irrigation problems
-
బాబు అంటే అబద్ధం.. మోసం..
-
రైతులను మోసం చేయడంలో ఆయనది పీహెచ్డీ
రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాల్సిందిపోయి అసలు రాష్ట్రంలో కరువే లేదని చంద్రబాబు అంటున్నారు ఒక్కసారి మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు చూడండి వైఎస్ఆర్ బతికున్నప్పుడు అవి ఏస్థాయిలో ఉండేవి, చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాథుడు ఉన్నాడా 2014లో గండికోట సభలో బాబు.. కనీసం 10 టీఎంసీలు 2015 ఖరీఫ్కి ఇస్తానన్నాడు. కానీ 2016 కూడా అయిపోవస్తున్నా గండికోట ప్రాజెక్టు ముందుకు కదల్లేదు ఇంతవరకు ఆ ముంపు గ్రామాల సమస్యలు తీర్చలేదు ప్రాజెక్టులోకి నీళ్లు తేవాలంటే.. ముందు పెండింగ్ పనులు పూర్తిచేయాలి గండికోటకు నీళ్లు రావాలంటే కెనాల్, వరద కాలువ పూర్తి చేయాలి దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 80 శాతం పనులు జరిగితే, మిగిలిన 20 శాతం ఇంతవరకు పూర్తికాలేదు ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే ఇంకా ఆ ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాల వాసులకు పరిహారం ఇవ్వాలి గ్రామస్తులకు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వకుండా గండికోటకు ఎలా 10 టీఎంసీల నీళ్లిస్తారు ఇక.. ఒక్కసారి తెలుగుగంగ ప్రాజెక్టు చూద్దాం. అందులో బ్రహ్మంసాగర్ అంతర్భాగం. చంద్రబాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా అందులో 12 టీఎంసీల నీళ్లు ఉండేలా చూస్తామంటారు. ప్రాజెక్టు ఇప్పటికే కట్టి ఉన్నా.. రెండున్నరేళ్ల నుంచి చంద్రబాబు ఏం చేశారని చూస్తే, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుకు ఒక్కటంటే ఒక్క టీఎంసీ కూడా నీళ్లివ్వలేదు ఒకవైపు శ్రీశైలం నుంచి నీళ్లు పొంగి పొరలిపోతున్నా.. తర్వాత నాగార్జున సాగర్ నుంచి సముద్రంలోకి వెళ్లి 92 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా బ్రహ్మంసాగర్ మాత్రం చంద్రబాబుకు కనిపించలేదు, ఇక్కడ 12 టీఎంసీలు పెట్టాలన్న ధ్యాస లేదు బుద్ధి ఉన్న ఎవరికైనా ఒకటి తెలుస్తుంది. వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్కు నీళ్లు రావాలి. అంటే, 0-20 కిలోమీటర్ల మధ్య కెనాల్ వీక్గా ఉంది, దానికి రిపేర్లు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు నేను కూడా చంద్రబాబుకు, మంత్రులకు ఎన్నోసార్లు చెప్పాం. కానీ ఇంతవరకు చంద్రబాబు ఆ రిపేర్ల గురించి పట్టించుకోకపోగా.. మళ్లీ రైతులను మోసం చేయడానికి బ్రహ్మంసాగర్లో 12 టీఎంసీలు నింపుతానంటాడు ఇలాంటి మనిషిని ఎక్కడ పెట్టాలని అడుగుతున్నా.. పిచ్చాసుపత్రిలో పెట్టాలా, బంగాళాఖాతంలో కలపాలా అని అడుగుతున్నా ఆయన నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు బ్రహ్మసాగర్ నుంచి ఆర్టీపీపీకి కూడా నీళ్లు రావాలి. లేకపోతే కరెంటు ఉండదు. ఈయన సీఎం అయ్యాక వర్షాలు రాకుండా పోయాయి. ఆర్టీపీపీ కూడా మూతపడితే ఇక కరెంటు కోసం ఎవరివైపు చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఆర్టీపీపీ మూతపడితే సంతోషించేది చంద్రబాబే. ఆ పేరు చెప్పి దాన్ని సింగపూర్ వాళ్లకు అమ్మేస్తారు చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు చేసింది శూన్యం జీఎన్ఎస్ఎస్కు ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో 11 కోట్లు ఇచ్చారు. వెలిగోడుకు 13 కోట్లు ఇచ్చారు. అయినా నీళ్లు వదిలితే ఆ ప్రాజెక్టులలోకి వచ్చే పరిస్థితి ఉందంటే, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటమే కారణం అందుకే కొద్దోగొప్పో డ్యాంలు, కెనాల్స్ పూర్తయ్యాయి