Advertisement
Heavy flood
-
పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి
-
Yamuna River Waterlogging Images: యమునా ఉగ్రరూపం.. ఢిల్లీ వెన్నులో వణుకు (ఫొటోలు)
-
వారెవ్వా..వరదలో ప్రాణాలకు తెగించి సాయం చేసారు
-
భారీ వరదల్లో కొట్టుకుపోయిన వాహనం.. అందులోని వ్యక్తి ఏం చేశాడో చూడండి
-
బెంగళూరులో వర్ష బీభత్సం.. వరద నీటితో నగరం అల్లకల్లోలం (ఫొటోలు)
-
లంక గ్రామాల్లో వరద కష్టాలు
-
కృష్ణా నదికి పోటెత్తిన వరద (ఫొటోలు)
-
భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం
-
హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు
-
కృష్ణా నదికి అకస్మాత్తుగా పెరిగిన వరద
-
తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత..
సాక్షి, కర్నూలు: శ్రీశైలం డ్యామ్కు భారీగా వరద నీరు చేరుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 7.37 లక్షల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7.79 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ స్థామర్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 193 టీఎంసీల నీరు డ్యామ్లో ఉంది. శ్రీశైలం డ్యామ్కు నీరు విడుదల.. తుంగభద్ర జలాశయానికి భారీ వరదల నేపథ్యంలో 33 గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేశారు. 2,24,539 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్కు చేరుతోంది. ఇన్ ఫ్లో 2,10,282 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,24,539 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 88.661 టిఎంసిలుగా ఉంది. తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాచలంలో వరద తగ్గుముఖం.. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 34 .8 అడుగులుగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 11.7 అడుగులుగా నమోదైంది. కాటన్ బ్యారేజ్ నుండి 9 లక్షల 97 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. -
మిడ్ మానేరుకు గండి
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్ట్ కట్టకు గండిపడింది. ఎగువ మానేరు నుంచి భారీగా వస్తున్న వరదతో మిడ్ మానేరు మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులను దిగువ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలతో పొటెత్తిన వరదల కారణంగా భారీ మొత్తంలో ప్రవాహం వచ్చి డ్యాంలో చేరడంతో అనూహ్యంగా డ్యాం మట్టికట్టకు గండి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తమయ్యారు. గండి పడిన ప్రాంతాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావు, జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రులు భరోసానిచ్చారు. మానేరు డ్యామ్కు 5 లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉందన్నారు. నాలుగు గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. త్వరలోనే గ్రామస్తులకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెప్పారు. కొదురుపాక, మన్వాడ, రుద్రవరం గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గండిపడిన కారణంగా సిరిసిల్ల-కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు తరలించారు. సహాయక చర్యలను ప్రారంభించారు. మరోపక్క, మిడ్ మానేరు వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. -
పశ్చిమబెంగాల్నుముంచెత్తిన వరదలు
-
అమృతధారతో వచ్చిన ఆపద్బాంధవుడు
చెన్నై: భీకర వరదల్లో చిక్కుకొని ఆకలిదప్పికలతో అలమటిస్తున్న చెన్నైవాసులు.. అన్నంమాట దేవుడెరుగు, గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అల్లాడిపోతుంటే ఆపద్బాంధవుడిలా వచ్చాడు బెంగళూరుకు చెందిన దినేశ్ జైన్. ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చే ‘ప్యూరిఫికేషన్ ప్లాంట్’ ట్రక్కును తనతో తీసుకొచ్చాడు. ఔత్సాహిక వ్యాపారవేత్త అయిన దినేశ్ జైన్ వ్యాపారం కోసం కాకుండా కేవలం మానవతా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చానని మీడియాకు తెలిపాడు. ‘అమ్మ’ పెట్టదూ.. పెట్టనివ్వదు..: రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే తన ప్యూరిఫికేషన్ ప్లాంట్ ద్వారా 20 వేల లీటర్ల మురికి నీటిని మంచినీటిగా మార్చవచ్చని ఆయన తెలిపారు. వివిధరకాల ఫిల్టర్లు, ప్రెషర్ మెకానిజం ద్వారా వివిధ దశల్లో మురికిని తొలిగించి, మంచినీటిగా మారుస్తామన్నారు. అందులో 99.1 శాతం కలుషితాలు ప్రాసెస్ దశలోనే తొలగిపోతాయని చెప్పారు. బెంగళూరు నుంచి శుక్రవారమే చెన్నై నగరానికి చేరుకున్నప్పటికీ వరదనీటిని మంచినీరుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే నీటిని శుద్ధిచేసి వరద బాధితులకు ఉచితంగానే సరఫరా చేస్తానని చె ప్పాడు. స్థానికుల ఒత్తిడితో రంగంలోకి..: ఎంతకూ ప్రభుత్వ అధికారుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో స్థానికుల ఒత్తిడి మేరకు శనివారం నీటిశుద్ధిని ప్రారంభించాడు. తొలుత కొన్నిలీటర్ల వరద నీటిని మంచినీటిగా మార్చి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించానని, ల్యాబ్ రిపోర్టు రాగానే నీటిని ఉచితంగా అందజేస్తానని చెప్పాడు. వరదనీటిలో డ్రైనేజీ నీరు కూడా కలిసినందున పరీక్షలకు పంపి, సురక్షితమని తేలిన తర్వాతే బాధితులకు అందజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ప్యూరిఫికేషన్ ప్లాంటుకు ‘అమృత్ ధార’ అనే పేరు పెట్టుకున్నానని చెప్పాడు.