Govt college
-
17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్
-
ఆ హైస్కూల్లో ఒంటిగంటకే ఫైనల్ బెల్
రాజంపేట: మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్కు రోజూ ఒంటిపూట బడే. అన్నమయ్య జిల్లా నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఒంటిపూటే నడిచే ఏకైక హైస్కూల్గా రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్ హైస్కూల్.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్ సెకండరీ హైస్కూల్గా ఆవిర్భవించింది.ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. జూనియర్ కళాశాల రాకతో హైస్కూల్ విద్యకు గ్రహణంనందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్ కళాశాలను ఇక్కడికి మార్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్ యాజమాన్యం మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారువ్యతిరేకిస్తున్న అధ్యాపకులుఏదో ఒక పూట వస్తున్నాం..పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఇంటర్ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది.కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో, ఇంటర్ ఆర్జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా...ఐఏఎస్లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్గా ఈ ఇది ఖ్యాతి గడించింది. -
‘ప్రభుత్వ డిగ్రీ’తో ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి : ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ‘ప్లేస్మెంట్ల’లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. డిగ్రీతో పాటు జవహర్ నాలెడ్జ్ సెంటర్లు(జేకేసీ), నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను పొందుతుండటంతో డిగ్రీ చివరి ఏడాదిలోనే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో ఏకంగా 539 జాబ్ డ్రైవ్ల ద్వారా చరిత్రలో తొలిసారిగా 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు పొందడం విశేషం. గతంలో విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశాలు మాత్రమే అందేవి. బయట ఉద్యోగాలకు వెళితే నైపుణ్యాలు లేవన్న కారణంతో పరిశ్రమలు తిరిస్కరించేవి. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. బీటెక్ వంటి ప్రొఫెషనల్ విద్యలోనే కాకుండా నాన్–ప్రొఫెషనల్ డిగ్రీల్లోనూ 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశారు. ఫలితంగా డిగ్రీ చదువుతున్న సమయంలోనే విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. మార్కెట్ ఓరియెంటెడ్ నైపుణ్యం దేశంలోనే నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రతి విద్యారి్థనిని ‘జాబ్ రెడీనెస్’ ఓరియెంటేషన్తోనే సన్నద్ధం చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేస్మెంట్ సెల్ ద్వారా 17 రంగాల్లో నైపుణ్యాలు అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రబ్బర్ అండ్ పెట్రోలియం కెమికల్స్, ఫుడ్ ప్రొసెసింగ్, ఎల్రక్టానిక్స్, టూరిజం–హాస్పిటాలిటీ, క్యాపిటల్ గూడ్స్, మేనేజ్మెంట్ ఎంట్రప్రెన్యూర్íÙప్, గ్రీన్జాబ్స్, రిటైల్ సెక్టార్ వంటి రంగాల్లో మార్కెట్ ఓరియెంటెడ్ స్కిల్స్ను పెంపొందిస్తూనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సుమారు 500 కంపెనీలను సమన్వయం చేస్తూ ఒకేసారి దాదాపు 30 వేల ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. కళాశాల విద్యాశాఖ ప్రత్యేక జాబ్ పోర్టల్ను, యాప్ను తయారు చేసింది. 165 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్లుగా విభజించి ప్లేస్మెంట్ డ్రైవ్లు కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన కళాశాలల్లో నోడల్ రిసోర్స్ సెంటర్ల పేరుతో ప్లేస్మెంట్ సెల్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మొదటి రెండేళ్లు విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తోంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘నైపుణ్యాల పెంపు’ సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. గడిచిన రెండేళ్లలో 2,000 మంది విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లను పూర్తి చేశారు. మరో 2,500 మంది అధ్యాపకులు, విద్యార్థులు సిస్కో ఎడ్యూస్కిల్ కోర్సులు, 7,700 మంది ఐఐటీ ముంబయి సహకారంతో స్పోకెన్ ట్యూటోరియల్స్ కోర్సుల ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో.. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని ఎక్కడికో వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కల్పిస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది కెమికల్ ఇండస్ట్రీలో డాక్టర్ రెడ్డీస్, హెటిరో, అరబిందో, డెక్కన్గ్రూప్, రిటైల్ విభాగంలో ఫ్లిప్కార్ట్, డీమార్ట్, ఈ–కామ్ ఎక్స్ప్రెస్, అమెజాన్, జాయలుక్కాస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, స్టార్టెక్ హెల్త్తో పాటు ఫార్మాలో అపోలో, మెడ్ప్లస్, బ్యాంకింగ్లో ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీలో ఎఫ్ట్రానిక్స్, టెక్బియం, హెచ్1హెచ్ఆర్తో పాటు ట్రాన్స్పోర్టు, మీడియా, ఎడ్యుటెక్, ఫైనాన్స్ రంగాల్లో అనేక కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా హెచ్సీఎల్, టీసీఎస్, డెలాయిట్, స్టేట్స్ట్రీట్ వంటి సంస్థల్లోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు. విద్యతో పాటే ఉద్యోగం.. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధిని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం కరిక్యులమ్లో మార్పులు తెచ్చింది. తరగతి బోధనతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎనలిటికల్ థింకింగ్ పెంపొందించేలా చర్యలు చేపట్టాం. కళాశాలల్లో ప్లేస్మెంట్ సెల్స్ ఏర్పాటు చేసి ఏటా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధిని చూపుతున్నాం. గతేడాది ఆగస్టు వరకు వివిధ ప్రదేశాల్లో ప్లేస్మెంట్ డ్రైవ్లు నిర్వహించాం. సుమారు 18 వేల మందికి పైగా వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. – పోలా భాస్కర్, కమిషనర్, కళాశాల విద్య -
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ..
హుజూర్నగర్/మంచిర్యాల అర్బన్/సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్ సురేంద్ర కుమార్ పెయింటర్ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. కూలీ బిడ్డ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్లో మల్టీ పర్పస్హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్ ఫలితాల్లో ఎంపీహెచ్డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. అత్యధికం 994! ఇంటర్లో 994 మార్కులు టాప్ర్యాంక్గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్కు చెందిన పి.రాజేశ్ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్ బోర్డ్ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. ► నిజామాబాద్కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. ► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్ వర్ష (బైపీసీ), సీహెచ్ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు. ► ఖమ్మంలోని ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది. ► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి. ► నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్కు చెందిన అదీబానాజ్ 462/470 మార్కులు సాధించింది. చదవండి: అమ్మాయిలదే హవా -
TS Inter Results: గురుకులాలు భేష్.. ప్రభుత్వ కాలేజీలు డౌన్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంక్షేమ గురుకుల సొసైటీలు సత్తా చాటాయి. కార్పొరేట్ కాలేజీల కంటే దీటైన మార్కులను సొంతం చేసుకున్నాయి. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) నుంచి ఫస్టియర్, సెకండియర్లో అత్యధిక మార్కులు సొంతం చేసుకున్నారు. టాప్ 10లో సగం ర్యాంకులు ఈ సొసైటీకే సొంతమయ్యాయి. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే.. గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం తగ్గిపోయింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ కేవలం 40 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. రెండో ఏడాది కూడా 54 శాతమే పాసయ్యారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్) 92శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో నిలబడింది. వివిధ వర్గాలకు చెందిన గురుకుల కాలేజీల్లోనూ విద్యార్థులు ఎక్కువ మంది పాసయ్యారు. కానీ మోడల్ స్కూళ్లలో మాత్రం ఫ్యాకలీ్టలోపం వల్ల ఉత్తీర్ణత శాతం 66కు మించలేదు. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈసారి 63 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. కార్పొరేట్కు దీటైన ఫలితాలివి: మంత్రి గంగుల ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలకు దీటైన ఫలితాలను గురుకుల పాఠశాలలు సాధించాయి. బీసీ గురుకుల సొసైటీ నుంచి అద్భుతమైన ర్యాంకులు రావడం ఆనందకరం. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో మందమర్రికి చెందిన హరిత 468 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు కొట్టింది. ఇక సికింద్రాబాద్కు చెందిన భూమిక 467 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఇంతటి అద్భుత పలితాలు సాధించిన సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ఉన్నత అవకాశాల్లోనూ ముందే..: మంత్రి కొప్పుల ఉత్తమ ఫలితాల్లోనే కాకుండా ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్న వారిలో గురుకుల విద్యార్థులుంటున్నారు. ఈసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గురుకులాలను నిర్వహిస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయి. పేదల విద్యకు ప్రాధాన్యత:మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో తెరిచి పేదలకు కేజీ టు పీజీ విద్య అందించే లక్ష్యాన్ని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా గురుకులాలు రికార్డులు సాధిస్తున్నాయి. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందునే గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. ప్రయాణికులకు గుడ్న్యూస్ -
ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్నగర్, మెదక్తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్కు పంపగలంఅని ఇంటర్ బోర్డ్ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి. స్పాట్కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ముదురుతున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఇక చర్యలు తప్పవు మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్ కాలేజీలు రిలీవ్ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. –ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆందోళన తప్పదు మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. –మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ అధ్యాపకులే లేరు.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో? –అయినేని సంతోష్కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
