IPC Section 309
-
వారికి కావాల్సింది శిక్ష కాదు..కౌన్సెలింగ్
కతువా: జీవితాన్ని ముగించుకోవాలంటూ తీవ్రచర్యలకు పాల్పడే వ్యక్తులను శిక్షించరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐపీసీ నుంచి ఆత్మహత్యా నేరం తొలగింపుపై ఆయన శనివారమిక్కడ పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాలో మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారికి కావాల్సింది శిక్ష కాదని, సరైన కౌన్సెలింగ్ అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మహత్యాయత్నం నేరం కాదని ...ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలగించాలని నిర్ణయించిన విషయం విదితమే. -
ఇక ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
న్యూఢిల్లీ: ఐపీసీ సెక్షన్ 309ని తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఐపీసీ నుంచి ఈ సెక్షన్ను తొలగిస్తే ఆత్మహత్యయత్నం నేరంకాదు. సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్న నేరానికి సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే 1996లో సెక్షన్ 309 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ 309ని తొలగించాలని లాకమిషన్ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సెక్షన్ను తొలగించే అవకాశాలను పరిశీలించమని సుప్రీం కోర్టు పార్లమెంటుకు సలహా ఇచ్చింది. గతంలోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటివరకు ఇది చట్టబద్దం కాలేదు. ఈ రోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక కీలక మలుపుగా భావించవచ్చు. **