కాబట్టి కాస్తయినా నీళ్లు వస్తున్నాయి ఇదే చంద్రబాబు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. అనంతపురం తనకు ప్రాణం అంటారు సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలకు వెన్నుపోటు పొడవడం కష్టం కాదు మూడు ప్రాజెక్టులకు కెనాల్ సిస్టం అభివృద్ధి చేసి ఉంటే మార్గమధ్యంలో వందల చెరువులకు నీళ్లు వచ్చేవి అలా ఉంటే ఈవాళ అత్యధికంగా వేరుశనగ పంట వేసి నష్టపోయిన అనంతపురం జిల్లాకు తోడుగా ఉండేది జీడీపల్లెకు 1.5 టీఎంసీ నీళ్లు ఇన్నాళ్లకు వచ్చాయి. పీఏబీఆర్లో 1 టీఎంసీ. అక్కడ నింపడం ఇప్పుడు మొదలుపెట్టాడు రైతులను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ తీసుకున్నాడు ప్రజలను మోసం చేయడంలో ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తండ్రి బాటలోనే ఉన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు ఒకమాట, లోకేష్ ఒకమాట మాట్లాడతారు ఎవరైనా కొడుకులకు తండ్రి మంచి మాటలు చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయన పార్టీ, కొడుకు అందరికీ.. రైతులను ఎలా మోసం చేయాలో నేర్పుతారు. రైతులకు సులభంగా అబద్ధాలు చెబితే మోసం చేయొచ్చు కదా, దానివల్ల అధికారంలోకి వస్తామని నేర్పుతారు ఇంకా ఒక అడుగు ముందుకేసి బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలని ఒక అబద్ధం ఆడండని చెబుతారు రైతులనే కాదు.. చివరకు ఆడవాళ్లను కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అంటారు చివరకు చదువుకునే చిన్నపిల్లలను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. మామూలుగా అయితే ఎవరైనా వాళ్ల తిట్లు భయంకరంగా ఉంటాయని అనుకుంటారు జాబు రావాలంటే బాబు సీఎం కావాలని అబద్ధాలు చెప్పించాడు. చివరకు ఏ స్థాయిలో అబద్ధాలు ఉన్నాయంటే సీఎం కుర్చీలో కూర్చోడానికి, ఆ తర్వాత కూడా అబద్ధాలు చంద్రబాబు పాలన గురించి నాలుగు ముక్కలు చెప్పాలంటే.. అబద్ధం, మోసం, దుర్మార్గం, వెన్నుపోటు చంద్రబాబును ఉద్దేశించి డిమాండ్ చేస్తున్నాం నీ పుణ్యమాని కేసీ కెనాల్ పరిధిలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు 92 వేల ఎకరాల ఆయకట్టును బతికించడానికి జనవరి 15 నాటికి నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తున్నాం ముంపుగ్రామాల సమస్యలు తీర్చి గండికోట పనులు పూర్తి చేయాలి, గండికోటకు కనీసం 12 టీఎంసీల నీళ్లయినా నిల్వ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం చిత్రావతిలో 90 శాతం పనులు వైఎస్ హయాంలో జరిగితే, 10 శాతం పనులు ఇంతవరకు చంద్రబాబు పూర్తి చేయలేకపోయాడు.. ఆ పనులు వెంటనే పూర్తిచేయాలి తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్లో కనీసం 12 టీఎంసీలు నిల్వచేయాలి. వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలి తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్, వెలిగోడు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు ఆ ప్రాజెక్టును విద్యుత్తు కోసం కాకుండా రైతుల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లా ప్రజలు, యువకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారు వైఎస్ హయాంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతోకొంత కదలిక వచ్చింది. ఆ ఫ్యాక్టరీ పెట్టాలని, 10 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న స్పృహ కూడా లేదు కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా -
బాబు అంటే అబద్ధం.. మోసం.. వెన్నుపోటు