‘నీట్’ టాపర్స్లో మనవాళ్లు నలుగురు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు బుధవారం విడుదలైన నీట్ ఫలితాల్లో టాప్–50లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మన రాష్ట్రానికి చెందిన ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మరో విద్యార్థి సొదం శ్రీనందన్రెడ్డి 685 మార్కులే సాధించి 42వ ర్యాంక్ పొందాడు. తెలంగాణకు చెందిన మాధురిరెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మన రాష్ట్రం నుంచి 57,798 మంది నీట్కు దరఖాస్తు చేసుకోగా 55,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 70.72 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్–2018లో 72.55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. నీట్లో ఉత్తీర్ణతా శాతం ఆధారంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా ఈసారి 134కు పెరిగింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో ఎక్కువ మంది 500 మార్కులకు పైగానే సాధించారు. అయితే గతేడాది కంటే ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు తగ్గాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లీనాకు గతేడాది 464 మార్కులు రాగా జాతీయ స్థాయిలో 37,050వ ర్యాంక్ వచ్చింది. లీనా ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించినా ర్యాంకు 49,261కి చేరింది. ఇలా చాలామంది 500 మార్కులు దాటినా సీటు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భారీగా మార్కులు సాధించినా అంచనాకు తగ్గట్టు ర్యాంకులు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 16.98 మంది పోటీలో ఉన్నారు. గతేడాది కంటే ఈసారి పోటీ మరింత పెరిగింది. తుది ‘కీ’ తో అన్యాయం మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జూన్ 1 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని ప్రకటించింది. దీనిపై విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు చెబుతున్నారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని అంటున్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో మన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయంటున్నారు. ఇలా 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు విద్యార్థులు కోల్పోయారని వివరించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందంటున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 40 పర్సంటైల్గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వీటన్నింటినీ అలిండియా కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. నిపుణుల అంచనా ప్రకారం.. నీట్లో జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీట్లో 470 నుంచి 480 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్డియాలజిస్టునవుతా నీట్ ఏడో ర్యాంకర్ జి.మాధురీరెడ్డి శిరివెళ్ల: నీట్–2019 ఫలితాల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన గంగదాసరి మాధురీరెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఏపీ ఎంసెట్లోనూ 5వ ర్యాంకుతో సత్తా చాటింది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ మెడికల్ అకాడమీలో చదువుతూ నీట్ రాసిన మాధురి 720 మార్కులకు గాను 695 మార్కులు సాధించి సత్తా చాటింది. ఢిల్లీ ఎయిమ్స్లో చేరతానని, కార్డియాలజిస్టు కావడమే తన లక్ష్యమని తెలిపింది. మాధురి తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. రేడియాలజిస్టునవుతా నీట్ 40వ ర్యాంకర్ భానుతేజ సాక్షి, విశాఖపట్నం: నీట్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన భానుతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించాడు. విశాఖ చైతన్య కళాశాలలో ఇతను ఇంటర్మీడియట్ చదివాడు. ర్యాంకు వచ్చిన సందర్భంగా భానుతేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ర్యాంకు సాధించడానికి రెండు నెలల పాటు రోజుకు 15 గంటలు కష్టపడి చదివాను. నీట్ రాశాక 500 లోపు ర్యాంకు వస్తుందని భావించాను. 40వ ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మ సూర్యమణి విశాఖ కేజీహెచ్లో డాక్టర్. నాన్న శ్రీకాకుళంలో ఎంవీ ఇన్స్పెక్టర్. అక్కలు ఇద్దరూ వైద్యులే. నాకు చిన్నప్పట్నుంచి రేడియాలజీ అంటే ఇష్టం. అందుకే భవిష్యత్తులో రేడియాలజిస్టునవుతాను. నాకు ఉత్తమ ర్యాంకు రావడంలో నా తల్లిదండ్రులు, చైతన్య కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం ఉంది.’ అని వివరించాడు. శ్రీనందన్రెడ్డికి ఫిజిక్స్లో 180కి 180 కడప ఎడ్యుకేషన్: నీట్లో కడపకు చెందిన శ్రీనందన్రెడ్డి 42వ ర్యాంకు సాధించాడు. అంతేకాకుండా ఫిజిక్స్ సబ్జెక్టులో ఇతను 180కి 180 మార్కులు సాధించాడు. శ్రీనందన్రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇతను కడపలోని సంకల్ప కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. శ్రీనందన్రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు రామిరెడ్డి, ప్రసూన, సంకల్ప్ డైరెక్టర్ వంశీ హర్షం వ్యక్తం చేశారు. -
ఆకలి చదువులు
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటిస్తున్నా.. అమలుకు నోచుకోవడంలేదు. జూలైలో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పలు అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. ఇంటర్ విద్యార్థులతో పాటు డిగ్రీ, డైట్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు గడుస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేకుండా పోయింది. పథకం ఎప్పుడు అమలు చేస్తారో అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవడానికి ఆయా మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. దీంతో మధ్యాహ్న భోజనం కళాశాలలో అందిస్తే రెండుపూటలు కళాశాలలో ఉండి చదువుకునే వీలుంటుంది. కొంతమంది టిఫిన్ బాక్సులు తీసుకొస్తుండగా, మరికొంత మంది పస్తులుండి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా మూడు డిగ్రీ కళాశాలలు, ఒక డైట్ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్లో దాదాపు 5 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో దాదాపు 8 వేల వరకు విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాలలో 2వేల మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ప్రతీ రోజు ఉదయం కళాశాలకు చేరుకోవాల్సి ఉండడంతో అల్పాహారం తీసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం టిఫిన్ బాక్సులు సైతం తీసుకురావడానికి సమయం దొరకకపోవడంతో వారు మధ్యాహ్నం పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడంతో అనారోగ్యానికి గురవుతారని వైద్యులు పేర్కొంటున్నారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య.. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఉదయం పూట హాజరు శాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా మంది విద్యార్థులు ఆకలిని తట్టుకోలేక ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం తగ్గి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపుతోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కొంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పస్తులుండి ఆటలాడుతూ కనిపిస్తుంటారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే సర్కారు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. గత రెండేళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అమలుకు నోచుకోవడంలేదు. ఇంటి నుంచి కళాశాలకు నడిచిరావడంతో ఉదయం 9 గంటలకే బయల్దేరాల్సి వస్తోంది. దీంతో టిఫిన్ బాక్సులు తీసుకురాలేని దుస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఆకలి కారణంగా చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నాం. కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే నాలాంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.– నందన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడంతో టిఫిన్ బాక్సు తెచ్చుకోని వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. – జి.లావణ్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ -
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్) కోసం నాంపల్లి బజార్ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరల్ ఫౌండేషన్ కోర్సు(జీఎఫ్సీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ), డైరీయింగ్లలో ఖాళీలు ఉన్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. జీఎఫ్సీకి ఎంఏ ఎకనామిక్స్, ఎంఎల్టీకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, డైరీయింగ్కు వెటర్నిటీ సైన్స్ చేసిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
-
వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నాంపల్లి బజార్ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఏఈటీ), ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఈఈటీ), ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ఈటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ), డైరీయింగ్, టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్, అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్(ఓఏ), రిటైల్ మేనేజ్మెంట్(ఆర్ఎం), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్ పాస్, ఫెయిలైన వారు అర్హులని వెల్లడించారు. మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉంటాయన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పారు. వివరాలకు 9395554558 నంబర్లో సంప్రదించవచ్చు. -
పరీక్షలకు దూరం..!
