index
-
462 కంపెనీలపై దర్యాప్తు!
అనుమానాస్పద మోసపూరిత లావాదేవీల విషయమై కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు 462 కంపెనీలపై దర్యాప్తు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో కార్పొరేట్ మోసాలు పెరిగాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు (ఆర్డీలు), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అధికారులు సాధారణంగా మోసపూరిత లావాదేవీలపై దర్యాప్తు నిర్వహిస్తుంటారు. ఆర్డీలు, ఎస్ఎఫ్ఐవో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్న కేసుల వివరాలను కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభకు లిఖిత పూర్వకంగా అందించారు. 2019–2020 మధ్య ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 462 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించగా, ఎస్ఎఫ్ఐవో 72 కేసుల దర్యాప్తును చేపట్టినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శాఖ ఆర్డీలు 51 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలుబీఎస్ఈ నుంచి కొత్త ఇండెక్సులుస్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ అనుబంధ సంస్థ ఏషియా ఇండెక్స్ తాజాగా ఐదు సూచీలను ప్రవేశపెట్టింది. మార్కెట్ నుంచి బీఎస్ఈ 1000సహా మరో 4 ఇండెక్సులను రూపొందించింది. దీని ద్వారా మార్కెట్లో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలకు తెరతీసింది. దీంతో దేశీయంగా తదుపరితరం వర్ధమాన కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు కల్పించనుంది. బీఎస్ఈ 1000తోపాటు బీఎస్ఈ నెక్ట్స్ 500, బీఎస్ఈ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ నెక్ట్స్ 250 మైక్రోక్యాప్, బీఎస్ఈ 1000 మల్టీక్యాప్తో కొత్త ఇండెక్సులకు తెరతీసింది. మొత్తం దేశీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 93 శాతాన్ని బీఎస్ఈ 1000 ఇండెక్స్ ప్రతిఫలించనున్నట్లు ఏషియా ఇండెక్స్ ఎండీ, సీఈవో అశుతోష్ సింగ్ పేర్కొన్నారు. వెరసి మొత్తం స్టాక్ మార్కెట్కు ప్రామాణిక ఇండెక్స్గా ఇది నిలవనున్నట్లు తెలియజేశారు. -
Stock Market Trading: ఇండెక్స్ల్లో ట్రేడ్ చేస్తున్నారా...!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఈక్విటీలు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ అనే మార్గాలు ఉంటాయని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం కదా...ఇందులో ఫ్యూచర్స్ & ఆప్షన్స్... దానిలో ఇండెక్స్ ట్రేడ్ ల గురించి ఇప్పుడు చూద్దాం.వాస్తవానికి ఫ్యూచర్స్ కి, ఈక్విటీల్లో ట్రేడింగ్ కి పెద్దగా తేడా ఉండదు. ఈక్విటీ ల్లో షేర్లు గా వ్యవహరిస్తే... ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ) లో కాంట్రాక్టులు గా పేర్కొంటారు. ఈక్విటీల్లో మనం కొనే షేర్లు ఎన్ని సంవత్సరాలైనా అట్టేపెట్టుకోవచ్చు. షేర్లు అనేవి మన ఆస్తిగా భావించవచ్చు. కాంట్రాక్టులను మాత్రం ఆవిధంగా పరిగణించలేం. ఎఫ్ & ఓ లో కాంట్రాక్టులు కొన్నప్పుడు కేవలం ఒక నెల రోజుల వ్యవధికే పరిమితమవుతాయి.ఒకవేళ మనం కొన్న కాంట్రాక్టు మంచి లాభాల్లో ఉంటే ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. అదే నష్టాల్లో ఉంటే నెల రోజుల వరకు ఆగొచ్చు. అప్పటికీ నష్టాల్లోంచి బయట పడకపోతే కచ్చితంగా నెలాఖరున బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆ కాట్రాక్టు రాబోయే రోజుల్లో పెరుగుతుందనే నమ్మకం ఉంటే... ప్రస్తుతం చేతిలో ఉన్న కాంట్రాక్టు ను నెలాఖరున అమ్మేసి తదుపరి నెల కాంట్రాక్టు ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఈక్విటీల్లో ఒక్క షేర్ మొదలుకొని మన చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి ఎన్ని షేర్లు అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ & ఓ లో తప్పనిసరిగా లాట్స్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేరును బట్టి, ఇండెక్స్ ను బట్టి లాట్ సైజు ను నిర్ణయిస్తారు.ఉదా: రిలయన్స్ షేర్ ధర రూ. 1250 ఉంది. దీన్ని ఎఫ్ & ఓ లో కొనుగోలు చేయాలంటే 500 షేర్లు (1 లాట్) తీసుకోవాలి. అదే జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ 5625 (ఒక లాట్) షేర్లు కొనాలి. ఐటీసీ అయితే.. 1600 (ఒక లాట్) తీసుకోవాలి.ఎఫ్ & ఓ లో ట్రేడ్ చేయాలంటే కేవలం లాట్స్ లో అది కూడా పరిమిత కాలానికి మాత్రమే కొనగలం అన్న విషయం అర్ధం అయింది కదా... ఇప్పుడు ఇండెక్స్ ల గురించి మాట్లాడుకుందాం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కి నిఫ్టీ ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయం మనకు తెలుసు కదా...ఈ సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, బీఎస్ఈ బ్యాంకెక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. బ్యాంకు నిఫ్టీ ల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి కాక ఆటో, ఫార్మా, ఐటీ.... ఇలా వివిధ రంగాలకు కూడా ఆయా ఇండెక్స్ లు ఉంటాయి. కానీ వీటిలో ట్రేడింగ్ చేయలేం.గత నవంబర్ 20 వ తేదీ వరకు మిడ్ నిఫ్టీ కి సోమవారం, ఫిన్ నిఫ్టీ కి మంగళవారం, బ్యాంకు నిఫ్టీ కి బుధవారం, నిఫ్టీ కి గురువారం, సెన్సెక్స్ కు శుక్రవారం... ఇలా వీక్లీ కాంట్రాక్టు లు ఉండేవి. అంటే ఆ వారాంతానికి ముగిసిపోయే కాంట్రాక్టు లన్న మాట. ఇలా ట్రేడింగ్ జరిగే ప్రతి రోజూ ఏదో ఒక ఎక్సపైరీ ఉండటం వల్ల రిటైల్ ట్రేడర్లు భారీగా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో సెబీ... సెన్సెక్స్, నిఫ్టీ లకు తప్ప మిగతా ఇండెక్స్ లకు వీక్లీ కాంట్రాక్టు లు తీసేసింది.బీ ఎస్ ఈ కి సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ కి నిఫ్టీ లు ప్రామాణిక సూచీలు కాబట్టి వీటిలో మాత్రం వీక్లీ, మంత్లీ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్సపైరీ శుక్రవారం ఉండగా వచ్చే వారం నుంచి మంగళవారం (జనవరి 7,14, 21, 28... ఇలా ) కి మారబోతోంది. నిఫ్టీ కి మాత్రం గురువారమే కొనసాగుతుంది. అలాగే లాట్ సైజు లను కూడా సెబీ మార్చింది. వాటి వివరాలు.ఇండెక్స్లాట్ సైజు ప్రస్తుతంమార్చాకఅమల్లోకి వచ్చే/వచ్చిన తేదీ నిఫ్టీ2575జనవరి 2, 2025బ్యాంకు నిఫ్టీ1530ఫిబ్రవరి 2025ఫిన్ నిఫ్టీ2565 ఫిబ్రవరి 2025మిడ్ నిఫ్టీ50120 ఫిబ్రవరి 2025సెన్సెక్స్ 10 20 జనవరి 7, 2025 నిఫ్టీ నెక్స్ట్ 50 10 25 నవంబర్ 20, 2024 బీఎస్ఈ బ్యాంకెక్స్ 15 30 నవంబర్ 20, 2024మిడ్, ఫిన్, బ్యాంకు నిఫ్టీ ల్లో ట్రేడ్ చేయాలంటే తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి చాల ఖరీదు ఉంటాయి. అదే సమయంలో లాట్ సైజు లను కూడా పెంచడం వల్ల రిటైల్ ట్రేడర్లు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ప్రమేయం తగ్గుతుందని, తద్వారా వారి నష్టాల స్థాయిని తగ్గించవచ్చనేది సెబీ ఉద్దేశం.ఉదా: గతంలో ఒక ట్రేడర్ రూ. 100 ఖరీదు చేసే నిఫ్టీ 50 ఆప్షన్ ఒక లాట్ కొనడానికి రూ. 100 X 25 (లాట్ సైజు) = రూ.2,500 వెచ్చిస్తే సరిపోయేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అదే లాట్ కొనాలంటే రూ. 7,500 పెట్టాలి. అంటే చేతిలో రూ.25,000 ఉన్న వ్యక్తి 10 లాట్లు కొనగలిగేవాడు కాస్తా తాజాగా రూ.75,000 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి... ట్రేడింగ్ లో రిటైలర్ల ప్రమేయం తగ్గిపోతుంది. తద్వారా వారికొచ్చే నష్టాలు కూడా పరిమితం గానే ఉంట్టాయన్న ఉద్దేశంతో సెబీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇండెక్స్ ల్లో ట్రేడ్ చేసేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఆహార భద్రత సూచిక 2024: మరోసారి అగ్రస్థానంలో ఆ రాష్ట్రం!
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆహార భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నందున ఇది మరింత ముఖ్యం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) 2024 ర్యాంకింగ్లో మరోసారి కేరళ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ సూచీలో వరుసగా రెండోసారి తొలిస్థానం దక్కించుకుంది. గతేడాది రెండోస్థానంలో ఉన్న తమిళనాడు ఈసారి మొదటి స్థానానికి ఎగబాకింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాలాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకుర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఫేస్బుక్ పోస్ట్లో.. "కేరళ జాతీయ స్థాయిలో ఆహార భద్రతలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆహార భద్రతా సూచికలో జాతీయ స్థాయిలో కేరళ వరుసగా రెండవ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో గతేడాది కూడా మొదటి స్థానంలోనే నిలిచింది కేరళ. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కేసులు, గుర్తింపు పొందిన ల్యాబ్ల సంఖ్య, ల్యాబ్లలో అత్యుత్తమ పరీక్ష, మొబైల్ ల్యాబ్ల పనితీరు, శిక్షణ , అవగాహన కార్యకలాపాలు మొదలైనవి కేరళను అగ్రస్థానంలో నిలిపాయి. అలాగే కేరళ ఈ విజయాన్ని దక్కించుకోవడంలో కృషి చేసి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ అభినందనలు. అని పోస్ట్లో పేర్కొన్నారు వీణా జార్జ్. ఈ ఆహార భద్రతా సూచీ అనేది రాష్ట్రాల ఐదు కీలక పారామితులపై అంచనా వేస్తుంది. మానవ వనరులు, సంస్థాగత డేటా, సమ్మతి, ఆహార పరీక్ష-మౌలిక సదుపాయాలు, నిఘా, శిక్షణ, సామర్థ్యం పెంపు, వినియోగదారుల సాధికారత. ఆహార సంబంధిత వ్యాధులు, న్యూట్రాస్యూటికల్ భద్రత, ఆహారంలో ప్లాస్టిక్ల వల్ల ఎదురవుతున్న సవాళ్లను దృష్ట్యా..నేటి ప్రపంచంలో ఫుడ్ రెగ్యులేటర్ల ప్రాముఖ్యత పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నొక్కి చెప్పారు. అంతేగాదు ఫుడ్ సేఫ్టీ విషయంలో నిరంతర సహకారం, ఆవిష్కరణలు, మెరుగుదల తదితరాల ఆవశ్యకత గురించి హైలెట్ చేశారు.(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
ఇటు అభివృద్ధి .. అటు పేదరికం!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఒక రాష్ట్రం అభివృద్ధికి.. ఒక నగరం. కొన్ని పట్టణాలు, పలు గ్రామాలే కొలబద్ద కాదు. ఏ మూలకు వెళ్లినా కాస్త అటుఇటుగానైనా అభివృద్ధి, ఒకే జీవన విధానం, సమాన అవకాశాలు ఉండాలి. అలా ఉండేలా చూడటం ప్రభుత్వాల విధి. కానీ గణనీయమైన అభివృద్ధి, అపార అవకాశాలు ఉన్న నగరాలు, గ్రామాలు ఒక వైపు.. అసలు తినేందుకు పౌష్టికాహారం, నడిచేందుకు రోడ్డు, ఉండేందుకు ఇళ్లులేని పేద ప్రాంతాలు మరోవైపు ఉంటే ప్రగతి గతి సరిగా లేదనే చెప్పాలి. తెలంగాణలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచి–2023.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదరికం 7.3 శాతం తగ్గిందని వెల్లడించింది. 2015–16లో రాష్ట్రంలో 13.18 శాతం పేదలుండగా 2019 –21కి వచ్చే సరికి 5.88 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. అయితే కొమురంభీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం జాతీయ సగటు (14.96 శాతం)కు మించి పేదరికం నమోదు అవటం గమనించాల్సిన అంశం. గడిచిన పదేళ్ల క్రితమే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పైమూడు జిల్లాల్లో అసమగ్ర అభివృద్ధి, సంక్షేమం ఉందని తేలినా.. అక్కడ ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ అమలు చేయని కారణంగా ఇంకా ఆయా జిల్లాలు అత్యధిక పేద జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్నీ సమస్యలే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ఆధారంగా నీతిఆయోగ్ బాలికా శిశు, బాలింతల ఆరోగ్యం, విద్య, పారిశుధ్యం, విద్యుత్, మంచినీరు, సొంత ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ తదితర పన్నెండు అంశాలను తీసుకుని తెలంగాణలోని పేదల లెక్కలు తీసింది. అందులో అత్యధికం తినేందుకు పౌష్టికాహారం, ఉండేందుకు సరైన ఇంటి వసతి లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలింది. అలాగే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉండటం శోచనీయం. ఆరు కిలోమీటర్లు నడిస్తేనే.. కొమురంభీం జిల్లా తిర్యాణి మండలం భీమ్రెల్ల గ్రామానికి వెళ్లే దారి ఇది. మండల కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే భీమ్రెల్లకు వెళ్లాలంటే ముల్కలమంద పంచాయతీ పరిధిలోని తోయరేటి వరకు వాహనంలో వెళ్లాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు నడిస్తేనే గానీ గ్రామానికి చేరుకోలేం. ఈ గూడెంలో 50 మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు. బండరాళ్ల దారిలో కాలినడక! ఇది కొమురంభీం జిల్లా కెరమెరి మండలం లైన్పటార్ గ్రామానికి వెళ్లే రోడ్డు. ఈ గ్రామంలో 113 మంది జనాభా ఉన్నారు. దారి మొత్తం బండరాళ్లతో అధ్వానంగా ఉంది. దారి మధ్యలో రెండు ఒర్రెలు కూడా ఉండటంతో వర్షాకాలంలో ఆదివాసీల అవస్థలు వర్ణనాతీతం. పిల్లలు, పెద్దలు ఎవరైనా.. ఇలా ఇబ్బందులు పడాల్సిందే. అక్షరాస్యతలో అధ్వానం.. గట్టు జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. మండలంలో 36 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. మండలంలో 60 పాఠశాలలు ఉన్నాయి. కానీ సరైన వసతులు లేవు. టీచర్ల కొరత వేధిస్తోంది. ఎక్కువమంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించేస్తున్నారు. ఆడపిల్లలను చదివించేందుకు పెద్దగా శ్రద్ధ చూపరు. సీడ్ పత్తి సీజన్ (పత్తి మొగ్గ గిల్లేందుకు చిన్నపిల్లలు అవసరం. దీంతో సీజన్లో ఎక్కువగా చిన్నపిల్లలను రైతులు పనుల్లో పెట్టుకుంటారు. పిల్లలు బడికి వెళ్లకపోవడానికి ఇదో ప్రధాన కారణం. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా స్పందన అంతంత మాత్రమే. ఈ కారణంగా గట్టు మండలం పూర్తిగా వెనుకబడి ఉంది. ప్రత్యేక కార్యాచరణ అవసరం పేదరికం, వెనుకబాటుపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్నా.. వెనుకబడిన ప్రాంతాలు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు లేవు వెనుకబాటు, అసమానతల వల్లే తెలంగాణ నినాదం పుట్టింది. ఈ రెండింటినీ లేకుండా చేయటం కోసమే తెలంగాణ ఏర్పడింది. కానీ గడిచిన పదేళ్లలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రణాళికలు, రాజకీయ నిర్దేశనం లేకపోవటం వల్లే అభివృద్ధిలో అసమానతలు నెలకొన్నాయి. – గాదె ఇన్నయ్య, సామాజిక విశ్లేషకుడు -
‘అచీవర్’ ఆంధ్రప్రదేశ్.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్!
