Hitech prostitution
-
పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. స్పా మాటున హైటెక్ వ్యభిచారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ నగరంలో భూతల స్వర్గాన్ని తలపించేలా స్పా, సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు నిర్వహిస్తున్నారు. బయటకు వేరే కలరింగ్ ఉన్నా లోపల మాత్రం పాడు పనులను ప్రోత్సహిస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచార దందా కొనసాగుతోంది. వీటి మాయలో పడి ఎంతోమంది జేబులకు చిల్లులు పడుతుండగా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె. రాణా నేతృత్వంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి విటులను అరెస్ట్చేసి కొందరికి ఈ మురికికూపం నుంచి విమక్తి కల్పించారు. మొదటి దశలో నగరంలో గుర్తించిన 190 స్పాలపై 18 ప్రత్యేక పోలీస్ బృందాలతో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న స్పాలను సీజ్ చేసి నిర్వాకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇందులో కొంతమంది విటులను అదుపులోకి తీసుకొని 28 మంది యువతులకు మురికి కూపం నుంచి విముక్తి కల్పించారు. వారిని వారి సొంత గ్రామాలకు పంపారు. అనధికారికంగా నిర్వహణ.. గతంలో చేసిన తనిఖీల్లో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. స్పా, మసాజ్ల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కొన్ని స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు, అందుకు తగిన ఆధారాలు సైతం లభించడంతో పోలీసులు అటువంటి వాటిపై ఉక్కు పాదం మోపారు. రెండో దశలో పోలీసు నిఘా ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ఓ హైటెక్ స్పా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. దీనిపై పోలీసులు పక్కా స్కెచ్తో బందరురోడ్డులో స్టింగ్ అపరేషన్ చేసి అక్కడ క్రాస్ మసాజ్ జరగుతున్నట్లు నిర్ధారించుకొన్నాక, రెవెన్యూ, లోకల్ పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులతో కలిసి దాడి చేసి స్పాను సీజ్ చేశారు. స్పా నిర్వాహకుడిని అరెస్ట్ చేసి, అక్కడ పట్టుబడిన యువతులను హోంకు తరలించారు. సెక్షన్ 18 కింద స్పాను ఖాళీ చేయించేలా అధికారులు హౌస్ ఓనర్కు నోటీసులు జారీ చేశారు. ఇవే కాకుండా గతంలో నగరంలో స్పాలకు వెళ్లిన అమాయకుల ఫొటోలను తీసి, బెదిరించి డబ్బులు గుంజుతున్న ముఠాలను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పాత భవనం.. లోపల భూతల స్వర్గం.. పైకి చూసేందుకు మూడు అంతస్తుల పాత భవనం అయినా లోపల మాత్రం భూతల స్వర్గాన్ని తలదన్నేలా వసతులున్నాయి. అధునాతన బాత్ సౌక్యరం కలిగి ఉంది. హైటెక్ సెక్యూరిటీ కార్డు సిస్టం ద్వారానే లోనికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మొదట స్పాలోకి వెళ్లగానే అందులో జరిగే కార్యకలాపాలు చూసుకొనేందుకు వీలుగా కస్టమర్లతో మాట్లాడేందుకు మేనేజరు, రిసెప్షనిస్ట్ ఉంటారు. వారు కస్టమర్కు వారి వద్ద ఉన్న వివిధ రకాల సర్వీసులను వివరిస్తారు. ఈ విధంగా కస్టమర్ తనకు కావాల్సిన సర్వీసును ఎంపిక చేసుకున్న తరువాత, వారు ఎంపిక చేసుకున్న సర్వీసుకు అనుగుణంగా రూమ్లకు రూ.3,700 నుంచి రూ.13,000 వరకు వసూలు చేస్తున్నారు. కస్టమర్కు కావాల్సిన సర్వీస్ను ఎంపిక చేసుకున్న తరువాత మేనేజర్ అక్కడ తన వద్ద ఉన్న ఉద్యోగిని, కస్టమర్తో రూమ్ లోపలికి పంపిస్తారు. రూమ్ లోపల కస్టమర్కు కావాల్సిన సరీ్వస్ చేసే సమయంలో కస్టమర్లను మాటల్లో దించి తన హావభావాలు, డ్రెస్ కోడ్తో రెచ్చగొట్టేలా చేస్తారు. స్పా ఉద్యోగి కస్టమర్కు వివిధ రకాలైన లైంగిక సరీ్వస్లను చెప్పి, వాటి ఖర్చుల