IPS passing out parade
-
68వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
-
68వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొన్నారు. ఈ బ్యాచ్లో మరో 15 మంది విదేశీ అధికారులు సైతం శిక్షణ పొందారు. అందులో భూటాన్ నుంచి ఆరుగురు, నేపాల్ నుంచి ఐదుగురు, మాల్దీవుల నుంచి నలుగురు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 109 మంది ఐపీఎస్ శిక్షణార్థుల్లో 75 మంది ఇంజనీరింగ్, వైద్య విద్యను చదివిన వారే ఉన్నారు. పది మంది ఆర్ట్స్, తొమ్మిది మంది సైన్స్, ఇద్దరు కామర్స్ నేపథ్యం నుంచి రాగా, 66 మంది ఇంజనీర్లు, తొమ్మిది మంది ఎంబీబీఎస్, తొమ్మిది మంది ఎంబీఏ, ముగ్గురు లా, ఒకరు ఎంఫిల్ చేశారు. కాగా నేషనల్ పోలీస్ అకాడమీలో 2015 బ్యాచ్ అధికారులుగా శిక్షణ ముగించుకున్న 109 మంది ట్రైనీ ఐపీఎస్ల్లో ఏడుగురిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు రక్షిత కె.మూర్తి(కర్ణాటక), పాటిల్ సంగ్రామ్సింగ్ గణపత్రావు(మహారాష్ట్ర), చేతన మైలబత్తుల(తెలంగాణ).. ఏపీకి కె.ఆరీఫ్ హఫీజ్(కర్ణాటక), అజిత వేజెండ్ల (ఏపీ), గౌతమి సలి(ఏపీ), బరుణ్ పురకయత్స(అసోం) ట్రైనీ ఐపీఎస్లుగా రానున్నారు. -
ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
-
పోలీస్ అకాడమీలో ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్
హైదరాబాద్ : హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 67వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ బ్యాచ్లో మొత్తం 141 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొన్నారు. వారిలో 26 మంది మహిళ ఐపీఎస్లు ఉన్నారు. అలాగే నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాలకు చెందిన 15 మంది పోలీసు అధికారులు ఈ పరేడ్లో పాల్గొన్నారు. -
ఐపీఎస్లు సామాన్యులకు రక్షణ కల్పించాలి: ప్రణబ్
హైదరాబాద్ : సామాన్యులకు రక్షణ కల్పించేలా ఐపీఎస్లు పని చేయాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంగళవారం ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ప్రణబ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అంకితభావంతో శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఐపీఎస్లు పని చేయాలన్నారు. ఐపీఎస్లు వృత్తి నిబద్ధతతో పని చేస్తారని ఆశిస్తున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని సూచించారు. మతసామరస్యం కాపాడడంలో ఐపీఎస్లది కీలకపాత్ర అని తెలిపారు. నిరంతరం ఉగ్రవాదులకు భారత్ లక్ష్యంగా మారుతోందని చెప్పారు. ఉగ్రవాదం, చొరబాటుదారులను ఆరికట్టడంలో భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోందన్నారు. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల నివారణకు కొత్త చట్టం తెచ్చామని చెప్పారు. దేశంలో జరుగుతున్న సంఘ విద్రోహ చర్యలను అరికట్టాలని కోరారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. 148 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో ఏపీ కేడర్కు చెందినవారు ఎనిమిదిమంది ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రణబ్ రాజ్భవన్ చేరుకున్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయాం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 5 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. -
ఐపీఎస్ల పాసింగ్ ఔట్లో పాల్గొన్న ప్రణబ్
-
ఐపీఎస్ల పాసింగ్ ఔట్లో పాల్గొన్న ప్రణబ్
2012 బ్యాచ్ ఐపీఎస్ల ముగింపు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీ చేరుకున్నారు. అక్కడ ఆయన ఐపీఎస్ నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం శిక్షణ పొందిన ఐపీఎస్ల ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు. పోలీసు అకాడమీలో 148 మంది ఐపీఎస్లు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పొందిన వారిలో ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రణబ్ న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ప్రణబ్ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.