hero sivaji
-
చంద్రబాబు డిప్రెషన్లో ఉన్నాడు
-
డిప్రెషన్లో చంద్రబాబు...
సాక్షి, కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్రెషన్లో ఉన్నారని.. అందుకే మోదీపై తిరగబడాలంటూ మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం ఉదయం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ ఆయన(చంద్రబాబు) డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారు. అందుకే తిరగబడాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎన్నికల్లో సమయంలో 1200 వాగ్దానాలు చేశారు. కనీసం వాటిలో 10శాతం కూడా పూర్తి చేయలేదు. కానీ, బీజేపీ మాత్రం హామీల్లో సగం పూర్తి చేసింది. మిగతావి కూడా త్వరలోనే నెరవేరుస్తుంది. పోనీ అధికారంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటే.. ఎంత సేపు డబ్బులు వెనకేసుకోవటంలోనే బిజీగా అయిపోయారు. స్కూల్ యూనిఫామ్ క్లాత్లను చెన్నై నుంచి తెచ్చి అప్కోలో కొన్నట్లు చెబుతూ మోసం చేస్తున్నారు. చంద్రబాబు పక్కా కాంగ్రెస్ కోవర్టు. ఇప్పటికీ లాలూచీ పడుతూనే ఉంటారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారు’ అని వీర్రాజు విరుచుకుపడ్డారు. ఇక రాయలసీమ జిల్లాలకు కేంద్రం చేసిన సాయం గురించి వివరించిన ఆయన.. పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. రాయలసీమపై బీజేపీ కన్నబిడ్డపై చూపే ప్రేమను చూపుతుంటే.. బాబు మాత్రం సవతి ప్రేమను చూపిస్తున్నారన్నారు. సీమ ప్రజలకు ఇంత చేస్తే కేంద్ర ప్రభుత్వంపై తిరగబడాలంటూ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారంటూ చంద్రబాబును నిలదీశారు. హంద్రినీవా అంచనాలను పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ను అద్భుతంగా తీర్చి దిద్దినట్లు అసెంబ్లీలో ప్రకటించారని.. మళ్లీ ఇప్పుడు అదే అసెంబ్లీలో నిత్యం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం డ్యాష్ బోర్డ్ అనేది మొత్తం తప్పుల తడకేనన్నారు. శివాజీ ఆరోపణలపై... ఇక సినీ నటుడు శివాజీ బీజేపీపై చేసిన ఆరోపణలపై సోము వీర్రాజు స్పందించారు. శివాజీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే పిలిపించి.. ఆ ఆధారాలపై దర్యాప్తు ప్రభుత్వం చేపట్టాలి. కానీ, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటే అందులో అర్థం ఏంటని? ఆయన అన్నారు. దమ్ముంటే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన సవాల్ విసిరారు. -
ఆంధ్రుల దయాభిక్షతోనే అధికారం
బీజేపీపై సినీ హీరో శివాజీ ధ్వజం హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కేవలం ఏపీ ప్రజల దయాభిక్షతోనే అని.. ఇప్పుడు ఏరు దాటిన తర్వాత 14వ ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక ప్రతిపత్తిపై దాటవేత దోరణి ప్రదర్శిస్తున్నారని సినీ హీరో శివాజీ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి 10 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు రూ.1500 కోట్లు మంజూరు చేయించానని చెప్పుకుంటున్నారని అవి కొత్త రాజధానిలో 1000 కిలోమీటర్లు రోడ్డు వేసేందుకు కూడా సరిపోవన్నారు. సుజనాచౌదరి రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారని వాటి వివరాలు చెప్పాలన్నారు. -
టీటీడీ చైర్మన్ పదవిపై హీరో కన్ను!
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధ్యక్ష పదవిపై టాలీవుడ్ హీరో కన్నేశాడు. టీటీడీ చైర్మన పదవి తనకు దక్కుతుందని అతడు నమ్మకంగా చెబుతున్నాడు. అయితే పదవి కోసం తాను పైరవీలు చేయనని, పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీటీడీ చైర్మన్ గిరి రేసులో తానున్నాంటూ శివాజీ ప్రకటించడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులు ఉలిక్కి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదవిపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్లు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వస్తూనే చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని టీడీపీ సర్కారు రద్దు చేసింది. పాత పాలక మండలి గడువుకు 11 రోజులకు ముందే ఈ నిర్ణయం తీసుకుంది. పాలక మండలిని రద్దు నెలన్నర కావొస్తున్నా ఇంతవరకు నూతన పాలక మండలిని నియమించలేదు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదన్న శివాజీ- టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చొవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అయితే బీజేపీ అతడికి హామీయిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అతడికి ఈ పదవి దక్కుతుందో, లేదో చూడాలి. -
బూచోడు ఎవరు...?