బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో పథకాలు పక్కదారిపట్టాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిధులు దుర్వినియోగం కావడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
సోమవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామజ్యోతి సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు.