islamic terrorists
-
కర్ణాటకలో ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్
శివమొగ్గ: నిషేధిత ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘా వేశారు. ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో టెర్రరిస్ట్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద పేలుడు పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించినట్లు తెలిపారు. -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
ఫ్రాన్స్లో టీచర్ తలనరికిన యువకుడు
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒక ఉపాధ్యాయుడిని తలనరికి దారుణంగా హత్య చేశారు. చెచెనీయాకు చెందిన 18ఏళ్ల యువకుడు ఇందుకు బాధ్యుడని పోలీసులు భావిస్తున్నారు. టీచర్ను చంపిన అనంతరం సదరు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఎటాక్ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్ ప్రకటించారు. శుక్రవారం ఒక పాఠశాలలో ప్రవక్తకు సంబంధించిన క్యారికేచర్లను ప్రదర్శించినందుకు టీచర్ను హత్య చంపేశాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ యాంటీ టెర్రరిజం ప్రాసిక్యూటర్ విచారణ ఆరంభించారు. మూడువారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. క్యారికేచర్లు ప్రదర్శించారంటూ గత నెల పాక్కు చెందిన ఒక యువకుడు ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచాడు. త్వరలో ఇస్లామిక్ రాడికల్స్కు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చేందుకు మాక్రాన్ ప్రభుత్వం యత్నిస్తోంది. హత్యకు గురైన టీచర్పై ఒక స్టూడెంట్ తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని అధికారులు చెప్పారు. -
భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..
జమ్మూ: ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.. కుటుంబానికో వ్యథ. తమ సంస్కృతిని మరచిపోయారు. సంప్రదాయాలు వదిలేశారు. ప్రాణ సమానంగా ప్రేమించిన సాహిత్యం, కవిత్వం, సంగీతం గుర్తు కూడా లేదు. ఇస్లాం ఉగ్రవాదుల దాడుల భయంతో మూడు దశాబ్దాల కిందట కట్టుబట్టలతో తమ సొంత గడ్డను వీడిన కశ్మీర్ పండిట్లలో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో తిరిగి మాతృభూమికి చేరుకోవాలని పండిట్లు అందరూ తహతహలాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం 1990, జనవరి 19 అర్ధరాత్రి ఇస్లాం జీహాదీల ఊచకోతతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన పండిట్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ఒకటయ్యారు. తాము లోయను విడిచి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో హమ్ వాపస్ ఆయేంగే హ్యాష్ ట్యాగ్తో వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్గా మారాయి. కొందరు అప్పట్లో శ్రీనగర్ నుంచి జమ్మూకి కొన్న బస్సు టిక్కెట్లు షేర్ చేస్తూ ఉంటే, మరికొందరు పీడకలలా ఇప్పటికీ వెంటాడుతున్న ఆనాటి అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు నష్టపరిహారం చెల్లించి లోయలో భద్రత కల్పించాలని ఆనాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి సర్వానంద్ కౌల్ ప్రేమి కుమారుడు రాజేందర్ కౌల్ ప్రేమి డిమాండ్ చేస్తున్నారు. ఇక జమ్ములో ఆదివారం పండిట్లు కశ్మీర్ లోయని విడిచి పెట్టి 30 ఏళ్లయిన సందర్భంలో ఆల్ స్టేట్ కశ్మీరీ పండిట్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సొంతింటికి తాము తిరిగి వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూతల స్వర్గం నరకంగా మారిన వేళ.. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో మైనర్లుగా ఉన్న పండిట్లపై ఇస్లాం వేర్పాటువాద తీవ్రవాదులు దాడులకు దిగారు. జేకేఎల్ఎఫ్, ఇతర ఇస్లాం జీహాదీలు హిందువులు ఇస్లాంలోకి మారాలని, మారకపోతే లోయని విడిచిపెట్టి పోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. 1989–90 మధ్య కాలంలో వందలాది మంది కశ్మీర్ పండిట్లను చంపేశారు. మహిళలపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు. హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు. కశ్మీర్ని అల్లాయే పరిపాలించాలి అంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు. దీంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని 5 లక్షల మంది వరకు కశ్మీర్ పండిట్లు లోయని విడిచిపెట్టి జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పారిపోయారు. మోదీ సర్కార్ ప్రణాళికలేంటి ? కేంద్రంలో మోదీ సర్కార్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. కశ్మీర్ ఘర్షణల్లో చెల్లాచెదురైన 5 లక్షల మంది పండిట్లను తిరిగి కశ్మీర్ లోయకి తెప్పించడానికి 2015లో రోడ్ మ్యాప్ రచించింది. వీరి కోసం సురక్షితమైన టౌన్షిప్లు నిర్మించాలని, అందులోనే షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇప్పుడు కశ్మీర్ను తన పాలన కిందకి తెచ్చుకోవడంతో పాటు పండిట్లు కూడా తిరిగి సొంత గూటికి చేరుతామన్న డిమాండ్లతో అది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. -