కడప: తనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ విషయాలు తెలియడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఆయనకు రాష్ట్రంలో కరువు ఉంది.. రైతులు నానా కష్టాలుపడుతున్నారని చెప్పేందుకు నేడు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. రాయలసీమ ఆయకట్టుకు నీళ్లు అందించకపోవడానికి నిరసనగా కడప కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో కరువుందన్న విషయం చంద్రబాబునాయుడికి తెలియదంట. వాస్తవానికి కరువు పరిష్కారంపై కేబినెట్ నిర్వహించాలి. రైతులకు ఎలా తోడుగా ఉండాలి, ఎలా ఆదుకోవాలనే విషయంపై సమీక్ష నిర్వహించాలి కానీ ముఖ్యమంత్రి మాత్రం తనకు అసలు కరువు, వర్షం వివరాలు తెలియడం లేదంట. స్విస్ చాలెంజ్ కోసం కేబినెట్ భేటీ నిర్వహించే చంద్రబాబు రైతుల కరువుపై మాత్రం సమావేశం నిర్వహించడం లేదు. ఆగస్టు 12న ఏ ముఖ్యమంత్రి అయినా కేబినెట్ భేటీ నిర్వహించి సమీక్ష నిర్వహించాలి కరువుపై మభ్యపెట్టేందుకు మేనేజ్మెంట్ టీం తీసుకొచ్చి రెయిన్ గన్లు తీసుకొచ్చారు ఇవి ఇప్పుడు ఉన్నవి కాదు.. ఎప్పటి నుంచో ఉన్నవి.. అయినా సీఎం చంద్రబాబు ఏదో గొప్ప చేసినట్లు చెప్తున్నారు. ఖరీఫ్లో రైతులను ఆదుకునేందుకు, వారికి రుణాలు ఏమేరకు అందాయో తెలుసుకునేందుకు ఆగస్టు 12లోపు సమావేశం నిర్వహించాల్సి ఉండగా దానిని సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 15కు వాయిదా వేశారు సెప్టెంబర్ 15న ఈ మీటింగ్ వల్ల రైతులకు మేలు జరుగుతుందా? చంద్రబాబుకు రైతులమీద ప్రేమ నిజంగా ఉందా? కడప రాయచోటికి వచ్చి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారట మేం పొలాలకు వెళ్లి రైతులను కలిసి కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నాం వరదలు వచ్చినప్పుడు ఏరియల్ సర్వే చేస్తారు కానీ, కరువు వచ్చినా చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. కరువు కూడా ఎరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రిని నేను ఇప్పటివరకు చూడలేదు రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు నాయుడు కరువు రాకుండా ఉండేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా రైతులను రక్షించాలి శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉన్న వాటిని కిందకు ఎడాపెడా తోడేస్తున్నారు సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలా.. బంగాళాఖాతంలో వేయాలా రైతులను మోసం చేయడంలో చంద్రబాబునాయుడు పీహెచ్ డీ తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే అబద్ధం.. మోసం.. వెన్నుపోటు -
కేంద్రం సవతి ప్రేమ
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నగరంలో మారుతి ఐ క్లినిక్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా తనను కలిసిన మీడియా ప్ర తినిధులతో మాట్లాడుతూ... మహదాయి న దీ నీటి పంపకం, మలప్రభ-మహదాయి నదు ల అనుసంధానం, కళసబండూరి సాగునీటి పథ కం ప్రారంభం తదితర విషయాల పరిష్కారాని కి చొరవ చూపాలంటూ ఇటీవల ప్రధాని నరేం ద్రమోదీని కర్ణాటక అఖిల పక్షం సభ్యులు కలిసి విన్న వించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. ‘మహదాయి నీటి పంపకం విషయం లో కర్ణాటక, గోవా, మహరాష్ట్ర మధ్య తరు చూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ రెండు రాష్ట్రా ల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల కర్ణాటకతో పాటు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి ఈ విషయం పై చర్చించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని కోరినా అందుకు ఆయన సమ్మతించలేదు. మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో మొదట చర్చించండి అని మాకు సూచించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన అలా మాట్లాడారు. ఇది సరికాదు. మొదట ప్రధాని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిపితే అటు పై మేము మూడు రాష్ట్రాల ప్రతిపక్షనాయకులతో సమావేశమవుతాం.’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవానికి గల కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాల్సిందిగా పార్టీ హై కమాండ్ నుంచి తనకు ఎలాంటి సూచన అందలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
పులిచింతలలో 20టీఎంసీల నీటి నిల్వకు కసరత్తు
సాక్షి, విజయవాడ : కృష్ణాడెల్టా రైతాంగం కలలు సాకారమయ్యే రోజులు సమీపిస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో వేసవిలో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ఆదుకుని ఆ తర్వాత నీటిని నిల్వ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణలోని నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న నాలుగు ముంపు గ్రామాలకు సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులతో మన రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం10.15 టీఎంసీల నీరు నిల్వ నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో జల విద్యుత్కు ఉపయోగించిన నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం వద్ద ప్రస్తుతం 860 అడుగుల నీరు నిల్వ ఉంది. కానీ, 854 అడుగులకు నీటి మట్టం తగ్గితే ప్రమాదఘంటికలు మోగుతాయి. కృష్ణా డెల్టాకు వచ్చే ఏడాది తాగు నీరు కూడా లభించే అవకాశం ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో ఆంధ్రా ప్రజల బాధలను పట్టించుకోకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కిందకు నీటిని వదులు తున్నారు. దీంతో కిందకు వస్తున్న నీటిలో 10.15 టీఎంసీల నీటిని సోమవారం వరకు పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసినట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. మరో 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దీని వల్ల వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కృష్ణా డెల్టా ప్రజల దాహార్తిని తీర్చవచ్చని చెప్పారు. ముంపు గ్రామాలకు నిధులు ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ నీరు నిల్వ చేస్తే నల్లగొండ జిల్లాలోని అడ్లూరు, వెల్లటూరు, కృష్ణపురం, చింప్రియాల, గుంటూరు జిల్లాలోని కొల్లూరు, గొల్లపేట గ్రామాలు నీట మునిగిపోతాయి. అడ్లూరు, వెల్లటూరు, కృష్ణపురం, చింప్రియాల గ్రామాల బాధితులకు నష్ట పరిహారం కోసం ఇప్పటికే రూ.20 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి మన రాష్ట్ర తరఫున అందజేశారు. అయితే తెంగాణ సర్కారు మరో రూ.40 కోట్లు కోరినట్లు తెలిసింది. ఈ నిధులు కూడా మరో 15 రోజుల్లో చెల్లించి 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మంత్రి ఉమా, ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
జిల్లాల మధ్య జల వైరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా డెల్టాకు నీరు పారాలంటే మహబూబ్నగర్ జిల్లాలో పొలాలెండిపోవాలి. మహబూబ్నగర్ జిల్లా ప్రజల గొంతు తడవాలంటేనేమో డెల్టా ఆయకట్టు ఎండిపోవాల్సిందే. రాష్ట్ర విభజన ప్రక్రియతో తెరపైకి రానున్న అనేకానేక చిక్కుముడుల్లో ఇదొకటి. నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, మహబూబ్నగర్ జిల్లాల మధ్య ప్రత్యేక సమస్య ఉత్పన్నం కానుంది. సమైక్య రాష్ట్రంలో చేసుకున్న పరస్పర నీటి సర్దుబాటు విభజన తర్వాత చెల్లుబాటయ్యే