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సరకు రవాణా రంగంలో అద్భుత పనితీరుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్గా అవతరించింది. సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి అవసరమైన లాజిస్టికల్ సేవల్లో ఆయా రాష్ట్రాల సామర్థ్యాన్ని ఈ సూచిక తెలియజేస్తోంది. కాగా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్లో అచీవర్స్ తర్వాత ఫాస్ట్ మూవర్స్ కేటగరిలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆస్పైరర్స్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రాల్లో సరకు రవాణా సేవలకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితుల ఆధారంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
ప్రపంచ ఆకలి సూచీలో...మనకు 111వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది. దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ‘ఇది తప్పుడు ర్యాంకింగ్. దురుద్దేశపూర్వకంగా ఇచ్చిన బాపతు‘ అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్ (81), నేపాల్ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్లో ఉన్నట్టు చెప్పింది. ‘భారత బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ అని పేర్కొంది. వాతావరణ మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు పద్ధతులు వాడి రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం‘ అంటూ విమర్శించింది. -
3గిఫ్ట్ నిఫ్టీ టర్నోవర్ రికార్డ్
న్యూఢిల్లీ: గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఒకే రోజులో 15.25 బిలియన్ డాలర్ల(రూ. 1.27 లక్షల కోట్లు) టర్నోవర్ను సాధించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. 38.63 లక్షల కాంట్రాక్టుల ద్వారా రికార్డ్ నమోదైంది. వెరసి ఈ ఏడాది ఆగస్ట్ 29న సాధించిన 12.98 బిలియన్ డాలర్ల రికార్డ్ టర్నోవర్ను అధిగమించినట్లు ఎన్ఎస్ఈ ఐఎక్స్ వెల్లడించింది. నిఫ్టీ–50 ఇండెక్స్ ఆధారంగా డాలర్లలో ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు గిఫ్ట్ నిఫ్టీ వేదికగా నిలిచే సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ ఐఎక్స్.. గిఫ్ట్ సిటీ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మలీ్టఅసెట్ ఎక్సే్ఛంజ్. ఈ ఏడాది(2023) జులై 3నుంచి గిఫ్ట్ నిఫ్టీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఎన్ఎస్ఈ ఐఎక్స్లో ట్రేడింగ్ టర్నోవర్ ఊపందుకుంది. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ మొదలయ్యాక తొలి రోజు నుంచి ఇప్పటివరకూ 4.59 మిలియన్ కాంట్రాక్టుల ద్వారా 178.54 బిలియన్ డాలర్ల విలువైన టర్నోవర్ నమోదైంది. ఎన్ఎస్ఈ ఐఎక్స్ విభిన్న ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. దేశీ సింగిల్ స్టాక్ డెరివేటివ్స్, ఇండెక్స్, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్సహా.. డిపాజిటరీ రిసీప్ట్స్, గ్లోబల్ స్టాక్స్ను ఆఫర్ చేస్తోంది. -
రూపాయి హై జంప్: కారణం ఇదే!
Rupee rises దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో శుక్రవారం ఒక రేంజ్లో పుంజుకుంది. ఆరంభంలోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని తాకింది. చివరికి 19 పైసల లాభంతో 82.93 వద్ద ముగిసింది. గురువారం 2 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్లో భారతదేశాన్ని చేర్చడం పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. 2024 , జూన్ నుంచి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల బాండ్ ఇండెక్స్లో భారత ప్రభుత్వ బాండ్లను (IGBs) చేర్చనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ స్వాగతించింది. (సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలతో కుదేలైన నిఫ్టీ) ప్రధాన గ్లోబల్ బాండ్ ఇండెక్స్లో భారతదేశాన్ని చేర్చడం వల్ల దేశ రుణ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు ప్రవాహం భారీగా పెరగనుందని అంచనా. భారత ప్రభుత్వ బాండ్లను , బెంచ్మార్క్ ఎమర్జింగ్-మార్కెట్ ఇండెక్స్లో చేర్చాలని జేప్ మోర్గాన్ చేజ్ & కో తీసుకున్న నిర్ణయం, భారతదేశ డెట్ మార్కెట్ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుందని ఫారెక్స్ వ్యాపారులు భావిస్తున్నారు. రూపాయి ఎన్డిఎఫ్ మార్కెట్లలో సుమారు 0.42 శాతం వృద్ధి చెంది 82.80 స్థాయిలకు చేరుకోవడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మరోవైపు దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమైనాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టపోగా,నిఫ్టీ 19700 దిగువన స్థిరపడింది. అటు ఆరు కరెన్సీల బాస్కెట్తో గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పెరిగి 105.48కి చేరుకుంది. ప్రపంచ చమురు బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.61 శాతం పెరిగి 93.87 డాలర వద్ద ఉంది. విదేశీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం క్యాపిటల్ మార్కెట్లో నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ3,007.36 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. (క్యాబ్ డ్రైవర్ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?) -
ఇంధన పరివర్తన ఇండెక్స్లో భారత్ సత్తా.. మెరుగైన ర్యాంక్ సాధన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్) ఇండెక్స్లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని వెల్లడించింది. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్లో భారత్ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది. -
భారత్ ‘సేవలు’ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఏప్రిల్లో గణనీయమైన ఫలితాన్ని నమోదుచేసుకుంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్విసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 13 నెలల గరిష్ట స్థాయిలో 62కు ఎగసింది. మార్చిలో సూచీ 57.8 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో వృద్ధి, మార్కెట్ పరిస్థితుల సానుకూల వంటి అంశాలు ఈ పటిష్ట ఫలితానికి కారణమని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సేవల సూచీ గడచిన 21 నెలల్లో వృద్ధి శ్రేణిలోనే ఉంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం మెజారిటీ వాటాను కలిగిఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఇంకా ఉపాధి అవకాశాలు ఈ రంగంలో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించిన సర్వే పేర్కొంది. ఇదిలావుండగా, తయారీ, సేవల రంగం రెండూ కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా ఏప్రిల్లో 61.6గా నమోదయ్యింది. మార్చిలో సూచీ 58.4 వద్ద ఉంది. -
కారు చీకటి బతుకులు.. అంతరం అలాగే!
చెలిమ నీళ్లే ఇంకా.. కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గోవెన పరిధిలో ఐదు గూడేలకు విద్యుత్ వెలుగే లేదు. ఇందులో నాయకపుగూడ, కుర్సీ గూడాల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మిషన్ భగీరథ కోసం నిర్మించిన వాటర్ ట్యాంకులు అలంకారప్రాయమే. దీంతో నాయకపుగూడ గిరిజనులకు వాగులోని చెలిమ నీళ్లే గొంతు తడుపుతున్నాయి. గోవెన పరిధిలోని ఐదు గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఐటీడీఏ ఎప్పుడో ఏర్పాటు చేసిన సోలారు లైట్లు ఆరేళ్ల క్రితమే పనిచేయకుండా పోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలారు వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. కారు చీకటి బతుకులు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామానికి చేరాలంటే ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లాలి. సరైన దారే లేని అలాంటి ఊరికి కరెంటు కూడా లేదు. పెంబిమండల కేంద్రం నుంచి 25 కి.మీ. దూరంలో ఉండే ఈ పల్లెలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇంకా పెద్దరాగిదుబ్బ, సోముగూడ, కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్ గ్రామాలవీ చీకటి బతుకులే. శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి : వెనుకబాటుపైనే తిరుగుబాటు చేసి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్న నినాదమూ తెలంగాణదే. అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లవుతున్నా.. రాష్ట్రంలో ఇంకా 13.74% పేదలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో జాతీయ సగటు (25.01%)ను మించి పేదరికం ఉందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిక (మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్–2021) వెల్లడించడం గమనార్హం. విద్య, వైద్యం, విద్యుత్ ప్రాతిపదికగా.. విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్లు, సొంత ఆస్తులు, బ్యాంక్ ఖాతా తదితర పన్నెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. దేశ జనాభాలో 25.01% పేదలుండగా, తెలంగాణలో ఇది 13.74%గా ఉంది. అయితే ఆదిలాబాద్ (27.43%), మహబూబ్నగర్ (26.11%) జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో 25% మందికి ఇప్పటికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదని నివేదిక తేల్చింది. కొత్తగా ఏర్పడిన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం, రాజకీయ అవసరం, ప్రాబల్యం ఉంటేనే నిధుల వరద పారుతున్న వైనం.. వెనుకబడిన ప్రాంతాల్లో మరోసారి అసహనానికి కారణం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం, రాజకీయ సిఫారసులు, అవసరాలు లేని ప్రత్యేక కార్యాచరణ అమలుతోనే సమ అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ సి.నాగేశ్వర్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రాధాన్యం ఏదీ? తెలంగాణ వచ్చినా కూడా పాలమూరు వెతలు తీరటం లేదు. మా జిల్లాలో సహజ వనరుల దోపిడీ పెరిగింది. వలసలు ఇంకా ఆగనే లేదు. గుంపు వలసల స్థానే వ్యక్తిగత వలసలు కొనసాగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే కొనసాగితే పాలమూరు పేదల జిల్లాగానే మిగిలిపోతుంది. –ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ప్రణాళికా బద్ధమైన కేటాయింపులు ఉండాలి సంక్షేమ రాజ్యం ప్రధాన సూత్రం..అందరికీ సమన్యాయం. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి దాని ని నిరీ్ణత కాలంలో అమలు చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రణాళిక – కేటాయింపులు–సమీక్షలు అంత అర్థ్ధవంతంగా లేవు.అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో దేశ సగటును మించి పేదరికం నమోదైంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ పేదలే లేని కొట్టాయం కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు. ఎర్నాకులం జిల్లాలో 0.1%, కోజికోడ్లో 0.26% ఉన్నారు. దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ (0.71) నిలిచింది. ఇక అత్యధిక పేదరికం బిహార్లో (51.91%) ఉంది. దేశంలో అత్యధిక పేదరికం యూపీలోని శ్రావస్తి జిల్లాలో (74.38%) నమోదైంది. బహరైచ్లో 71.81%, మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్లో 71.31% పేదరికం ఉంది. మా జీవితాలకు వెలుగెప్పుడో..! అడవిలో మూడు కిలోమీటర్లు నడిస్తేనే.. బయటి ప్రపంచానికి మేమంటూ ఉన్నామని తెలుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నరు కరెంటు వస్తదని. కానీ రాలే.. సోలారు లైట్లు పెడుతున్నా.. అవి కొన్నిరోజులే వెలుగుతున్నయి. మా పిల్లల జీవితాల్లోనైనా వెలుగు వస్తుందో లేదో..! – ఆత్రం శ్రీరాములు, ఠిమిద్దెచింత, నిర్మల్ బడి లేక..కూలీకి.. అమ్మా నాయిన ముంబైకి వలస వెళ్లిండ్రు. నేను మా తండా బడిలోనే 5వ తరగతి వరకుచదివిన. 6వ తరగతి చదవాలంటే రోజూ 14 కి.మీ వెళ్లిరావాలి. రోడ్డు బాగా లేదు, ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో రోజూ నడుచుకుంటూ వెళ్లలేక గత ఏడాది బడి మానేసిన. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు కూలీ పనులకెళ్తున్న. మా అమ్మా నాయిన లాగే తండాలో 95 కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి. నాలా చానామంది నడుచుకుంటూ బడికి వెళ్లలేక కూలీ పని చేస్తుండ్రు. – సోనమ్మ, పాతతండా, నారాయణపేట జిల్లా -
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది. ► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ)ని ప్రారంభించారు. ► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది. ► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది. ► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి. ► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్లో) సమయం భారతదేశం, సింగపూర్లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది. 50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. -
రీట్స్, ఇన్విట్స్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ.. దేశీయంగా తొలిసారి రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్) ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయ్యి, ట్రేడయ్యే రీట్స్, ఇన్విట్స్ పనితీరును పరిశీలించేందుకు మదుపరులకు వీలు చిక్కనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఆదాయాన్ని ఆర్జించే రియల్టీ ఆస్తులతో రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్తులతో ఇన్విట్స్ ఏర్పాటయ్యే సంగతి తెలిసిందే. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. దీర్ఘకాలికమైన రియల్టీ ప్రాజెక్టులలో రీట్స్, మౌలిక రంగ ప్రాజెక్టులలో ఇన్విట్స్ పెట్టుబడులు చేపడుతుంటాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లకు విభిన్న మార్గాలలో నిరవధిక ఆదాయానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు నగదు ఆర్జించే ప్రాజెక్టుల ద్వారా నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక అవకాశాలుగా రీట్స్, ఇన్విట్స్ గుర్తింపు పొందాయి. కాగా.. ఇండెక్సులో ఫ్రీఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెక్యూరిటీలకు వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఒక్కో సెక్యూరిటీకి 33 శాతం పరిమితిని అమలు చేయనుంది. ఇండెక్స్ ప్రాథమిక విలువ 1,000కాగా.. త్రైమాసికవారీగా సమీక్షించనుంది. -
మరో భారత్ బాండ్ ఇండెక్స్ షురూ
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ తాజాగా మరో బాండ్ ఇండెక్సును ప్రారంభించింది. నిఫ్టీ భారత్ బాండ్ ఇండెక్స్ సిరీస్లో భాగంగా ఏప్రిల్ 2033ను ప్రవేశపెట్టింది. అత్యధిక భద్రతగల ఏఏఏ రేటింగ్ ప్రభుత్వ బాండ్లతో ఎన్ఎస్ఈ బాండ్ ఇండెక్సులను ఆవిష్కరిస్తోంది. వీటిలో భాగంగా ఏప్రిల్ 2033ను విడుదల చేసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. భారత్ బాండ్ ఇండెక్స్లో భాగంగా తొలు త 2019 డిసెంబర్లో ఏప్రిల్ 2023, ఏప్రిల్ 2030 గడువులతో బాండ్ ఇండెక్సులను ప్రవేశపెట్టింది. తదుపరి 2020 జులైలో మరోసారి ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2031 గడువులతో ఇండెక్సులను ఆవిష్కరించింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ సిరీస్లో భాగంగా త్వరలో విడుదల చేయనున్న ఆరో భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా భారత్ బాండ్ ఇండెక్స్ 2033ను ట్రాక్ చేయనున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
ఆవిష్కరణల్లో తెలంగాణ అ‘ద్వితీయం’!
సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్నెస్ (ఐఎఫ్సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి.. ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ గురువారం ఆవిష్కరించారు. పెర్ఫార్మర్స్లో టాప్ ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా.. ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే.. పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్తో నాలుగో స్థానంలో నిలిచింది. ఎంఎన్సీలు, స్టార్టప్లతో మెరుగైన పనితీరు స్టార్టప్లకు తెలంగాణ నిలయంగా మారుతోంది. ‘ఇన్ఫ ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్మార్క్లు, ఇండస్ట్రియల్ డిజైన్ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. స్టార్టప్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం తెలంగాణ పనితీరును మెరుగుపర్చు కోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు తాము సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చడంపై దృష్టి సారించాలని సూచించింది. ‘3ఐ మంత్రం’తో అద్భుత ఫలితాలు: కేటీఆర్ దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్లో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న ‘3ఐ మంత్రం’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021’లో తెలంగాణ మొత్తంగా రెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది’’ అని ట్వీట్ చేశారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రం తెలంగాణ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో రాష్ట్రం అగ్రగామిగా నిలవడం గర్వకారణం. సీఎం కేసీఆర్, ఐటీ–పరిశ్రమల మంత్రి కేటీఆర్ దూరదృష్టి వల్లే ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలో టాప్ స్థానంలో నిలిచింది. – బి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు -
పత్రికా స్వేచ్ఛ.. దిగజారిన భారత్ స్థానం
World Press Freedom Day: న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. పత్రికా స్వేచ్ఛకు అత్యంత ప్రమాదం ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. విధి నిర్వహణలో ఏడాదికి ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే వస్తోందని పేర్కొంది. భారత్లో లక్షకు పైగా వార్తా పత్రికలతోపాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ఎడిషన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయిన 3న విడుదలైంది. -
ఫిన్లాండ్.. అంత సంతోషంగా ఎలా ఉంటుందో తెలుసా?
ఫిన్లాండ్.. మరోసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. ఈ భూమ్మీద ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. ► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్, వెనిజులా, అఫ్గనిస్థాన్ దేశాలు. లెబనాన్.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్లో నిలిచింది. ► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ► వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్ అయ్యింది. ఆర్థిక, సోషల్ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. ► ఉత్తర యూరప్ దేశాల డామినేషన్ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ స్విట్జార్లాండ్, ఐస్ల్యాండ్, నెదర్లాండ్స్(హాల్యాండ్), నార్వే, స్వీడన్ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్కు దక్కింది. భారత్ 136వ స్థానంలో నిలిచింది. ► ఫిన్లాండ్ జనాభా.. దాదాపు 5.5 మిలియన్. ఇక్కడి ప్రజల లైఫ్స్టయిల్ డిఫరెంట్గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్. ► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు. ► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు. ► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది. -
అవినీతి సూచీలో మరింత దిగజారిన పాక్, భారత్ స్థానం ఏంటంటే..
ఇస్లామాబాద్: ప్రపంచ అవినీతి సూచికలో పాకిస్తాన్ మరింత దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. బెర్లిన్కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 180 దేశాలతో కూడిన ఈ జాబితాను విడుదల చేస్తుంది. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది. 2021 సీపీఐ (కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్) జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్లో మార్కులు ఇచ్చారు. ఈ జాబితాలో 28 సీపీఐతో పాక్ 140వ స్థానంలో నిలిచింది. భారత్ 40సీపీఐతో 85వ స్థానంలో, బంగ్లాదేశ్ 147వ స్థానంలో నిలిచాయి. పాక్లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషిం చింది. జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి. భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్ ఉన్నాయి. ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది. -
భారత్లో తొలి క్రిప్టోకరెన్సీ సూచీ వచ్చేసింది
India First Cryptocurrency Index IC15: భారత్ మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ సూచీ అధికారికంగా లాంఛ్ అయ్యింది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ సూపర్ యాప్గా గుర్తింపు పొందిన క్రిప్టోవైర్ ఈ కరెన్సీ సూచీని తీసుకొచ్చింది. ఇంతకీ దీని పేరేంటో తెలుసా?.. ఐసీ15 (IC15). క్రిప్టోమార్కెట్ను.. దాని తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించడమే ఈ సూచీ చేసే పని. ఈ సూచీ డ్యూటీ ఏంటంటే.. బాగా ట్రేడింగ్లో, లీడింగ్ ఎక్స్ఛేంజ్లో ఉన్న క్రిప్టోకరెన్సీల పనితీరును పర్యవేక్షించడం.. ఆ వివరాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ద్వారా తెలియజేడం. ట్రిక్కర్ప్లాంట్ లిమిటెడ్లో స్పెషల్ బిజినెస్ యూనిట్గా ఉన్న క్రిప్టోవైర్.. క్రిప్టో లెక్కల వివరాల్ని పక్కాగా తెలియజేస్తుంటుంది. తద్వారా క్రిప్టో ఇన్వెస్టర్లకు మాత్రమే కాదు.. ఆసక్తి ఉన్నవాళ్లకు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లకు సైతం క్రిప్టో మార్కెట్ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు అర్థమవుతుంటాయి. పనిలో పనిగా ఈ ఇండెక్స్(సూచీ).. క్రిప్టోకరెన్సీ, బ్లాక్చెయిన్ ఇకోస్టిస్టమ్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తుంటుంది కూడా. డొమైన్ ఎక్స్పర్ట్స్, విద్యావేత్తలు, మేధావులతో కూడిన గవర్నెన్స్ కమిటీ(IGC) ఐసీ15లో ఉంటుంది. ఏదైనా ఒక క్రిప్టోకరెన్సీకి ఇండెక్స్లో చోటు దక్కాలంటే.. రివ్యూ ప్రకారం ట్రేడింగ్ రోజుల్లో కనీసం 90 శాతం అయినా ట్రేడ్ అయ్యి తీరాలి. గడిచిన నెలలో మార్కెట్ క్యాపిటలైజేషన్ సర్క్యులేటింగ్ పరంగా టాప్ 50లో ఉండాలి. IC15 ఇండెక్స్లో లిస్టింగ్కు అర్హత పొందేందుకు మాత్రం.. ట్రేడింగ్ విలువ పరంగా అది టాప్ 100 అత్యంత లిక్విడ్ క్రిప్టోకరెన్సీలలో ఒకటిగా ఉండాలి. -
Good Governance Index 2021: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ
సాక్షి, అమరావతి: ప్రధాన రంగాలన్నింటిలో మన రాష్ట్రం గతంలో కంటే మెరుగైన పురోగతి సాధించింది. ఆర్థిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి సర్వతోముఖాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు ముందుకు వేసింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–2021 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ నివేదికలో రాష్ట్రాన్ని ‘ఏ’ గ్రూపులో చేర్చారు. ఈ నివేదికలో 2019–20, 2020–21 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను బేరీజు వేశారు. చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్ మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రం గతంలో కన్నా ఎక్కువ పాయింట్లు సాధించింది. విద్యారంగం పరంగా.. నాణ్యమైన విద్య, లింగ సమానత్వ సూచిక, ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ ఎస్సీ, ఎస్టీ (ఎస్సీ, ఎస్టీల చేరికలు), రిటెన్షన్ రేట్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ (ప్రాథమిక విద్య స్థాయిలో డ్రాపవుట్లు అరికట్టడం), స్కిల్ ట్రెయినింగ్ (నైపుణ్య శిక్షణ), ప్లేస్మెంట్ రేషియో (ఉద్యోగ, ఉపాధి కల్పన) అంశాలలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య పరంగా 2019లో గరిష్ట స్కోరు 39 శాతం ఉండగా 2021లో 63 శాతానికి పెరిగింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. మెరుగైన భద్రత ♦ప్రజల భద్రతకు భరోసానిస్తూ మెరుగైన పోలీసు వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. 2019–20లో 26.10 శాతం నేరాల్లో దోషులను గుర్తించి శిక్షలు విధించగా, 2020–21లో అది 38.40 శాతానికి పెరిగింది. ♦2019–20లో పోలీసు శాఖలో మహిళా పోలీసులు 4.17 శాతం ఉండగా.. 2020–21లో 5.85 శాతానికి పెరిగారు. ♦పీహెచ్సీల్లో వైద్యుల అందుబాటు 2019–20తో పోలిస్తే 2020–21లో 6.4 శాతం వృద్ధి చెందింది. 1,145 పీహెచ్సీలలో ఇద్దరు వైద్యుల విధానం, 650 మంది మెడికల్ ఆఫీసర్ల నియామకం, సుమారు 3 వేల మంది సిబ్బంది నియామకం, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధిలో 11 వేలకు పైగా పోస్టుల భర్తీ, మరో 4,142 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండటం, కొత్తగా 3,483 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇందుకు దోహదపడింది. ♦మాతృ మరణాలు 74 నుంచి 65కు, శిశు మరణాలు 32 నుంచి 29కి తగ్గాయి. ♦ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, ఆహారం, నివాసం తదితర విషయాల్లో ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ విషయంలో 0.546 స్కోర్తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పౌరులు ప్రత్యక్ష లబ్ధిదారులుగా నిలవడం అభివృద్ధి నమూనాకు కీలకం. ♦2019–20లో 42.05 శాతంగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబన 2020–21లో 58.2 శాతానికి పెరిగింది. ఆడబిడ్డల జననాల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. 2019–20లో 26.96 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు 2020–21లో 12.62 శాతానికి తగ్గాయి. -
ఆహార భద్రత అంతంత మాత్రమే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్లో ప్రజలకు ఆహార భద్రత అంతంత మాత్రమేనన్న విషయం మరోసారి రూఢీ అయింది. ప్రపంచ ఆహార భద్రతా సూచీ(జీఎఫ్ఎస్)లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. లండన్కు చెందిన ఎకనమిస్ట్ ఇంపాక్ట్ సంస్థ కోర్టెవా అగ్రిసైన్స్ సాయంతో తయారు చేసిన 113 దేశాలతో కూడిన వార్షిక నివేదిక జీఎఫ్ఎస్ ఇండెక్స్–2021ను మంగళవారం విడుదల చేసింది. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, సహజవనరులు వంటి అంశాల ఆధారంగా 113 దేశాల్లో ఆహార భద్రతను అంచనా వేసింది. అంతేకాకుండా ఆహార భద్రతకు సంబంధించి ఆర్థిక అసమానతల వంటి 58 అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఇండెక్స్లో 71వ స్థానంలో ఉన్న భారత్కు మొత్తమ్మీద 57.2 పాయింట్లు దక్కాయి. ఈ విషయంలో భారత పొరుగుదేశాలైన పాకిస్తాన్ 52.6 పాయింట్లతో 75వ స్థానంలో, శ్రీలంక 62.9 పాయింట్లతో 77వ స్థానంలో, నేపాల్ 79, బంగ్లాదేశ్ 84వ స్థానంలో ఉన్నాయి. చైనా 34వ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ సూచీలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా మొత్తమ్మీద 77.8–80 మధ్య మార్కులతో టాప్ ర్యాంకులను దక్కించుకున్నాయి. ఆహార లభ్యత, నాణ్యత, భద్రత, ఆహారోత్పత్తిలో సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందని వార్షిక నివేదిక తెలిపింది. ఆహార భద్రత విషయంలో గత పదేళ్లుగా భారత్ సాధించిన అభివృద్ధి పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ల కంటే వెనుకంజలోనే ఉందని తెలిపింది. 2012లో భారత స్కోర్ 54.5 కాగా కేవలం 2.7 పాయింట్లు పెరిగి 2021కి 57.2 పాయింట్లకు చేరుకుంది. పాకిస్తాన్ స్కోర్ 45.7 నుంచి 54.7కు, నేపాల్ స్కోర్ 46.7 నుంచి 53.7కు, బంగ్లాదేశ్ స్కోరు 44.4 నుంచి 49.1కి పెరగ్గా, చైనా స్కోరు 61.7 నుంచి 71.3కు చేరుకుందని తెలిపింది. సరసమైన ధరలకు ఆహారం లభించే దేశాల్లో భారత్ కంటే పాకిస్తాన్, శ్రీలంక మెరుగైన స్థానాల్లో ఉండటం విశేషం. జీఎఫ్ఎస్ ఇండెక్స్ హెడ్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ‘గత పదేళ్లుగా ఆహార భద్రత లక్ష్య సాధన దిశగా గణనీయ పురోగతి సాధించినప్పటికీ, ఆహార వ్యవస్థలు ఇప్పటికీ ఆర్థిక, వాతావరణ, భౌగోళిక రాజకీయ పరిణామాలకు లోనవుతూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు, ఆకలి, పోషకాహార లోపం నివారించి, అందరికీ ఆహారభద్రతను సమకూర్చేందుకు స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చర్యలు అత్యవసరం’అని పేర్కొన్నారు. చదవండి: కెప్టెన్ సొంత పార్టీ! -
క్యూ3లో ఐపీవో స్పీడ్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 60,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇ న్సూరెన్స్(రూ. 7,000 కోట్లు), పాలసీ బజార్(రూ. 6,000 కోట్లు), హెల్త్కేర్ సంస్థ ఎమ్క్యూర్ ఫార్మా (రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు) తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. -
లగ్జరీ ఉత్పత్తుల్లో వీటిపై అధిక లాభాలు...!
