Girl Suicide attempt
-
యువకుడితో చనువుగా ఉంటోందని మందలిస్తే..
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంది. ఈ విషాద సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడలో చోటు చేసుకుంది. హైదర్గూడ ప్రాంతానికి చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఓ యువకుడితో చనువుగా ఉంటోందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్: రాజేంద్రనగర్లో యువతి మృతదేహం కలకలం) -
ఆన్లైన్ క్లాసు కోసం ఆత్మహత్యాయత్నం
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): ఆన్లైన్ క్లాసు వినేందుకు ఓ విద్యార్ధిని సెల్ఫోన్ లేదని అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటన శంకరపట్నం మండలం ఇప్పలపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని ఇప్పలపల్లె గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థిని రాజన్నసిరిసిల్ల జిల్లాలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం ఆన్లైన్ క్లాస్లు ప్రారంభించింది. ఈ క్లాసులు వినేందుకు ఇంట్లో కుటుంబసభ్యుల సెల్ఫోన్ను సదరు విద్యార్థిని వాడుకుంటోంది. సదరు విద్యార్థిని సోదరుడు కేశవపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. ఇద్దరు ఆన్లైన్ క్లాసులు వినేందుకు సెల్ఫోన్కోసం పట్టుబట్టారు. ఇంట్లో స్మార్ట్ఫోన్ ఒక్కటే ఉండడంతో తమ్ముడికి ఫోన్ ఇచ్చారని, నాకు ఇవ్వలేదని ఆన్లైన్ క్లాసులు మిస్సవుతున్నానని ఇంట్లో వరిపొలం కోసం దాచిని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. -
ప్రియుడు మోసగించాడని బాలిక ఆత్మహత్యాయత్నం
భైంసాటౌన్: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భైంసాలో జరిగింది. పట్టణ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం భైంసా మండలం మహాగాం గ్రా మానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకుని నీళ్లలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిం ది. అప్పుడే అక్కడ ఈత కొడుతున్న పట్టణానికి చెందిన షేక్ నవీద్ అనే యువకుడు బాలిక నీటిలో దూకడం గమనించి వెంటనే ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా, ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ ఆమెను పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. బా లిక నీటిలో దూకే ముందు తన చావుకు శ్రీకాంత్ అనే వ్యక్తి కారణమంటూ రాసిన లెటర్ లభించింది. ఆ లెటర్లో తనది మహాగాం గ్రామమని, అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ తనను ప్రేమించానంటూ మోసం చేశాడని రాసి ఉంది. బాలికను ప్రాణాలకు తెగించి రక్షించిన నవీద్ను పట్టణ సీఐ శ్రీనివాస్ అభినందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. -
బాలిక ఆత్మహత్యాయత్నం
అనంతపురం , బుక్కరాయసముద్రం : తమ్మున్ని గాయపరిచినందుకు తల్లిదండ్రులు తననెక్కడ కొడతారోనన్న భయంతో అక్క ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. పొడరాళ్ల గ్రామంలో బాబాఫకృద్దీన్, సాయినాల దంపతులకు కుమార్తె చాంద్బీ (17), కుమారుడు మౌలాలి ఉన్నారు. శుక్రవారం తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో అక్కా తమ్ముడు మాత్రమే ఉన్నారు. సెల్ఫోన్ చార్జింగ్ పెట్టే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశంలో కత్తెరతో కొట్టడంతో తమ్ముడికి గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వస్తే తనను కొడతరాని భయపడ్డ అక్క చాంద్బీ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి బాలికను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరం 60 శాతం మేర కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
మందలించినందుకు యువతి..
ఖానాపురం: ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోమటిపల్లి తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య సుభద్ర(20) ఇంటి వద్ద సరిగా పనులు చేయడం లేదు. దీంతో తల్లి గుగని పనులు చేయకుండా ఖాళీగా ఉంటే ఎలా అంటూ మందలించి అన్నారంకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి కుటుంభ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా ఉరేసుకొని ఉంది. మృతురాలి అన్న భూక్య శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘నన్ను క్షమించండి...నేను ఏ తప్పు చేయలేదు
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఎండీ. నేహ(15) అనే బాలిక ఉరివేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాలికను ఓ యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వన్టౌన్ పోలీసుల వివరాల మేరకు... స్థాని అంబేద్కర్నగర్కు చెందిన ఎండీ జలేఖభేగంకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమా రుడు, కోడలు అబ్దుల్ లతీఫ్, షబానా దంపతులు ఆరేళ్ల వయసులో ఉన్న వారి కూతురు నేహాను ఇంట్లో వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో నేహకు అన్నీతానైన నాయనమ్మ జలేఖభేగం, బాబాయ్ అబ్దుల్ రజాక్ ఆలనాపాలన చూ సుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో నేహా 7వ తరగతి వరకు చదువుకుంది. శనివారం జలేఖభేగం కూతురును చూసేందుకు మంచిర్యాలకు వెళ్లగా, బాబాయ్ వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నేహ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన నాయనమ్మ, బాబాయ్ ఉరికి వేళ్లాడుతున్న నేహను చూసి షాక్కు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. వన్టౌన్ సీఐ ఎస్.వాసుదేవరావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘నన్ను క్షమించం డి... నేను ఏ తప్పు చేయలేదు...’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించిందని సీఐ తెలిపారు. అలాగే ఆర్టీసీ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ చిట్టూరి రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రేమ పేరుతో వేధింపులు... ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ గత కొంతకాలంగా నేహను ప్రేమించాలంటూ ఫోన్లో వేధింపులకు గురి చేయడంతోపాటు వెంటపడుతున్నాడు. శనివారం నేహ బాబాయ్ రజాక్కు నిఖిల్ ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నేహ ఆత్మహత్య చేసుకుందని నాయనమ్మ, బాబాయ్లు రజాక్, సమర్తోపాటు బంధువులు ఆరోపించారు. గుండెలవిసేలా రోదించిన నాయనమ్మ... ‘‘ఎంత పనిచేసిన్ బేటా... నన్ను వదిలిపోయావా...’’ అంటూ నేహ మృతదేహం దగ్గర నాయనమ్మ జలేఖభేగం గుండెలవిసేలా రోధించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేస్తే, అనాథ కావద్దని నేహను కన్న కూతురుగా పెంచుకుం టున్నానని... ఇలా చనిపోతుందని అనుకోలదని జలేఖభేగం రోదించింది. నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని ధర్నా... నేహ మృతికి కారకుడైన నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువు లు, ముస్లిం పెద్దలు, యువకులు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐ లు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని ఆందోళనకారులను శాంతిపజేశారు. నిందితునిపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ వాసుదేవరావు -
పోకిరీలు వేధిస్తున్నారని..
అశ్వారావుపేట ఖమ్మంజిల్లా : స్థానిక పాత ఆంధ్రాబ్యాంకు వీధిలో ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న మైనర్ బాలిక సోమవారం ఉదయం నల్లుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి అదే వీధిలో కొందరు యువకులు అటుగా వెళుతున్న బాలికలు, యువతులను సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నారంటూ పాల దుకాణం నిర్వాహకురాలు ప్రశ్నించడంతో యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తెల్లారగానే ఎదురుగా ఉన్న దుకాణంలో పనిచేస్తున్న మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుకాణంలో ఉండగానే నోటి నుంచి నురగలు వస్తుండటంతో షాపు యజమాని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చికిత్స చేయిస్తున్నారు. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. సదరు పాల దుకాణం నిర్వాహకురాలు తనపై చెప్పలేని నిందలు మోపిందని, ఇందుకు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం లేదని చెబుతోంది. కాగా అదే వీధిలో దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు సినిమాహాల్, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. సినిమాహాల్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా గొడవలు, కేకలతో చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా ఉందని ఆరోపిస్తున్నారు. కానీ ఏమాత్రం వారి జోలికి వెళ్లినా లేనిపోని గొడవల్లోకి లాగుతారేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనకు సంబంధం ఉన్నా లేకున్నా ఈవీధిలో అల్లరి మూకలను అదుపు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై అశ్వారావుపేట ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా షాపింగ్ కాంప్లెక్స్పై నిఘా పెంచుతామన్నారు. -
ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో..
-
ప్రేమ వేధింపులకు బాలిక బలి
సాక్షి, మైసూరు: ప్రేమించాలంటూ యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దక్షిణ గ్రామీణ పోలీసుల కథనం మేరకు... మైసూరు తాలూకాలోని రమ్మనహళ్లి గ్రామానికి చెందిన రజని(16) పీయూసీ చదువుతుండేది. అదే కాలేజీకి చెందిన ఇంటి పక్కనే ఉంటున్న దొడ్డస్వామి అనే యువకుడు తనను ప్రేమించాలంటూ బాలికను వేధించేవాడు. తనకు ఇష్టం లేదని తిరస్కరించినా వెంటపడి సతాయించేవాడు. ప్రేమించకపోతే తనతో కలసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరిచేవాడు. దీంతో మనస్థాపం చెందిన రజనీ ఆరు నెలల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లితండ్రులు రజనిని కే.ఆర్.ఆసుపత్రికి తరలించగా కోమాలోకి వెళ్లింది. ఈక్రమంలో రజనీ బుధవారం మృతి చెందింది. ఇదిలా ఉండగా ఘటనపై దొడ్డస్వామిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్పై బయటకు వచ్చి అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. -
మానవ మృగం వికృత క్రీడ
తండ్రి బాధ్యత మరచి వదిలివెళ్లిపోతే.. తల్లే అన్నీ తానై పోషించింది. ఆ తల్లీబిడ్డకు ఏ అండా లేదని తెలుసుకున్న ఓ మృగం బాలికపై కన్నేశాడు. సమయం దొరికినప్పుడల్లా అనుభవించాడు. ఆపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. * బాలికతో వివాహేతర సంబంధం * ఆపై అనుమానించి చితకబాదిన వైనం * అడ్డుకోబోయిన తల్లిపైనా విచక్షణారహితంగా దాడి * అవమానం తట్టుకోలేక బాధితురాలి బలవన్మరణం * కేసు నుంచి బయటపడేందుకు ఆత్మహత్యాయత్నం గుమ్మఘట్ట : అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీపీ గ్రామానికి చెందిన ఆషాబీ(15) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన తల్లిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత సోదరుడు బెస్త రఘు దాడి చేసి కొట్టడాన్ని అవమానంగా భావించిన ఆ బాలిక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. తన బిడ్డ చావుకు కారణమైన రఘుపై చర్యలు తీసుకోవాలని ఆషాబీ తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కథనం ప్రకారం... భర్త నిరాదరణకు గురై... బీటీపీకి చెందిన గోరీబీ వివాహం రాయదుర్గానికి చెందిన నజీర్తో 18 ఏళ్ల కిందట అయింది. వారికి ఆషాబీ పుట్టింది. ఆమె పుట్టిన కొన్నాళ్లకే భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి గోరీబీ తన కుమార్తెతో కలసి పుట్టింట్లోనే ఉంటోంది. తల్లీ కూలి పనులకు వెళ్తుండగా, కుమార్తె కూడా కుట్టు పని నేర్చుకుంది. వచ్చిన బొటాబొటీ డబ్బులతో ఇద్దరు ఉన్నదాంట్లోనే తిని బతుకున్నారు. కన్నేసిన కామాంధుడు తల్లీబిడ్డలకు మగ దిక్కు లేదని గ్రహించిన బెస్త రఘు అనే కామాంధుడు ఆషాబీపై కన్నేశాడు. కొంతకాలంగా తల్లి లేని సమయంలో ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ విధంగా ఆ బాలికను లొంగదీసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఆమెను వదిలేవాడు కాదు. మేనమామ ఇంటికి వెళ్లడంతో... సోమవారం రాత్రి ఆషాబీ తన మేనమమా ఇంటికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు రఘు గోరీబీ ఇంటికెళ్లాడు. ఆ సమయంలో తల్లీబిడ్డ లేకపోవడంతో ఆవేశానికి లోనయ్యాడు. అరగంట తరువాత వారిద్దరూ ఇంటికి రాగానే వారితో పాటు లోనికెళ్లాడు. గడియపెట్టి ‘ఎవర్నడిగి వెళ్లావ్. అంతా నీ ఇష్టమేనా? అంటూ గద్దించాడు. దీంతో గోరీబీ అభ్యంతరం తెలిపింది. మా ఇష్టం. నువ్వెరు చెప్పడానికంటూ ఆమె నిలదీసింది. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటకెళ్లంటూ హెచ్చరించింది. మగ దిక్కు లేదని మాపై ఏమిటీ నీ దౌర్జన్యమంటూ ప్రశ్నించింది. ఆమె మాటలు ఆ మృగంలో మరింత ఆక్రోశాన్ని పెంచాయి. అంతే ఆవేశంతో ఊగిపోయాడు రఘు. తల్లీ ఎదుటే ఆషాబీని గొడ్డును బాదినట్లు బాదాడు. అడ్డుకోబోయిన తల్లినీ చితకబాదాడు. రాత్రి వేళ రాద్ధాంతం చేయడంతో ఇరుగు పొరుగు వారు పోగయ్యారు. అవమానభారం తట్టుకోలేక.. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆషాబీ విషపు గుళికలు మింగింది. వెంటనే ఆమెను గుమ్మఘట్ట పీహెచ్సీకి, అక్కడి నుంచి రాయదుర్గం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే ఆషాబీ ప్రాణం విడిచింది. భయంతో ఆత్మహత్యాయత్నం ఆషాబీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న రఘు మంగళవారం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే అనుమానంతో భార్యను కూడా చంపుకున్నాడనికేసు తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో బెస్త రఘు మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలాంటి అనుమానాలతోనే భార్యను కూడా చంపుకున్నాడని, తన కూతురు చావుకు కారణమైన రఘుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘుపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రసాద్ తెలిపారు.