బుర్కినాఫాసోలో రక్తపాతం
ఔగడొగు: ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో రక్తమోడింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓ పట్టణంపై దాడి చేసి 35 మందిని చంపేశారు. ప్రతిగా సైన్యం జరిపిన దాడుల్లో 80 మంది ఉగ్రమూకలు హతమయ్యారు. సౌమ్ ప్రావిన్స్లోని అర్బిండాలో మంగళవారం ఉదయం బైక్లపై వచ్చిన ఉగ్రవాదులు పట్టణంలోని సైనిక క్యాంపుతోపాటు పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 35 మంది పౌరులు చనిపోగా 20 మంది సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. మృతుల్లో 31 మంది మహిళలేనని ప్రభుత్వం తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, వైమానిక దళం సాయంతో ఉగ్రవాదులపై భారీ ఎత్తున విరుచుకుపడింది. తమ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఉగ్రదాడికి తామే కారణమంటూ ఎవరూ ప్రకటించుకోనప్పటికీ ఈ ప్రాంతంలో తరచూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న అల్ ఖాయిదా, ఐఎస్లే కారణమని భావిస్తున్నారు. బుర్కినాఫాసోతో మాలి, నైగర్ సరిహద్దులకు సమీపంలో గడిచిన ఐదేళ్లలో ఉగ్ర దాడుల్లో 700 మంది చనిపోయారు. 5.60 లక్షల మంది ప్రజలు భయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు 4, 500 ఫ్రెంచి, 13 వేల ఐక్యరాజ్యసమితి బలగాలు పనిచేస్తున్నాయి. -
మనకు వేరే మార్గం లేదు: ట్రంప్
వాషింగ్టన్: ఒబామా, హిల్లరీలు అమెరికన్లకు సంబంధం లేని యుద్ధాలు, వివాదాల్లో తలదూర్చి దేశాన్ని సురక్షితం కానిదిగా మార్చారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. న్యూ హాంప్షైర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్.. ఒబామా, హిల్లరీల విదేశాంగ విధానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర ప్రజల సరిహద్దుల కోసం పోరాడుతూ అమెరికన్లు ప్రాణాలు, డబ్బు కోల్పోతున్నారని.. అయితే తన మొదటి ప్రాధాన్యత అమెరికాకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాక్, సిరియా, లిబియాలలో మారణహోమానికి హిల్లరీనే కారణమని ట్రంప్ మరోసారి విమర్శించారు. సిరియా నుంచి అమెరికాకు ప్రవేశించే శరణార్థుల సంఖ్య 550 శాతం పెరగాలని హిల్లరీ కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఒబామా అనుమతించిన వారి కంటే వేల సంఖ్యలో ఎక్కువమంది వలసదారులను హిల్లరీ అమెరికాలోకి అనుమతించాలని చూస్తున్నారన్నారు. సిరియన్ శరణార్ధుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దూరంగా ఉంచాలని.. మనకు అంతకన్నా వేరే మార్గం లేదని ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ట్రంప్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. -
పారిపోతూ కూడా.. కాల్పులు జరిపారు!!
-
పారిపోతూ కూడా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
ప్యారిస్: ఉగ్రవాద దాడితో ప్యారిస్ లోని విశ్వవిఖ్యాత సందర్శనీయ కేంద్రం ఈఫిల్ టవర్ ను మూసివేశారు. ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. బుధవారం ప్యారిస్ లోని ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలోకి చొరబడి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దాడి చేసిన మరుక్షణం ఉగ్రవాదులు ఘటనాస్థలం నుంచి తప్పించుకుని నల్ల రంగు కారులో పారిపోయారు. కారులో పారిపోతున్నప్పుడు కూడా రోడ్డుపైనున్నవారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ముష్కర మూకల దాడితో ప్యారిస్ ప్రజలు భీతిల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై పరుగులు తీశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, కనీసం 9 మంది జర్నలిస్టులున్నట్టు తెలుస్తోంది. -
60 మంది అమ్మాయిలు.. 31 మంది అబ్బాయిల అపహరణ
నైజీరియాలోని ఈశాన్య ప్రాంత గ్రామాల నుంచి 60 మంది అమ్మాయిలు, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన ఆ దేశంలో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను ఉగ్రవాదులు అపహరించుకుని వెళ్లినా, ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో అక్కడి సర్కారుతో పాటు సైన్యం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. శనివారం నాడు నలుగురు గ్రామస్థులను చంపి మరీ అమ్మాయిలు, అబ్బాయిలను ఉగ్రవాదులు అపహరించుకు వెళ్లారని ఆ గ్రామ వాసి అజీ ఖలీల్ తెలిపారు. గ్రామాల్లోకి ఉగ్రవాదులు చొరబడి అఘాయిత్యాలు చేయకుండా అడ్డుకోడానికి ఏర్పాటుచేసిన గ్రామ కమిటీలో ఖలీల్ కూడా సభ్యుడు. ఈ కమిటీ సభ్యులు సాధారణ ఆయుధాలతో కొంతమేరకు గ్రామాలకు రక్షణ కల్పించగలుగుతున్నారు. గ్రామంలో చాలామంది ఉగ్రవాదుల భయంతో దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.