Knight Frank Luxury Investment Index: లగ్జరీ ఉత్పత్తులపై పెట్టుబడిపెడితే లాభాలను గడించే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా లగ్జరీ ఉత్పత్తులపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే వైన్ ఎక్కువ రాబడులను వచ్చాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ తన ద్వితీయా త్రైమాసికం 2021 రిపోర్ట్లో వెల్లడించింది. తాజా డేటా ప్రకారం....వైన్ ఉత్పత్తి చేస్తోన్న కంపెనీలు ఏడాది కాలంలో 13 శాతం మేర గణనీయంగా లాభాలను పొందినట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అరుదైన విస్కీ, లగ్జరీ హ్యండ్బ్యాగుల తయారీ సంస్థల కంటే వైన్ కంపెనీలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయని తేలింది. చదవండి: Bill Gates: అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్గేట్స్...! ఇటీవలి కాలంలో నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ లో టాప్ గెయినర్స్గా అరుదైన స్కాచ్ బాటిల్స్, హెర్మెస్ హ్యాండ్ బ్యాగుల కంపెనీలు ఏడాది కాలంలో ప్రతికూల వృద్ధిని నమోదుచేసి సూచిక అగ్రస్థానంలో నిలిచాయి. 10 ఏళ్లలో 13శాతం, 119శాతం మేర ధరలు పెరగడంతో జూన్ 2021 చివరి వరకు 12 నెలల్లో వైన్ కంపెనీలు ఇండెక్స్ ముందు వరుసలో ఉన్నాయని నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఎడిటర్ ఆండ్రూ షిర్లీ అన్నారు. ప్రముఖ వైన్ దిగ్గజం బోర్డియక్స్ కంపెనీ భారీ లాభాలను గడించింది. 12 నెలల వ్యవధిలో వైన్ ఉత్తమ రాబడులను చూసినప్పటికీ, 10 సంవత్సరాల వ్యవధిలో ఇతర పెట్టుబడుల కంటే ఇది చాలా ఎక్కువ. అరుదైన విస్కీ కంపెనీలు 10 సంవత్సరాలలో 483 శాతం రాబడిని నమోదు చేశాయి. లగ్జరీ ఉత్పత్తుల్లో క్లాసిక్ కార్లు, లగ్జరీ వాచీలు వరుసగా 4 , 5 శాతం ధరల పెరుగుదలతో 12 నెలల వ్యవధిలో భారీగా రాబడులను పొందాయి. చదవండి: ప్యాన్కేక్ .. ఆ రుచి వెనుక కష్టాల కథ -
దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్
ముంబై: దేశంలోని పది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2020–21 జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున స్వల్పంగా పెరిగాయి. అఖిల భారత గృహ ధరల సూచీ (హెచ్పీఐ) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2.7 శాతం పెరిగినట్లు (2019–20 ఇదే త్రైమాసికంతో పోల్చి) సోమ వారం విడుదలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. పది ప్రధాన నగరాల హౌసింగ్ రిజిస్ట్రేషన్ అథారిటీల నుంచి అందిన గణాంకాల ప్రాతిపదికన ఆర్బీఐ ఈ త్రైమాసిక హెచ్పీఐని విడుదల చేస్తుంది. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కోచ్చి, కోల్కతా, లక్నో, ముంబై ఉన్నాయి. నగరాలను వేర్వేరుగా చూస్తే, 15.7 శాతం పెరుగుదలతో బెంగళూరు టాప్లో ఉంది. అయితే జైపూర్లో ధరలు 3.6 శాతం తగ్గాయి. కాగా 2020–21 ఇదే త్రైమాసికంలో ఆల్ ఇండియా హెచ్పీఐ 3.9 శాతంగా ఉంది. ఇదిలావుండగా, 2020–21 క్యూ3తో పోల్చితే (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) క్యూ4లో ఆల్ ఇండియా హెచ్పీఐ వృద్ధి రేటు స్వల్పంగా 0.2 శాతం పెరిగింది. త్రైమాసికపరంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, జైపూర్లలో ధరలు తగ్గితే, మిగిలిన ఆరు పట్టణాల్లో పెరిగాయి. -
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్: భారత్ 28 స్థానాలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లింగ అసమానతల సూచీలో భారత్ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనం. 2021కి సంబంధించి 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిల్చింది. 2020లో భారత్ ర్యాంకు 112గా ఉంది. తాజా నివేదిక ప్రకారం రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ సాధికారతకు సంబంధించిన అంతర్గత సూచీలో భారత్ 13.5 శాతం మేర క్షీణించింది. మహిళా మంత్రుల సంఖ్య 2019లో 23.1 శాతంగా ఉండగా 2021లో 9.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణం. ప్రొఫెషనల్, టెక్నికల్ ఉద్యోగాల్లోనూ మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది. ఇక ఆర్థికాంశాలపరంగా చూస్తే మహిళలు ఆర్జించే ఆదాయం.. పురుషుల ఆదాయంలో అయిదో వంతే ఉంటోంది. దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ , నేపాల్ కంటే వెనుకబడి ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్ నార్వే ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ 156 చివరి స్థానంలో ఉంది. -
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: టాప్ ప్లేస్లో బెంగళూరు
న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. మిలియన్కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ తరువాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. మొదటి పది స్థానాల్లో ఉన్న నగరాలు ఒకసారి చూస్తే.. 1. బెంగళూరు 2. పుణె 3. అహ్మదాబాద్ 4. చెన్నై 5. సూరత్ 6. నవీ ముంబై 7. కోయంబత్తూర్ 8. వడోదర 9. ఇండోర్, 10. గ్రేటర్ ముంబై ఉన్నాయి అదే విధంగా 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల్లో సిమ్లాకు టాప్ ప్లేస్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వాసా, కాకినాడ, సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. దీనికి సంబంధించి 2020లో సర్వే నిర్వహించారు. మొత్తంగా 111 నగరాలు ఇందులో పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు పీఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: పేరెంట్స్తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న ఢిల్లీ సీఎం -
సానుకూలంగా రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్–డిసెంబర్ నాల్గో త్రైమాసికం (క్యూ4)లో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. దీంతో వచ్చే ఆరు నెలల కాలంలో నివాస, కార్యాలయాల విభాగంలో డిమాండ్ పుంజుకుంటుందని నైట్ఫ్రాంక్ ఇండియా–ఫిక్కీ–నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన ‘27వ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్–క్యూ4, 2020’ సర్వే వెల్లడించింది. తొలిసారిగా 2020 క్యూ4లో కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 54 పాయింట్స్తో ఆశావాద జోన్ (ఆప్టిమిస్టిక్)లోకి చేరిందని సర్వే తెలిపింది. క్యూ3తో పోలిస్తే 14 పాయింట్లు పెరిగింది. ఇక క్యూ4లో ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 65 పాయింట్లకు ఎగబాకింది. క్యూ3లో ఇది 52 పాయింట్లుగా ఉంది. స్కోర్ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆశావాద జోన్, 50 పాయింట్లుగా ఉంటే న్యూట్రల్, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద (పెసిమిజం) జోన్గా పరిగణిస్తుంటారు. సానుకూల దృక్పథంతో మొదలైన కొత్త ఏడాదితో రాబోయే ఆరు నెలల్లో గృహాల అమ్మకాలు 77 శాతం మేర పెరుగుతాయని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. క్యూ3లో ఇది 66 శాతంగా ఉంది. క్యూ3లో 47 శాతంగా ఉన్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు క్యూ4 నాటికి 60 శాతానికి పెరిగాయి. చదవండి: రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే! -
ఎంఎస్సీఐలో చోటు- షేర్ల హైజంప్
ముంబై: ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులకు ప్రామాణికంగా పరిగణించే ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ తాజాగా సవరణలు చేపట్టింది. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమీక్షలో భాగంగా 12 షేర్లకు చోటు కల్పించనుంది. మరో రెండు షేర్లను ఇండెక్సు నుంచి తొలగించనుంది. అదానీ గ్రీన్, ట్రెంట్, యస్ బ్యాంక్ బాలకృష్ణ, అపోలో హాస్పిటల్స్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఎంఆర్ఎఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్ జాబితాలో చోటు సాధించనున్నాయి. అయితే బాష్, ఎల్ఐసీ హౌసింగ్ను తొలగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండెక్సుల ఏర్పాటు, నిర్వహణలో ఎంఎస్సీఐ అతిపెద్ద సంస్థకాగా.. పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ ఇండెక్స్ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు చేపడుతూ ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండెక్సులో భాగంకానున్న కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జోష్లో.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 898 వద్ద ఫ్రీజయ్యింది. యస్ బ్యాంక్ 5 శాతం పెరిగి రూ. 44.15 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.5 శాతం జంప్చేసి రూ. 1571ను తాకగా.., అపోలో హాస్పిటల్స్ 7 శాతం దూసుకెళ్లి రూ. 2,168కు చేరింది. ఈ బాటలో పీఐ ఇండస్ట్రీస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2303 వద్ద, ట్రెంట్ 2 శాతం పెరిగి రూ. 710 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో పీఐ రూ. 2325 వద్ద, ట్రెంట్ రూ. 780 వద్ద గరిష్టాలకు చేరాయి. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ 2 శాతం లాభంతో రూ. 1,790ను తాకగా.. ఎంఆర్ఎఫ్ 1 శాతం బలపడి రూ. 70,064కు చేరింది. అయితే తొలుత రూ. 3105కు పెరిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ప్రస్తుతం 3.4 శాతం క్షీణించి రూ. 2923 వద్ద కదులుతోంది. తొలుత రూ. 2145కు జంప్ చేసిన ఇప్కా ల్యాబ్స్ 1.3 శాతం క్షీణించి రూ. 2034 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా ఇంట్రాడేలో రూ. 1215కు ఎగసిన ముత్తూట్ ఫైనాన్స్ 2 శాతం నీరసించి రూ.1161 వద్ద కదులుతోంది. -
పిల్లల ఆరోగ్యాభివృద్ధి సూచీలో కేరళ ఫస్ట్
న్యూఢిల్లీ: ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్యంలో కేరళ ప్రథమ స్థానంలో నిలవగా బిహార్ అథమ స్ధానంలో ఉంది. ప్రధానంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, ఎదుగుదల అనే మూడు అంశాలతో పాటు, శిశు మరణాల రేటు, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు స్థానాలను కేటాయించారు. 2005-06 లోని ఫలితాలను 2015-16 నాటి ఫలితాలతో పోలుస్తూ రూపొందించిన ఈ నివేదికను యంగ్ చైల్డ్ అవుట్కమ్స్ ఇండెక్స్(వైసీఓఐ) వెల్లడించింది. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు శుక్రవారం విడుదల చేసిన 'స్టేట్ ఆప్ ద యూత్ చైల్డ్ ఇన్ ఇండియా' అనే పుస్తకంలో ఈ నివేదిక పొందుపర్చి ఉంది. బాలల ఆరోగ్య, సంక్షేమ సూచీలో 2005-06లో 0.443 పాయింట్లు సాధించిన భారత్ 2015-16కి 0.585 వద్ద స్థిరపడింది. వైసీఓఐ నివేదికలో కేరళ, గోవా రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా అస్సాం, మేఘాలయ, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్ చివరి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వైసీఈఐ నివేదికలోనూ వెనకబడి ఉండటం గమనార్హం. 2005లో వెనకంజలో ఉన్న త్రిపుర మాత్రం కొంతమేరకు మెరుగుపడింది. (చదవండి: ‘అప్పుడే కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుంది’) యంగ్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్: లింగ బేధం, పేదరికం, చదువు, ఆరోగ్యం, మంచినీటి సరఫరా వంటి అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 2015-16కు గానూ భారత్ 0.672 పాయింట్లను సాధించింది. జాతీయ సగటున దాటి కేరళ, గోవా టాప్లో ఉండగా అత్యంత తక్కువ పాయింట్లతో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కాగా దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలను వెంకయ్య నాయుడు ప్రస్తావించిన విషయం తెలిసిందే. (చదవండి: దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది) -
రిటైరైన తర్వాత అధిక రిస్క్ వద్దు!
నేను ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇవి ఈక్విటీ ఫండ్స్కంటే మంచి రాబడులనే ఇవ్వగలవా? ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చంటారా? –సుచరిత, హైదరాబాద్ ఇండెక్స్ ఫండ్స్కు ఉండే ప్రధాన ప్రయోజనం.... వ్యయాలు తక్కువగా ఉండటం. ఇవి సూచీలను ప్రతిబింబిస్తాయి. సెన్సెక్స్ లేదా నిఫ్టీల రాబడులను మించి రాబడులను సా«ధించడమనేది ప్రతి ఇన్వెస్టర్ ఆశించే లక్ష్యాల్లో ప్రధానమైనది. ఈ లక్ష్యాన్ని అయితే ఇండెక్స్ ఫండ్స్తో సాధించలేం. ఇండెక్స్ ఫండ్స్కు ఉన్న ప్రధాన అవరోధం ఇదే. 2018లో గానీ, 2019లో గానీ ఏ ఫండ్ కూడా ఇండెక్స్ ఫండ్ను మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. అయితే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చాలా ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్కు మించిన రాబడులనిచ్చాయి. సూచీల స్థాయి రాబడులు చాలు, వ్యయాలు తక్కువగా ఉండాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయదల్చుకున్నా, ఇండెక్స్ ఫండ్స్ను మించి రాబడులు రావాలనుకున్నా, ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోవడమే మేలు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే అవసరాల కోసం ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ప్రీమియమ్ను వెనక్కి ఇచ్చే బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ అవసరాలను తీర్చుకోవచ్చా? ఇది సరైన నిర్ణయమేనా? –సూరి, విశాఖపట్టణం ఇది అస్సలు సరైన నిర్ణయం కాదు. బీమా వేరు. ఇన్వెస్ట్మెంట్ వేరు. ఈ రెండింటి అవసరాలు కూడా వేర్వేరుగా ఉన్నట్లుగానే, మదుపు కూడా విడివిడిగానే ఉండాలి. ఎప్పుడూ ఈ రెండింటిని కలపకూడదు. ప్రీమియమ్ వెనక్కి ఇచ్చే బీమా పాలసీలు ఒక విధంగా చెప్పాలంటే ఎరల్లాంటివే. బీమా అవసరాల కోసం పూర్తిగా టర్మ్ ప్లాన్లనే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్, తగిన ఆరోగ్య పాలసీలు తీసుకుంటే ఇక వేరే బీమా ప్లాన్ల కోసం ఆలోచించాల్సిన పని లేదు. ఇక రిటైర్మెంట్ అవసరాల కోసం కనీసం పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగేలా ఉంటే, ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోండి. ఈ ఫండ్స్లో నెలకు కొంత మొత్తం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ప్రతీ ఏడాది ఈ మొత్తాన్ని కనీసం 10 శాతమైనా పెంచండి. కనీసం రెండేళ్లకొకసారైనా మీ పోర్ట్ఫోలియోను సమీక్షిస్తూ ఉండండి. నేను ఇటీవలనే రిటైరయ్యాను. క్రమం తప్పని ఆదాయం కోసం మాలాంటి రిటైరైన వ్యక్తులకు అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఏంటి? –ప్రభాకర్, విజయవాడ రిటైరైన తర్వాత పెన్షన్ తప్ప మరో ఆదాయం ఉండదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. క్రమం తప్పని ఆదాయం వచ్చేలా ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకోవాలి. గతంలో జీవితం సాఫీగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. గతంలో డిపాజిట్లు, బాండ్లు, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, లేదా ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్)ల్లో ఇన్వెస్ట్ చేస్తే, ఈ సాధనాలన్నీ ద్రవ్యోల్బణాన్ని బీట్ చేసే రాబడులనిచ్చేవి. భవిష్యత్తులో ఈ ఇన్వెస్ట్మెంట్స్ సాధనాలకు ఇంత సీన్ ఉంటుందనుకోవడం లేదు. వీటిపై రాబడులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నాయి. రిటైరైన తర్వాత అధిక రిస్క్ తీసుకోకూడదు. అధిక రిస్క్ తీసుకుంటే, అధిక రాబడులు వచ్చే విషయం వాస్తవమే అయినప్పటికీ, ఒక వేళ నష్టాలు వస్తే, దానిని భరించడం కష్టసాధ్యమే. అయినప్పటికీ, రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే. రిటైరైన వాళ్లకు వేరే సంపాదన ఉండదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్పైననే ఆధారపడి ఉండాలి. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. కోటి వచ్చాయనుకుందాం. 8 శాతం రాబడి లెక్కన నెలకు రూ.66,000 వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నెల గడవడానికి ఈ మొత్తం సరిపోతుంది. కానీ ఐదేళ్ల తర్వాత? ద్రవ్యోల్బణం 10 శాతం చొప్పున లెక్కేసుకుంటే, మీకు ఇంకా ఎక్కువ మొత్తమే అవసరం. ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు వృద్ధిని కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ సాధించాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డెట్ ఫండ్స్ వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు మీ పెట్టుబడికి రక్షణ నిస్తాయే కానీ, పెద్దగా రాబడులను ఇవ్వలేవు. మీ పెట్టుబడి వృద్ధి చెందేలాగా, భవిష్యత్తు అవసరాలు తీరేలాగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. దీనికి అసెట్–అలకేషన్ విధానాన్ని అనుసరించవచ్చు. మీ మొత్తం పెట్టుబడుల్లో 30–40 శాతాన్ని ఈక్విటీలో, మిగిలింది డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. -
ఏప్రిల్లో సేవలు పేలవం: నికాయ్
న్యూఢిల్లీ: సేవల రంగం ఏప్రిల్లో నీరసించింది. ఇండెక్స్ 51గా నమోదయినట్లు నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ తెలియజేసింది. సూచీ ఈ స్థాయికి కిందకు రావడం ఏడు నెలల్లో ఇదే తొలిసారి. కొత్త వ్యాపారాల్లో స్వల్ప పెరుగుదల, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి తాజాగా సేవల రంగం సూచీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నికాయ్సూచీ 50 పైన కొనసాగితే దానిని వృద్ధిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన సేవల రంగం వరుసగా 11 నెలల నుంచీ 50 పైనే కొనసాగుతోంది. తయారీ కూడా నెమ్మదే...! భారత తయారీ రంగం వృద్ధి ఏప్రిల్లో నెమ్మదిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనిశ్చితి ప్రభావం ఏప్రిల్లో తయారీ రంగంపై కనిపించింది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్లో 51.8గా నమోదయ్యింది. మార్చిలో ఇది 52.6 పాయింట్లు. ఆగస్టు తరువాత ఇంత తక్కువ స్థాయికి (51.8) సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన పాయింట్లు కొనసాగడం ఇది వరుసగా 21వ నెల. సేవలు, తయారీ రెండూ కలిపినా నిరాశే.. కాగా సేవలు, తయారీ రంగం రెండూ కలిసిన నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా నిరాశగానే ఉంది. మార్చిలో 52.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ ఏప్రిల్లో 51.7కు తగ్గింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్ 3 నుంచి 6వ తేదీ మధ్య జరుగనున్న నేపథ్యంలో ఈ తాజా గణాంకాలు వెలువడ్డాయి. -
నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్లు షురూ
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు తమ పోర్టిఫోలియో రిస్కును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు.. నిఫ్టీ 50 ఇండెక్స్లో మరో అదనపు హెడ్జింగ్ సాధనం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రధాన సూచీలో తాజాగా వారాంత ఆప్షన్లను నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ప్రారంభించింది. మూడు నెలలు, త్రైమాసికం, అర్థ సంవత్సరాంత ఆప్షన్లకు సరసన వీక్లీ ఆప్షన్లు కూడా సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ విక్రం లిమాయే వెల్లడించారు. ఈయన మాట్లాడుతూ.. ‘నిఫ్టీ 50 ఇండెక్స్ డెరివేటీవ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రేడవుతున్నాయి. ఈ ప్రధాన సూచీ ఎక్సే్ఛంజ్ ప్లాగ్షిప్ ఇండెక్స్.’ అని అన్నారు. ఇక నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో వీక్లీ ఆప్షన్లకు కూడా సెబీ వద్ద నుంచి ఎన్ఎస్ఈ అనుమతి పొందిన విషయం తెలిసిందే కాగా, ఈ సూచీ ట్రేడింగ్ను సైతం త్వరలోనే ప్రారంభించనుందని సమాచారం. -
నవంబర్లో తయారీరంగం మెరుపులు
న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి ఎన్నడూ లేదని నికాయ్ ఇండియా పేర్కొంది. నిజానికి ఈ ఇండెక్స్ 50 పైన ఉంటే, వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రకారం– గడచిన 16 నెలల కాలంలో తయారీ పీఎంఐ 50 పైనే ఉంది. తాజా పరిస్థితి చూస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశావహ పరిస్థితులూ ఏర్పడుతున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, నివేదిక రూపకర్త పోల్యానా డీ లీమా పేర్కొన్నారు. వచ్చే 12 నెలల్లో కూడా తయారీ రంగానికి మంచి మార్కెట్ పరిస్థితులే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. -
టాటామోటర్స్ నిర్ణయంతో షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలన్న టాటామోటర్స్ నిర్ణయం తొలుత తమకు షాక్ కలిగించిందని టాటా హిటాచీ సీనియర్ డైరెక్టర్ షిన్ నకజిమా చెప్పారు. అలాంటి అనూహ్య నిర్ణయాన్ని ఊహించలేదన్నారు. హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలివీ... టాటా హిటాచీ జాయింట్ వెంచర్లో వాటాలను విక్రయానికి ఉంచినట్లు టాటామోటర్స్ గత త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది కదా! ఈ విక్రయం ఎంతవరకు వచ్చింది? ఒక్కసారిగా టాటాల నుంచి అలాంటి ప్రతిపాదన రావడం విస్మయం కలిగించింది. నిజానికి టాటా హిటాచీ జాయింట్ వెంచర్లో పూర్తి వాటా తీసుకునేందుకు హిటాచీకి ఏ అభ్యంతరమూ లేదు. అలాంటప్పుడు మాతో నేరుగా చర్చిస్తారనుకున్నాం. ఈ లోపే టాటాల నుంచి ప్రకటన వచ్చింది. అనంతరం జపాన్ నుంచి హిటాచీ ప్రతినిధులు వచ్చి చర్చలు జరిపారు. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. జేవీలో ఎవరి వాటా ఎంత? కంపెనీ పనితీరు ఎలా ఉంది? జేవీలో టాటామోటర్స్కు 40 శాతం, హిటాచీకి 60 శాతం వాటా ఉంది. మాంద్యం సమయంలో కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవటం నిజమే. కానీ 2015 నుంచి మంచి పనితీరు కనబరుస్తోంది. ప్రస్తుతం లాభాల్లోనే నడుస్తోంది. అందుకే వాటాలు విక్రయించాలని టాటా మోటర్స్ భావించి ఉండొచ్చు. వీలున్నంతవరకు జేవీలో వాటాలను విక్రయించడం జరిగితే హిటాచీనే సొంతం చేసుకుంటుంది. రూపీ క్షీణత ఎంతవరకు ఉండవచ్చు? రూపాయిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన చర్యలు త్వరలో ఫలితాలనివ్వవచ్చు. రూపీ స్వల్పకాలానికి 74– 75 రేంజ్లో స్థిరత్వం పొందవచ్చు. యెన్ కదలికలు ఇండో జపనీస్ కంపెనీలపై ఎలా ఉండొచ్చు? డాలర్ ఇండెక్స్ బలపడటంతో ఇతర కరెన్సీల్లాగానే యెన్ సైతం బలహీన పడింది. అయితే ఇటీవల కాలంలో తిరిగి యెన్ పుంజుకుంది. యెన్ బలపడితే ఇండో జపనీస్ కంపెనీలకు ఇబ్బందులు ఉండొచ్చు. కానీ డాలర్ స్థిరపడితే యెన్, రూపీల్లో సైతం స్థిరత్వం వస్తుంది. కరెన్సీల్లో ఈ కల్లోలం మరికొన్ని త్రైమాసికాలు కంపెనీల ఫలితాలపై నెగిటివ్ ప్రభావం చూపవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఎకానమీలు బుల్లిష్గా మారుతున్నాయి. -
జూన్లో బాగుపడ్డ ‘సేవలు’: నికాయ్
న్యూఢిల్లీ: సేవల రంగం జూన్లో తిరిగి వృద్ధిబాటలోకి ప్రవేశించింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.6గా నమోదయ్యింది. మే నెలలో ఈ ఇండెక్స్ అసలు పెరక్కపోగా, క్షీణత (49.6) నమోదయిన సంగతి తెలిసిందే. నికాయ్ ఇండెక్స్ ప్రకారం, 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన క్షీణతగా భావిస్తారు. జూన్లో నమోదయిన శాతం ఈ ఏడాదిలో ఇంతవరకూ నమోదుకాకపోవడం మరో విశేషం. తయారీ–సేవలు రెండూ చూస్తే... రెండు ప్రధాన విభాగాలైన తయారీ–సేవల రంగాలను చూస్తే, మే నెలలోలో నికాయ్ సూచీ 50.4 శాతం ఉన్న సూచీ జూన్లో 53.3కు పెరిగింది. -
భారత్@42
న్యూఢిల్లీ: పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనా రిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్కు 32వ స్థానం దక్కగా 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసా గుతోంది. కాగా, ఈ లిస్ట్లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది. బ్రిటన్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది. భారత్లో దోషపూరిత ప్రజాస్వామ్యం! దేశంలో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం అంశాల్లో మొత్తమ్మీద పది పాయింట్లకు గాను 9.17 దక్కగా పౌరస్వేచ్ఛ, రాజకీయ సంస్కృతి, ప్రభుత్వ పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం అంశాల్లో వెనుకబడినట్లు ఈఐయూ పేర్కొంది. లౌకిక దేశంలో అతివాద హిందూ ధోరణులు, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై హింస పెరగటమే భారత్ స్థానం పడిపోవటానికి కారణమంది. భారత్లో మీడియా స్వేచ్ఛ కూడా పాక్షికంగానే ఉందని, ఛత్తీస్గఢ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పాత్రికేయులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపింది. అట్టడుగున ఉత్తరకొరియా: దోషపూరిత ప్రజాస్వా మ్య దేశాల్లో.. భారత్తోపాటు అమెరికా(21), జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, హాంగ్కాంగ్ కూడా ఉన్నాయి. మిశ్రమపాలన ఉన్న పొరుగుదేశాలు.. బంగ్లాదేశ్ 92, నేపాల్ 94, భూటాన్ 99, పాకిస్తాన్ 110వ స్థానాల్లో ఉన్నాయి. నిరంకుశపాలిత దేశాల జాబితాలో మయన్మార్ 120, రష్యా 135, చైనా 139, వియత్నాం 140, సిరియా 166వ స్థానంలో ఉండగా, ఉత్తర కొరియాకు అట్టడుగు 167 స్థానం దక్కింది. ప్రపంచ జనాభాలో కేవలం 4.5% మంది సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన కింద జీవిస్తున్నారు. దాదాపు సగం (49.3%) మందికి ఏదో ఒకరకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నట్లు ఈఐయూ గుర్తించింది. -
మార్చిలో తయారీ పరుగు
న్యూఢిల్లీ: తయారీ రంగం మార్చిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.2కు చేరింది. ఐదు నెలల్లో ఈ సూచీ ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. దేశీయంగా, అలాగే అంతర్జాతీయంగా ఎగుమతుల ఆర్డర్లు పెరగడం ఈ సానుకూల ఫలితానికి కారణమని తమ సర్వేలో తేలినట్లు నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన ఉంటే, క్షీణతగా భావించడం జరుగుతుంది. -
స్టాక్ మార్కెట్కు సెన్సెక్స్, నిఫ్టీలే ప్రామాణికం ఎందుకు?
స్టాక్ మార్కెట్కు ప్రామాణికంగా ప్రధాన ఇండెక్స్లనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇండెక్స్లో వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల స్టాక్స్ ఉంటాయి. దేశంలో చాలా స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి. కానీ బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లు మాత్రమే బాగా ప్రాచుర్యం పొందాయి. బీఎస్ఈ 1875లో ఏర్పాటయ్యింది. దీని ప్రామాణిక ఇండెక్స్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్. సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి. ఇవి వివిధ రంగాల్లోని పెద్ద, ఆర్థికంగా బలమైన, షేర్లలో అధిక లిక్విడిటీ ఉన్న కంపెనీలకు చెందినవి. ఇక ఎన్ఎస్ఈ 1992లో ప్రారంభమైంది. దీని బెంచ్మార్క్ ఇండెక్స్ సీఎన్ఎక్స్ నిఫ్టీ. నిఫ్టీలో 23 రంగాలకు చెందిన 50 ప్రముఖ స్టాక్స్ ఉంటాయి. ఈ రంగాలకు సూచీలో ఎంతమేర వాటా ఉందో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్స్లో చూడొచ్చు. సెన్సెక్స్, నిఫ్టీలలో బాగా ట్రేడయ్యే వివిధ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ కంపెనీల స్టాక్స్ ఉంటాయి. అందుకే ఆయా రంగానీలకు చెందిన ఏ చిన్న వార్త అయినా.. సంబంధిత కంపెనీ స్టాక్ విలువను ప్రభావితం చేస్తుంది. అంటే సంబంధిత షేరు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ కంపెనీలు ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న అంశాల వల్ల కూడా ఇవి ప్రభావితమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఈ కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండెక్స్లు కూడా పెరగడం కానీ, తగ్గడం కానీ జరుగుతుంది. అందుకే సెన్సెక్స్, నిఫ్టీలను ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ప్రధాన సూచీలుగా భావిస్తారు. సెన్సెక్స్ లేదా నిఫ్టీ హిస్టారికల్ ట్రెండ్స్(గత ధోరణి)ను విశ్లేషించడం ద్వారా కూడా భారత ఈక్విటీ మార్కెట్ వృద్ధిని అంచనా వేయవచ్చు. -
డాలర్ ఇండెక్స్ స్పీడ్
ప్రపంచ మార్కెట్లను మళ్లీ డాలరు వణికించడం మొదలుపెట్టింది. శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్లో డాలరు ఇండెక్స్ దాదాపు రెండు నెలల గరిష్టస్థాయికి చేరింది. దాంతో యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు, బంగారం, క్రూడ్ క్షీణించాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెల 20,21 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతుందా..లేదా అనే అంచనాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజాగా అమెరికాలో ద్రవ్యోల్బణం స్థాయి 2 శాతం దాటినట్లు గణాంకాలు వెలువడటంతో ఫెడ్ రేట్లు పెంచేదిశగా కదలవచ్చన్న అంచనాలు తిరిగి నెలకొన్నాయి. ఒక్కరోజులో అంతా తారుమారు.. క్రితం రోజు రాత్రి ఆ దేశంలో రిటైల్ అమ్మకాలు క్షీణించినట్లు డేటా రావడంతో గురువారం డోజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ సూచీలు జోరుగా పెరిగాయి. దాంతో శుక్రవారం ఉదయం భారత్తో సహా ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, సింగపూర్, ఆసియా మార్కెట్లు ర్యాలీ జరిపాయి. కానీ అమెరికా ద్రవ్యోల్బణం డేటాతో మళ్లీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకూ ఆ దేశంలో ద్రవ్యోల్బణం 2 శాతం లోపుగానే వుంటోంది. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ద్రవ్యోల్బణం 2 శాతానికి చేరడం కూడా ఒక లక్ష్యం. ఇది పరిపూర్తి అయినందున, ఈ సెప్టెంబర్లో పెంచకపోయినా, డిసెంబర్లో రేట్లు పెరగవచ్చన్న అంచనాలు తాజాగా ఊపందుకోవడంతో డాలరు ఇండెక్స్ ఒక్కసారిగా ర్యాలీ జరిపింది. ప్రపంచంలో పది దేశాల ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం విలువకు అనుగుణంగా ట్రేడయ్యే ఈ ఇండెక్స్ శుక్రవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరిగి 96 స్థాయిని దాటిపోయింది. జులై తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం. వారం రోజుల క్రితం అమెరికా జాబ్స్ డేటా బలహీన ంగా వుండటంతో ఇప్పట్లో ఫెడ్ రేట్లు పెరగవన్న అంచనాలు ఏర్పడి డాలరు ఇండెక్స్ 94 స్థాయి దిగువకు పడిపోయింది. డాలరుకు అభిముఖంగానే అన్నీ... అమెరికా రేట్లు పెంచితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ వృద్ధిబాట పట్టిందనే విశ్వాసంతో కరెన్సీ విలువ పెరుగుతుందన్న అంచనాలు ఏర్పడతాయి. దాంతో ఇతర దేశాల్లోనూ, పుత్తడి తదితర ఆస్తుల్లోనూ ఇప్పటివరకూ పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి నిధుల్ని వెనక్కు తెస్తారన్న ఆశాభావంతో డాలరు పెరుగుతోంది. డాలరు విలువ పెరిగినప్పుడు ఇతర దేశాల కరెన్సీ విలువలు, బంగారం సహజంగానే తగ్గుతాయి. డాలరు ఇండెక్స్లో అధిక వెయిటేజి కలిగిన యూరో, జపాన్ యెన్లు తాజాగా క్షీణించాయి. భారత్ రూపాయి విలువ సైతం ఆఫ్షోర్ మార్కెట్లో 67.10 స్థాయికి తగ్గిపోయింది. ఇక బంగారం ఔన్సు ధర 1,310 డాలర్ల స్థాయికి తగ్గింది. బ్యారల్ క్రూడ్ విలువ 43 దిగువకు పడిపోయింది. యూరప్ సూచీలు అన్నీ క్షీణతతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా స్టాక్ మార్కెట్ 0.6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. -
కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: భారత్లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవాలని నిపుణుల సంఘం సూచించింది. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన నిబంధనలు సరళీకరించాలని, సెన్సెక్స్, నిఫ్టీలలాగా కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ను ఏర్పాటు చేయాలని, ఈ మార్కెట్ ద్వారా కంపెనీలు నిధులు సమీకరించడాన్ని తప్పనిసరి చేయాలని... ఇలా ఈ సంఘం పలు సూచనలు చేసింది. రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ తదితర సంస్థల నామినీలతో కూడిన ఈ సంఘం ఈ మేరకు తన నివేదికను ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎఫ్ఎస్డీసీ) చైర్మన్ అయిన రఘురామ్ రాజన్కు సమర్పించింది. ఈ నివేదికను సెబి చైర్మన్ యు.కె. సిన్హా గురువారం విడుదల చేశారు. నిపుణుల సంఘం సూచనల్లో కొన్ని., ♦ మోసాలు జరిగినప్పుడు సకాలంలో వాటిని వెల్లడించేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనలను సరళీకరించాలి. ♦ కంపెనీలు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కావలసిన నిధుల్లో కొంత భాగాన్ని ఈ బాండ్ మార్కెట్ నుంచే సమీకరించేలా నిబంధనలు రూపాందించాలి. ♦ లిస్ట్ కాని డెట్ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ఫెమా నిబంధలను సవరించాలి. ♦ కార్పొరేట్ బాండ్లలో నేరుగా ట్రేడింగ్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లును అనుమతించేలా ఫెమా, సెబి నిబంధనలను సరళీకరించాలి. -
రిఫరెండం ముందు ఒడుదుడుకులు
రోజంతా హెచ్చుతగ్గులు స్వల్ప తగ్గుదలతో ముగిసిన సూచీలు ముంబై: బ్రిటన్ రిఫరెండం జరిగే రోజు దగ్గరపడుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్లో ఒడుదుడుకుల కు నెలకొన్నాయి. రోజంతా స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 26,617-26,887 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 47 పాయింట్ల క్షీణతతో 26,766 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 8,153-8,138 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 16 పాయింట్లు కోల్పోయి 8,204 పాయింట్ల వద్ద ముగిసింది. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ కొనసాగవచ్చన్న ఆశావహ అంచనాలతో మెజారిటీ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వున్నప్పటికీ, వారు జాగురూకతతో వ్యవహరిస్తున్నారని, దాంతో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని బీఎన్పీ పారిబాస్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవల్కర్ చెప్పారు. టాటా మోటార్స్ 2.5 శాతం డౌన్..: బ్రిటన్ వైదొలిగితే ఆ దేశంలో జాగ్వర్ లాండ్ రోవర్ బ్రాండ్ల ఉత్పత్తి చేస్తున్న టాటా మోటార్స్పై అధిక ప్రభావం పడుతుందన్న అంచనాలతో ఈ షేరులో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరిపారు. దాంతో సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా టాటా మోటార్స్ 2.58 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకూ ఈ షేరు 20 శాతం పెరిగిన నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటుచేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. గెయిల్, హెచ్యూఎల్, ఐటీసీలు 1-2 శాతం మధ్య తగ్గాయి. అదాని పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, కోల్ ఇండియా, లుపిన్ షేర్లు 1-2 శాతం మధ్య పెరిగాయి. -
బానిసత్వంలో భారత్ ది నాలుగో స్థానం!
శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో చంద్రలోకానికి చేరినా.. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. బానిస బతుకుల్లో మాత్రం వెలుగులు కనిపించడం లేదు. ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ప్రత్యేక చట్టాలు తెచ్చినా కార్మికుల శ్రమ దోపిడీ ఆగడం లేదు. నేటికీ కడుపు కాలే కష్టజీవులు బానిసత్వం మాటున దుర్భర జీవితాలను గడుపుతున్నారనడానికి తాజా సర్వేలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తక్కువ వేతనానికి కార్మికులను నియమించుకొని, వారి శ్రమను దోపిడీ చేయడంతోపాటు, బానిసలుగా చూడటంలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉంది. థర్డ్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ పేరిట నిర్వహించిన తాజా సర్వే ఈ నిజాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.6 కోట్లమంది ప్రజలు ఇంకా బానిస జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు సర్వే తేల్చి చెప్పింది. కేవలం భారత దేశంలోనే 1,83,54,700 మంది ఇంకా బానిసలుగా ఉండటమే కాక, వారి పిల్లలను సైతం సెక్స్ వర్కర్లుగా మార్చి వారికి దుర్భర జీవితాన్ని అంటగట్టడమో, లేదంటే కూలీలుగా ఉపయోగించుకోవడమో చేస్తున్నారని సర్వే వెల్లడించింది. హ్యూమన్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ప్రకారం బానిసత్వాన్ని అమలు చేయడంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2014 లో ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా ఉన్న సంఖ్య... రెండేళ్ళలో 2016 నాటికి నాలుగు కోట్లకు పైగా చేరి సుమారు 30 శాతం బానిసత్వం పెరిగిందని తెలిపింది. భారత్ తో పాటు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో కూడ శ్రమ దోపిడీ భారీగానే జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 167 దేశాల్లో చేపట్టిన సర్వేలో భారత్ లోనే అత్యధికంగా బానిస బతుకులు గడుపుతున్నవారు ఉన్నట్లుగా తేటతెల్లం చేసింది. ఆధునిక కాలంలో బానిసత్వ విధానమే మారిపోయిందని, అక్రమ పరిశ్రమల్లో అత్యధికంగా బానిసత్వం కనిపిస్తోందని, అత్యంత లాభదాయక నేర పరిశ్రమల్లో మూడో స్థానంలో యునైటెడ్ నేషన్స్ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధ, ఔషధ పరిశ్రమలు నిలుస్తున్నట్లు తాజా సర్వేలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ ఓ) 21 మిలియన్లమంది ప్రజలు నిర్బంధిత కార్మికులుగా, ఇతర ఆధునిక బానిసత్వ చట్రంలోనూ చిక్కుకున్నారని అంచనా వేస్తోంది. -
టోకు ద్రవ్యోల్బణం ‘యూ’ టర్న్...