కనుగుణంగా అదనంగా రూ. నాలుగు వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలన్నీ పోలీసు స్టింగ్ అపరేషన్లో వెలుగు చూసినట్లు సమాచారం. కఠిన చర్యలు తీసుకొంటాం నగరంలో స్పాలకు ఎలాంటి అనుమతులు లేవు. గత ఏడాది అక్టోబర్ నుంచి స్పాలపై నిఘా పెట్టి దాడులు చేయించాం. అందులో 15 స్పాలలో అసాంఘిక, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశాం. కొంత మంది అనుమతులు తీసుకొన్నామని చెబుతున్నా వాటిని అతిక్రమించి చేయకూడని పనులు చేస్తున్నారు. అటువంటి వాటిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొంటాం. నిబంధనల విరుద్దంగా కార్యకలాపాలు చేస్తున్న స్పాలపై దాడులు చేసి సీజ్ చేసి నిర్వాహకులను అరెస్టు చేశాం. – టి.కె. రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్. -
మసాజ్ పేరుతో యువతులతో వ్యాపారం
-
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం
చందానగర్: స్పా అండ్ బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని చందానగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గంగారంలోని సన్షైన్ స్పా అండ్ బ్యూటీపార్లర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు పట్టుపడ్డారు. వారి నుంచి రూ.15 వేల నగదు, 8 మొబైల్ ఫాన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మీకు ఎవరు కావాలి ? సినిమా యాక్టరా ? లేక...
ఇతర రాష్ట్రాల నుంచి మోడళ్ల దిగుమతి గంటకు రూ.10 వేలకు పైగా వసూలు మంగళగిరి చుట్టుపక్కల జోరుగా వ్యభిచారం టీడీపీ నేత అండతో ఓ మహిళ నిర్వాకం ‘సాక్షి’ చేతికి చిక్కిన ఫోన్ సంభాషణ ‘మీకు ఎవరు కావాలి? ముంబయి మోడళ్లా..? ఢిల్లీ భామలా..? లేక సినిమా ఆర్టిస్టులా..? లేదా బుల్లితెర అందగత్తెలా..? ఎవరైనా సిద్ధం.. విందు వినోదాలకు కూడా అమ్మాయిలు రెడీ... ఎవరి రేటు వారిదే... కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన అందమైన అమ్మాయిలూ సిద్ధంగా ఉన్నారు... మీరు సరే అనడమే ఆలస్యం...’ ఇదీ... మంగళగిరి ప్రాంతంలోని పలువురు ధనవంతుల సెల్ఫోన్లకు వస్తున్న మెసేజీల సారాంశం. రాజధాని నేపథ్యంలో ఖరీదైన ప్రాంతంగా మారిన ఇక్కడ అంతే కాస్ట్లీవ్యభిచారం సాగుతోంది. అధికార పార్టీ నేత అండతో ఓ మహిళ ఈ వ్యవహారాన్ని నడిపించడం గమనార్హం. రాజధానిగా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోక మునుపే ఇటువంటి వికృతాలకు కేంద్రం కావడం దురదృష్టకరం. సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరి కేంద్రంగా హైటెక్ వ్యభిచారం సాగుతోంది. ముంబయి మోడళ్లు, తెలుగు సినీ ఆర్టిస్టులు, బుల్లితెర నటులు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్న వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారు. ధనవంతులను ఎంపిక చేసుకుని వారి ఫోన్లకు వాట్సప్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపించి వారిని ముగ్గులోకి దించి నిత్యం లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేత అండతోనే.. ! ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో హైటెక్ వ్యభిచార గృహాలు నిర్వహించడంలో ఓ మహిళ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె గతంలో బీజేపీలో ఉన్నారు. అప్పట్లో మంగళగిరి ఇందిరానగర్లో కొంతకాలం అసాంఘిక కార్యకలాపాలు జరిపిస్తుండగా, పోలీసులుకేసులు కూడా నమోదు చేశారు. అప్పట్లో ఆమె ఓ బీజేపీ నాయకుడి అం డతో వ్యభిచార గృహం నడిపేవారు. అయితే ఆ నాయకుడు పోలీసులను మ్యానేజ్ చేయలేకపోవడంతో ఏకంగా ఆమె బీజేపీని వీడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నియోజకవర్గ నేత పంచన చేరారు. ప్రస్తుతం ఆయన కనుసన్నల్లో ఆమె హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రతిఫలంగా ఆ నాయకుడికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు తెలిసింది. బోనస్గా అందమైన అమ్మాయిలను పంపిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఖరీదైన వ్యక్తులు.. మరోవైపు అధికార పార్టీ నేత అండ ఉండడంతో ఆమెను పోలీ సులు ఏమీ చేయలేక నెలకు రూ.