బ్యాటర్లను నిలువరించడంలో అర్‡్షదీప్ కూడా పూర్తిగా సఫలమయ్యాడు. వరుణ్ చక్రవర్తి టోర్నీ ద్వితీయార్ధంతో కొంత తడబడినా... ఓవరాల్గా అతని స్పిన్ ప్రభావం బాగానే కనిపించింది. టీమ్ కూర్పు కారణంగా సిరాజ్, కుల్దీప్ ఒకే ఒక్క మ్యాచ్కే పరిమితం కాగా, రింకూ సింగ్కు కూడా ఎక్కువ అవకాశం రాలేదు. 2024 ఆరంభం నుంచి భారత జట్టు ఆరుసార్లు 250కు పైగా స్కోర్లు నమోదు చేసింది. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా భారీ షాట్లతో విరుచుకుపడింది. 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత 50 మ్యాచ్లలో 41 విజయాలు మన స్థాయిని, అసాధారణ ప్రదర్శనను చూపించాయి. ఈ టోర్నీలో కూడా ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో మినహా మిగతా ఎనిమిది మ్యాచ్లలో టీమిండియా అసలు స్థాయిని ప్రదర్శించాయి. గత రెండేళ్లుగా సాగించిన సన్నాహాలు, వరుస సిరీస్లలో విజయాలు, ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు వరుసగా రెండో వరల్డ్ కప్ను అందించాయి. –సాక్షి క్రీడా విభాగం సక్సెస్ఫుల్ కోచ్ భారత గడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల చేతుల్లో క్లీన్స్వీప్నకు గురి కావడం, ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో చిత్తుగా ఓడటం హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్కు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. కోచ్గా సమర్థుడు కాకపోయినా... బీసీసీఐ పెద్ద అండదండలంతో సాగుతున్నాడనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను ‘డ్రా’గా ముగించినా అతనికి తగిన క్రెడిట్ దక్కలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్కు సంబంధించి మాత్రం గంభీర్ను విజయవంతమైన కోచ్గా అంగీకరించాలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీల్లో జట్టు విజేతగా నిలవడంతో కోచ్గా అతని పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి అన్ని అంశాల్లో అతని భాగస్వామ్యం ఉంది. జట్టు ఎంపిక మొదలు తుది జట్టులో మార్పులు, కీలక సమయాల్లో వ్యూహాల విషయంలో గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. కెప్టెన్గా పెద్దగా అనుభవం లేని సూర్యకుమార్కు సరైన రీతిలో అతను మార్గనిర్దేశనం కూడా చేశాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, 2026 టి20 వరల్డ్ కప్లను గెలిపించిన కెప్టెన్ గంభీర్ తదుపరి లక్ష్యం 2027 వన్డే వరల్డ్ కప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో ఆటగాడిగా టి20 వరల్డ్కప్ గెలిచిన గంభీర్ ఇప్పుడు కోచ్గా తన ఖాతాలో మరో ప్రపంచకప్ జమ చేసుకున్నాడు. -
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్ ఆరంభంలో నేపాల్ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్-8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్.. ఇంగ్లండ్ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, విల్ జాక్స్ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్తో కీలకమైన ‘సూపర్–8’ మ్యాచ్లో శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు’’ అని గంభీర్ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్ వర్మ, శివమ్ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్!‘క్రికెట్ ఎప్పటికైనా టీమ్ గేమ్. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
-
అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూ శాంసన్పై ప్రశంసలు కురిపించాడు. అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్ అంటూ ఆకాశానికెత్తాడు. సరైన సమయంలో రాణించి తన విలువను మరోసారి చాటుకున్నాడని కొనియాడాడు.టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు ఫామ్లేమితో సతమతమైన సంజూ (Sanju Samson)తుదిజట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్గా అతడి స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం కాగా సంజూ తొలిసారి వరల్డ్కప్ మ్యాచ్ ఆడాడు.బాధ్యతాయుత ఇన్నింగ్స్అనంతరం సూపర్-8లో జింబాబ్వేతో మ్యాచ్లో ఆడిన సంజూ.. తాజాగా వెస్టిండీస్తో ఆదివారం నాటి కీలక మ్యాచ్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అదిరిపోయే ఆట తీరుతో జట్టును సెమీ ఫైనల్కు చేర్చాడు.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026కోల్కతా వేదికగా సహచర ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన వేళ సంజూ.. 50 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ సంజూను ప్రశంసలతో ముంచెత్తాడు.అతడొక వరల్డ్క్లాస్ ప్లేయర్.. అందుకే మద్దతు‘‘సంజూ మంచి ఆటగాడు అని అందరికీ తెలుసు. అయితే, కొన్నిసార్లు విఫలమైనా అతడికి మద్దతుగా నిలవడం అవసరం. మేము అదే పని చేశాము. అందుకు తగ్గట్లుగానే జట్టుకు అతడి అవసరం ఉన్న కీలక సమయంలో రాణించాడు.అతడి పూర్తి స్థాయి నైపుణ్యాలను ఈరోజు ప్రదర్శించి.. జట్టుకు విజయం అందించాడు. అతడు వరల్డ్క్లాస్ ప్లేయర్ అని నేను తరచూ చెబుతూ ఉంటాను. సంజుకు గొప్ప ప్రతిభ ఉంది. ఇప్పటి నుంచి అతడి నుంచి ఇలాంటి ఇంకెన్నో ఇన్నింగ్స్ చూడాలని కోరుకుంటున్నా’’ అని గంభీర్ సంజూను కొనియాడాడు.ఐదు వికెట్ల తేడాతో విజయంకాగా వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 199 పరుగులు సాధించింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ముంబై వేదికగా గురువారం సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకుంటుంది.As soon as Sanju Samson smashed a match winning SIX, just look at the Celebration of Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Suryakumar Yadav and Jay Shah 💥- Most trolled and most hated Sanju Samson delivered at the biggest stage 👏🏻#INDvsWI pic.twitter.com/tYJmi4fxwC— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 1, 2026 -
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం -
కొంపముంచిన గంభీర్
-
గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై?
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..భారత క్రికెట్ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్ జాగరణ్లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ గంభీర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం.వాటా ఇస్తారా?.. ట్రిపుల్ ధమాకా!ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్ (Gautam Gambhir)కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్ రాయల్స్ జట్టు మొత్తం గంభీర్ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్కప్ విన్నర్కు దక్కుతుంది.ఒకవేళ గంభీర్ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.టెస్టులలో ఫ్లాప్అయితే, రాజస్తాన్ ఆఫర్ను గంభీర్ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్కోచ్గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం గంభీర్కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్ 2025ని కూడా కైవసం చేసుకుంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో హిట్ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్గా టీ20 ప్రపంచకప్-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్కోచ్గా పదవి చేపట్టిన గంభీర్ పదవీ కాలం 2027 వరల్డ్కప్ వరకు ఉంది. ఇలాంటి తరుణంలో గంభీర్ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్ రాయల్స్ ఆఫర్కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్ భారత్కు మరో ఐసీసీ టైటిల్ అందించిన తర్వాతే హెడ్కోచ్గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.ఐపీఎల్ వీరుడుటీమిండియా ఓపెనర్గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్ ఐపీఎల్లోనూ సత్తా చాటాడు. కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్కు కూడా గంభీర్ మెంటార్గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఐపీఎల్లో మొత్తంగా 154 మ్యాచ్లు ఆడి 4218 పరుగులు సాధించాడు.చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్ -
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
ఐసీసీ టీ20 వరల్డ్కప్-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్లో నమీబియాతో భారత్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్జైట్లీ మైదానం ఇందుకు వేదిక.సతీసమేతంగాఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లతో పాటు కోచ్లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు ఓల్డ్ రాజేంద్రనగర్లో ఉన్న గంభీర్ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.#WATCH | Members of the Indian T20 cricket team arrive at the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi. Gautam Gambhir is hosting a special dinner for the team https://t.co/VQ2symRZ2M pic.twitter.com/tXgiuAwN6D— ANI (@ANI) February 8, 2026అందుకే డిన్నర్ పార్టీలుకాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్ డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్కోచ్ ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.టీ20 ప్రపంచకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్-ఎలో పాకిస్తాన్, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్ (ఫిబ్రవరి 15).. లీగ్ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్తో తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్!#WATCH | Indian Cricket Team Head Coach Gautam Gambhir arrives at his residence in Delhi pic.twitter.com/Y3yg3yvgVy— ANI (@ANI) February 8, 2026 -
గంభీర్ బాటలో అభిషేక్ శర్మ.. ఇలా చేశావేంటి బ్రో?
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో ఈ పంజాబీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.గత కొన్నాళ్లుగా మంచి ఫామ్లో ఉన్న అభిషేక్.. కెరీర్లో తొలి ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్కప్లో టీమిండియా ఆరంభ మ్యాచ్లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ అదరగొడతాడని అంతా భావించారు.అయితే, ఊహించని రీతిలో అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అమెరికా పేసర్ అలీ ఖాన్ బౌలింగ్లో సంజయ్ కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చిన ఈ లెఫ్టాండర్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయ్యాడు.ఇక అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్కావడంతో.. “గంభీర్ బాటలో నడిచిన అభిషేక్ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. పవర్ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.టీ20 వరల్డ్కప్ అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అయిన భారత ఆటగాళ్లు వీరే👉గౌతం గంభీర్👉ఆశిష్ నెహ్రా (గోల్డెన్ డక్)👉శార్దూల్ ఠాకూర్👉దీపక్ హుడా👉అభిషేక్ శర్మ (గోల్డెన్ డక్). -
తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..పదవి నుంచి తొలగించాలిగౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులేఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.వారిదే తుది నిర్ణయంఅయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు. చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే -
గిల్కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్గా ఇప్పటికైనా గిల్కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్స్వీప్ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్కు హాజరైన సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్బాల్ మ్యాచ్ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
-
ప్రధాని తర్వాత కష్టమైన జాబ్ చేస్తున్నాడు
టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు, తిరువనతంపురం ఎంపీ శశిథరూర్ మాత్రం ప్రశంసలు కురిపించారు. దేశంలో రెండో కష్టతర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బరంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్పూర్లో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతకుముందుకు గంభీర్తో ఆయన భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్'లో పోస్ట్ చేసి, తమ ఫొటోను షేర్ చేశారు.''నాగ్పూర్లో నా పాత స్నేహితుడు గౌతమ్ గంభీర్తో జరిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది తనను విమర్శిస్తున్నా ప్రశాంతంగా పనిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాన''ని ఎక్స్లో రాసుకొచ్చారు. శశిథరూర్ ట్వీట్కు ధన్యవాదాలు అంటూ గంభీర్ సమాధానం ఇచ్చారు.కివీస్ రన్స్ కంటే నా సెల్పీలే ఎక్కువతన నాగ్పూర్లో పర్యటనలో భాగంగా ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్(ఈవో) నిర్వహించిన కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ టి20 మ్యాచ్ను ఆయన వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహలం నడుమ మ్యాచ్ చూడడం ఎంతో బాగుందని పేర్కొంటూ.. తన ఫొటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడడంతో తన నాగ్పూర్ పర్యటన పూర్తయిందన్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చానని చమత్కరించారు. టీమిండియా (Team India) విజయాన్ని పూర్తిగా ఆస్వాదించానని పేర్కొన్నారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేతకాగా, శశిథరూర్ కొంతకాలంగా సొంత పార్టీతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించి హస్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్ను కలవడంతో పాటు ఆయనను పొడగ్తలతో ముంచెత్తారు. గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాతే టీమిండియా ఎన్నడూ చవిచూడని పరాజయాలు పొందిందని అందరూ విమర్శిస్తుంటే.. థరూర్ మాత్రం ఆయనను వెనుకేసుకురావడం గమనార్హం. వీరిద్దరి భేటీపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు. In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026 -
నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్తో గంభీర్.. వీడియో వైరల్
సొంతగడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సన్నాహకంగా కివీస్తో జరిగే ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్ సేన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది.హార్దిక్ పాండ్యా రీఎంట్రీహెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్-2025 మ్యాచ్లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్.. మంచి ఫామ్లో ఉన్నాడు. కివీస్తో టీ20 సిరీస్, ప్రపంచకప్ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కుపెట్టావు?ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ సెషన్లో బంతితో, బ్యాట్తో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్రౌండర్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్- హార్దిక్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.పవర్ఫుల్ హిట్టింగ్తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. ఇందుకు హార్దిక్.. ‘‘మొదటి టైర్లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్ టైర్లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు. బుమ్రా కూడాఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కివీస్తో టీ20 సిరీస్తో తిరిగి టీమిండియాతో చేరాడు. కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!Sound On 🔊 Dialling up the intensity as #TeamIndia steps into T20I mode to take on New Zealand ⚡️ #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/RSE2DXLFXA— BCCI (@BCCI) January 20, 2026 -
గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్కు ముందు వరకు గంభీర్ను టెస్ట్ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్ కోచ్గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్మన్ గిల్కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్కు అన్యాయం చేసి గిల్ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్ షమీ లాంటి సీనియర్ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్మన్ గిల్ సైతం భారత కెప్టెన్గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్ల్లోనూ గిల్ (కెప్టెన్గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్తో పోటీ పడుతున్నాడు. -
రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపుపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్లో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తొలగింపు చర్చలు మళ్లీ వేడెక్కాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తివారి ఆరోపణల ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కారణం. అగార్కర్ తీసుకున్న నిర్ణయంపై గంభీర్ ప్రభావం చూపాడు. అగార్కర్ బలమైన వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఒంటరిగా తీసుకోలేడు. ఈ సమయంలోనే గంభీర్ ప్రభావం చూపాడు. సాధారణంగానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చీఫ్ సెలెక్టర్ కోచ్ సూచనలు తీసుకుంటాడు. రోహిత్ వన్డే కెప్టెన్సీ తొలగింపులో ఇదే జరిగింది. రోహిత్కు జరిగిన అన్యాయానికి గంభీర్, అగార్కర్ బాధ్యత వహించాలి. రోహిత్ను తొలగించిన తీరు తనకు అభిమానిగా, మాజీ సహచరుడిగా చాలా బాధ పెట్టింది. అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీని, అంతకుముందే టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ను ఇలా తొలగించడం సబబు కాదు. రోహిత్ నుండి శుభ్మన్ గిల్కు వన్డే కెప్టెన్సీ బదిలీ చేసే ప్రక్రియ సాఫీగా జరగాల్సింది. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ వరకు రోహిత్ను కెప్టెన్సీలో కొనసాగించి, ఆతర్వాత గిల్కు బాధ్యతలు అప్పగించాల్సింది. 2027 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేయడం తగదని తివారి అభిప్రాయపడ్డాడు. తివారి చేసిన ఈ వ్యాఖ్యలతో గంభీర్–అగార్కర్ జంటపై మళ్లీ దృష్టి పడింది. నాయకత్వ మార్పులు ఎలా జరుగుతున్నాయి.. అవి సరైన రీతిలో కమ్యూనికేట్ అవుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కొన్ని నెలలకే కెప్టెన్సీ తొలగించబడ్డాడు. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ వంటి విజయవంతమైన కెప్టెన్కు గౌరవప్రదంగా మార్చి ఉండాల్సిందనే వాదన బలపడుతుంది. గిల్ నియామకం భవిష్యత్తుకు సంకేతం అయినప్పటికీ, రోహిత్ను తొలగించిన తీరు గౌరవప్రదంగా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు."బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్లు ఆడకుండా బెంచ్పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు -
టీమిండియా కోచ్ పదవి ఆఫర్.. సున్నితంగా తిరస్కరించిన పాక్ మాజీ కోచ్..!