* 1- 17 నెలల తరువాత క్షీణతలో నుంచి బయటకు.. * ఏప్రిల్లో 0.34 శాతం * తయారీ రంగం ‘ప్లస్’ ఎఫెక్ట్.. * కొన్ని నిత్యావసరాల ధరలు పైకి.. న్యూఢిల్లీ: తయారీ రంగం అలాగే కొన్ని ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల ఫలితంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం క్షీణదశ నుంచి పెరుగుదల బాటలోకి ‘యూ’ టర్న్ తీసుకుంది. ఏప్రిల్లో 0.34 శాతం రేటు నమోదయ్యింది. అంటే సూచీ 2015 ఏప్రిల్తో పోల్చితే 2016 ఏప్రిల్లో 0.34 శాతం పెరిగిందన్నమాట. క్రూడ్ ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం, సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగం మందగమనం వంటి అంశాల నేపథ్యంలో గడచిన 17 నెలల్లో వార్షికంగా ఏ నెలలోనూ పెరుగుదల నమోదుచేసుకోలేదు. మైనస్లోనే వుంటూ వచ్చింది. 2015 ఏప్రిల్లో ఈ రేటు -2.43 శాతం. ఇటీవల విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 6%కి దగ్గరకు చేరింది. తాజా గణాంకాల నేపథ్యంలో... జూన్ 7 పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రేటు కోత అనుమానమేనని నిపుణులు కొందరు విశ్లేషిస్తున్నారు. కొన్ని నిత్యావసరాలు చూస్తే... పప్పులు (36%), ఆలూ (35%), చక్కెర (16%) ధరలు పెరిగిన వస్తువుల జాబితాలో ఉన్నాయి.కూరగాయల ధరలు 2.21% ఎగశాయి. ఉల్లి ధరలు మాత్రం 5% తగ్గాయి. పండ్ల ధరలు -2.38% తగ్గాయి. ఫుడ్ ఆర్టికల్స్, నాన్-ఫుడ్ ఆర్టికల్స్తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ సూచీ 0.50 శాతం నుంచి 2.34 శాతానికి ఎగసింది. ఇందులో ఫుడ్ ఆర్టికల్స్ రేటు 5.90% నుంచి 4.23%కి తగ్గింది. నాన్-ఫుడ్ ఆర్టికల్స్కు సంబంధించి రేటు -2.9 శాతం క్షీణ దశ నుంచి 7.12 శాతం పెరుగుదల బాటకు మారింది. -
మూడో రోజూ క్షీణత...
♦ 128 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ♦ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్ ముంబై: అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి పట్ల ఇన్వెస్టర్లలో తలెత్తిన అనుమానాల కారణంగా ప్రపంచ ట్రెండ్ను అనుసరిస్తూ భారత్ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసాయి. ఆర్థికాభివృద్ధి అంచనాలు తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయని, ఇందుకుతోడు చమురు ధరల్లో ఒడుదుడుకుల కారణంగా దేశీయ మార్కెట్ క్షీణించిందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 128 పాయింట్ల తగ్గుదలతో 25,102 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 40 పాయింట్ల క్షీణతతో 7,707 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మెటల్ షేర్లలో అమ్మకాలు... చైనా తయారీ రంగం మందగించిందన్న వార్తలతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్లో బేస్ మెటల్స్ ధరలు భారీగా తగ్గడంతో ఇక్కడ మెటల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. టాటా స్టీల్, హిందాల్కో, వేదాంతలు 5 శాతంపైగా క్షీణించాయి. నాన్-సెన్సెక్స్ మెటల్ షేర్లలో సెయిల్ 8 శాతం పతనంకాగా, ఎన్ఎండీసీ 5 శాతం తగ్గింది. మరోవైపు గత నెలలో జేఎల్ఆర్ అమ్మకాలు అమెరికాలో క్షీణించాయన్న వార్తలతో టాటా మోటార్స్ 6 శాతంపైగా పడిపోయింది. సెన్సెక్స్లో అన్నింటికంటే అధికంగా ఆదాని పోర్ట్స్ షేరు 12 శాతం క్షీణించి రూ. 208 స్థాయికి దిగిపోయింది. క్రితం రోజు ఆదాని పోర్ట్స్ ప్రకటించిన ఫలితాల్లో ఇబిటా మార్జిన్లు అంచనాలకంటే తక్కువగా వున్నాయన్న కారణంగా ఈ షేరులో అమ్మకాలు జరిగాయి. అక్షయ తృతీయకు ట్రేడింగ్ వేళలు పొడిగింపు ఈ నెల 9న అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడింగ్ వేళల్ని రాత్రి 7 గంటలవరకూ పొడిగించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. అన్ని విభాగాల్లోనూ సాయంత్రం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసిన తర్వాత 4.30 గంటలకు గోల్డ్ ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ పునర్ప్రారంభమై, 7 గంటలవరకూ కొనసాగుతుందని వివరించాయి. -
మూడు వారాల కనిష్టానికి సెన్సెక్స్
♦ 170 పాయింట్ల క్షీణతతో 25,437 పాయింట్ల వద్ద ముగింపు ♦ జపాన్ మార్కెట్ పతన ప్రభావం ♦ క్యూ4 ఫలితాల పట్ల నిరుత్సాహం ముంబై: జపాన్ మార్కెట్ భారీగా తగ్గడంతో పాటు దేశీయ కార్పొరేట్ల ఫలితాలు నిరుత్సాహపర్చడంతో బీఎస్ఈ సెన్సెక్స్ మూడు వారాల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అలాగే దేశంలో తయారీ రంగ కార్యకలాపాలు తగ్గాయన్న వార్తలు కూడా సెంటిమెంట్ను దెబ్బతీసాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తాజా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించకపోవడంతో ఆ దేశపు మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఈ కేంద్ర బ్యాంక్ నిర్ణయం కారణంగా జపాన్ కరెన్సీ యెన్ పెరిగిపోయింది. దాంతో ఆ దేశంలో ఎగుమతి కంపెనీలు దెబ్బతినే అవకాశం వుండటంతో జపాన్ నికాయ్ సూచి సోమవారం మరో 3.11% పడిపోయింది. ఈ ప్రభావం భారత్ మార్కెట్పై పడిందని విశ్లేషకులు చెప్పారు. చైనాతో సహా పలు ప్రధాన ఆసియా మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ నెలలో దేశంలో తయారీ రంగ కార్యకలాపాలు నెమ్మదించాయంటూ వెలువడిన పీఎంఐ గణాంకాలు మార్కెట్ను కోలుకోనీకుండా చేశాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. టాప్ లూజర్ ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ4లో నికరలాభం భారీగా తగ్గిన కారణంతో వరుసగా రెండో ట్రేడింగ్ రోజు కూడా ఐసీఐసీఐ బ్యాంక్ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. సెన్సెక్స్-30లో అన్నింటికంటే ఈ షేరు అధికంగా 4 శాతం క్షీణించి రూ. 227 వద్ద ముగిసింది. ఈ ప్రభావం మిగిలిన బ్యాంక్ షేర్లపై కూడా పడటంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐలు 1.35 శాతం చొప్పున తగ్గాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 2.66 శాతం, ఆదాని పోర్ట్స్ 1.93 శాతం, భారతి ఎయిర్టెల్ 1.64 శాతం, విప్రో 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం చొప్పున క్షీణించాయి. మరోవైపు సోమవారం కాస్త మెరుగైన ఫలితాలు వెల్లడించిన హెచ్డీఎఫ్సీ స్వల్ప పెరుగుదలతో ముగిసింది. పెరిగిన షేర్లలో బీహెచ్ఈఎల్, గెయిల్, హీరో మోటోకార్ప్లు వున్నాయి. -
వెలుగులో మెటల్, సిమెంట్ షేర్లు
♦ రోజంతా సూచీల హెచ్చుతగ్గులు ♦ చివరకు స్వల్పంగా కోలుకున్న మార్కెట్ ముంబై: రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని క్రితంరోజు చవిచూసిన భారత్ మార్కెట్ బుధవారం స్వల్పంగా కోలుకుంది. రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను పావుశాతమే పెంచడంతో మంగళవారం సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. తాజాగా మెటల్, సిమెంట్ షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా స్వల్ప రికవరీ సాధ్యపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశపు మినిట్స్ బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ట్రేడింగ్ కూడా మందకొడిగా సాగింది. దాంతో 25,000-24,834 పాయింట్ల మధ్య స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 17 పాయింట్ల పెరుగుదలతో 24,901 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 7,614 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే ఫెడ్ మినిట్స్ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు మందకొడిగా వున్నందున, భారీ పెరుగుదల సాధ్యపడలేదని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. టాటా స్టీల్ టాప్ గెయినర్... మెటల్, సిమెంటు షేర్లకు భారీ కొనుగోలు మద్దతు లభించింది. యూరప్ ప్లాంట్ల అమ్మకానికి సంబంధించిన లావాదేవీ త్వరలో జరగవచ్చనే అంచనాలతో పాటు ఒడిస్సా మైనింగ్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ క్లియరెన్స్ రావడంతో టాటా స్టీల్ 5.24 శాతం పెరిగి రూ. 328 వద్ద ముగిసింది. ఇదేబాటలో హిందాల్కో 4.5 శాతం, వేదాంత 2 శాతం మేర పెరిగాయి. సిమెంటు షేర్లు అల్ట్రాటెక్, ఏసీసీ, గ్రాసిమ్లు 1.5-3 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
♦ షార్ట్ కవరింగ్తో లాభాలు ♦ 115 పాయింట్ల లాభంతో 24,338కు సెన్సెక్స్ ♦ 42 పాయింట్ల లాభంతో 7,404కు నిఫ్టీ ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. దీనికి షార్ట్ కవరింగ్ కూడా తోడవడంతో మన స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ 7,400 కీలక పాయింట్లను దాటింది. ఇటీవల పతనం కారణంగా బాగా తగ్గి నష్టపోయిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 24,338 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7,404 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ, దివాళా బిల్లులు ఆమోదం పొందగలవని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేయడం సెంటిమెంట్కు ఊపునిచ్చింది. రూపాయి 52 పైసలు బలపడడం సానుకూల ప్రభావం చూపింది. ఫార్మా షేర్లు కుదేల్ అన్ని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్(ఏపీఐ)లను అమెరికాలోనే తయారు చేయడం తప్పనిసరని అమెరికా పేర్కొనడంతో ఫార్మా షేర్లు కుదేలయ్యాయి. ముడి చమురు ధరలు పెగరడంతో విమానయాన షేర్లు నష్టపోయాయి. ఉక్కు ఉత్పాదకతను తగ్గించాలన్న చైనా నిర్ణయంతో ఉక్కు కంపెనీల షేర్లు పెరిగాయి. టీమ్ లీజ్ ఐపీఓకు మంచి స్పందన రిక్రూటింగ్ సేవలందించే టీమ్లీజ్ సర్వీసెస్ సంస్థ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. గురువారం ముగిసిన ఈ రూ.423 కోట్ల ఐపీఓ 66 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. -
గురువు... ప్రవహించే జ్ఞానం
తరగతి గదే సమాజం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమాలకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది. విశ్లేషణ చుక్కా రామయ్యగారు లబ్ధప్రతి ష్టులైన, జనామోదం పొందిన విద్యావేత్త. లబ్ధప్రతిష్టులైన వారం దరూ జనామోదం పొందిన వారు కాకపోవచ్చు. జనామోదం ఉన్న వారు లబ్ధప్రతిష్టులు కానక్కర లేదు. ఈ రెండూ ఒక్కరిలో కలసి సాగిపోవాలంటే, విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు మేళవించే శక్తి సామర్థ్యాలుండాలి. రామయ్యగారిలో ఈ శక్తి సామ ర్థ్యాలు అపారంగా ఉన్నాయి. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన విద్యాలక్ష్యాల గురించీ, సమాజానికి విద్యా వ్యవస్థకు ఉండాల్సిన సంబంధాల గురించీ ఆయనకు స్పష్ట మైన అవగాహన ఉంది. ఉపాధ్యాయ వృత్తి ఎడల ఉండవ లసిన గౌరవానికీ, నిబద్ధతకూ ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే రామయ్యగారంటే నాకెంతో అభిమానం. ప్రజా పోరాటాల్లో పాల్గొన్న, పాల్గొంటున్న నేపథ్యంతో, పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ సాగిన అధ్యాపన అనుభవంతో రామ య్యగారు విస్తృతంగా రచనలు చేశారు, చేస్తున్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించడం కోసం ఒక తరాన్ని ఎప్ప టికప్పుడు తయారుచేయడమే 'విద్య' ప్రధాన లక్ష్యంగా ఆయన భావించారు. ఈ లక్ష్యమే ఆయన రచనల్లో అంతస్సూ త్రం. ఆ కోవకు చెందినదే రామయ్యగారి ప్రస్తుత రచన 'విద్యాక్షేత్రం తరగతి గది' రామయ్య గారి అధ్యాపక అనుభవ సారం ఈ పుస్తకం. అందుకే ఈ పుస్తకానికి ముందుమాట రాయడం గౌరవంగా, నేర్చుకునే అవకాశంగా భావిస్తు న్నాను. గురుకులం నుంచి తరగతి గది వరకు, అక్కడి నుంచి virtual classroom వరకు జరుగుతున్న విద్యారంగ ప్రస్థానం సామాజిక ప్రస్థానంలో భాగమే. సాంప్రదాయ సామాజిక వ్యవస్థల విద్యావ్యవస్థ ప్రతిరూపమే గురుకు లాలు. పారిశ్రామిక వ్యవస్థల ప్రతిరూపమే తరగతి గదుల విద్యావ్యవస్థ. ఆధునిక సమాజాల (Post Industrial Societies) ప్రతిరూపమే virtual classrooms. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ రూపాలు కూడా మారుతుంటాయి. తరగతి రూప స్వభావాలు మారుతున్నప్పటికీ, నేటి విద్యావ్యవస్థలో తరగతి గది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. రామయ్యగారి మాటల్లో చెప్పాలంటే, 'తరగతి గది ఒక పవిత్రమైన క్షేత్రం. తల్లి గర్భకోశం లాంటిది. సమాజ సూక్ష్మ ప్రతిబింబం.'