లక్ష వరకు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు సమాచారం. సినీ, టీవీ ఆర్టిస్టుల రాక.. ముంబయి మోడళ్లతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సినీ, టీవీ ఆర్టిస్టులను కూడా ఆమె పిలిపించి వ్యాపారం చేయిస్తున్నారు. మోడళ్లను ప్రత్యేకంగా పిలిపించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వద్దకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించి గంటకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ఖరీదైన వ్యక్తులకైతే వారి విందు, వినోదాలకు పంపించి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. చాలా మంది రాజకీయ నాయకులు తమ విందు, వినోదాలకు మోడళ్లను పంపాలని సదురు మహిళను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. అపార్టుమెంట్లలో యథేచ్ఛగా... విజయవాడ, గుంటూరు నగరాలకు మధ్యలో ఉన్న మంగళగిరి రాజధాని ప్రాంతంలో కీలకమైంది. ఆ ప్రాం తంలో రియల్ భూమ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు నివాసాలు ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అసాంఘిక కార్యకలాపాల జోరు కూడా ఈ ప్రాంతాల్లో పెరిగింది. జాతీయ రహదారి సమీపాన మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. టెక్నాలజీతోనే వ్యాపారం.. హైటెక్ వ్యభిచారానికి టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అమ్మాయిలు రాగానే వారి ఫొటోలను తమ కస్టమర్లకు వాట్సప్ ద్వారా పంపిస్తారు. వారు నచ్చారని తిరిగి మెసేజ్ పంపితే, ఆ తర్వాత రేటు చెబుతారు. యువతి అందచందాలను బట్టి రేటు నిర్ణయిస్తారు. నచ్చితేనే అపార్ట్మెంటు వద్దకు వాలిపోవాలి. అపార్ట్మెంటు వద్దకు వెళ్లి యువతులను చూసి వస్తానంటే అంగీకరించరు. ఆన్ లైన్లోనే వ్యాపారం సాగి స్తారు. ఒకవేళ నచ్చిన అమ్మాయిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఆ మహిళా నేత భర్తే వాహనం సమకూరుస్తారు. ఆయనే డ్రైవర్ అవతారమెత్తి కస్టమర్ చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్తాడు. వ్యభిచారం నిర్వాహకులు ఓ వ్యక్తితో వ్యాపారంపై జరిపిన ఫోన్ సంభాషణ ‘సాక్షి’ చేతికి చిక్కింది. -
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం
-
వ్యభిచారం గుట్టు రట్టు.. అదుపులో ముంబై మోడల్
హైదరాబాద్: పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి బంజారాహిల్స్లోని ఓ హోటల్పై దాడి చేసి హైటెక్ వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ హోటల్లోని రూం నం.407లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి 10.30కి సదరు హోటల్పై దాడి చేయగా, ముంబైకి చెందిన మోడల్తో పాటు ఒక విటుడు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హోటల్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. -
విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
విశాఖ : విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. బీచ్ రోడ్డు అఫిషియల్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి.. చైల్డ్ హోమ్కు తరలించారు. ఇక నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు