inventions
-
నొప్పిని తగ్గించే మార్గం.. సరికొత్త ఆవిష్కరణ: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఏముంది? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. సిరలను గుర్తించడానికి పరారుణ కాంతిని ఉపయోగించడం చూడవచ్చు. రక్తం తీసుకునేటప్పుడు సిరలను గుర్తించడం కొంత కష్టమైన పని. ఈ టెక్నాలజీ ద్వారా సిరలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇది వైద్య విధానంలో అతి చిన్న ఆకర్షణీయమైన ఆవిష్కరణ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వేలమంది వీక్షించిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇది నిజంగా గొప్ప టెక్నాలజీ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.Using infrared light to locate veins. Saving the pain from repeated attempts to find a vein when drawing blood. It’s often the smallest, least glamorous inventions which significantly improve our medical experience and hence, the quality of our lives… pic.twitter.com/XgZI8Bcf2m— anand mahindra (@anandmahindra) July 6, 2024 -
‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్
స్మార్ట్ఫోన్లోని డిజిటల్ కెమెరా.. మెమరీ ఫోమ్ పరుపులు.. కారు టైర్లు.. గీతలు పడని లెన్స్.. వాటర్ ఫిల్టర్.. ఇవన్నీ ‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్ తెలుసా? ఎందుకంటే ఇవన్నీ అంతరిక్ష ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లోంచి పుట్టినవి. మనం నిత్యం వాడే వస్తువులుగా మారిపోయాయి. మరి వీటి విశేషాలు ఏమిటో చూద్దామా.. గ్రహాంతర ప్రయోగాలు.. ఫోన్ కెమెరా.. ►శాటిలైట్లలో బిగించేందుకు.. నాసాకు చెంది న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) ఇంజనీర్ యూజీన్ లల్లీ మొదటిసారిగా 1960 దశకంలో డిజిటల్ కెమెరాలను రూపొందించారు. అవి పెద్ద పరిమాణంలో ఉండి, ఎక్కువ విద్యుత్ అవసరం పడేవి. దీంతో తక్కువ సైజులో ఉండే డిజిటల్ కెమెరాలపై పరిశోధన చేసిన జేపీఎల్ ఇంజనీర్ ఎరిక్ ఫోసమ్.. 1990 దశకం మొదట్లో ‘సీఎంఓఎస్– యాక్టివ్ పిక్సెల్ సెన్సర్ (ఏపీఎస్)’ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫోన్ కెమెరాలు, వెబ్క్యామ్లు వంటి మినియేచర్ కెమెరాల్లో వాడుతున్న టెక్నాలజీ ఇదే. అంతరిక్షంలోకి పంపకున్నా.. ఇళ్లలోకి వాటర్ ఫిల్టర్.. ►నాసా చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. వాళ్లకు మంచి నీళ్లు ఎలాగనే పరిశోధనలూ చేసింది. వాడిన నీటిని తిరిగి శుద్ధిచేసుకుని వినియోగించుకునేలా ‘ఎలక్ట్రోలైటిక్ సిల్వర్ అయాన్ జనరేటర్’ను అభివృద్ధి చేసింది. ఈ వాటర్ ఫిల్టర్ను అంతరిక్ష ప్రయోగాల్లో వాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలోకి వచ్చేసింది. అయితే దీనికన్నా మెరుగైన, ఖరీదైన టెక్నాలజీని ‘అపోలో’ ప్రయోగాల్లో వాడారు. స్పేస్ షటిల్లో సీట్లు.. మెమరీ ఫోమ్ పరుపులు ►స్పేస్ షటిల్స్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వాటిలో ఉండే వ్యోమగాము లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలా ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేందుకు నాసా 1960వ దశకంలో ‘పాలీయూరేథీన్ సిలికాన్ ప్లాస్టిక్ (మెమరీ ఫోమ్)’ మెటీరియల్ను అభివృద్ధి చేసింది. స్పేస్ షటిల్ సీట్లలో అమర్చింది. అవే ఇప్పుడు మనం వాడుతున్న మెమరీ ఫోమ్ పరుపులు, దిండ్లు. అనుకోకుండా కనిపెట్టిన.. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్స్.. ►వ్యోమగాములు హెల్మెట్ కోసం గాజును వాడితే ప్రమాదకరం కావడంతో నాసా ఫైబర్ గ్లాస్ను వినియోగించింది. కానీ దానిపై సులువుగా గీతలు పడి ఇబ్బంది వస్తుండటంతో పరిష్కారంపై ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే చిత్రంగా టెడ్ వైడెవెన్ అనే శాస్త్రవేత్త వాటర్ ఫిల్టర్ కోసం చేస్తున్న ప్రయోగాల సందర్భంగా.. స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కళ్లద్దాల నుంచి టీవీలు, మానిటర్లు, ఫోన్ స్క్రీన్ల దాకా ఈ కోటింగ్ను వాడుతున్నారు. మార్స్పై దిగే ప్యారాచూట్ తాళ్లు.. కారు టైర్లు.. ►1976లో నాసా ప్రయోగించిన ‘వైకింగ్ ల్యాండర్’ అంగారకుడిపై సురక్షితంగా దిగేందుకు ప్యారాచూట్లను వినియోగించారు. అసలే మార్స్పై తేలికైన వాతావర ణం, ఎక్కువ బరువున్న ప్రోబ్.. ప్యారా చూట్ తాళ్లు అత్యంత బలంగా ఉండాలి. దీనిపై నాసా విజ్ఞప్తి మేరకు.. ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ’ ఉక్కుకన్నా బలమైన రబ్బర్ మెటీరియల్ను రూపొందించింది. తర్వాత దీనిని వాహనాల టైర్ల తయారీలో వాడటం మొదలుపెట్టారు. ఇంకా ఎన్నో.. ►స్పేస్ ఫ్లైట్లలో, విమానాల్లో వాడేందుకు నాసా తోపాటు యునైటెడ్ ఎయిర్ లైన్స్ శాస్త్రవేత్తలు కలిసి వైర్ లెస్ హెడ్సెట్ను అభివృద్ధి చేశారు. ►నాసా స్పేస్లో ఆల్గే (నాచు)ను ఉపయోగించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుండగా.. పిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ‘బేబీ ఫార్ములా’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ►స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త డోగ్ ఎంగెల్బర్ట్.. నాసా చేసిన ఆర్థిక సాయం, సూచనలతోనే కంప్యూటర్ ‘మౌస్’ను తయారు చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సృజన భళా... ఆరోగ్య మేళా...
సాక్షి, హైదరాబాద్: సూది గుచ్చడం దగ్గర నుంచి సర్జరీ దాకా అవసరమైన సందర్భాల్లో నొప్పి తెలీకుండా చేసే ఉత్పత్తి ఏదైనా ఉంటే? మనం ఇంట్లో కూర్చుని ఓ వైపు మన పని మనం చేసుకుంటుండగానే మన హార్ట్ బీట్, బ్లడ్షుగర్ స్థాయిలు వైద్యునికి తెలిసిపోతూ ఉంటే..? ఆకాశమే హద్దుగా ఆరోగ్యరంగంలో వెల్లువెత్తుతున్న సృజన సాకారం చేస్తున్న అద్భుతాలివి... వీటన్నింటికి అద్దం పడుతోంది నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు. ఇందులో విజేతలుగా నిలిచిన స్టార్టప్లు చేసిన ఆవిష్కరణలు ఇలా.. అందుబాటు ధరలో కృత్రిమ అవయవాలు వైకల్య బాధితులను దృష్టిలో పెట్టుకుని అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉత్పత్తులు రూపొందించాం. ప్రస్తుతం మేము చేతులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ప్రధాన అవయవాలనూ అందుబాటులోకి తెస్తాం. సహజమైన శరీర భాగాల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు రూ7 లక్షల వరకుంటే.. మా ఉత్పత్తులు రూ.1.50 లక్షల్లోనే లభిస్తున్నాయి. – మునీష్ కుమార్, ఎగ్జోబొట్ డైనమిక్స్ సంస్థ సీఈఓ కేన్సర్ మందుల సృష్టితో... అంతర్జాతీయ మార్కెట్ కోసం కేన్సర్ మందులను తయారు చేసే సంస్థని మూడేళ్ల క్రితం ప్రారంభించాం. ఫస్ట్ ఇన్ క్లాస్ మెకానిజమ్తో దేశంలోనే మాది తొలి సంస్థ. లంగ్ కేన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కేన్సర్కు డ్రగ్ను అభివృద్ధి చేశాం. దీనిని త్వరలోనే మనుషుల మీద ప్రయోగించనున్నాం. దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని మెకానిజమ్ను అనుసరిస్తూ ఈ డ్రగ్ను తెస్తున్నందుకే మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. –సీఎస్ఎన్ మూర్తి, సీఈఓ సత్య ఫార్మా ఇన్నోవేషన్స్, హైదరాబాద్ ఆరోగ్యం చెప్పే మెషీన్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కనిపించే వెయింగ్ మెషీన్ తరహాలో ఓ అధునాతన మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ రూపొందించింది. ఈ మెషీన్ మీదకు ఎక్కి స్క్రీన్ ముందు నిలబడి మొబైల్ నంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేస్తే చాలు. మన ఆరోగ్య వివరాలు వాట్సాప్కు వచ్చేస్తాయి. ఇందులో మన బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతోపాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, ఫిట్నెస్ స్థాయిని, డయాబెటిస్ అవకాశాల్ని కూడా అంచనా వేస్తుంది. మెషీన్ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని భవిష్యత్తులో అన్ని ఆసుపత్రుల్లో బహిరంగ ప్రదేశాల్లో అమర్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్ తనికెళ్ల చెప్పారు. ధర రూ.2.50 లక్షలు. నేరుగా వైద్యుడికి నివేదికలు.. ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకోవడంతోపాటు ఆ పరీక్షల ఫలితాలు నేరుగా మన వైద్యునికి చేరేలా ఉత్పత్తులు సృష్టించారు ‘ఆబో 1008 డిజిటల్ హెల్త్ కేర్’ సంస్థకు చెందిన నగరవాసి సత్యదేవ్. పల్స్ రేట్, బీపీ, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర శాతం ఇవన్నీ కలిపి హెల్త్ బోట్ డివైజ్ ద్వారా పరీక్షించుకునే సదుపాయాన్ని తెచ్చారు. అలాగే నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, మహిళల రుతుక్రమ సమస్యలు తెలుసుకునే ఉంగరం మాదిరి ఉండే పరికరాన్నీ రూపొందించారు. చర్మ పరీక్షలు, చెవి, గొంతు సమస్యలు తెలుసుకోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల్ని గుర్తించడానికి ఆబో వన్ డివైజ్లను తయారుచేశారు. ఇంట్లో చేసుకున్న ఈ పరీక్షల రిపోర్టులు నేరుగా వైద్యునికి చేరేలా అప్లికేషన్ రూపొందించామన్నారు. విద్యుత్ అవసరం లేని ‘ఫ్రీజర్’.. కొన్ని రకాల వైద్య చికిత్సల్లో ఉపయోగించే ఉత్పత్తుల్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భధ్రపరచాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటిదాకా థర్మాకోల్తో చేసిన బాక్స్లనే ఉపయోగిస్తుండగా, బయోస్యూర్ పేరుతో షిప్పర్ బాక్స్లను మ్యాక్ఫై అనే సంస్థ రూపొందించింది. విద్యుత్ అవసరం లేకుండా రోజుల తరబడి ఫ్రీజర్ సేవల్ని అందించే ఈ బాక్స్ను వెజిటబుల్స్ దాచుకోవడానికీ వాడొచ్చని సంస్థ చెప్పింది. పేస్ ఛేంజ్ మెటీరియల్ ఉపయోగించి దీన్ని చార్జ్ చేయాల్సి ఉంటుందని, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే నిర్ణీత ఉష్ణోగ్రతను 24గంటలపాటు ఉంచుతుందని పేర్కొంది. అందరికీ ప్రాథమిక వైద్యం కోసం... ప్రాథమిక వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా హెల్త్ కాన్ అండ్ మెడ్ టెక్ స్టార్టప్ లక్ష్యం. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రజలకు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సొల్యూషన్స్, మొబైల్ హెల్త్ సొల్యూషన్స్, అనలటిక్స్ ద్వారా హెల్త్కేర్ను చేరువ చేస్తున్నాం. అపోలో టెలీ హెల్త్తో కలిసి దేశవ్యాప్తంగా 440 కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. బయో ఆసియాలో లభించిన ఈ గుర్తింపు మా సేవలకు మరింత స్ఫూర్తినిస్తుంది. – డా.ప్రణయ్ కార్గ్, ప్రతిభ హెల్త్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఇట్టే గుర్తించే పేపర్ ఆధారిత డివైజ్... రాంజా జీనో సెన్సర్ కూడా టాప్ 5లో నిలిచింది. అమెరికాలోని ఎండీ ఆండర్సన్ కేన్సర్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్కు చెందిన ల్యాంబ్డజెన్ థెరప్యూటిక్స్ కూడా ఈ జాబితాలో నిలిచింది. -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www.teamtsic.telangana,gov.in/intinta-innovator-exhibition-2021 పోర్టల్లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది
మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్’ కాదు. టైమ్ అంటే సందర్భం. వరల్డ్ వార్–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్ బర్త్, డెత్ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్కు కారణమైన హెచ్.ఐ.వి. వైరస్ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి. అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా కెనడా, యూఎస్లలోని మెడికల్ జర్నల్స్ ప్రకటించాయి. ఎయిడ్స్ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి. చేతి వాచీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్ వాచీలకు, పాకెట్ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్ వాచీ’లు. వాటినే రిస్ట్లెట్స్ అనేవారు. ఒక గ్రేట్ వార్ వస్తే కానీ రిస్ట్వాచ్లు తగిలించుకోని ‘గ్రేట్’ పీపుల్ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. జిప్పులు మగవాళ్ల ప్యాంట్లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్లెస్ ఫాస్ట్నర్స్’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్ సండ్బాక్ అనే స్వీడిష్ అమెరికన్ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్లు ఎన్ని మారినా, జిప్ డిజైన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్లు తేల్చేశారు! స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్లెస్ స్టీల్’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్లెస్ స్టీల్ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, మెస్ కిట్ సిల్వర్వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అవిర్భవించింది. పైలేట్స్ ఇదొక ఫిట్నెస్ టెక్నిక్. జోసెఫ్ పైలేట్స్ అనే జర్మన్ ఫిట్నెస్ మాస్టర్ ఈ టెక్నిక్ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్తో వ్యాయామ సేవలు కూడా అందిం చారు. శానిటరీ నేప్కిన్స్ 1914లో యూఎస్లోని కింబర్లీ క్లార్క్ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్ డ్రెస్సింగ్గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్ శానిటరీ పాడ్స్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్కిన్స్ వాటికి ఆధునాతన రూపమే. పోర్టబుల్ ఎక్స్–రేస్ తొలి ‘రేడియోలాజికల్ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్ రే మిషన్ ఉండేది. ఫొటోగ్రాఫ్ డార్క్ రూమ్ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు. -
శభాష్ షంషేర్.. నీ సేవలు అద్భుతం..
శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్ ఆవేదన, ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్ క్విట్పఫ్. పదమూడు సంవత్సరాల వయసు నుంచే అద్భుతాలు చేస్తున్న నిఖియ షంషేర్ పరిచయం... స్కూల్ప్రాజెక్ట్లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్. అక్కడ ఒక వార్డ్లో నోటిక్యాన్సర్ పేషెంట్ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్ చెకప్లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు. ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్పఫ్’ అనే ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్. రిస్క్లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్పఫ్’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్ నుంచి హైరిస్క్ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్పఫ్ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’ విద్యార్థి అయిన షంషేర్. అయితే ఈ ‘క్విట్పఫ్’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్’లో అనుమతి దొరికింది. 500 మందికి పైగా క్రానిక్ స్మోకర్లు, నాన్స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్పఫ్’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్పఫ్’ ప్రాజెక్ట్పై పనిచేయడానికి షంషేర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్ సొమ్మును ప్రాజెక్ట్ కోసం ఉపయోగించింది. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్ ప్రాజెక్ట్ ‘యెర్న్ టు లెర్న్’ చేపట్టింది. తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్ వైబ్సైట్ ‘క్నిక్నాక్స్’ ద్వారా వచ్చిన ఆదాయంలో వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. టీనేజర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ సైన్స్ కాంపిటీషన్ ‘జూనియర్ ఛాలేంజ్’లో టాప్స్కోరర్గా నిలిచింది. తన ఫేస్బుక్ పేజీలో ‘స్పేస్టైమ్ అండ్ గ్రావిటీ’పై చేసిన వీడియో పోస్ట్కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్’ ‘ఔట్స్టాండింగ్ యూత్ ఎకనామిక్ సిటిజన్షిప్’ (జర్మనీ) అవార్డ్...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్కు అభినందనలు తెలియజేద్దాం. -
యూవీసీ బాక్స్తో కరోనాకు చెక్
ప్రశాంత్నగర్ (సిద్దిపేట) : కరోనా వైరస్ మనం నిత్యం వాడుకునే వస్తువులపై ప్రభావం చూపకుండా అడ్డుకోవడానికి సిద్దిపేటకు చెందిన కాపర్తి భార్గవ్ అనే యువశాస్త్రవేత్త యూవీసీ వైరస్ కిల్లర్ మెషీన్ రూపొందించాడు. భార్గవ్ హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సెకండియర్ చదువుతున్నాడు. ప్రజలు కరోనా వైరస్తో ఇబ్బందులు పడుతున్న తీరును గమనించిన భార్గవ్ ఈ వైరస్ కిల్లర్ను తయారు చేశాడు. కేవలం రూ. 600 ఖర్చుతో అట్టబాక్స్, రిఫ్లెక్షన్ కవర్, థర్మకోల్, యూవీసీ (అల్ట్రా వయొలెట్ కాంపైజర్) బల్బ్, కనెక్టర్లతో ఈ పరికరాన్ని రూపొందించాడు. నిత్యావసర సరుకులు, బయటకు వెళ్లి వచ్చినప్పుడు మన వస్తువులను బాక్స్లో పది నిమిషాలుంచితే వైరస్ ఉన్నట్టయితే చనిపోతుంది. దీంతో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండవచ్చన్నాడు. యూవీసీ కిరణాలు మన శరీరానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. (ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి ) -
కొనుగోళ్లకు ఎప్పుడూ సిద్ధమే..
• వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపు నిర్మాణం: చైర్మన్ సైరస్ మిస్త్రీ • వేగం, చురుకుదనంతోనే ముందుంటాం • వృద్ధికి ఆవిష్కరణలు, టెక్నాలజీ కీలకం • గ్రూపు ఆదాయంలో 70% విదేశాల నుంచేనని వెల్లడి న్యూఢిల్లీ: టాటా గ్రూపు దేశీయంగా, విదేశాల్లో కంపెనీల కొనుగోళ్లకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతుందని గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నారు. తమ వ్యాపారాలు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెప్పిన ఆయన, పోర్ట్ఫోలియో తగ్గించుకునే దిశగా కఠినమైన, బలమైన నిర్ణయాలకు పిలుపునివ్వాల్సిన అవసరాన్ని కల్పించాయన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రూపు కంపెనీలు వేగం, చురుకుదనంతో పనిచేయాలని తాను కోరుకుంటానని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూపు చైర్మన్గా మిస్త్రీ... కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, టెక్నాలజీ ఆవశ్యకత, ఆవిష్కరణలు, వినియోగదారుల అవసరాల గురించి గ్రూపు అంతర్గత మేగజైన్కు వివరించారు. సామాజిక బాధ్యతకు టాటా కట్టుబడి ఉంటుందన్న ఆయన వచ్చే 150 ఏళ్ల కోసం టాటా గ్రూపును నిర్మించే పనిలో ఉన్నామన్నారు. రెండు విధానాలు సహజసిద్ధంగా ఎదుగుతూనే, కొనుగోళ్ల ద్వారా దేశీయంగా, విదేశాల్లో వృద్ధి అవకాశాలను అందుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. స్థిరమైన, లాభదాయకమైన వృద్ధి సాధించేందుకు గ్రూపులోని ప్రతి కంపెనీ తనదైన అభివృద్ధి విధానాన్ని రూపొందించుకుంది. గత దశాబ్ద కాలంలో రూ.4,15,000 కోట్ల రూపాయలను విస్తరణపై వెచ్చించాం. ఇందులో రూ.1.7 లక్షల కోట్లు గత మూడేళ్లలో ఖర్చు చేసిందే. 2016 మార్చి నాటికి గ్రూపు నికర రుణాలు 24.5 బిలియన్ డాలర్లు కాగా, నిర్వహణ ఆదాయాలు 9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత మూడేళ్లలో గ్రూపు నిర్వహణ ఆదాయాలు వార్షిక చక్రగతిన (సీఏజీఆర్) 30 శాతం వృద్ధి నమోదు చేశాయి. అయితే, స్థూలంగా కాకుండా... విడిగా ప్రతీ కంపెనీ కూడా ఇదే స్థాయిలో వృద్ధి సాధించాలి. అందుకే విడిగా ప్రతీ కంపెనీపై ఫోకస్ పెట్టాం. టాటా గ్రూపు మొత్తం ఆదాయంలో అంతర్జాతీయ ఆదాయం 70 శాతంగా ఉంది. అందుకే గత మూడేళ్లలో మూల ధన వ్యయం ఎక్కువ భాగం విదేశాల్లోనే ఖర్చు పెట్టాం. 103 బిలియన్ డాలర్ల విలువైన జాయింట్ ప్రాజెక్టులపై టాటా గ్రూపు పరిధిలో అంతర్గత సహకారంపై దృష్టి సారించాం. మూలధన వ్యయం అనేది టాలెంట్, బ్రాండ్లు, టెక్నాలజీపై ఉండాలి. భవిష్యత్తులో అసలైన మార్పును తీసుకొచ్చేవి ఇవే. కొత్తగా ఇరాన్, మయన్మార్లోకి ప్రవేశించాం. చురుగ్గా లేకుంటే వెనుకనే... చురుగ్గా లేకుంటే వెనుకబడిపోతాం. సంస్థాగతమైన వేగం, చురుకుదనం, మార్పునకు సిద్ధంగా ఉండడం అవసరం. కల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు చురుకుదనం అనేది చాలా కీలకం అవుతుంది. మారుతున్న సమయాల్లోనూ వృద్ధి చెందేందుకు ఆవిష్కరణలు, టెక్నాలజీ దోహదపడతాయి. పరిశోధన, అభివృద్ధిపై తగినంత పెట్టబడులు పెట్టడంతోపాటు వినియోగదారుల అవసరాలను భిన్న విధాలుగా అర్థం చేసుకోవడం ద్వారా కొత్త పరిశ్రమలు, ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను గుర్తించవచ్చు. అదే టాటా స్టీల్ను నిలబెట్టింది భిన్న రకాల ఉత్పత్తులను టాటా స్టీల్ తక్కువ వ్యయానికే ఉత్పత్తి చేస్తోంది. పైగా బలమైన బ్రాండ్. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఎన్నో సంస్థలు మునిగినా టాటా స్టీల్ నిలదొక్కుకునేందుకు ఇవే కారణాలు. ‘టాటా మోటార్స్, టాటా స్టీల్ టర్న్ ఎరౌండ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా వృద్ధి చెందేందుకు తగినంత సామర్థ్యం ఉంది. ప్యాసింజర్ కార్లు తదితర విభాగాల్లో సవాళ్లు కొనసాగుతాయి. కంపెనీకి సంబంధించి ఎనిమిది వ్యూహాత్మక విధానాలను గుర్తించాం. భిన్న స్థాయిల్లోని ఎగ్జిక్యూటివ్లతో 100 బృందాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడమే మా ఉద్దేశం. మా అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అని మిస్త్రీ చెప్పారు. డిజిటల్ విప్లవం డిజిటల్ రంగంలోని అవకాశాలను గుర్తించి టాటా మూడు కంపెనీలను ఏర్పాటు చేసింది. ఈ కామర్స్ రంగం కోసం టాటా క్లిక్, డేటా అనలటిక్స్ అవసరాల కోసం టాటా ఐక్యూ, ఆరోగ్య రంగం కోసం టాటా డిజిటల్ హెల్త్ ఏర్పడ్డాయి. మా అన్ని వ్యాపారాల్లోనూ కార్పొరేట్, కస్టమర్ వైపు నుంచి అంశాలను అర్థం చేసుకోవడంపై దృష్టి ఉంటుంది. ఏడువేల పెటెంట్లను అధిగమించాం. నాయకత్వం గురించి... నా మొట్టమొదటి విధానం ఎదుటి వారు చెప్పేది వినడం. దాంతో నాయకత్వ పరంగా శూన్యాన్ని భర్తీ చేయగలం. గ్రూప్ను విజయవంతంగా నడిపించడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, బోర్డ్ డెరైక్టర్లు, భాగస్వాముల విశ్వాసం, గౌరవాన్ని పొందడమే కారణం. సరైన కారణాలు ఉంటే కఠినమైన నిర్ణయాలకు వెనుకాడరాదు. టాటా గ్రూపును నడిపించేది క్రియాశీల పరివర్తనే. -
బాల శాస్త్రవేత్తల ఆవిష్కరణలివిగో..!