gopi murdered
-
యువకుడి దారుణ హత్య
పెద్దకూరపాడు: గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలంలోని తాళ్లూరు, కాశిపాడు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఓ యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. కంభవరం గ్రామానికి చెందిన గోపి (25)ని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా... వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
శ్రీకాళహస్తిలో వ్యక్తిని హత్య చేసిన దుండగులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో గోపీ అనే వ్యక్తిని కొందరు దుండగులు హత్య చేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గోపీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మృతుడు శ్రీకాళహస్తి పట్టణంలో ఆప్టికల్ షాపు నిర్వహిస్తున్నాడని తెలిపారు. మృతుడికి సంబంధించి వివరాల కోసం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.