తరగతి గదిని కేంద్రంగా చేసుకుని, తన అధ్యాపక జీవితంలో తరగతి గది నేర్పిన పాఠాలెన్నింటినో రామయ్యగారు మనకందించారు. ప్రపంచ భవిష్యత్తు తరగతి గదుల్లో లిఖితమవుతుం దనే ప్రగాఢ విశ్వాసం రామయ్యగారికుంది. అందుకే, భువ నగిరి పాఠశాల నుంచి నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కళా శాల వరకూ సాగిన అధ్యాపక ప్రస్థానంలో పిల్లల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను కదిలించి కార్యాచరణకు సిద్ధం చేయడంలోని తన అనుభవాలను మనకందించారు. పిల్లల దగ్గర నుంచి తాను నేర్చుకున్న పాఠాల నుంచి, పిల్లలకు తను నేర్పిన పాఠాల వరకూ ఎన్నెన్నో విషయాలను సందర్భోచితంగా వివరించారు. అనుభవాల నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని సందర్భోచితంగా అన్వయించడం రామయ్యగారి ప్రత్యేకత. చాలా మందికి అనుభవం ఉంటుంది కానీ, నేర్చుకోలేరు. నేర్చుకున్న దానిని అన్వయించలేరు. కనుకనే సరళమైన భాషలో రామయ్యగారు అందించిన తరగతి గది నేర్పిన పాఠాల సూత్రీకరణలు నేటి తరానికి దిక్చూచిలా ఉపకరిస్తాయి. పాఠశాల అంటే బల్లలు, భవనాలు, కట్టడాలు కావు. పాఠశాల అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థుల సంబంధం, అనురాగం, ప్రజాస్వామిక చర్చ, మేధోమథనం అనంటారు రామయ్యగారు. విద్యార్థి అధ్యాపక సంబంధాలే విద్యా వ్యవస్థ మౌలిక అంశంగా గుర్తిస్తూ, ఆ సంబంధాలే ఏ విధంగా విద్యార్థి భవిష్యత్తును.. సమాజ భవిష్యత్తును ప్రభా వితం చేస్తాయో వివరించడం జరిగింది. తరగతి గదే సమా జం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలం గాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమా లకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది. రామయ్యగారు విదేశాలలోని తరగతి గదుల అనుభవాలని, ముఖ్యంగా అమె రికా, ఫిన్లాండ్ దేశాల అనుభవాలని, మన దేశ అనుభవంతో పోల్చి విశ్లేషిం చారు. మనదేశంలో ప్రశ్నలకు సమాధా నాలు చెప్పడాన్ని నేర్పడానికి ప్రాధాన్య తనిస్తే అమెరికాలో సమాధానాన్ని ప్రశ్నిం చడానికి ప్రాధాన్యత ఉంటుంద న్నారు రామయ్యగారు. ప్రతిదేశానికి ప్రత్యేక మైన తరగతి గది కల్చర్ ఉంటుందని, ఇతర దేశాల తరగతి గది కల్చర్ని మన దేశంలోకి తేవాలనుకుంటే చాలా జాగ్ర త్తలు పాటించాలని హెచ్చరించారు. ప్రతిదీ స్విట్జర్లాండ్ నుంచో, అమెరికా నుంచో దిగుమతి చేసుకోవాలనుకునే వాళ్లకిదో మంచి హెచ్చరిక. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తరగతి గది నేర్పిన పాఠాలు తెలంగాణ విద్యావ్యవస్థ పున ర్నిర్మాణానికి, దిశా నిర్దేశానికి ఎంతగానో తోడ్పడతాయి. కార్పొరేట్ శక్తులు విద్యాలయాలను మురికికూపాలుగా మారుస్తున్నాయని రామయ్యగారు హెచ్చరించారు. ఈ తరుణంలో తరగతి గదుల్లో ప్రజాస్వామిక స్వభావాన్ని, సోషలిజాన్ని ఆచరణాత్మకంగా చూపాలని ఆశించారు. ఉపాధ్యాయుల నియామకాలలో జాగ్రత్త వహించాలని, ఫిన్లాండ్ దేశంలో లాగా ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉపాధ్యాయునికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని.. ఉపాధ్యాయుని పనిని అంచనా వేసేటప్పుడు సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రామయ్యగారి ఈ సూచనలు తెలంగాణ విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ఎంత గానో తోడ్పడతాయి. నేర్చుకోవడానికి తగిన వాతావరణం సృష్టించే కేం ద్రంగా తరగతి గదులను తయారు చేయడంలో అధ్యాప కుని పాత్ర గురించి రామయ్యగారు చేసిన సూచనలు, చెప్పిన పద్ధతులు పాటిస్తే తెలంగాణ విద్యార్థులకు ఎంతో సేవ చేసినవారమవుతాము. ప్రవహించే జ్ఞానానికి ఉపా ధ్యాయుడు ‘ప్రతీక’ కావాలనేది రామయ్యగారి కోరిక. ఇప్పుడు మనందరి కోరిక కూడా అదే. (చుక్కా రామయ్య 89వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన 'పాఠం'పుస్తకాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు. ఆ పుస్తకానికి ప్రొ॥వి.ఎస్. ప్రసాద్, ఫార్మర్ డెరైక్టర్, న్యాక్ అందించిన ముందుమాట ఇది.) ప్రొ॥వి.ఎస్.ప్రసాద్ -
స్థూలంగా... సూక్ష్మంగా...
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. అయితే వాస్తవాలేమిటో పరిశీలిద్దాం. అపోహ: స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటే. వాస్తవం: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీయులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అనే ప్రమాణాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి శరీర బరువును కిలోగ్రాములలో తీసుకొని, దానిని ఆ వ్యక్తి ఎత్తు (మీటర్లు) స్క్వేర్తో భాగిస్తే వచ్చే విలువే బీఎమ్ఐ. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 120 కిలోగ్రాములు, ఎత్తు 1.83 మీటర్లు (ఆరడుగులు) అనుకుందాం. ఆ వ్యక్తి బీఎమ్ఐ 120 / 1.83 ్ఠ 1.83 = 35.8. ఇలా లెక్కించిన విలువను ఈ కింది బీఎమ్ఐ పట్టికతో పోల్చి చూసుకుంటే మీ స్థూలకాయ స్థాయి ఏమిటో తెలుస్తుంది. బీఎమ్ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వుశాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మనకు తక్కువ స్థూలకాయం ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. భారతీయుల్లో స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్తో పాటు నడుము చుట్టుకొలత, నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మొదలైన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. నడుం చుట్టుకొలత మహిళల్లో 80 సెం.మీ. కంటే ఎక్కువగా, పురుషుల్లో 90 సెం.మీ. కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లు. ఇక నడుమూ-హిప్ చుట్టుకొలతల నిష్పత్తి మహిళల్లో 0.8 కంటే ఎక్కువగానూ, పురుషుల్లో 0.9 కంటే ఎక్కువగానూ ఉంటే స్థూలకాయ సమస్య ఉన్నట్లుగా పరిగణించాలి. అపోహ: స్థూలకాయం అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య మాత్రమే. వాస్తవం: నిజానికి స్థూలకాయ సమస్యను ఒక వ్యాధిగా పరిగణించాలి. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం మూలకారణం. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా అనేక వైద్యపరమైన సమస్యలకు స్థూలకాయం మొదటిమెట్టు. అపోహ: పొట్ట చుట్టూ మాత్రమే కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరం కాదు. వాస్తవం: నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవక్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం తీసుకున్న ఆహారం పేగులలో జీర్ణమై, రక్తంలోకి చేరుతుంది. సగటున మనిషికి రోజుకు 2000 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అవసరానికి మించి క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని మనం తీసుకుంటే, శరీర అవసరాలకు పోగా మిగిలిన శక్తిని శరీరం కొవ్వురూపంలోకి మార్చుకొని నిలువ చేసుకుంటుంది. అయితే శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది ముందుగానే నిర్ణయమై ఉంటుంది. ఈ విలువను ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటారు. ఉదాహరణకు 60 కేజీలు ఉండాల్సిన వ్యక్తి 120 కేజీల బరువు ఉన్నాడనుకుందాం. అంటే ఆ వ్యక్తి 60 కేజీల అదనంగా బరువున్నట్లు. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్పాయింట్ 60 కేజీలు. కొంతమంది తక్కువ తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. ఇంకొంత మంది ఎక్కువ తింటున్నప్పటికీ సన్నగానే ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్న వ్యక్తుల్లో సెట్పాయింట్ ఎక్కువగా, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల (కూల్డ్రింక్లు, ఐస్క్రీములు, స్వీట్లు, కేక్లు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కట్లు మొదలైన వాటివల్ల) సెట్పాయింట్ పెరుగుతుంది. ఒకసారి పెరిగిన సెట్పాయింట్ మళ్లీ తగ్గదు. ఈ సెట్పాయింట్ మన మనసు అధీనంలో ఉండదు. ఇది మన శరీర ఉష్ణోగ్రత సెట్పాయింట్ లాంటిదే. మన శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారిన్హీట్గా సెట్ అయి ఉంటుంది. దీనిని మనసులో అనుకుని మనం ఎలా మార్చలేమో, అలాగే ‘సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ను కూడా మార్చలేము. ఈ సెట్పాయింట్ జీర్ణవ్యవస్థలో తయారయ్యే కొన్ని హార్మోన్ల అధీనంలో ఉంటుంది. వీటిలో ముఖ్యమైనవి గ్రెలిన్, జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1). గ్రెలిన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది ఆకలిని పెంచే హార్మోన్. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ ఎక్కువగా తయారై ఆకలి పెరుగుతుంది. కడుపునిండా ఆహారం తీసుకుంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి తగ్గుతుంది. అలాగే చిన్న పేగు చివరి భాగంలో జీఎల్పీ-1 హార్మోన్ తయారవుతుంది. ఇది ఆకలిని తగ్గించే హార్మోన్. చిన్నపేగు చివరి భాగంలోకి జీర్ణంకాని ఆహారం వస్తే జీఎల్పీ-1 ఎక్కువగా తయారై, ఆకలి తగ్గుతుంది. పొట్ట ఖాళీగా ఉంటే ఈ హార్మోన్ తగ్గి ఆకలి పెరుగుతుంది. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలి అన్నది జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్ల నియంత్రణలో ఉంటుందన్నమాట. అపోహ: తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు (వెరీ లో-క్యాలరీ డైట్) వల్ల స్థూలకాయం తగ్గించుకోవచ్చు. వాస్తవం: తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల వల్ల ఉపయోగం తాత్కాలికమే. మార్కెట్లో బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే హెర్బల్ ఆహారం లభ్యమవుతోంది. కానీ వీటివల్ల కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. ఈ పదార్థాలు వాడటం వల్ల కొంత బరువు తగ్గినప్పటికీ సెట్పాయింట్ ప్రభావం వల్ల ఆరునెలల నుంచి ఐదేళ్లలోపల మనం కోల్పోయిన బరువు తిరిగి పెరుగుతాం. అపోహ: బరువు తగ్గాలంటే లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం. వాస్తవం: ఈ పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. చాలామంది బరువు తగ్గించుకోడానికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి బాడీ షేపింగ్కు ఉపయోగపడే కాస్మెటిక్ ఆపరేషన్లు. ఇవి స్థూలకాయ సమస్యను పరిష్కరించలేవు. ఈ విధానాల వల్ల కూడా శరీరంలోని కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. డైటింగ్, వ్యాయామం ద్వారా బరువు తగ్గగలిగేవారికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం లేదు. అలా తగ్గలేని వారు లైపోసక్షన్, కూల్స్కల్ప్టింగ్ ద్వారా కూడా తగ్గలేరు. పైగా కొంతకాలం తర్వాత ఇంకాస్త బరువు పెరుగుతారు. అపోహ: బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు తగ్గడానికి మూలకారణం ఆహారం ఎక్కువగా తీసుకోలేకపోవడం. వాస్తవం: బేరియాట్రిక్ సర్జరీ జీర్ణవ్యవస్థలో తయారయ్యే హార్మోన్లను మార్చి కొవ్వు సెట్పాయింట్ను తగ్గిస్తుంది. దీని కారణంగా బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ కారణంగా కొవ్వును నియంత్రించే కొన్ని హార్మోన్లలో (గ్రెలిన్, జీఎల్పీ-1) మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల కొవ్వు సెట్పాయింట్ తగ్గుతుంది. దాంతో బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎక్కువ ఆహారం తినలేరు. కొన్ని ఆపరేషన్ల తర్వాత ఆహారం శరీరంలోకి ఇంకిపోయే ప్రక్రియ మందగిస్తుంది. ఈ రెండిటి కారణంగా బరువు తగ్గుతారని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి బరువు తగ్గడానికి అసలు కారణం హార్మోన్ల మార్పుల వల్ల కొవ్వు సెట్పాయింట్ తగ్గడమే. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. బేరియాట్రిక్ ఆపరేషన్ల తర్వాత ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. -నిర్వహణ: యాసీన్ అపోహ: డైటింగ్, వ్యాయామంతో బరువు తగ్గుతుంది. వాస్తవం: బీఎంఐ 30, అంతకంటే ఎక్కువగా ఉన్నవారిలో డైటింగ్, వ్యాయామం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోవు. పరిమిత ఆహారం, వ్యాయామం స్థూలకాయం రాకుండా చూసుకోడానికి, ఫిట్నెస్ కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి స్థూలకాయం వస్తే వీటిద్వారా మాత్రమే శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. నూటికి తొంభైమంది డైటింగ్, వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడంలో విఫలమవుతారు. అయితే మొదట్లో కొన్ని కిలోలు బరువు తగ్గిచుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. డైటింగ్, వ్యాయామంతోనే స్థూలకాయం ఎందుకు తగ్గదంటే, ఇవి కొవ్వు సెట్పాయింట్ను మార్చలేవు. డైటింగ్ చేసే సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటాం. దీంతో కడుపు నిండదు. ఫలితంగా ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరిగి ఆకలి పెరుగుతుంది. అలాగే చిన్నపేగులలో తయారయ్యే ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 హార్మోన్ ఉత్పత్తి తగ్గి, ఆకలి పెరిగిపోతుంది. కొవ్వు సెట్పాయింట్ ప్రభావం వల్ల డైటింగ్ చేసిన ప్రతిసారీ జీవక్రియలు నెమ్మదించి శక్తి వేడిరూపంలో బయటకువెళ్లడం ఆగిపోతుంది. డైటింగ్ ఒక సమయానికి మించి కొనసాగిస్తే ఈ మార్పులు విపరీతంగా పెరిగి ఆకలికి తట్టుకోలేక తెలియకుండానే తినేస్తారు. దీంతో తిరిగి బరువు పెరుగుతారు.