బేల(ఆదిలాబాద్) : దూరభారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షగా మారింది. ఫలితంగా ఉన్నత విద్యను అర్ధంతరంగా ముగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. మారుమూల సరిహద్దు మండలం బేల. ఉన్నత విద్య కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని బేలకు వచ్చి ఇక్కడి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. స్థానిక ప్రముఖుల చొరవతో 2014–15లో మండల కేంద్రంలో ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. గతంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారు, రెగ్యులర్ విద్యార్థులు ఇక్కడే ప్రవేశాలు పొందుతున్నారు. ఇంగ్లిషు మీడియం అయినప్పటికీ సమీపంలో ఉండడంతో మరాఠీ, గిరిజన విద్యార్థులు ప్రవేశాలు తీసుకున్నారు. 220 మంది డిగ్రీ విద్య అభ్యసిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సౌకర్యాలు అంతగా లేకున్నా.. ఇబ్బందులను అధిగమించి వస్తున్నారు. పరీక్షల కోసం జిల్లా ఆదిలాబాద్లోని కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. గతేడాది నుంచి ప్రభుత్వం సెమిస్టర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. దీంతో ఒక విద్యా సంవత్సరంలో కచ్చితంగా రెండు పరీక్షలు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి రోజు పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి రావడానికి ఎంతో సమయం పడుతోంది. గ్రామాల నుంచి విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాలేక చదువును అర్ధంతరంగా మానేస్తున్నారు. 2015–16 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం పరీక్ష రాసిన వారి సంఖ్య 120 ఉండగా.. 2016–17లో 100కు తగ్గింది. ఈ విద్యా సంవత్సరంలో 58 పడిపోయింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంఖ్య సైతం 100కు తగ్గింది. నిర్మల్ జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలకు అనుమతి.. మారుమూల మండల కేంద్రాల్లో ప్రైవేటు డిగ్రీ కళశాలలు ఉన్న చోట కాకతీయ యూనివర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రాలకు స్థానికంగా అనుమతి ఇస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్మల్ జిల్లాలోని కల్లూర్లోని ప్రైవేటు డిగ్రీ కళశాలకు సమీప ప్రభుత్వ జెడ్పీఎస్ఎస్లో పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చారు. లక్ష్మణచాందలోని కళశాలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళశాలలో పరీక్ష కేంద్రం అనుమతి లభించింది. పేద విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి యూనివర్సిటీ అధికారులు బేలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు, పోషకులు కోరుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయిన. మాది కూలీ కుటుంబం. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఉన్నదని, ఇష్టపడి చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి ఇక్కడి రావాలంటే ఎటువంటి వాహనాలు ఉండవు. చదువుకోవాలని ఆసక్తితో రెండు కిలోమీటర్లు కాలినడకన వస్తున్నాను. ఆదిలాబాద్కు వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోయినా. ఇప్పుడు నా చదువు అర్ధంతరమేనో.– కైరి అశ్విని, బీఎస్సీ(బీజెడ్సీ) మొదటి సంవత్సరం, మోహబత్పూర్ నాన్నతో కలిసి పరీక్షలకు.. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయడానికి ప్రతి రోజు నాన్నతో కలిసి వెళ్లాను. నా స్నేహితులు వారి కుటుంబ సభ్యుల తోడు లేకపోవడంతో ఈ పరీక్షలు రాయడానికి రాలేదు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– మరప అశ్విని, బీకాం మొదటి సంవత్సరం, బెల్లూరిగూడ పరీక్ష కేంద్రం కోసం ప్రయత్నిస్తున్నాం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కళశాలకు సమీపంలో మండల కేంద్రంలో పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. భాష, రవాణా, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం సెమిస్టర్ విధానంతో రెండు సార్లు పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వెళ్లలేక విద్యార్థులు చదువు అర్ధంతరంగా మానేయడం బాధగా ఉంది. స్థానికంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తే విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.– వరప్రసాద్రావు, కీర్తన డిగ్రీ కళశాల బేల -
ప్ర‘యోగం’ లేదు
జిల్లావ్యాప్తంగా పలు ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ విద్యార్థులు అసౌకర్యాల నడుమ ప్రాక్టికల్స్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి. కొన్ని కళాశాలల్లో అవసరమైన సామగ్రి లేకపోవడం, మరి కొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాయచోటి రూరల్/కడప ఎడ్యుకేషన్: కొత్త ఆవిష్కరణలకు విద్యార్థి దశలోనే పునాది పడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంటర్లో ప్రయోగాత్మక విద్యను బోధించడం జరుగుతోంది. అధ్యాపకులు, ప్రయోగశాలలు లేకపోవడం, పరికరాలు, రసాయనాలు కొనుగోలుకు నిధులు మంజూరు కాకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. దీంతో వీరికి ప్రయోగాత్మక విద్య దూరమవుతోంది. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రయోగాలు అంతంత మాత్రంగానే సాగాయి. ప్రైవేటు కళాశాలల్లో కొంత వరకు ల్యాబ్లు, పరికరాలు ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల చెంతకు ప్రయోగాలు చేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగానే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 21 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 18356 మంది హాజరుకానున్నారు. వారి కోసం 61 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు ప్రాంతీయ ఇంటర్ విద్యాపర్యవేక్షణాధికారి ఎస్. రవి చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్స్లోనూ, పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తే తప్ప తదుపరి కోర్సుల్లో సీట్లు సాధించలేమన్న ఆలోచనల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. రాయచోటి విషయానికి వస్తే సుమారు 3600 మంది వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారు. అందులో అధిక శాతం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు మంది ప్రవేటు కళాశాలల్లో చదువుకుంటున్నారు. రాయచోటిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బాలికల జూనియర్ కాలేజీ, ఏఎన్ఎం అండ్ బీఆర్(ప్రతిభా) కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాల , సీఎన్ రాజు, కాకతీయ, అర్చన, ఎస్బీటీ, వీరభద్ర కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని కళాశాలల్లో పరికరాలు సరిగా లేకపోవడం, మరి కొన్నింటిలో ప్రయోగశాలలు అలంకారప్రాయంగా ఉండటం కనిపిస్తున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు దీంతో పరీక్షలు ఎలా రాయాలోనని విద్యార్థులు, ఇతర కళాశాలలల్లో వీరు ప్రాక్టికల్స్ ఎలా చేస్తారోనన్న భయం యాజమాన్యంలో నెలకొంది.జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలని గతంలో పలువురు డిమాండ్ చేయడం తెలిసిందే. ప్రాక్టికల్స్కు సిద్ధంగా ఉన్నాం అధ్యాపకులు గత కొంత కా లంగా కళాశాలలో ఉన్న ప్రయోగశాలలో మాకు ప్రాక్టికల్స్ నేర్పించారు. ప్రస్తుతం అన్ని ర కాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రారం భం కానున్న ప్రాక్టికల్స్కు సిద్ధంగా ఉన్నాం. -వీరాంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి, రాయచోటి సౌకర్యాలు ఉన్నాయి మాది పాత ప్రభుత్వ జూని యర్ కళాశాల. ఇక్కడ అన్ని రకాల ప్రయోగశాలలు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులకు అన్ని రకాల ప్రయోగాలను చెప్పడం జరిగింది. సిలబస్ పూర్తి చేసి, ప్రాక్టికల్స్కు పిల్లలను సిద్ధం చేశాం. –కె.కె. రావు, జువాలజీ అధ్యాపకులు , ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాయచోటి ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం ఫిబ్బవరి 1వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ను నిర్వహిస్తాం. అన్ని సెంటర్లలో ప్రయోగశాలలు ఉన్నాయి. ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించాం. ప్రయోగశాలలు సరిగా లేని కళాశాలల విషయం మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్. రవి, ప్రాంతీయ ఇంటర్విద్యా పర్యవేక్షణాధికారి, వైఎస్సార్ జిల్లా -
లెక్చరర్గా మారిన ఎమ్మెల్యే రోజా
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
మధురానగర్ : 16 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్స్గా పనిచేస్తున్న లెక్చరర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం ప్రభుత్వ కళాశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామన్నారు. జీతాలు చాలక కుటుంబాలు అర్ధాకలితో, పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన పాలకులు నేడు తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలుచేయని ప్రభుత్వాలు, తమను క్రమబద్ధీకరించటానికి మాత్రం సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పిందంటూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీఓ 16 ప్రకారం 2–94 యాక్ట్ను సవరించిందని, ఏపీలో తమ గురించి ఆలోచించిన వారే కరువయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జీతాలను రెట్టింపు చేసుకునేందుకు నిధుల సమస్యలు లేవని తమ వేతనాలు పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి నిధుల కొరత కనిపించడం హేయమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశామని, 21 నుంచి 23 వరకు పోస్టుకార్డు ఉద్యమం, 24, 25 తేదీలలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించటం, 28న కలెక్టరేట్వద్ద ధర్నా, డిసెంబర్ 1న కుటుంబ సభ్యులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 2 నుంచి నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు జాన్సన్, విజయశ్రీ,, రాంబాబు, సుధాకరన్, జ్యోతి, సునీత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పెచ్చులూడి పడి విద్యార్థినికి గాయాలు
గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ క్లాస్ రూమ్ పైకప్పు ఊడిపడి ఒక బాలిక గాయపడింది. మంగళవారం ఉదయం తరగతి గ దిలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని గాయపడింది. దాంతో విద్యార్థులు క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ త్వరలో తరగతి గదులకు మరమ్మతు చేస్తామని చెప్పారు.