పరిస్థితి కన్పించడం లేదు. అంతేగాక నిత్య కరువుతో ఇబ్బంది పడే మహబూబ్నగర్ జిల్లాలోని బీమా ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు నిర్ణయం కూడా అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఇదీ ప్రతిపాదన: మహబూబ్నగర్ జిల్లాలో జూరాల ఎగువన బీమా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం 20 టీఎంసీల నీరు అవసరం. కానీ కృష్ణా నదిలో మన రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 811 టీఎంసీల నికర జలాలనూ ఉపయోగించుకునేందుకు ఇప్పటికే ప్రాజెక్టులున్నాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే పరిస్థితి లేదు. దాంతో బీమా ప్రాజెక్టు నిర్మాణం కష్టమవుతుందనే ఉద్దేశంతో కృష్ణా డెల్టా ఆయకట్టుకు చెందిన నీటిని దానికి కేటాయించారు. 13 లక్షల ఎకరాల ఆయక ట్టున్న కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలున్నాయి. అయితే వీటిలో అత్యధిక ఆయకట్టు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉంది. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా డెల్టాకు 181 టీఎంసీలు కేటాయించారు. అయితే డెల్టా ఆధునీకరణ ద్వారా సుమారు 29 టీఎంసీల నీటిని ఆదా చేయవచ్చనే భావనతో, అందులో సుమారు 9 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టుకు, మిగతా 20 టీఎంసీలను బీమాకు ఉపయోగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సమ్మతించింది. అలా బీమా ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి లభించింది. ప్రస్తుతం కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వరద నీటిపైనే ఆధారపడ్డవి కాగా ఒక్క బీమాకు మాత్రమే నికర జల కేటాయింపు ఉంది. కానీ రాష్ట్ర విభజన జరిగితే దానికి కూడా నికర జలాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదీ సమస్య: సుమారు రూ. 4,573 కోట్ల అంచనాతో ఐదేళ్ల క్రితం మొదలు పెట్టిన కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు ఇప్పటికీ 17 శాతం పనులే పూర్తయ్యాయి. 683 కిలోమీటర్ల మేర కాల్వలు, 1,034 కిలోమీటర్ల మేర ఉన్న డ్రెయిన్ల ఆధునీకరణ వంటి పనులు జరగాల్సి ఉంది. కానీ మొత్తం 84 ప్యాకేజీల పనులకు గాను ఇప్పటికి 54 ప్యాకేజీలకే టెండర్లు ఖరారయ్యాయి. ఆధునీకరణ పనులు పూర్తయ్యే దాకా 29 టీఎంసీల నీటి ఆదా సాధ్యం కాదు. మరోవైపు కృష్ణా డెల్టాకు కేటాయించిన 181 టీఎంసీల కంటే ఇప్పటికే మరో 50 టీఎంసీలను అదనంగా వాడుతున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటినీ ఉపయోగిస్తున్నారు. అంటే రాష్ట్ర విభజన తర్వాత బీమాకు కేటాయించిన 20 టీఎంసీలతో పాటు అదనంగా ఉపయోగిస్తున్న 50 టీఎంసీలను కూడా కృష్ణా డెల్టా కోల్పోవాల్సి ఉంటుంది. మరో పక్క బీమా ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే కొన్ని పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. అంటే ఒకపక్క డెల్టా ఆధునీకరణ పనులు సాగక ఆశించిన మేరకు నీటి పొదుపు జరగడం లేదు. మరోవైపు బీమా ప్రాజెక్టు నీటి వినియోగం మొదలైతే కృష్ణా డెల్టాకు నీటికొరత తప్పేలా లేదు. దానికి నీరిచ్చేందుకు డెల్టా రైతులు అంగీకరించకపోతే బీమా పరిధిలో పాలమూరులో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి కానున్నాయి. సమైక్య రాష్ట్రంలోనైతే ఇరు ప్రాంతాల వారికి నచ్చజెప్పడం ద్వారా, లేక మరో ప్రాజెక్టు నుంచి నీరివ్వడం ద్వారా వారికి న్యాయం చేసే అవకాశముండేది. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు నీటి కేటాయింపు ఇబ్బందికరమేనని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.