టీమిండియా హెడ్ కోచ్ పదవి ఆఫర్పై పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జేసన్ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్లో ఓ పాకిస్తాన్ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్గా వ్యవహరించమని అడిగాడు. ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్ వాష్ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్ చేశాడు. ఈ ఆఫర్ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్ యూజర్-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐకి పాకిస్తాన్ కోచ్గా పని చేసిన వారికి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్ కోచ్ అయ్యేంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్ ఎక్స్ యూజర్ను చెడుగుడు ఆడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్ను భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.వాస్తవానికి గంభీర్పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది. ఇంత దారుణమైన ట్రాక్ ఉంటే సహజంగానే ఏ కోచ్పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్) ఆ పదవికి రాజీనామా చేశాడు. గిల్లెస్పీ జమానాలో పాక్ బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్ మొహిసిన్ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు. -
గౌతమ్ గంభీర్పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.టెస్ట్ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. గంభీర్ టెస్ట్ జట్టు కోచ్గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్కోచ్మెన్షిప్పై ఊహాగానాలు తొలగిపోయాయి.ముందుంది ముసళ్ల పండగప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్లో ఫైనల్స్కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్లో ఫైనల్స్కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. తాజా సైకిల్లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో టీమిండియా ఫైనల్కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు. -
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
-
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వన్డౌన్లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్కు ముందు సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్ను మార్చబోము. తప్పక ఆర్డర్ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్పూర్లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్మన్లను బరిలోకి దించింది. బార్ట్మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మాన్.చదవండి: భారత్ X పాకిస్తాన్ -
గంభీర్, సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే!
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్డౌన్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను పంపించింది మేనేజ్మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ను పంపించారనుకోవచ్చు.కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్డ్గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.అయితే, టీ20 ఓపెనర్గా గిల్ను పంపడం కోసం.. ఫామ్లో ఉన్న సంజూ శాంసన్పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేశారు. -
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్ పంత్ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్కప్ ప్లాన్లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టువిరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్వన్షీ, ప్రన్షు విజయరణ్.చదవండి: వరల్డ్కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు -
‘రోహిత్, కోహ్లి కీలకమే కానీ’...
సాక్షి, విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో విజయం సాధించడంలో సీనియర్లతో పాటు... యువ ఆటగాళ్లూ కీలక పాత్ర పోషించారని భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ , ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లి ఈ మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకోగా... రోహిత్ శర్మ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. గంభీర్కు సీనియర్ ఆటగాళ్లకు మధ్య సయోధ్య కుదరడం లేదనే వార్తల నేపథ్యంలో... సిరీస్ విజయం అనంతరం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్, కోహ్లి ప్రాధాన్యత... పేస్ ఆల్రౌండర్గా హర్షిత్ రాణా రాణించడం... వాషింగ్టన్ సుందర్కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వడం వంటి వివరాలు అతడి మాటల్లోనే... » కోహ్లి, రోహిత్ నాణ్యమైన ప్లేయర్లు. వాళ్లు ప్రపంచశ్రేణి ఆటగాళ్లు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఇలాంటి అనుభజు్ఞలు డ్రెస్సింగ్ రూమ్లో ఉండటంతో జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. » వాళ్లు చక్కగా ఆడుతున్నారు. సుదీర్ఘకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లిద్దరూ చాలా ముఖ్యం. » పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటే... జట్టు ఎంపికలో వెసులుబాటు ఉంటుంది. అందుకే హర్షిత్ రాణా వంటి వారిని ప్రోత్సహిస్తున్నాం. ఎనిమిదో స్థానంలో బ్యాట్తో పరుగులు చేయగల ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా మేలే కదా. అలాంటి ఆటగాడు జట్టులో సమతూకాన్ని తీసుకువస్తాడు. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ముగ్గురు ప్రధాన పేసర్లు జట్టులో ఉండటం తప్పనిసరి. రాణా పేస్ ఆల్రౌండర్గా మరింత పరిణతి సాధిస్తే అది టీమ్కు బాగా ఉపయోగ పడుతుంది. ఆ దిశగా అతడిని ప్రోత్సహిస్తున్నాం. » బుమ్రా అందుబాటులో లేకున్నా... అర్‡్షదీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ ముగ్గురికి వన్డే క్రికెట్లో పెద్దగా అనుభవం లేకపోయినా... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకొని చక్కటి ఫలితాలు రాబట్టారు. » వన్డే క్రికెట్లో స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలని నేను అనుకోవడం లేదు. పరిస్థితులకు తగ్గట్లు ఆటగాళ్లంతా సిద్ధంగా ఉండటం మేలు. టెస్టు క్రికెట్లో అయితే ప్రతి స్థానానికి ప్రత్యేకమైన ఆటగాళ్లు ఉండటం మంచిది, కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ జోడీ మినహా తక్కిన స్థానాలకు ఆ అవసరం లేదు. » వాషింగ్టన్ సుందర్నే తీసుకుంటే అతడు ఏ స్థానంలోనైనా చక్కగా ఒదిగిపోగలడు. విదేశాల్లో చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. మూడో స్థానంలో, ఐదో స్థానంలో, ఎనిమిదో స్థానంలో ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ బ్యాటింగ్ చేసేందుకు చిరునవ్వుతో సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే ఎంతో బాగుంటుంది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. » ఇటీవలి కాలంలో మ్యాచ్ ఫలితాలను నిర్ణయించడంలో టాస్ కీలకం అవుతోంది. మొదట బౌలింగ్ చేయడంలో, ఆ తర్వాత బౌలింగ్ చేయడంలో చాలా తేడా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో మన బౌలర్లకు బంతిపై సరిగ్గా పట్టు చిక్కలేదు. ఇక రెండో ఇన్నింగ్స్లో మన బ్యాటర్ల ప్రతాపం అందరూ చూశారు. » వన్డే సిరీస్ ఫలితాలపై మంచు ప్రభావం చూపింది కానీ... టి20 సిరీస్కు ఆ ఇబ్బంది ఉండదు. రెండు ఇన్నింగ్స్లు సాయంత్రం తర్వాతే ప్రారంభమవుతాయి కాబట్టి ఇద్దరికీ పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయి. -
అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0తో వైట్వాష్కు గురైంది.గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడంటూ..భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్ల సిరీస్లో క్లీన్స్వీప్ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్వాష్కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ టెస్టు కోచ్గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.బీసీసీఐదే నిర్ణయంఈ విషయంపై గంభీర్ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.అదే జరిగితే నీపై వేటు వేస్తారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్ ఖబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్కోచ్గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి కాంబినేషన్లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.చదవండి: హర్షిత్ రాణాకు బిగ్ షాక్ -
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025 -
చెప్పినట్లు వింటారా?.. తమ మాటే నెగ్గించుకుంటారా?
సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్వాష్ తర్వాత వన్డే సిరీస్కు సిద్ధమైంది టీమిండియా. సంప్రదాయ క్రికెట్లో విఫలమైనా.. పరిమిత ఓవర్ల సిరీస్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. నవంబరు 30- డిసెంబరు 6 మధ్య ప్రొటిస్ జట్టుతో భారత్ మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా రాంచి వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టు మొత్తం ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రో- కో భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. వన్డే వరల్డ్కప్-2027 (ICC World Cup 2027) వరకు ఈ లెజెండరీ బ్యాటర్లు కొనసాగుతారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వాటి ఆధారంగానే నిర్ణయిస్తాంఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. రోహిత్- కోహ్లిల విషయంలో యాజమాన్యం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని తెలిపాయి. జట్టులో వారి పాత్ర, అంచనాలు, ఫామ్ ఆధారంగానే వీరిద్దరు ప్రపంచకప్ టోర్నీ ఆడతారా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి.‘‘ఆస్ట్రేలియా పర్యటనలో వాళ్లిద్దరు మూడో వన్డేలో వింటేజ్ ఆటను గుర్తు చేశారు. అయితే, అప్పటికే సిరీస్ మన చేజారిపోయింది. తొలి రెండు మ్యాచ్లలో రో-కో పెద్దగా ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్క మ్యాచ్లో ఆడినంత మాత్రాన ప్రతిసారీ వారికి మినహాయింపు లభిస్తుందని అనుకోవద్దు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియతో సదరు వర్గాలు పేర్కొన్నాయి.తిరుగులేని రో-కోవన్డేల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు కోహ్లి, రోహిత్. ముఖ్యంగా ఇప్పటికే వన్డే ఫార్మాట్లో 51 శతకాలతో అత్యధిక సెంచరీల వీరుడిగా కోహ్లి కొనసాగుతుండగా.. యాభై ఓవర్ల క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఘనుడు రోహిత్ (264 పరుగులు). వీరి ఘనతను చెప్పడానికి ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.ఇక కెప్టెన్గా రోహిత్ శర్మ ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచాడు. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని సారథిగా తప్పించి.. అతడి స్థాయంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది మేనేజ్మెంట్. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చెప్పినట్లు వింటారా?కాగా వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఇంకా 22 నెలల వ్యవధి ఉంది. ఈలోపు టీమిండియా ఆడే వన్డే సిరీస్లలో ప్రదర్శన ఆధారంగానే రో- కో భవితవ్యం తేలనుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్ నాటికి రోహిత్ 40, కోహ్లి 38 ఏళ్ల వయసు దాటేస్తారు. కాబట్టి ఫిట్నెస్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, ఇప్పటికే ఫిట్నెస్కు మారుపేరుగా పేరొందిన కోహ్లి.. మరింత ఫిట్గా మారగా.. రోహిత్ ఆసీస్ టూర్కు ముందు ఏకంగా పది కిలోల బరువు తగ్గి స్లిమ్గా మారిపోయాడు. అయితే, ఇప్పటికే వీరిద్దరు అంతర్జాతీయ టీ20లతో పాటు.. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు.ఇలాంటి తరుణంలో ఫిట్నెస్, మ్యాచ్ ప్రాక్టీస్, ఫామ్ కోసం రో- కో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బోర్డు కూడా వీరి నుంచి ఇదే కోరుకుంటోంది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకున్న రో-కో ఇందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’తో వన్డే సిరీస్లో వీరిద్దరు ఆడతారని ముందుగా వార్తలు వచ్చాయి.గంభీర్, అగార్కర్తో చర్చల తర్వాతే..కానీ ఈ అనధికారిక సిరీస్లో రో-కో ఆడలేదు. ఏదేమైనా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తో రోహిత్- కోహ్లి భవిష్యత్తుపై ఒక అంచనాకు రావాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరిగే సమావేశంలో హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయం గురించి రో-కోతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో రోహిత్- కోహ్లి వంటి సీనియర్ల అనుభవం యువ జట్టుకు పనికివస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వీరిని మించి సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు కూడా ఎవరూ లేరు. అలాంటపుడు రో- కోను గనుక కావాలని తప్పిస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు!!చదవండి: India vs South Africa: టికెట్లు సోల్డ్ అవుట్ -
గంభీర్ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ అకస్మాత్ రిటైర్మెంట్ ప్రకటనల వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.విమర్శలు.. రాజీనామాకు డిమాండ్అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్కోచ్గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, అశ్విన్ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.అండగా ఉంటామని చెప్పినా..ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గంభీర్ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్ అలా తయారు చేయించానని గంభీర్ అంగీకరించిన విషయం తెలిసిందే.అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి, యువ పేసర్ హర్షిత్ రాణాను ఆడించే విషయమై గంభీర్ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులుఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్గా నిలిచిన ఆ క్రెడిట్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్కప్ టోర్నీలో భారత్ను విజేతగా నిలిపితేనే గంభీర్ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్ కీలక ప్రకటన -
గంభీర్ నా బంధువు కాదు.. తప్పంతా వాళ్లదే: అశ్విన్ ఆగ్రహం
టీమిండియా సిరీస్ పరాజయానికి హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్వాష్ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో కీలక వ్యాఖ్యలు చేశాడు.అది సరైంది కాదు‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.తప్పంతా వాళ్లదేభారత క్రికెట్ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.కోచ్, కెప్టెన్ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?గంభీర్ నా బంధువు కాదు.. గంభీర్ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్ వివరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయిన విషయం తెలిసిందే. చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్
న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ గంభీర్కు అండగా నిలిచాడు. కోచ్ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో గావస్కర్ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్ పరాజయానికి గంభీర్ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్గా ఉంచాలని మీరు చెప్పారా. మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్ వైపు చూస్తారు’ అని గావస్కర్ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్ను కోచ్గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్ జట్టుకు బ్రెండన్ మెక్ల్లమ్ అన్ని ఫార్మాట్లలో కోచింగ్ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు. -
గంభీర్పై వేటు తప్పదా?.. బీసీసీఐ నిర్ణయం ఇదే!
సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్ కోచ్గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.కోచ్గా ఎలాంటి అనుభవం లేకపోయినా..టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెడ్కోచ్గా తప్పుకోగా.. గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్గా గంభీర్కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్ను కోల్పోయింది భారత్. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లలో చాంపియన్గా నిలిచి సత్తా చాటింది.ద్రవిడ్కే ఆ క్రెడిట్కానీ చాంపియన్స్ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్ భాయ్ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు టైటిల్కు అందించిన హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు.పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. అంతకుముందే స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడానికి కారణం గంభీర్ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్మన్ గిల్కు దక్కడంలో గంభీర్ కీలకమనే విమర్శలు వచ్చాయి.ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.సంధి కాలంఈ నేపథ్యంలో గంభీర్ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.చాలా మంది న్యూజిలాండ్ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్లో టెస్టు సిరీస్లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్లోనే జట్టు చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా గెలిచింది.కివీస్తో సిరీస్తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్ విజ్ఞప్తి చేశాడు.బీసీసీఐ నిర్ణయం ఇదే!ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్కప్ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్ను హెడ్కోచ్గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్.. సరికొత్త చరిత్ర -
గంభీర్ కోచింగ్ అద్భుతం.. ఇదంతా ఆయన ఘనతే!
''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ వినయ్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్వాష్కు అభినందనలు అంటూ చురక అంటించారు.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లపై ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించారు. వీరిద్దరినీ తొలగించకపోతే భారత క్రికెట్కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేదని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్యబట్టారు. కోచ్ పదవికి గంభీర్ తనంత తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.వారిద్దరినీ తొలగించాలిపటిష్టమైన భారత టెస్ట్ జట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్రష్టు పట్టించాడని, టి20 ఆల్ రౌండర్ల టీమ్గా మార్చేశాడని వినయ్ కుమార్ ధ్వజమెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ఇండియన్ క్రికెట్ జట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిపడ్డారు. టీమిండియా 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని.. గంభీర్, అగార్కర్లను తొలగించకపోతే మన జట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.భారత టెస్ట్ క్రికెట్ హంతకుడుఅశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్ నుంచి అవమానకరంగా రిటైర్ కావడానికి గంభీర్ కారణమయ్యాడని వినయ్ కుమార్ ఆరోపించారు. అసమర్థ టి20 క్రికెటర్లతో టెస్ట్ జట్టును నింపేశారని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆటగాళ్ల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గౌతమ్ గంభీర్ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయనకు సరిపడదని, రాజకీయాల్లోకి తిరిగి వెళ్లాలని గంభీర్కు సలహాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జట్టు కూర్పుతో 2027 సీజన్లో ఇండియాను WTC ఫైనల్స్కు వెళ్లకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.సక్సెస్ రేటు డౌన్2016 నుంచి 2019 వరకు సొంతగడ్డపై టీమిండియా విజయాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వరకు 73 శాతం సక్సెస్ రేటు సాధించిందని వినయ్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబర్ నుంచి ఇది 29 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ఇంతటి ఘనత సాధించిన గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.చదవండి: భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది13 నెలల్లో ఆరుగురు..టీమిండియా టెస్ట్ టీమ్లో కీలకమైన మూడో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారని విమర్శించారు. రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్లు, ఛతేశ్వర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారని గుర్తు చేశారు. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 నెలల కాలంలోనే ఆరుగురిని మార్చారని తెలిపారు. శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, పడిక్కల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్లను మూడో స్థానంలో ఆడించిన విషయాన్ని వెల్లడించారు.I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025 -
అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం: గంభీర్
స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్స్వీప్నకు గురైంది.అశూ, రో-కోలను పంపించేశాడు!ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.బీసీసీఐదే తుది నిర్ణయంఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.అందరూ నన్నే నిందిస్తారుఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము. ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.దారుణ వైఫల్యాలుగతేడాది న్యూజిలాండ్తో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 3-0తో వైట్వాష్ అయింది. తాజాగా కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్వాష్ను ఎదుర్కొంది.అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్లో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్ -
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.అసలు సెన్స్ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్కతా టెస్టులో వాషీని వన్డౌన్లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
గంభీర్పై విమర్శల వర్షం.. స్పందించిన బీసీసీఐ
హెడ్కోచ్గా గౌతం గంభీర్ (Gautam Gambhir) వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో విజయ పరంపర కొనసాగిస్తున్న టీమిండియా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతోంది. ముఖ్యంగా స్వదేశంలోనూ వరుస మ్యాచ్లలో ఓటమి పాలుకావడం విమర్శలకు దారితీస్తోంది.గంభీర్ మార్గదర్శనంలో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టుల్లో టీమిండియా 3-0తో వైట్వాష్ అయింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి ఫామ్లోలేని జట్లపై గెలిచినా.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ ఓటమిని మూటగట్టుకుంది. వేళ్లన్నీ గంభీర్ వైపేకోల్కతా వేదికగా సఫారీ (IND vs SA)లు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ముప్పై పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రాగా.. వేళ్లన్నీ గంభీర్ వైపే చూపాయి. అతడి ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు.ఈ క్రమంలో గంభీర్ కూడా పిచ్ పరిస్థితికి తానే కారణమంటూ నైతిక బాధ్యత వహించాడు. అయినా సరే గంభీర్పై విమర్శల వర్షం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా స్పందించాడు. గంభీర్పై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ అతడికి మద్దతు పలికాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘మా సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది.. మరీ ముఖ్యంగా హెడ్కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరినీ మేము తక్కువ చేయము. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది.అయితే, ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్లను మేము అస్సలు పట్టించుకోము. ఇదే జట్టు.. ఇదే హెడ్కోచ్ మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.అదే విధంగా.. ఆసియా టీ20 కప్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ గడ్డ మీద ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది’’ అంటూ దేవజిత్ సైకియా.. గంభీర్, టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తాము పట్టించుకోమని రెవ్స్పోర్ట్స్తో పేర్కొన్నాడు. కాగా గంభీర్ గైడెన్స్లో ఈ ఏడాది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే, స్వదేశంలో కివీస్ చేతిలో టెస్టుల్లో ఘోర పరాభవంతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 1-3తో చేజార్చుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని టీమిండియా కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ను 2-2తో సమం చేసింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో తప్పకగెలవాల్సిందే!.. లేదంటే సొంతగడ్డపై మరో పరాభవం తప్పదు!!చదవండి: ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్ -
ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాం: రిషభ్ పంత్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా సారథిగా రిషభ్ పంత్ (Rishabh Pant) ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా జట్టుకు దూరం కావడంతో పగ్గాలు పంత్ చేతికి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన పంత్.. తనకు కెప్టెన్గా అవకాశం ఇచ్చినందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ధన్యవాదాలు తెలిపాడు.నా కెప్టెన్సీ అలాగే ఉంటుందిటీమిండియాకు సారథ్యం వహించడం సంతోషంగా ఉందన్న పంత్.. గువాహటి టెస్టులో తమ తుదిజట్టు కూర్పు గురించి స్పందించాడు. ‘‘మా బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లే ఉన్నారు. కోల్కతాలో మేము స్పిన్నర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాం.పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. కానీ సానుకూల ఫలితం రాలేదు. ఏదేమైనా మేము సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతాం. ఒత్తిడి దరిచేరనీయము. నా కెప్టెన్సీ సంప్రదాయబద్దంగానే ఉంటుంది. అదే సమయంలో సహజ శైలికి భిన్నంగా అవుట్-ఆఫ్-ది- బాక్స్ కూడా ఆలోచిస్తా.ఆడాలని ఉన్నా..నిజానికి రెండో టెస్టులో ఆడాలని శుబ్మన్ ఎంతగానో పరితపించాడు. కానీ అతడి ఆరోగ్యం అందుకు సహకరించలేదు. గువాహటిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది. అందుకే మాతో పాటు ప్రేక్షకులకూ ఇది ప్రత్యేకం.పిచ్ తొలుత బ్యాటింగ్కు అనుకూలంగా ఉండవచ్చు. ఆతర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపగలరు’’ అని పంత్ పేర్కొన్నాడు. ఇక గంభీర్ మార్గదర్శనంలో ఆల్రౌండర్లకు ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న విలేకరుల మాటలకు స్పందిస్తూ..‘‘జట్టు కూర్పు సమతూకంగా ఉండాలి. కొన్నిసార్లు స్పెషలిస్టు ప్లేయర్ల కంటే కూడా ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్లు వారు తమ పాత్రకు న్యాయం చేయగలరు. టీమ్ బ్యాలెన్స్ దృష్ట్యానే ఆల్రౌండర్లను ఎంపిక చేస్తామే తప్ప.. టెస్టు స్పెషలిస్టులను పక్కనపెట్టాలని కాదు’’ అని పంత్ స్పష్టం చేశాడు.ఎవరిని ఆడించాలో తెలుసు.. నిర్ణయం తీసుకున్నాంఅదే విధంగా.. గిల్ స్థానంలో తుదిజట్టులోకి ఎవరు వస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయంలో మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. గిల్ ప్లేస్లో ఎవరు ఆడతారో.. ఆ ప్లేయర్కు తెలుసు’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ పంత్ మాట దాటవేశాడు. కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా కోల్కతాలో తొలి టెస్టు జరిగింది. ఇందులో భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గువాహటిలో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిస్తేనే టీమిండియా పరువు నిలుస్తుంది.ఇక కోల్కతా టెస్టులో టీమిండియా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లతో బరిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లను ఆడించింది. వీరితో పాటు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, శుబ్మన్ గిల్ సఫారీలతో తొలి టెస్టులో భాగమయ్యారు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్కు గంభీర్ సలహా ఇదే
టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill). భారత జట్టు టెస్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డే కెప్టెన్గానూ పగ్గాలు చేపట్టాడు. ఇక అంతకంటే ముందే ఆసియా కప్-2025 సందర్భంగా టీమిండియా టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.విరామం లేని షెడ్యూల్ఇలా వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో విరామం లేకుండా ఆడుతున్న గిల్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డాడు. మెడ నొప్పి కారణంగా ఆట మధ్యలోనే నిష్క్రమించి.. మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేకపోయాడు. ఐసీయూలో చికిత్స పొందిన ఈ కెప్టెన్ సాబ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫలితంగా గువాహటిలో సఫారీలతో జరిగే రెండో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు.కాగా నిద్రలేమి, అవిశ్రాంతంగా ఆడటం వల్లే గిల్ మెడ నొప్పి తీవ్రమైందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బీసీసీఐ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సైతం పనిభారం తగ్గించుకునే క్రమంలో ఇంగ్లండ్లో ఐదింటికి కేవలం రెండే టెస్టులు ఆడిన విషయం తెలిసిందే.వారికి విశ్రాంతిఅంతేకాదు.. సౌతాఫ్రికాతో టీ20లకు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడని.. అతడితో పాటు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు కూడా సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మరోసారి చర్చ మొదలైంది.ఈ విషయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) వైఖరి ఏమిటన్న ప్రశ్నలు మొదలుకాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. తాను ఈ విషయం గురించి గంభీర్తో చర్చించినపుడు ఆటగాళ్లను ఉద్దేశించి అతడు ఓ కీలక సూచన చేశాడని తాజాగా వెల్లడించాడు.ఐపీఎల్ ఆడకపోతే సరిజియోస్టార్తో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ‘‘వెస్టిండీస్తో టీమిండియా టెస్టు మ్యాచ్ సందర్భంగా నేను గౌతమ్ను ఓ ప్రశ్న అడిగాను. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు ఏం చేయాలంటారు? అని అడిగాను. అందుకు అతడు.. ‘ఐపీఎల్ ఆడకపోతే సరి’ అని సమాధానం ఇచ్చాడు.‘ఐపీఎల్లో కెప్టెన్గా ఉంటే.. అదనపు ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటపుడు సారథిగా ఉండకుండా పగ్గాలు వదిలేయడం ఇంకా మంచిది. ఒకవేళ టీమిండియా కోసం ఆడాలనుకుంటే.. ఫిట్గా ఉండటంతో పాటు మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండాలి.అలా జరగాలంటే ఐపీఎల్ వంటి టోర్నీలను వదిలేస్తే సరి’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు’’ అని తెలిపాడు. ఏదేమైనా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు అదనపు ఒత్తిడిని తగ్గించుకుంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వరుస సిరీస్లు ఆడగలరని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. మానసికంగా బలంగా ఉంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్కు విరామం ఇవ్వాల్సిన అవసరం రాదని అభిప్రాయపడ్డాడు.చదవండి: Ashes: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్ -
గంభీర్ మాస్టర్ ప్లాన్తో వాళ్లకు చెక్!.. ఎవరీ మిస్టరీ స్పిన్నర్?
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఊహించని ఫలితాన్ని పొందింది. ప్రొటిస్ బ్యాటర్ల కోసం బిగించిన స్పిన్ ఉచ్చులో.. మనవాళ్లే చిక్కుకుపోయి విలవిల్లాడారు. సఫారీ స్పిన్నర్లు సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) ధాటికి తాళలేక చేతులెత్తేశారు.కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 93 పరుగులకే కుప్పకూలి ఓటమిని ఆహ్వానించారు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా రెండు మ్యాచ్ల సిరీస్లో భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో పిచ్ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో గువాహటిలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాతక్మకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్ను సమం చేయగలుగుతుంది. ఇలాంటి తరుణంలో బర్సపరా క్రికెట్ మైదానంలో ఎర్రమట్టి పిచ్ను తయారు చేయాలని బీసీసీఐ సంకల్పించింది.ఈ నేపథ్యంలో పేస్తో పాటు ఎక్కువగా బౌన్స్ అవుతూ.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను క్యూరేటర్ రూపొందించినట్లు సమాచారం. ఇలాంటి వికెట్పై పరుగులు రాబట్టే క్రమంలో టీమిండియా బ్యాటర్లు.. ఈడెన్ గార్డెన్స్లోనే ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా మంగళవారం ఓ ప్రత్యేక బౌలర్ను భారత బ్యాటర్లు ఎదుర్కొన్నారు.అతడు మరెవరో కాదు.. బెంగాల్ మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల సవ్యసాచి. కుడి చేతితో ఆఫ్ స్పిన్.. ఎడమ చేతితో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్ను పిలిపించాలన్నది హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచన అని సమాచారం. గతంలో పలు ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్గా కౌశిక్ మెయిటీ పనిచేశాడు.అయితే, టీమిండియాకు నెట్స్లో కౌశిక్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. 26 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. నెట్స్లో లెఫ్టాండర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దేవ్దత్ పడిక్కల్కు ఆఫ్ స్పిన్ వేశాడు. అదే విధంగా.. కుడిచేతి వాటం గల బ్యాటర్లు ధ్రువ్ జురెల్ వంటి వాళ్లను లెఫ్టార్మ్ స్పిన్తో తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో హార్మర్, మహరాజ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన కౌశిక్ మెయిటీ కారణంగా టీమిండియాకు అన్ని రకాలుగా సిద్ధమయ్యే అవకాశం దొరికింది. కాగా కోల్కతాకు చెందిన కౌశిక్ మెయిటీ దేశీ క్రికెట్లో ఎనిమిది లిస్ట్-ఎ మ్యాచ్లతో పాట మూడు టీ20 మ్యాచ్లు ఆడి.. మొత్తంగా పదకొండు వికెట్లు కూల్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియాకు నెట్స్లో బౌలింగ్ చేసే అవకాశం రావడంపై కౌశిక్ మెయిటీ స్పందిస్తూ.. ‘‘మొదటిసారి భారత బ్యాటర్లకు నెట్స్ బౌలింగ్ చేశాను. కల నిజమైన అనుభూతి కలిగింది. నేను జడ్డూ భాయ్కు బౌలింగ్ చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.తాను బౌలింగ్ చేస్తున్నపుడు గౌతం గంభీర్ కానీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని.. తనను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనిచ్చారని మెయిటీ తెలిపాడు. తన సహజ నైపుణ్యాలపై నమ్మకం ఉంచినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. జడేజా తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని.. ఈ ట్రెయినింగ్ సెషన్ తనకు సరికొత్త అనుభవం, అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు. -
అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?.. గంభీర్పై డీకే ఫైర్!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను పక్కనపెట్టడం.. మూడో స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా ఈ జాబితాలో చేరాడు. గంభీర్ నిర్ణయం వల్ల వాషింగ్టన్ సుందర్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లేనిపోని ఆందోళనలతో అతడు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.టాపార్డర్కు ప్రమోట్కాగా సౌతాఫ్రికాతో కోల్కతా వేదికగా భారత తుదిజట్టులో తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్కు చోటు ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను కాదని.. మరో తమిళనాడు ఆటగాడు, ఎడమచేతి వాటం ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేశారు.ఈ క్రమంలో.. బ్యాటింగ్కు అనుకూలించని పిచ్పై తొలి ఇన్నింగ్స్లో 29, రెండో ఇన్నింగ్స్లో 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు వాషీ. అయితే, బంతితో మాత్రం ఈ స్పిన్ ఆల్రౌండర్ రాణించలేకపోయాడు. ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో ఒకే ఒక్క ఓవర్ వేసి మూడు పరుగులు ఇచ్చిన వాషీకి.. రెండో ఇన్నింగ్స్లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్.. టెస్టు ప్లేయర్.. అతడు బ్యాటింగ్ చేయగల బౌలరా? అతడిని మీరు మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపారు. తద్వారా.. పరోక్షంగా ‘నువ్వు బ్యాటింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టు’ అనే సందేశం ఇచ్చారు.అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?బ్యాటింగ్ ప్రాక్టీస్లో గంటలు గంటలు తలమునకలైదే.. బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించాల్సి వస్తుంది. రెండూ సమానంగా చేయాలంటే శారీరకంగా మరింత శ్రమించక తప్పదు. టాపార్డర్కు ప్రమోట్ చేయడం ద్వారా.. ‘నీ నుంచి ఎక్కువ పరుగులు ఆశిస్తున్నాం’ అని చెబితే.. అతడు గందరగోళానికి గురవ్వచ్చు.అతడి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారవచ్చు’’ అంటూ గంభీర్ తీరును డీకే విమర్శించాడు. కాగా తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గువాహటి వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడాడు. ఓ సెంచరీ సాయంతో టెస్టుల్లో 821 పరుగులు చేసిన వాషీ.. ఇప్పటికి 35 వికెట్లు పడగొట్టాడు. -
‘టీమిండియా హెడ్కోచ్గా అతడు ఉంటే బాగుండేది’
గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలోని టీమిండియాకు స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో న్యూజిలాండ్ చేతిలో కనీవినీ ఎరుగని రీతిలో టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులోనూ చేదు ఫలితమే చవిచూసింది.30 పరుగుల తేడాతోకోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలో సఫారీలు విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రొటిస్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో టీమిండియా కూరుకుపోయింది.కాగా గంభీర్ హెడ్కోచ్గా నియమితుడైన తర్వాత టెస్టుల్లో టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్లను మాత్రమే ఓడించింది. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయింది. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఇంగ్లండ్ టూర్లో 2-2తో సిరీస్ను సమం చేసుకుంది.జీర్ణించుకోలేకపోతున్నాంఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్.. కోచ్ గంభీర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకపక్ష నిర్ణయాలతో కోచ్లను నియమిస్తే ఇలాగే ఉంటుందటూ బీసీసీఐని విమర్శించాడు. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్లో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని.. కోచ్ల నియామకంలో పారదర్శకత ప్రదర్శిస్తే బాగుండేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.పెద్దగా బాధపడే వారు కాదు.. కానీ ఈసారిఅదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరును కైఫ్ తెరమీదకు తెచ్చాడు. ఈ మేరకు.. ‘‘అవును.. స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఓడితే కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. గతంలో.. ఆస్ట్రేలియా పర్యటన అంటే ఓటమి ఖరారు అనే భావన ఉండేది. ముందుగానే అభిమానులు కూడా ఫిక్స్ అయ్యే వారు కాబట్టి పెద్దగా బాధపడే వారు కాదు.ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో ఓటమిని మరీ ఎక్కువగా మనసుకు తీసుకునేవారు కాదు. కానీ మన సొంతగడ్డపై ఇలా మ్యాచ్లు ఓడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. సౌతాఫ్రికా మన కోటను బద్దలు కొట్టింది. న్యూజిలాండ్ గతంలోనే వైట్వాష్ చేసింది.ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు..కాబట్టి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటపుడే వీవీఎస్ లక్ష్మణ్ పేరు అందరికీ గుర్తుకువస్తుంది. అయన లాంటి మరికొందరి పేర్లు కూడా కోచింగ్ పోటీదారుల జాబితాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. నిజానికి కోచింగ్ ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తారు.ఇంటర్వ్యూ ద్వారా కోచ్ను సెలక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ.. దరఖాస్తులు ఆహ్వానించినా తమకు నచ్చిన వారి కోసం.. మిగతా వారిని నిర్దద్వంగా తిరస్కరిస్తున్నారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ లేకుండానే కోచ్ను ఎంపిక చేస్తున్నారు. అలాంటపుడు ఎవరు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు?పారదర్శకత లేదుతమ దరఖాస్తు తిరస్కరణకు గురి అవుతుందని కచ్చితంగా తెలిసిన తర్వాత అవమానపడాలని ఎందుకు అనుకుంటారు?.. అక్కడ పారదర్శకత లేదని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని కైఫ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా ఉన్న సమయంలో.. హైదరాబాదీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బ్యాకప్ కోచ్గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్గా పనిచేస్తున్నాడు. కోచింగ్ పరంగా వీవీఎస్కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కైఫ్ ఈ మేరకు అతడు హెడ్కోచ్గా వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఇంతకుముందు ఎలాంటి కోచింగ్ అనుభవం లేకుండానే గంభీర్ నేరుగా టీమిండియా హెడ్కోచ్గా నియమితుడైన విషయం తెలిసిందే.చదవండి: IND vs SA: సిరీస్ సమమా? సమర్పణమా? -
చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్.. గంభీర్ చర్య వైరల్
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA 1st Test) చేదు ఫలితాన్ని చవిచూసింది. సొంతగడ్డపై చతికిల పడి సఫారీల చేతిలో ఓటమిపాలైంది. కోల్కతాలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో గిల్ సేన ముప్పై పరుగుల తేడాతో పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ (Eden Gardens Pitch)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.మ్యాచ్ మూడురోజుల్లోనే ముగిసిపోవడం.. నాలుగు ఇన్నింగ్స్లో ఒకే ఒక్క అర్ధ శతకం నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఘాటుగానే స్పందించాడు. టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగానే తమ క్యూరేటర్ పిచ్ తయారుచేశాడని కౌంటర్ ఇచ్చాడు.సంతృప్తిగానే గంభీర్ఈ క్రమంలో తొలి టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందిస్తూ.. ‘‘ఈ పిచ్పై పరుగులు రాబట్టవచ్చు. అయితే, మా వాళ్లు డిఫెన్స్ సరిగ్గా ఆడలేకపోయారు’’ అని పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తప్పేమీ లేదన్నట్లు అతడిని సమర్థించాడు. ఇక భారత్- సౌతాఫ్రికా మధ్య శనివారం (నవంబరు 22) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక.ఆలింగనం చేసుకున్న గౌతీఅయితే, టీమిండియా మాత్రం ఇంకా కోల్కతాలోనే ఉంది. అక్కడే ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పట్ల గంభీర్ వ్యవహరించిన తీరు వైరల్గా మారింది. సుజన్ను ఆలింగనం చేసుకున్న గంభీర్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. తద్వారా తమ మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు.చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శల నేపథ్యంలో సుజన్ ముఖర్జీ టైమ్స్ నౌ బంగ్లాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరు పిచ్ గురించే ప్రశ్నిస్తున్నారు. టెస్టు మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారుచేయాలో నాకు బాగా తెలుసు. అదే విధంగా తొలిటెస్టుకూ పిచ్ను రూపొందించాను.జట్టు కోరినట్లుగానే పిచ్ తయారు చేశా. వేరే వాళ్లు ఏదో చెప్పారని నేను చేయను. అది సరైంది అనిపిస్తేనే చేస్తా. ఏదేమైనా నా పనిని పూర్తి అంకితభావంతో పూర్త చేస్తా. భవిష్యత్తులోనూ నా వైఖరి ఇలాగే ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు.చదవండి: నేనేమీ హర్మన్ప్రీత్ కౌర్ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్ -
'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు'
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారం(నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే తొలి టెస్టులో భారత్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది.బంతి గింగరాలు తిరిగిన పిచ్పై భారత బ్యాటర్లు తడబడ్డారు. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా ఈ పిచ్పై మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అస్సలు అది టెస్టు క్రికెట్ సరిపోయే పిచ్ కాదని చాలా మంది మాజీలు మండిపడ్డారు.కాగా పిచ్పై తీవ్ర విమర్శలు వచ్చినా, తాము కోరుకున్నది ఇదేనని హెడ్ కోచ్ గంభీర్ పేర్కొనడం గమనార్హం. బ్యాటింగ్కు పిచ్ మరి అంత కష్టంగా లేదని, సరైన డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై కూడా కృష్ణమాచారి శ్రీకాంత్ లాంటి మాజీలు ఫైరయ్యారు. ఇప్పటివరకు ఇటువంటి పిచ్ను చూడలేదని అతడు అన్నాడు.ఈ నేపథ్యంలో గంభీర్కు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. పిచ్ క్యూరేటర్ల పనిలో గంభీర్ జోక్యం చేసుకోకుండా ఉండాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."ఐపీఎల్లో గంభీర్కు ప్లేయర్గా, హెడ్కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. అక్కడ పిచ్ల ఎంపిక విషయంలో ఏం జరుగుతుందో అతడికి తెలుసు. ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా క్యూరేటర్ను ఫలానా పిచ్ కావాలని అడగదు. క్యూరేటర్ స్వతంత్రంగా పిచ్ను తయారుచేస్తాడు. పిచ్ తయారీని క్యూరేటర్కే వదిలేయాలి. అతడి పనిలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. ఎలా తాయారు చేయాలో అతడికి బాగా తెలుసు. మీరు మధ్యలో వెళ్లి పిచ్లో మార్పులు చేయమని, 'ర్యాంక్-టర్నర్' కావాలని ఆదేశాలు ఇస్తే మొదటికే మోసం వచ్చే అవకాశముంది" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నారు.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్కు మళ్లీ పిలుపు -
పంత్ ఫెయిల్.. గంభీర్ ప్లాన్ అట్టర్ఫ్లాప్.. టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.గంభీర్ ప్రయోగాలుకోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్ పర్యటన, వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్ను తుదిజట్టు నుంచి తప్పించింది.సాయికి బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది. వన్డౌన్లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్ తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.వాషీ పర్లేదుఇక రెండో ఇన్నింగ్స్లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్ బౌలింగ్లో హార్మర్కు క్యాచ్ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.గిల్ స్థానంలో జురెల్ఈ మ్యాచ్లో మరో ప్రయోగం... ధ్రువ్ జురెల్ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్ శుబ్మన్ గిల్ మెడనొప్పి కారణంగా మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్ను ప్రమోట్ చేశాడు హెడ్కోచ్ గౌతం గంభీర్. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఐదో నంబర్ బ్యాటర్ రిషభ్ పంత్ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్కు వికెట్ల ముందు దొరికిపోయాడు.గెలుపు ఆశలు రేపిన అక్షర్మరోవైపు టెయిలెండర్ కుల్దీప్ యాదవ్ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్ పటేల్ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. Pressure? What pressure? 🔥#AxarPatel takes the attack to the South African bowlers! 🏏👏#INDvSA | 1st Test, Day 3, LIVE NOW 👉 https://t.co/19cUrY4aXc pic.twitter.com/zpiIumJibl— Star Sports (@StarSportsIndia) November 16, 2025అయితే, కేశవ్ మహరాజ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్లో (34.5)నే బవుమాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్.. మరుసటి బంతికే సిరాజ్ అవుట్ కావడంతో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇక గిల్ ఆబ్సెంట్ హర్ట్ (0) కావడంతో.. ఆలౌట్ అయిన భారత్ ఓటమి ఖరారైంది.టాస్ గెలిచిన.. తొలుత బ్యాటింగ్రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ రెండు, కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకే కుప్పకూలింది.ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39) టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. సుందర్ 29, పంత్ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహరాజ్, కార్బిన్ బాష్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తెంబా బవుమా హాఫ్ సెంచరీఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ తెంబా బవుమా హాఫ్ సెంచరీ (55 నాటౌట్) చేయడంతో ప్రొటిస్ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది.తప్పని ఓటమిఅయితే, ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్ నాలుగు, కేశవ్ మహరాజ్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్ ఒక వికెట్ తీశాడు. ఓపెనర్లను అవుట్ చేసి యాన్సెన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.సంక్షిప్త స్కోర్లుసౌతాఫ్రికా- 159 &153భారత్- 189 &93.చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్ -
తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్పై గంగూలీ ఫైర్
టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 31 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul- 39) టాప్. ఇటు స్పిన్.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్ గార్డెన్స్ పిచ్ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.మూడో రోజు హాఫ్ సెంచరీఅయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్లో మూడో రోజైనా కనీసం హాఫ్ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్ అభిమానులు సంబరపడుతున్నారు.టెస్టు క్రికెట్ను చంపేస్తారా?ఇదిలా ఉంటే.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్ తీరును తప్పుబట్టాడు. అస్సలు ఊహించలేదుమరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా క్యూరేటర్ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.నాలుగు రోజుల పాటు పిచ్పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్కోచ్ గౌతం గంభీర్దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీమిండియా ఓటమిసౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్ 93 పరుగులకే కుప్పకూలింది.చదవండి: ఈడెన్ గార్డెన్స్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాడు సాయి సుదర్శన్ను జట్టు నుంచి తప్పించడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో సుదర్శన్ విఫలమైనప్పటికి.. స్వదేశంలో వెస్టిండీస్తో సిరీస్లో మాత్రం సత్తాచాటాడు.దీంతో సౌతాఫ్రికా సిరీస్లో కూడా అతడు ఆడడం ఖాయమని అంతా భావించారు. కానీ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడిని బెంచ్కు పరిమితం చేశాడు. మూడో స్ధానంలో సుదర్శన్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు పంపాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు (జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్)తో బరిలోకి దిగింది.ఈ నేపథ్యంలో గంభీర్పై భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే విమర్శలు గుప్పించాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఖచ్చితంగా ఆడుతాడని అనుకున్నాను. కానీ అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు నంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడుతాడా? అస్సలు మీ ప్రణాళిక ఎంటో ఆర్ధం కావడం లేదు. నలుగురు స్పిన్నర్లు, కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడడం ఏంటి? తొలి రోజు బ్యాటింగ్కు కోల్కతా వికెట్ బాగుంది. కాబట్టి నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. కచ్చితంగా నలుగురులో ఎవరో ఒకరు తక్కువ ఓవర్లకే పరిమితమవుతారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు ఉన్న అప్షన్స్ను ఎలా ఉపయోగిస్తాడో వేచి చూడాలి అని సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
‘మన ఫిట్నెస్ ఇంకా మెరుగవ్వాలి’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిట్నెస్ స్థాయి పరంగా చూస్తే భారత జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని, మన టీమ్ ఈ విషయంలో అత్యుత్తమ స్థాయిని అందుకోలేదని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘టి20 ప్రపంచకప్లో ఇది చాలా కీలకంగా మారుతుంది. మనం చాలా చురుగ్గా ఉండాలి, ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చర్చించాం కూడా. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లంతా నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఫిట్గా మానసికంగా అంతే చురుగ్గా ఉంటాం. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్లో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఇది కూడా అవసరం. వరల్డ్ కప్కు ముందు అలాంటి స్థాయిని అందుకునేందుకు మనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్ అన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ విజయం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తాము కొన్ని కొత్త తరహాలో ప్రణాళికలు రచిస్తే, అవన్నీ సఫలమయ్యాయని గంభీర్ అన్నాడు. పవర్ప్లేలోనే బుమ్రాతో మూడు ఓవర్లు వేయించడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మూడు బుమ్రావే కావడం మంచి ప్రణాళిక. ఇది చాలా బాగా పని చేసింది. ఆరంభంలోనే మూడు మంచి ఓవర్లు పడితే ప్రత్యరి్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ స్పిన్నర్లు వస్తారు’ అని కోచ్ విశ్లేషించాడు. బౌలింగ్ విషయంలో మన జట్టుకు కనీసం 7–8 ప్రత్యామ్నాయాలు ఉంటే మంచిదన్నాడు. ‘దూబే, అక్షర్, సుందర్ లాంటి ఆల్రౌండర్లు టీమ్లో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతంలో ఆరుకు మించి బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉండకపోయేవి. ఇప్పుడు అంతకు మించి మనకు అవకాశం ఉంటోంది’ అని కోచ్ చెప్పాడు. మరో వైపు వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టు విజయాలే తనకు ముఖ్యమని కోచ్ పునరుద్ఘాటించాడు. ‘మ్యాచ్ ఓడాక మన జట్టులో బాగా ఆడిన వారిని ప్రశంసించడంలో అర్థమే లేదు. నేను వ్యక్తిగత రికార్డులకంటే టీమ్ గెలవడం గురించే ఆలోచిస్తాను. ఎవరైనా బాగా ఆడితే మంచిదే కానీ జట్టు గెలిస్తేనే నాకు సంతోషం. అందుకే వన్డే సిరీస్లో ఓటమి నిరాశకు గురి చేసింది’ అని గంభీర్ అన్నాడు. -
అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్ తొలి స్పందన
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు టీమిండియా స్టార్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్ వికెట్ టేకర్గా కొనసాగుతున్న అర్ష్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.అందుకే ఆడించారా?హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్ను బలి చేస్తున్నారనే ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్ను తప్పించి.. అర్ష్దీప్ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.మూడో టీ20లో హర్షిత్ను బెంచ్కు పరిమితం చేసి అర్ష్దీప్ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.అన్నింటికంటే కష్టమైన పనిబీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.మ్యాచ్ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.అతడిని అందుకే పక్కనపెట్టాంఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్, ప్లేయర్.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్రూమ్లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్ విమర్శలను కొట్టిపారేశాడు.చదవండి: కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్ -
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్
టీమిండియా హెడ్కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు ముందు వన్డే కెప్టెన్గా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.చేదు అనుభవం ఇక వన్డే కెప్టెన్గా ఆసీస్ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్.. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్ ముందుగానే సిరీస్ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.‘రో-కో’దే కీలక పాత్రఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఓటమి పట్ల గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.వాటిని పట్టించుకోను‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్ ఓడిపోయాం.అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్గా ఇలాంటివి జీర్ణించుకోలేను.కోచ్గా అలాంటి పని ఎప్పటికీ చేయనుదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచాం. ఇదొక భిన్నమైన ఫార్మాట్. అయితే, ఈ సిరీస్లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.కాగా ఆసీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. మొదటి. ఆఖరి మ్యాచ్లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్ సేన వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.చదవండి: వన్డే ఆల్టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్కు దక్కని చోటు -
జిడ్డు ఆటగాడి కోసం అతడిని బలి చేస్తావా? గంభీర్ ఇది నీకు న్యాయమేనా?
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. దాదాపు ఏడాది పాటు భారత తరపున పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న గిల్.. ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అప్పటివరకు ఓపెనర్గా కొనసాగుతున్న సంజూ శాంసన్ను మిడిలార్డర్కు టీమ్మెనెజ్మెంట్ డిమోట్ చేసింది. అయితే తన టీ20 పునరాగమనంలో గిల్ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. ఆసియా కప్తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్లోనూ విఫలమయ్యాడు. గురువారం క్వీన్స్లాండ్ వేదికగా ఆసీస్తో జరిగిన నాలుగో టీ20లో గిల్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినప్పటికి.. అతడి జిడ్డు బ్యాటింగ్పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్లో గిల్ 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అతడు 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 46 పరుగులు చేశాడు. తొలుత గిల్ పవర్ప్లేలో అభిషేక్ శర్మతో కలిసి కాస్త దూకుడా ఆడాడు. కానీ అభిషేక్ ఔటయ్యాక గిల్ బ్యాటింగ్ జోరు తగ్గింది. తను ఎదుర్కొన్న చివరి 21 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో గిల్ టీ20లకు సరిపోడని.. అతడికి బదులుగా జైశ్వాల్, సంజూ శాంసన్ ఎంతో బెటర్ అని నెటిజన్లు ఎక్స్లో పోస్ట్లు పెడుతున్నారు.గిల్ గణాంకాలు ఇవే..2023లో టీ20 అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 32 ఇన్నింగ్స్లు ఆడి కేవలం 808 పరుగులు మాత్రమే చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 28.86 ఉండగా, స్ట్రయిక్రేట్ 139.32గా ఉంది. అతడి ఇన్నింగ్స్లలో ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అయితే ఇదే ఫార్మాట్లో మరో ఓపెనర్ జైశ్వాల్ 22 ఇన్నింగ్స్లలో 36.15 యావరేజ్, 164.31 స్ట్రయిక్రేట్తో 723 పరుగులు చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ సైతం ఓపెనర్గా వచ్చి అద్భుతాలు చేశాడు. ఓపెనర్గా కేవలం 13 ఇన్నింగ్స్లే ఆడినా సెంచరీలు మోత మ్రోగించాడు. 34.75 యావరేజ్, 182.89 స్ట్రయిక్రేట్తో 417 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనర్గా సత్తాచాటాడు. 9 మ్యాచ్లలో భారత్ ఓపెనర్గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 365 పరుగులు చేశాడు. అందరికంటే రుతురాజ్( 60.83) సగటే ఎక్కువగా ఉంది. టీమిండియా మిగతా ఓపెనర్లతో గిల్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఒకవేళ ఇదే తీరును శుభ్మన్ కొనసాగిస్తే టీ20 జట్టు నుంచి పక్కన పెట్టే అవకాశముంది.చదవండి: -
‘వాళ్లు ముందే డిసైడ్ అవుతారు.. తర్వాత సాకులు చెబుతారు’
సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని మరోసారి పక్కనపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ బెంగాల్ బౌలర్కు మొండిచేయి చూపుతున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.కావాలనే షమీని పక్కనపెడుతున్నారుఈ నేపథ్యంలో షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ (Mohammed Badruddin) ఘాటుగా స్పందించాడు. కారణం లేకుండానే షమీని జట్టుకు దూరం చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడుతూ... ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వాళ్లు కావాలనే షమీని పక్కనపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.ఇంతకంటే వాళ్లకు వేరే కారణం ఏమీ లేదు. అతడు ఫిట్గా లేడని అంటారా?... ఓ ఆటగాడు టెస్టు మ్యాచ్లు ఆడుతూ.. రెండు మ్యాచ్లలో కలిపి 15 వికెట్లు పడగొట్టినా అతడు ఫిట్గా లేడంటే మనం ఏం చేయగలం?వాళ్లు ముందే డిసైడ్ అవుతారుసెలక్టర్లు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. తాము అలా చేయడం లేదంటే.. షమీని తప్పించడానికి గల కారణం ఏమిటో వాళ్లే స్వయంగా చెప్పాలి. సౌతాఫ్రికాతో సిరీస్కు షమీని ఎంపిక చేస్తారని భావించాను.స్వదేశంలో టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్బౌలర్లనే ఆడిస్తారు. కాబట్టి షమీకి ఈసారి అవకాశం ఇస్తారని అనుకున్నా. బుమ్రా వర్క్లోడ్ను తగ్గించే క్రమంలో షమీని పిలుస్తారని ఎదురుచూశా. అయినా.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదు.వాళ్లు ముందుగానే.. తమకు ఏ ఆటగాళ్లు కావాలో ఎంచుకుంటారు. ఆ తర్వాత తామేదో పారదర్శకంగా జట్టును ఎంపిక చేసినట్లు మాట్లాడతారు. టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ ప్రదర్శనల కంటే ప్రామాణికం ఏమి ఉంటుంది?టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేస్తామనడం సరికాదు. రంజీల్లో బాగా ఆడుతున్న వారినే టెస్టుల్లోకి తీసుకోండి. ఏదేమైనా ఇక్కడ ముందుగానే తమకు ఇష్టమైన ఆటగాళ్లను ఎంచుకుంటారు.సాకులు చెబుతారుఅదే జాబితాకు కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత.. ‘అతడు ఫిట్గా లేడు.. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అంటూ తప్పించిన ఆటగాళ్ల గురించి సాకులు చెబుతారు’’ అంటూ బద్రుద్దీన్ టీమిండియా సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు.ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదుఅదే విధంగా.. షమీది కష్టపడే తత్వమన్న బద్రుద్దీన్.. ఆట ద్వారానే అతడు అందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. వంద శాతం ఫిట్గా ఉన్న షమీ.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని.. షమీతో తాను ఇదే మాట చెప్పానని తెలిపాడు. అద్భుతంగా ఆడే ఆటగాడిని సెలక్టర్లు ఏదో ఒకరోజు జట్టుకు ఎంపిక చేయక తప్పదని పేర్కొన్నాడు. వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీలో జట్టు కోసం శ్రమించిన ఆటగాడిని పక్కనపెట్టడం ఎంతమాత్రం సరికాదని బద్రుద్దీన్ పునరుద్ఘాటించాడు.చదవండి: అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై విమర్శల వర్షంసౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అప్డేట్ లేదని.. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.ఆటతోనే సమాధానంఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడు.గుజరాత్తో మ్యాచ్లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మీకు ఎందుకింత పగ‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన -
అందుకే అర్ష్దీప్ను తప్పించాం: టీమిండియా కోచ్
ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్లలో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)కు మొండిచేయే ఎదురైంది. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వందకు పైగా వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న అర్ష్కు.. యాజమాన్యం తుదిజట్టులో చోటు ఇవ్వలేదు.అర్ష్దీప్ను కాదని.. హర్షిత్ రాణా (Harshit Rana)కు ప్రాధాన్యం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) హర్షిత్ కోసం అర్ష్ను బలిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. సత్తా చాటిన అర్ష్ఈ నేపథ్యంలో ఆసీస్ (IND vs AUS)తో జరిగిన మూడో టీ20లో ఎట్టకేలకు అర్ష్ను యాజమాన్యం ఆడించింది. వరుసగా రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమైన ఈ లెఫ్టార్మ్ పేసర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. 35 పరుగులు ఇచ్చిన అర్ష్దీప్.. ట్రావిస్ హెడ్ (6), జోష్ ఇంగ్లిస్ (11), మార్కస్ స్టొయినిస్ (64) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి మ్యాచ్లలో అర్ష్దీప్ను బెంచ్కే పరిమితం చేయడంపై ప్రశ్న ఎదురైంది.అతడు వరల్డ్క్లాస్ బౌలర్.. అర్థం చేసుకున్నాడుఇందుకు బదులిస్తూ.. ‘‘అర్ష్దీప్ అనుభవజ్ఞుడైన బౌలర్. మేము వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నామని అతడు అర్థం చేసుకున్నాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుసుకున్నాడు.అతడు వరల్డ్క్లాస్ బౌలర్. పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీయగల నైపుణ్యం గల ఆటగాడు. అతడి విలువ మాకు తెలుసు. అయితే, ఈ పర్యటనలో మాకు వివిధ కాంబినేషన్లు అవసరం. దీని వల్ల కొంత మంది ఆటగాళ్లకు నిరాశ తప్పకపోవచ్చు.అయితే, సెలక్షన్ విషయం ఆటగాళ్ల చేతుల్లో ఉండదు. ఇందుకు గల కారణాలు మాత్రం వారు అర్థం చేసుకోగలరు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని మేము ఆటగాళ్లను మరింత శ్రమించేలా చేస్తున్నాం. ఎప్పుడు జట్టులోకి వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా సంసిద్ధం చేస్తున్నాం.కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదుఒత్తిడిలోనూ రాణించేలా తీర్చిదిద్దుతున్నాం. మా ఆటగాళ్ల నైపుణ్యాలపై మాకు ఎటువంటి సందేహాలు లేవు. అయితే, కాంబినేషన్ల కోసం ప్రయత్నిస్తున్నపుడు కొన్నిసార్లు కొందరికి నిరాశ తప్పదు’’ అని 41 ఏళ్ల మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ప్రపంచ క్రికెట్ను శాసించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. 125 పరుగులకే ఆలౌట్మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj— cricket.com.au (@cricketcomau) October 31, 2025 ఆసీస్ అలవోకగాఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.పిచ్చి ప్రయోగాలు ఆపండిఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.ఈ మ్యాచ్లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్గా నిలిచాడు.కానీ ఈ మ్యాచ్లో వన్డౌన్లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుందిఅదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్ను బ్యాటర్గా మారుస్తాం.. బ్యాటర్తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.మార్పులు ఇవేకాగా మెల్బోర్న్లో ఆసీస్తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్ -
అతడి కోసం అర్ష్దీప్ను బలిచేస్తారా?.. గంభీర్పై ఫైర్
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh). ఈ లెఫ్టార్మ్ సీమర్ ఇప్పటి వరకు ఆడిన 65 మ్యాచ్లలో కలిపి 101 వికెట్లు తీశాడు. అంతేకాదు టీమిండియా తరఫున పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్గానూ నిలిచాడు.ఇంతటి ప్రతిభ గల అర్ష్దీప్ సింగ్ను ఆస్ట్రేలియాతో తొలి టీ20 (IND vs AUS T20)లో పక్కనపెట్టారు. ఆసీస్ టూర్లో తొలి రెండు వన్డేల్లో ఈ పేసర్ను ఆడించిన యాజమాన్యం.. మూడో వన్డే నుంచి తప్పించింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాకతో.. అర్ష్దీప్పై వేటు వేసి హర్షిత్ రాణా (Harshit Rana)కు పెద్దపీట వేసింది. అందుకు తగ్గట్లుగానే నాలుగు వికెట్లు తీసి హర్షిత్ టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టారు!అయితే, టీ20 ఫార్మాట్లో అర్ష్దీప్ సింగ్కు మంచి రికార్డు ఉన్నా.. మరోసారి హర్షిత్ కోసం అతడిని పక్కనపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ కోసం అర్ష్ను బలిచేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘అర్ష్దీప్ సింగ్’’ అంటూ ఒక్క మాటతో మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. మరోవైపు.. దేశీ స్టార్ ప్రియాంక్ పాంచల్ కాస్త తీవ్ర స్థాయిలోనే మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.ఎంత వరకు సమంజసం?‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. అలాంటిది విదేశీ పర్యటనలో తమ అత్యధిక వికెట్ల వీరుడిని పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం? అర్ష్దీప్ సింగ్ పట్ల ఇంకాస్త మంచిగా వ్యవహరించండి. అతడు అందుకు అర్హుడు’’ అని ప్రియాంక్ పాంచల్ విమర్శించాడు.అతడి కోసం అర్ష్దీప్ను బలిచేస్తారా?ఇక శ్రీవత్స్ గోస్వామి కూడా అర్ష్దీప్ సింగ్ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టులోకి తీసుకోవడాన్ని విమర్శించాడు. ఇందుకు గల కారణమేమిటో తనకైతే అంతుపట్టడం లేదన్నాడు. అలాగే రింకూ సింగ్ను కూడా జట్టు నుంచి అకారణంగా తప్పించడం ఏమిటోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 వర్షార్పణమైంది. చాన్నాళ్లుగా ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చక్కటి షాట్లతో అలరించినా... భారీ వర్షం కారణంగా మ్యాచ్ సజావుగా సాగలేదు. వర్షార్పణంఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం తొలి పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్... 9.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 97 పరుగుల వద్ద నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఆసియా కప్లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఇక 9.4 ఓవర్ల వద్ద ఆటకు అంతరాయం కలిగించిన వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఆసీస్తో తొలి టీ20కి భారత తుదిజట్టు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
‘సూర్య ఫామ్పై ఆందోళన లేదు’
కాన్బెర్రా: భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఆసియా కప్ టోర్నీలో జట్టును విజేతగా నిలిపినా... గత 14 ఇన్నింగ్స్లలో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. అయితే సూర్యకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. అతని ఫామ్తో తమకు ఆందోళన లేదని, ఒక ప్లేయర్ బ్యాటింగ్కంటే ఓవరాల్గా జట్టు ప్రదర్శనను చూడాలని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఎలాంటి స్థితిలోనైనా దూకుడుగా ఆడాలని మేమందరం కలిసి డ్రెస్సింగ్ రూమ్లో నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటప్పుడు సహజంగానే వైఫల్యాలు వస్తాయి. కాబట్టి సూర్య బ్యాటింగ్ గురించి మేం ఆందోళన చెందడం లేదు. 30 బంతుల్లో 40 పరుగులు చేసి అతను విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ధాటిని కొనసాగించి విఫలమైనా నష్టం లేదని ముందే అనుకున్నాం. ప్రస్తుతం అభిషేక్ శర్మ అద్భుత ఫామ్లో ఉన్నాడు. సూర్య ఒక్కసారి లయ అందుకుంటే తానూ దూసుకుపోతాడు. అయితే టి20ల్లో వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుకు పనికొచ్చే ప్రభావవంతమైన ఇన్నింగ్స్లు ముఖ్యం’ అని గంభీర్ వివరించాడు. జట్టు కెపె్టన్, కోచ్ల మధ్య మంచి అవగాహన ఉందని, అది జట్టు ఫలితాల్లో కనిపిస్తుందని అతను అన్నాడు. ‘ఎక్కడా వెనక్కి తగ్గని టీమ్గా దీనిని తీర్చిదిద్దాలని మేం భావిస్తున్నాం. అందుకే వైఫల్యాలకు మేం భయపడం. ఆసియా కప్ ఫైనల్లో కూడా ఏదైనా తప్పు చేసినా ఏమీ కాదని ఆటగాళ్లను ముందే చెప్పాను. తప్పులు మానవ సహజం. అయితే దూకుడును మాత్రం ప్రదర్శించకుండా సాధారణంగా ఆడితే ప్రత్యర్థిని అవకాశం ఇచ్చినట్లే’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాన్బెర్రాలో రేపు జరిగే తొలి మ్యాచ్తో ఆస్ట్రేలియా, భారత్ జట్ల ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్కు సన్నాహకంగా సోమవారం భారత ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నారు. -
ఫెయిల్ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. బ్యాటింగ్ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్లలో కలిపి కేవలం రెండే హాఫ్ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్గా ఆసియా టీ20 కప్-2025 టైటిల్ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్ ఫామ్ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్గా ఆడాలని డ్రెసింగ్రూమ్లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్ టోర్నీలో సూపర్ ఫామ్ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్ బ్రాండ్పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్ -
అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma)- విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్ రోహిత్ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్ బ్యాటర్లు తమ వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్, ఓపెనర్ గిల్ (24)తో కలిసి రోహిత్ 69 పరుగుల పార్ట్నర్షిప్ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్ చేతిలో క్లీన్స్వీప్ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్ హర్షిత్ రాణా తన కెరీర్లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసి.. ఆసీస్ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్- గిల్ సూపర్ఈ నేపథ్యంలో డ్రెసింగ్ రూమ్లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్మన్, రోహిత్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్-విరాట్ పార్ట్నర్షిప్ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్తో పాటు విరాట్ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్ అవుట్స్టాండింగ్ స్పెల్ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్ తన ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్ టూర్లో కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే గిల్ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్గానూ సిరీస్ను ఆసీస్కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
IND vs AUS: అదొక తెలివి తక్కువ నిర్ణయం: అశ్విన్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. అడిలైడ్ మ్యాచ్లో భారత జట్టు యాజమాన్యం అనుసరించిన వ్యూహాన్ని తప్పుబట్టిన అశూ.. తెలివి తక్కువ నిర్ణయం కారణంగా సిరీస్ కోల్పోయామంటూ ఘాటు విమర్శలు చేశాడు.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది టీమిండియా. తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా పెర్త్లో ఏడు వికెట్ల తేడాతో ఓడిన గిల్ సేన.. గురువారం నాటి రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా 0-2తో సిరీస్ను ఆసీస్కు కోల్పోయింది.బెంచ్కే పరిమితంఅయితే, ఈ రెండు వన్డేల్లోనూ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను బెంచ్కే పరిమితం చేసింది టీమిండియా మేనేజ్మెంట్. వికెట్ల తీయగల సత్తా ఉన్నా అతడిని తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.జంపా అదుర్స్ముఖ్యంగా రెండో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా (Adam Zampa) నాలుగు వికెట్లతో రాణించి.. భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించడం.. కుల్దీప్ లేనిలోటును మరింత ఎత్తి చూపింది. ఆతిథ్య జట్టు తమ స్పిన్నర్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే.. టీమిండియా మాత్రం వ్యూహాత్మక తప్పిదం చేసిందనే విమర్శలు వచ్చాయి.వికెట్లు తీసే బౌలర్లు కావాలిఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అడిలైడ్ వన్డేలో టీమిండియా బౌలింగ్ అటాక్ అత్యంత సాధారణంగా అనిపించింది. అసలు వికెట్ తీయాలని ఎవరూ ప్రయత్నించినట్లుగా అనిపించనేలేదు. పరుగులు చేయడం కంటే కూడా వికెట్లు పడగొట్టగలిగే బౌలర్లను ఎంపిక చేసుకోవాలి.మంచి కెప్టెన్లు, నాయకులు ఎలా ఆలోచిస్తారంటేఆడం జంపా నాలుగు వికెట్లు ఎలా తీశాడో చూశారా?.. అతడు బంతిని తిప్పేశాడు. ప్రతిసారీ మన డ్రెసింగ్రూమ్ దృష్టికోణం గురించే ఆలోచించవద్దు. మంచి కెప్టెన్లు, నాయకులు.. ఎల్లప్పుడూ ప్రత్యర్థి జట్టు ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో ముందే ఊహించి.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు.ఈ మ్యాచ్లో ఆడిన కూపర్ కన్నోలి ఇది వరకు అసలు కుల్దీప్ యాదవ్ను ఎదుర్కొన్నాడా? లేదు కదా!.. మరి మాథ్యూ షార్ట్.. అలెక్స్ క్యారీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇబ్బందిపడ్డాడు. మిచెల్ ఓవెన్ కూడా ఇంత వరకు కుల్దీప్ను ఎదుర్కొనేలేదు.తెలివి తక్కువ నిర్ణయంఆస్ట్రేలియా ప్రస్తుత బ్యాటింగ్ లైనప్లో చాలా మందికి కుల్దీప్ బౌలింగ్లో ఆడిన అనుభవమే లేదు. కాబట్టి అతడిని ఆడిస్తే.. ప్రత్యర్థి జట్టులోని ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడేవాడు. కుల్దీప్ను బెంచ్కే పరిమితం చేయడం తెలివిగల నిర్ణయం అయితే కానేకాదు’’ అని అశ్విన్.. కెప్టెన్ శుబ్మన్ గిల్, హెడ్కోచ్ గౌతం గంభీర్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. చదవండి: రోహిత్ భయ్యా ఏ తప్పూ చేయలేదు.. నన్నెందుకు కెప్టెన్ చేశారు? -
రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో విఫలమైన హిట్మ్యాన్ రెండో మ్యాచ్లో తన మార్క్ చూపించాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్ క్రీజులో నిలదొక్కున్నాక మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అలరించాడు.ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు తన అద్బుత ఇన్నింగ్స్తో రోహిత్ ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి మూడో వికెట్కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 97 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో అవుటయ్యాడు. అయితే మ్యాచ్ ముగిశాక టీమ్ హోటల్కు వెళ్లే క్రమంలో రోహిత్ శర్మను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటపట్టించాడు."రోహిత్.. అందరికీ ఇదే నీ ఫేర్వెల్ మ్యాచ్ అనిపిస్తోంది. ఒక్క ఫొటో అయినా పెట్టు" అని గంభీర్ అన్నాడు. అందుకు రోహిత్ నవ్వుతూ తన రూమ్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే.దీంతో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో రోహిత్ ఆడుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత లేదు. వరల్డ్కప్నకు ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటికి ఈ ముంబై ఆటగాడి వయస్సు నాలభైకి చేరుకుంటుంది. ఒకవేళ రోహిత్ ఫిట్గా ఉండి, ఫామ్లో ఉంటే వరల్డ్కప్లో ఆడే అవకాశముంది. అంతేకాకుండా వరల్డ్కప్ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలంటే దేశవాళీ టోర్నీ విజయహాజారే ట్రోఫీలో ఆడాల్సిందేనని అగార్కర్ స్పష్టం చేశాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. View this post on Instagram A post shared by Rohit Sharma (Fan Page) (@rohit_cha_fans45)చదవండి: వరుసగా రెండుసార్లు డకౌట్.. కోహ్లి రిటైర్మెంట్?.. గావస్కర్ స్పందన ఇదే -
ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?.. మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)కు చోటు దక్కలేదు. రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కావాల్సినంత ప్రాక్టీస్అదే విధంగా రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి టీమిండియా స్టార్లకు కూడా చోటిచ్చారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఉండే ఈ రెడ్బాల్ సిరీస్తో ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.పక్కనపెట్టడంపై విమర్శలుఇక ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్ ఖాన్కు ప్రధాన జట్టులో స్థానం దక్కదనే స్పష్టంగానే తెలుస్తోంది. ఇటీవలే పదిహేడు కిలోల బరువు తగ్గడంతో పాటు రెడ్ బాల్ టోర్నీల్లో సెంచరీ చేసినా సెలక్టర్లు అతడిని ఇలా పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ సంచలన ట్వీట్ చేశారు.ఇంటిపేరు వల్లే అతడిని ఎంపిక చేయలేదా?‘‘ఇంటిపేరు కారణంగానే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు ఎంపిక కాలేదా?.. ఊరికే అడుగుతున్నా అంతే!.. ఈ విషయంలో గౌతం గంభీర్ విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా!’’ అంటూ హెడ్కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతం గంభీర్ను షామా మొహమ్మద్ టార్గెట్ చేశారు.కరెక్ట్ కాదు మేడమ్..ఈ నేపథ్యంలో షామా ట్వీట్పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, మెజారిటీ మంది ఆమె ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నారు. మొహమ్మద్ సిరాజ్ జట్టులోని ప్రధాన బౌలర్లలో ఒకడన్న విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలుకుతున్నారు. ఆటలో ఇలాంటి రాజకీయాలకు తావు లేదని.. ఇలాంటి మాటలతో చిచ్చు పెట్టాలని చూడటం సరికాదని పేర్కొంటున్నారు.భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదుఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా విషాదకరం. ఇలాంటి మాటలు వద్దు. సర్ఫరాజ్ ఖాన్ జట్టులో ఉండేందుకు అర్హుడు.అయితే, అతడికి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అర్థంలేనివి. భారత క్రికెట్లో ఎప్పుడూ ఇలా జరుగలేదు. అజర్ హయాంలోనూ కొందరు ఇలాంటి మాటలే మాట్లాడారు.కానీ ఇందులో మతపరమైన కోణం ఉంటుందని నేను అస్సలు అనుకోను. సర్ఫరాజ్ ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగానే జట్టులోకి ఎంపిక కాలేడు. చాన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.సర్ఫరాజ్కు తగినన్ని ఛాన్సులు రాలేదు.. కానీఅయితే, ఓ ప్లేయర్ ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెట్టడం సరికాదు. సర్ఫరాజ్ ఖాన్కు తగినన్ని ఛాన్సులు రాలేదు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన రిషభ్ పంత్.. తర్వాత విఫలమైనా అతడిని పక్కనపెట్టడం జరగదు.జట్టు ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ఎవరూ మార్చలేరు’’ అని అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు. కాగా ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడి ఓ సెంచరీ, మూడు అర్థ శతకాల సాయంతో 371 పరుగులు చేశాడు. రోహిత్ లావుగా ఉన్నాడని..కాగా షామా మొహమ్మద్ గతంలోనూ రోహిత్ శర్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉన్నాడని.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడే తప్ప అతడికి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. కాగా భారత్కు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మది.చదవండి: ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్ -
ఓపెనర్గానూ రోహిత్ శర్మపై వేటు!?.. గంభీర్, అగార్కర్ చర్య వైరల్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు టీమిండియా స్టార్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమయ్యాడు. ఆప్షనల్ సెషన్లో భాగంగా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చిన హిట్మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. త్రోడౌన్స్ ఎదుర్కొంటూ బిజీబిజీగా గడిపాడు.అయితే, ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న తర్వాత రోహిత్ శర్మ మైదానాన్ని వీడే క్రమంలో ముభావంగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణం.. హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చర్యలే అని తెలుస్తోంది.అందుకే రోహిత్పై వేటుకెప్టెన్ హోదాలో భారత్కు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన 38 ఏళ్ల రోహిత్ శర్మపై యాజమాన్యం ఊహించని రీతిలో వేటు వేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని రోహిత్ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ ఆసీస్ పర్యటన జట్టు ప్రకటన సందర్భంగా తెలిపాడు.రోహిత్కు ఇష్టం లేకపోయినా..అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్గా కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ బలవంతంగానే రోహిత్ను తప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.ఓపెనర్గానూ చోటివ్వరా?ఇక ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత్కు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే జట్టులో ఓపెనర్గా మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, ఆ స్థానానికీ గంభీర్- అగార్కర్ ఎసరు పెట్టినట్లు తాజా ఊహాగానాల ద్వారా తెలుస్తోంది.ఆసీస్తో రెండో వన్డేకు ముందు అడిలైడ్ ఓవల్ మైదానంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వేళ.. గంభీర్, అగార్కర్.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇదే రోహిత్ మూడ్ ఆఫ్ అవడానికి కారణమని రెవ్స్పోర్ట్స్ కథనం ద్వారా అర్థమవుతోంది.జైసూతో చర్చలకు అర్థం ఏమిటి?కాగా ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. వన్డేల్లో మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. రోహిత్- గిల్ వన్డే ఫార్మాట్లో ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న నేపథ్యంలో జైసూకు ఇంత వరకు ఒకే ఒక్క వన్డే ఆడే అవకాశం వచ్చింది.అయితే, తాజాగా ఆసీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో జైస్వాల్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్గా తుదిజట్టులో గిల్ స్థానానికి వచ్చిన ఢోకా లేదు. మరోవైపు.. రోహిత్ కూడా పది కిలోల బరువు తగ్గి పూర్తి ఫిట్గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో గంభీర్, అగార్కర్ జైసూకు ప్రాధాన్యం ఇస్తూ చర్చలు జరపడం.. రోహిత్ అభిమానులను ఆందోళనలోకి నెట్టేసింది.భవిష్యత్తు ప్రణాళికలు అంటూ.. రోహిత్ను జట్టు నుంచే తప్పించి జైస్వాల్ ఆడిస్తారా ఏమిటి? అనే సందేహాలు ఫ్యాన్స్ను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్యూర్ బ్యాటర్ అయిన జైస్వాల్.. నెట్స్లో లెగ్ స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. గంభీర్ ఆల్రౌండర్లకే పెద్దపీట వేస్తాడన్న పేరుంది. కాబట్టి తనలోని ఆల్రౌండ్ నైపుణ్యాలతో గంభీర్ను ఆకట్టుకుని తుదిజట్టులో చోటు సంపాదించాలని జైసూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఆప్షనల్ సెషన్కు విరాట్ కోహ్లితో పాటు గిల్ కూడా డుమ్మాకొట్టినట్లు సమాచారం.విఫలమైన రో- కోకాగా ఆసీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ ఓవల్ వేదిక. ఇక ఏడు నెలల తర్వాత టీమిండియా తరఫున తొలి వన్డేతో రీఎంట్రీ ఇచ్చిన రో- కో నిరాశపరిచారు. రోహిత్ 8 పరుగులే చేసి అవుట్ కాగా.. కోహ్లి డకౌట్గా వెనుదిరిగాడు. చదవండి: కోహ్లి, రోహిత్ అందుకే ఫెయిల్ అయ్యారు: టీమిండియా కోచ్ కామెంట్స్ వైరల్ -
‘అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి!’.. సిగ్గు పడండి!
టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu)కు కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ఓపెనర్ మండిపడ్డాడు. ఇలాంటి నకిలీ వార్తలు ప్రచారం చేయొద్దంటూ సదరు నెటిజన్కు చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతం గంభీర్ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం.. మొహమ్మద్ షమీని కాదని హర్షిత్ రాణా (Harshit Rana)కు జట్టులో చోటివ్వడం ఇందుకు ప్రధాన కారణాలు.ఏడు వికెట్ల తేడాతో ఓటమిఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్లో గిల్ సేన ఆసీస్ చేతిలో.. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం విజేతను తేల్చారు.అగార్కర్, గంభీర్లను తొలగిస్తేనే సరి?ఇదిలా ఉంటే.. ఆసీస్తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజ్యోత్ సింగ్ సిద్ధు.. గంభీర్, అగార్కర్లను ఘాటుగా విమర్శించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సానే అనే అకౌంట్ నుంచి ‘‘ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలవాలనుకుంటే.. బీసీసీఐ అజిత్ అగార్కర్, గౌతం గంభీర్లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి.అదే విధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి’’ అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతీ, అగార్కర్ల ఫొటోలను కూడా సదరు నెటిజన్ జతచేశారు.సిగ్గు పడండిఈ విషయంపై స్పందించిన సిద్ధు.. ‘‘నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అసత్యపు వార్తలను ప్రచారం చేయకండి. అసలు ఇలాంటివి కూడా చేస్తారని అస్సలు ఊహించలేదు. సిగ్గు పడండి’’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఈ టూర్ కొనసాగుతుంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
పబ్లిక్గా అంత మాట అంటావా? ముందు నీ పనేంటో చూసుకో గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) తీరుపై భారత మాజీ క్రికెటర్ బల్విందర్ సంధు (Balvinder Sandhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోచ్గా చేయాల్సిన పని మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు. ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని.. దిగ్గజాల గురించి కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చురకలు అంటించాడు.అసలేం జరిగిందంటే.. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఆసీస్తో వన్డే సిరీస్కు ప్రకటించిన జట్టులో యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు చోటు ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చాయి. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తాను ఫిట్గానే ఉన్నానని చెప్పినా.. అతడిని కాదని హర్షిత్కు పెద్ద పీట వేయడం విమర్శలకు దారితీసింది.ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడుతున్న క్రమంలో అప్పటి మెంటార్ గంభీర్కు ప్రియ శిష్యుడైన కారణంగానే.. ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రధానంగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనదైన శైలిలో గంభీర్- హర్షిత్ల గురించి కామెంట్ చేశాడు.చిక్కాపై గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో ఇటీవల వెస్టిండీస్తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన గంభీర్ స్పందించాడు. ‘‘యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేస్తారా? కావాలంటే నన్ను ఏమైనా అనండి. అతడి జోలికి మాత్రం వెళ్లవద్దు. వాళ్ల నాన్న క్రికెటరో, సెలక్టరో కాదు’’ అంటూ చిక్కాపై ఫైర్ అయ్యాడు.ఈ క్రమంలో భారత మాజీ పేసర్, 1983 గెలిచిన భారత జట్టులో చిక్కా సహచర సభ్యుడైన బల్విందర్ సంధు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాడు. మిడ్-డేతో మాట్లాడుతూ.. ‘‘ఏ విషయం గురించైనా ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటితో ఇతరులు ఏకీభవించాలన్న నియమం లేదు.పబ్లిక్గా అంత మాట అంటావా?అయితే, పబ్లిక్గా చిక్కా గురించి అలా మాట్లాడంలో అర్థం లేదు. అవును.. శ్రీకాంత్ బ్యాటింగ్లాగే.. అతడి మాటలు కూడా ఉంటాయి. అందుకే అతడిని చాలా మంది ఇష్టపడతారు కూడా!.. సెలక్షన్ గురించి విమర్శించేటపుడు కొంతమంది మాజీ క్రికెటర్లు హద్దులు దాటుతున్న మాట వాస్తవమే.అందుకు సోషల్ మీడియాలో వారిపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయినంత మాత్రాన స్వేచ్ఛగా మాట్లాడే మాజీ ప్లేయర్ల హక్కును హరించేందుకు వీలులేదు. దేశం కోసం కష్టపడి, ఇష్టపడి ఆడిన వాళ్లు ఇలాంటి వాటిని పొందేందుకు ఎంత మాత్రం అర్హులు కాదు.హెడ్కోచ్గా నీ పనేంటో చూసుకోసలహాలు ఇస్తే క్రీడాస్ఫూర్తితో స్వీకరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. హెడ్కోచ్గా మైదానంలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్న అంశం మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. అలా కాకుండా ఇలా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని వేలాడితే అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది.శ్రీకాంత్ అభిప్రాయాల గురించి గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు చదువుతుంటే నా మనసుకు ఎంతో బాధ కలిగింది. మాజీ ఆటగాడిని ఉద్దేశించి మీడియా ముఖంగా ఇలా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు’’ అని బల్విందర్ సంధు గంభీర్ తీరును విమర్శించాడు. చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
సెలక్షన్ విషయంలో ద్రవిడ్తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తనదైన ముద్ర వేశాడు. రెండున్నరేళ్ల పాటు అతడి మార్గదర్శనంలో ముందుకు సాగిన భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచింది. అంతకుముందు.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరి.. రన్నరప్గా నిలిచింది.ఇక ద్రవిడ్ జట్టులో నింపిన స్ఫూర్తి కారణంగానే తాము టీ20 ప్రపంచకప్తో పాటు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ కూడా గెలిచామని టీమిండియా తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే వెల్లడించాడు. ద్రవిడ్ భాయ్ తమలో గెలవాలన్న పట్టుదలను మరింత పెంచి జట్టు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా రోహిత్- ద్రవిడ్ కాంబోలో టీమిండియా మంచి ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చు.ద్రవిడ్తో మాకు విభేదాలుభారత క్రికెట్లో ద్రవిడ్కు సౌమ్యుడనే పేరుంది. ఈ మాజీ కెప్టెన్ కెరీర్లో వివాదాలకు తావులేదు. అయితే, అలాంటి ద్రవిడ్ కోచ్గా మారిన తర్వాత మాత్రం జట్టు విషయంలో తగ్గేదేలే అన్నట్లు సెలక్టర్లతో వాదనలకు దిగేవాడట. తన ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా జట్టు కూర్పు ఉండాల్సిందేనని పట్టుబట్టేవాడట.టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘రాహుల్ ద్రవిడ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయితే, అతడు కోచ్గా ఉన్న సమయంలో మా మధ్య విభేదాలు వచ్చిన మాట వాస్తవం. అవి తగువులాటలు అని నేను చెప్పను.మా నిర్ణయమే ఫైనల్కానీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చేవి. కొన్ని విషయాల్లో తను అనుకున్నట్లే జరగాలని ద్రవిడ్ పట్టుబట్టేవాడు. ఏదేమైనా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉండేవి.జట్టు ఎంపిక పూర్తిగా మా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు రాహుల్.. ఇప్పుడు గంభీర్.. గతంలో రోహిత్.. ఇప్పుడు శుబ్మన్.. ఇలా కోచ్లు, కెప్టెన్లుగా ఎవరున్నా సరే.. వారికి కూడా జట్టు ఎంపిక విషయంలో జోక్యం కల్పిస్తాం. వారితో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తాం.మా పని అదేకోచ్, కెప్టెన్ పని సులువు చేసే విధంగా అత్యుత్తమైన పదిహేను మంది ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా పని. ఒకవేళ కోచ్, కెప్టెన్ను గనుక సెలక్షన్ విషయంలో భాగం చేయకపోతే.. అంతకంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఈ సిరీస్కు ముందే కెప్టెన్గా రోహిత్ను తప్పించిన యాజమాన్యం.. గిల్కు వన్డే పగ్గాలూ అప్పగించింది. ఇక ఇప్పటికే అతడు టెస్టు సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే కెప్టెన్గా రోహిత్ను తొలగించిన నేపథ్యంలో గంభీర్తో పాటు అగార్కర్పైనా విమర్శలు వెల్లువెత్తాయి.చదవండి: IND vs AUS: జట్లు, షెడ్యూల్, వేదికలు, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్.. అశ్విన్ స్పందన ఇదే
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్తో కలిసి సంజూ శాంసన్ (Sanju Samson)ను కాదని.. ధ్రువ్ జురెల్ను ఎంపిక చేయడం.. అదే విధంగా.. యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు ఈ జట్టులో చోటివ్వడం విమర్శలకు దారితీశాయి.టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్కు ప్రియ శిష్యుడు గనుకే హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తున్నారని మాజీ క్రికెటర్లు విమర్శించారు. చెన్నై దిగ్గజాలు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రధానంగా ఈ మేరకు విమర్శలు చేశారు. ఈ క్రమంలో హర్షిత్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.‘సిగ్గుచేటు’ అంటూ గంభీర్ ఫైర్ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో రెండో టెస్టులో టీమిండియా గెలిచిన తర్వాత గంభీర్ ఈ విషయంపై స్పందించాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం కుర్రాడి జీవితాన్ని నాశనం చేస్తారా?.. సిగ్గుచేటు అని మండిపడ్డాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చని.. కానీ 23 ఏళ్ల హర్షిత్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. అతడి తండ్రి మాజీ క్రికెటరో, సెలక్టరో కాదని.. నైపుణ్యాలతోనే అవకాశాలు దక్కించుకుంటున్నాడని గంభీర్ పేర్కొన్నాడు.కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. ఈ క్రమంలో అశ్విన్ తాజాగా గంభీర్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశాడు. అయితే, ఈసారి అశూ మాట మార్చడం విశేషం. హర్షిత్ నైపుణ్యాలను కచ్చితంగా విమర్శిస్తానంటూనే.. వ్యక్తిగతంగా ఎవరూ ఎవరినీ టార్గెట్ చేయవద్దంటూ హితవు పలికాడు. సోషల్ మీడియాలో ప్రతికూల విషయాలే తొందరగా వ్యాప్తి చెందుతాయని.. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.పగ పెట్టుకోలేదు‘‘నేను మరోసారి చెప్తున్నా.. ఏ ఆటగాడిని వ్యక్తిగతంగా విమర్శించవద్దు. పర్సనల్ అటాక్కి దిగితే జానర్ మారిపోతుంది. నా కెరీర్ ఆసాంతం సంజయ్ మంజ్రేకర్ నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అయినా సరే నేనేమీ ఆయన మీద పగ పెట్టుకోలేదు.విమర్శలు చెప్పేది సరైంది లేదంటే తప్పు కావొచ్చు. కానీ ముందుగా చెప్పినట్లు అది వ్యక్తిగతంగా ఉండకూడదు. ఒకవేళ హర్షిత్ రాణా.. తనను ఎవరైనా కఠిన పదజాలంతో విమర్శించిన వీడియో చూస్తే అతడి పరిస్థితి ఏమై పోతుంది?మ్యాచ్కు ముందు ఇలాంటివి జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది?.. ఒకవేళ అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరైనా ఈ వీడియోల గురించి తనకు చెబితే పరిస్థితి ఏంటి? ఓ ఆటగాడి నైపుణ్యాలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువకానీ వ్యక్తిగతంగా మాత్రం వద్దు. ఇలా చేయడం ఒకటీ రెండు సార్లు బాగుంటుంది. ఆ తర్వాత పరిస్థితి గంభీరంగా మారిపోతుంది. ఈరోజుల్లో నెగటివిటీ అమ్ముడుపోయే వస్తువుగా మారిపోయింది. ఎందుకంటే దానికే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది.ప్రస్తుతం హర్షిత్ రాణాను అన్ని కోణాల్లో టార్గెట్ చేస్తున్న వాళ్లు.. అతడు ఒకవేళ వచ్చే ఏడాది బాగా ఆడితే.. తన నైపుణ్యాల గురించి ఇదే స్థాయిలో ప్రశంసిస్తారా? లేదంటే కేవలం ప్రతికూలతల వరకే పరిమితం అవుతారా?’’ అంటూ అశూ ఫైర్ అయ్యాడు. హర్షిత్ నైపుణ్యాలను మాత్రమే తాను విమర్శించానంటూ పరోక్షంగా చిక్కాపైకే అంతా నెట్టేశాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లకు ముహూర్తం ఖరారైంది.చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు..
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమైంది. తొలి బ్యాచ్లో భాగంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తదితరులు కంగారూ దేశానికి బయల్దేరారు.వీరితో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఆ సమయంలో కొంత మంది సహాయక సిబ్బంది కూడా ఆటగాళ్ల వెంట ఉన్నారు.Team India off to Australia ✈️ pic.twitter.com/FCpqxYjTSI— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025గంభీర్ లేకుండానే..అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్ లేకుండానే తొలి బ్యాచ్తో వెళ్లడం లేదు. రెండో బ్యాచ్తో కలిసి అతడు సాయంత్రం ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నట్లు సమాచారం. ఇక టీమ్ బస్లో రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో కూర్చోగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025 కాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టులను 2-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. అక్టోబరు 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ సిరీస్కు ముందే వన్డే సారథిగా రోహిత్ను తప్పించిన బీసీసీఐ.. గిల్కు కెప్టెన్సీ అప్పగించింది.కెప్టెన్సీ మార్పు వెనుకఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పు వెనుక గంభీర్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్- కోహ్లి చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడారు. ఈ మెగా టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు.ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత టీమిండియా తరఫున రో- కో తొలిసారి ఆస్ట్రేలియాతో వన్డేల సందర్భంగా బరిలోకి దిగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు కంగారూ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా?కాగా 37 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల కోహ్లి వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారో లేదోనని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్గా ఉన్న ఈ ఇద్దరు తప్పక మెగా టోర్నీ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. వీరిద్దరి విషయంలో మేనేజ్మెంట్ వైఖరిపైనా సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐpic.twitter.com/BZLAUZArJP— Ro³ (@45__rohan) October 15, 2025 -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్కప్కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్మన్ గిల్కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్గా గిల్ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్కు మెంటార్గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
BCCI: గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చేసిన ‘సిగ్గుచేటు’ వ్యాఖ్యలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) స్పందించాడు. గంభీర్ సరిగ్గానే మాట్లాడానని సమర్థించిన అతడు.. యువ ఆటగాడి పట్ల సీనియర్ల ప్రవర్తన సరికాదని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..గంభీర్ హెడ్కోచ్ కాగానే..ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో యువ పేసర్ హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి కేకేఆర్ మెంటార్ గంభీర్.. టీమిండియా హెడ్కోచ్ కాగానే హర్షిత్ జాతీయ జట్టులోకి వచ్చేశాడు. వరుస వైఫల్యాలు చెందినా.. టీమిండియాలో అతడి స్థానానికి ఢోకా లేకుండా పోయింది.ముఖ్యంగా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్గానే ఉన్నానని మొత్తుకుంటున్నా.. సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియాతో వన్డే, టీ20లకు హర్షిత్ రాణా ఎంపిక కావడం విమర్శలకు దారితీసింది. గంభీర్ ప్రియ శిష్యుడు కాబట్టే అతడికి ఛాన్సులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.చిక్కా, అశూ విమర్శలుఈ విషయంలో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగానే స్పందించారు. హర్షిత్ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో అర్థం కావడం లేదని పరోక్షంగా గంభీర్ను విమర్శించారు.గంభీర్ ఆగ్రహంఈ నేపథ్యంలో వెస్టిండీస్తో రెండో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. చిక్కా, అశూలను టార్గెట్ చేశాడు. ‘‘యూట్యూబ్లో వ్యూస్ కోసం యువ ఆటగాడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు.మీ స్వార్థం కోసం 23 ఏళ్ల క్రికెటర్ను టార్గెట్ చేస్తారా? ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆటగాడి గురించి ఇలా మాట్లాడకండి’’ అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా స్పందించాడు.బీసీసీఐ స్పందన ఇదే‘‘గౌతం గంభీర్ సరిగ్గానే చెప్పాడు. ఓ ఆటగాడి ఎంపిక గురించి ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉంటే.. బాధ్యతాయుతంగా విమర్శించాలి. అంతేకానీ.. సదరు ప్లేయర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడకూడదు.ఎవరిని ఎంపిక చేయాలో యాజమాన్యం చూసుకుంటుంది. ఇతర ఆటగాళ్ల గురించి మాట్లాడేటపుడు.. మీరెంత బాధ్యతాయుతంగా ఉన్నారో ఆలోచించుకోండి’’ అంటూ రాజీవ్ శుక్లా గంభీర్కు మద్దతు పలికాడు. ANIతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గంభీర్, హర్షిత్ ఇద్దరూ ఢిల్లీకి చెందిన వారే కావడం గమనార్హం.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్#WATCH | Delhi: On Indian Men’s Cricket Team Head Coach Gautam Gambhir's statement on the selection process and bowler Harshit Rana, BCCI Vice President Rajeev Shukla says, "What Gautam Gambhir said is absolutely right. Comments should be made about players with responsibility;… pic.twitter.com/yOrJXFKanF— ANI (@ANI) October 14, 2025 -
కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి.. అందరూ అతడిని గౌరవిస్తారు: గంభీర్
టీమిండియా టెస్టు సారథి శుబ్మన్ గిల్ (Shubman Gill)పై హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. టెస్టు కెప్టెన్గా అతడు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడని.. అతడికి వంక పెట్టేందుకు ఏమీ లేదని కొనియాడాడు. తనకు ఉన్న నైపుణ్యాలతోనే గిల్ టెస్టు సారథి అయ్యాడని.. అలాగే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కించుకున్నాడని పేర్కొన్నాడు.సారథిగా తొలి ప్రయత్నంలోనేకాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. గిల్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే. సారథిగా తొలి ప్రయత్నంలోనే ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడ్డాడు. బ్యాటర్గా, కెప్టెన్గా రాణించి ఇంగ్లండ్ గడ్డ మీద ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో సమం చేశాడు.విండీస్ను వైట్వాష్ చేసి తొలి విజయంఇక తాజాగా వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసి.. కెప్టెన్గా గిల్ తొలి సిరీస్ విజయాన్ని రుచిచూశాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ నుంచి దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించిన భారత క్రికెట్ యాజమాన్యం.. గిల్కు పగ్గాలు అప్పగించింది.ఫేవటెరిజం లేదుఈ నేపథ్యంలో విమర్శలు రాగా.. విండీస్పై విజయానంతరం గంభీర్ స్పందించాడు. ‘‘అతడిని అచ్చంగా అతడిలా ఉండనివ్వడమే మేము చేసిన మంచిపని. టెస్టు లేదంటే వన్డే కెప్టెన్గా అతడిని ఎంపిక చేయడంలో ఎలాంటి ఫేవటెరిజం లేదు. ఇందుకు వందశాతం గిల్ అర్హుడు.ఎన్నో ఏళ్లుగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద టెస్టు కెప్టెన్ ఇప్పటికే కఠిన సవాలు ఎదుర్కొని.. అతడు సారథిగా పాసయ్యాడు. నాణ్యమైన జట్టుపై బ్యాటర్గా, కెప్టెన్గా రాణించాడు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ 2027 గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం సరికాదు.అందరూ అతడిని గౌరవిస్తారుప్రతి మ్యాచ్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ముఖ్యం. సొంతగడ్డపై మాకిది కీలకమైన సిరీస్. ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం. నిజానికి ఇంగ్లండ్లో టెస్టులు ఇంతకంటే కష్టంగా ఉండేవి. ఇదే విషయాన్ని గిల్తో నేను చాలాసార్లు చెప్పాను.రెండున్నర నెలల పాటు అక్కడ గిల్ అత్యంత కఠినమైన సవాలును ఎదుర్కొన్నాడు. ఇంతకంటే అతడు ఇంకేం చేయాలి? డ్రెసింగ్రూమ్లో అందరూ అతడిని గౌరవిస్తారు. సరైన పనులు చేసినందుకు అతడికి ఇవన్నీ దక్కాయి. మాటల కంటే చేతలు ముఖ్యం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.నాకు ఆ అవసరం ఉందిఇక ఒత్తిడిని తట్టుకునేందుకు గిల్ కోసం మెంటల్ కండిషనింగ్ కోచ్ను నియమిస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ముందైతే నాకు అతడి అవసరం ఉంది’’ అంటూ నవ్వులు చిందించాడు. గెలిచినప్పుడు జట్టుకు ప్రశంసలు దక్కుతాయన్న గౌతీ.. ఓడినప్పుడు మాత్రం ఆటగాళ్లు కుంగిపోకుండా చూసుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్గా ఫీట్ -
నాలో దూకుడు అలాగే ఉంది.. కానీ: గంభీర్ కామెంట్స్ వైరల్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనలో ఇప్పటికీ దూకుడు అలాగే ఉందని.. మైదానంలో తనను తాను ఇలా ఆవిష్కరించుకోవడం తన సహజమైన భావోద్వేగం అని తెలిపాడు. అయితే, వయసు పెరుగుతున్న దృష్ట్యా ఇంట్లో వాళ్ల కోసం కొన్నిసార్లు తనను తాను సంభాళించుకుంటున్నానని తెలిపాడు.కోహ్లితోనూ గొడవటీమిండియాకు ఆడిన రోజుల్లో గంభీర్ ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో క్రికెట్ ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్తో మ్యాచ్లో దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేవాడు. అంతేకాదు.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)తోనూ.. ఈ వరల్డ్కప్ విన్నర్ గొడవ పడిన విషయం తెలిసిందే.ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ‘ఢిల్లీ బాయ్స్’ గంభీర్- కోహ్లి రెండుసార్లు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. 43 ఏళ్ల గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పాత పగలు పక్కనపెట్టి కోహ్లితో కలిసిపోయాడు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్వయంగా వీరిద్దరు చెప్పడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫైట్స్కు తెరపడింది.ఎప్పుడూ గంభీరంగానేఇక గంభీర్ డగౌట్లోనూ ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అతడి ముఖంలో అమావాస్యకో.. పున్నమికో గానీ నవ్వు కనిపించదు. ఎప్పుడూ సీరియస్గా ఉండే గంభీర్పై ఈ విషయంలో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి.నేను మారలేదుఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన గౌతం గంభీర్ తన వ్యవహారశైలి గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాలో ఇప్పటికీ ఆ దూకుడు అలాగే ఉంది. నేను మారలేదు. అగ్రెసివ్గా ముందుకు వెళ్లాలనుకున్నపుడు గొడవ పడటమే నాకు ముందుగా గుర్తుకువస్తుంది.ఇంట్లో పిల్లలు ఉన్నారుఅయితే, వయసు పెరిగింది కాబట్టి.. నా మనసు.. ‘ఇంట్లో పిల్లలు ఉన్నారు’ కదా అని హెచ్చరిస్తుంది’’ అంటూ గంభీర్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్తో బిజీగా ఉంది.రెండు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసిన గిల్ సేన.. శుక్రవారం మొదలుపెట్టిన రెండో టెస్టులోనూ జోరు కనబరుస్తోంది. టీమిండియా- వెస్టిండీస్ రెండో టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా గంభీర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. టీమ్ డిన్నర్ఇక ఈ మ్యాచ్కు ముందు గౌతీ తన ఇంట్లో టీమిండియాకు డిన్నర్పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు జస్ప్రీత్ బుమ్రా,ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ సహా కోచ్లు ర్యాన్ టెన్ డష్కాటే, మోర్నీ మోర్కెల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గంభీర్ పార్టీకి హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి గిల్కు పగ్గాలు అప్పగించడంపై గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో గౌతీ టీమ్ డిన్నర్ ఇవ్వడం గమనార్హం. చదవండి: ‘యువీ గనుక తన పిల్లల్ని.. నాకు అప్పగిస్తే వారికీ అదే ‘గతి’ పట్టిస్తా’ -
అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు: అశ్విన్ ఫైర్
ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం అద్భుతమైన డెలివరీ సంధించాడని.. అదే ప్రాతిపదికగా ఇప్పటికీ ఓ ఆటగాడికి జట్టులో స్థానం కల్పిస్తున్నారంటూ ‘యువ పేసర్’ను టార్గెట్ చేశాడు.గిల్ సారథ్యంలో ..వెస్టిండీస్ స్వదేశంలో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)కు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో అక్టోబరు 19- నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్టును ప్రకటించింది.వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్తో ఆడే వన్డే, టీ20 జట్లలో యువ పేసర్ హర్షిత్ రాణాకు చోటు దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశ్విన్ ఘాటుగా స్పందించాడు.అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కాదు‘‘అసలు అతడిని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకైతే ఈ విషయం అంతుపట్టడం లేదు. రాణాను జట్టులో చేర్చడానికి గల కారణమేమిటో తెలుసుకునేందుకైనా సెలక్షన్ కమిటీ సమావేశంలో భాగమైతే బాగుండు అనిపిస్తోంది.ఆస్ట్రేలియాలో బ్యాట్తోనూ రాణించగల ఫాస్ట్బౌలర్ టీమిండియాకు అవసరం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలిగే బౌలర్ను వాళ్లు ఎంపిక చేయాలి. నాకైతే అతడి బ్యాటింగ్పై ఎలాంటి నమ్మకమూ లేదు. రెండేళ్ల క్రితం ఐపీఎల్ మ్యాచ్లో నితీశ్ కుమార్ రెడ్డిని అద్భుతమైన పేస్ డెలివరీతో అవుట్ చేసినందుకు.. నేటికీ ఆ ఒక్క కారణంతోనే వరుస అవకాశాలు ఇస్తున్నారు’’ అని అశ్విన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.గంభీర్కే చురకలుకాగా ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో కేకేఆర్ మెంటార్గా ఉన్న గౌతం గంభీర్.. తర్వాత టీమిండియా హెడ్కోచ్ అయ్యాడు. ఈ క్రమంలో గంభీర్ ప్రియ శిష్యుడైన హర్షిత్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడమే కాదు.. వైఫల్యాలు ఎదురైనా జట్టులో వరుస అవకాశాలు దక్కించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అశూ పరోక్షంగా గంభీర్కు ఈ విధంగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది.చదవండి: వన్డే కెప్టెన్గా రోహిత్పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్ -
టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!.. రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..
ఇటీవలే ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్ సేన భారత్ నుంచి ఆసీస్కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్ డిన్నర్ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్ టూర్కు ముందు... వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుబ్మన్ గిల్ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్ను ఓపెనర్గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్- హెడ్కోచ్ గంభీర్పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్.. గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్. చదవండి: టీమిండియాతో సిరీస్లకు ఆసీస్ జట్ల ప్రకటన -
ద్రవిడ్ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్ ట్రోఫీ గెలిచాం: రోహిత్ శర్మ
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.ముంబైలో జరిగిన CEAT క్రికెట్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదుఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.చాలాసార్లు ఫైనల్ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.నాకు, రాహుల్ భాయ్కు..చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్ భాయ్కు అందిన సహకారం గొప్పది.టీ20 ప్రపంచకప్-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.గంభీర్కు రోహిత్ కౌంటర్కాగా ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్ పరోక్షంగా చెప్పడం గమనార్హం.ఇక వన్డే కెప్టెన్గా కొనసాగాలనుకున్న రోహిత్ శర్మను తప్పించి.. శుబ్మన్ గిల్ను సారథి చేయడం వెనుక గంభీర్ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్కు హిట్మ్యాన్ ఇలా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ పలికిన రోహిత్.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్మన్ గిల్ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
ఇది నిజంగా సిగ్గుచేటు: రోహిత్పై గంభీర్ ‘కామెంట్స్’ వైరల్
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పు విషయంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించాడంటూ హిట్మ్యాన్ అభిమానులు గౌతీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. గౌతీతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్పై కూడా రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.అది సిగ్గుచేటుఈ నేపథ్యంలో గౌతం గంభీర్ రోహిత్ శర్మను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మరోసారి తెరమీదకు వచ్చింది. ఇందులో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ కాకపోతే అది జట్టు చేసుకున్న దురదృష్టమే కానీ... రోహిత్కు కాదు.పరిమిత ఓవర్ల క్రికెట్ లేదంటే టీ20 జట్టుకు అతడు కెప్టెన్ కాలేదంటే.. అది సిగ్గుచేటు. ఇంతకంటే రోహిత్ శర్మ ఇంకేం చేస్తే కెప్టెన్సీకి అర్హుడు అవుతాడు?’’ అంటూ గంభీర్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శిస్తూ రోహిత్ శర్మకు మద్దతు తెలిపాడు. పరోక్షంగా విరాట్ కోహ్లిని టార్గెట్ చేశాడు.నాడు కోహ్లి స్థానంలో రోహిత్ శర్మకాగా టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే టీమిండియా ఇంటిబాట పట్టడంతో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ కోహ్లిని తప్పించగా.. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి స్వయంగా తప్పుకొన్నాడు.ఈ క్రమంలో 2021-22 మధ్య కాలంలో కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అప్పటి నుంచి రోహిత్ సారథ్యంలో టీ20 ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటిన టీమిండియా గతేడాది వరల్డ్కప్ గెలిచింది.అంతకుముందు వన్డే వరల్డ్కప్-2023లో అజేయంగా ఫైనల్ చేరింది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ట్రోఫీ-2025 గెలిచింది. అయితే, ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతానని చెప్పగా.. బీసీసీఐ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది.ఇపుడు రోహిత్ ప్లేస్లో గిల్రోహిత్ స్థానంలో టెస్టు సారథిగా వచ్చిన యువ ఆటగాడు శుబ్మన్ గిల్కు వన్డే పగ్గాలనూ అప్పగించింది. ఇందులో హెడ్కోచ్ గంభీర్ పాత్ర కీలకం అని తెలుస్తోంది. గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసి 38 ఏళ్ల రోహిత్ను కెప్టెన్గా తప్పించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొనడం గమనార్హం.ఈ నేపథ్యంలో గంభీర్ గతంలో రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నిజంగానే ఇది సిగ్గుచేటు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్కప్-2027 నాటికి గిల్ చుట్టు జట్టును నిర్మించే క్రమంలో అతడిని కెప్టెన్ను చేసినట్లు అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్Never seen anyone more hypocritical and two-faced than Gautam Gambhir. The same guy who once said, “If Rohit Sharma doesn’t become India’s captain, it’s India’s loss, not Rohit’s,” now doesn’t want him as captain after becoming coach himself. pic.twitter.com/pqRzYKDR2a— Kusha Sharma (@Kushacritic) October 4, 2025 -
గంభీర్, అగార్కర్ కలిసే చేశారు.. రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!
‘వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మను అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు?’.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇదే ప్రధాన చర్చ. టీమిండియాకు రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన హిట్మ్యాన్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మండలి తీరుపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు.. సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి దిగ్గజాలు మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.రోహిత్ కెప్టెన్గా ఉంటే ఆ ప్రమాదం!ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పునకు సంబంధించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు కీలక విషయాలు వెల్లడించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా అందించిన వివరాల మేరకు.. ‘‘నాయకుడిగా డ్రెసింగ్రూమ్లో రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుంది. సారథిగా తనకంటూ ప్రత్యేక శైలి ఉంది.అయితే, తను ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరి అలాంటపుడు.. కేవలం ఒక్క ఫార్మాట్కు తను కెప్టెన్గా ఉంటే టీమ్ కల్చర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆరు నెలలు గౌతం గంభీర్ టెస్టు, వన్డే జట్ల విషయంలో వెనక ఉండే నడిపించాడు.అంతా గంభీర్ ఆధీనంలోనే..అయితే, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం (టెస్టుల్లో 3-0తో వైట్వాష్), ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో ఓటమి తర్వాత గంభీర్ అన్ని విషయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు.ప్రస్తుత నిర్ణయం (కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించడం) కూడా గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కలిసికట్టుగా తీసుకున్నారు. రోహిత్, విరాట్ కోహ్లిల వయస్సు ఇప్పటికే 35 ఏళ్లు దాటిపోయింది. కెరీర్లో వారు చివరి అంకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి దశలో అకస్మాత్తుగా రోహిత్, కోహ్లిలు ఫామ్ కోల్పోతే నాయకత్వ బృందంలో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉంటుంది.గంభీర్ నిర్ణయాల వల్లే మెరుగైన ఫలితాలునిజానికి ఇంగ్లండ్ పర్యటనకు ముందే వీరిద్దరు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లండ్లో రెండు టెస్టుల్లోనూ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమిండియా గెలిచిన తీరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత.. రోహిత్తో పాటు కోహ్లి కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఇక ఇటీవల ఇంగ్లండ్తో టెస్టులకు ముందు సంప్రదాయ క్రికెట్కూ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే, ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డేల్లో మాత్రం మరికొన్నాళ్లు కొనసాగుతామని స్పష్టం చేశారు.త్వరలోనే టీ20 జట్టు పగ్గాలు కూడా అతడికేకానీ అనూహ్య రీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో శుబ్మన్ గిల్ను వన్డేలకూ సారథిని చేసింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వెల్లడించాడు. అంతేకాదు.. రోహిత్- కోహ్లి 2027 ప్రపంచకప్ వరకు ఆడతామని తమకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ టూర్ సందర్భంగా గిల్ టెస్టు జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 జట్టులోనూ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ ఆసియా కప్-2025లో పాల్గొన్నాడు. త్వరలోనే టీ20లకు కూడా అతడే కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో గంభీర్ కీలక పాత్ర పోషించినట్లు బీసీసీఐ వర్గాల మాటల ద్వారా స్పష్టం అవుతోంది.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
పాక్ను చిత్తు చేసిన భారత్.. గౌతం గంభీర్ పోస్ట్ వైరల్
దాయాది పాకిస్తాన్కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.అభిషేక్- గిల్ ధనాధన్ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.దిగ్గజాలు లేకుండానేఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.ఫియర్లెస్..ఇన్స్టా స్టోరీలో ‘‘ఫియర్లెస్.. ఫియర్లెస్.. ఫియర్లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య


