breaking news
IVRS
-
ఐవీఆర్ఎస్ కాల్స్తో వైఎస్సార్సీపీపై విష ప్రచారం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్తో వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్షాప్ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే నిందితుడు జనార్థన్తో మాజీ మంత్రి జోగి రమేష్పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టగత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్రావు వాయిస్తో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్స్లో జోగి రమేష్పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడుప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఐవీఆర్ఎస్ కాల్స్లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్లో జోగిరమేష్తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్ను ఎయిర్పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్లో పెట్టారు.మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్యాదవ్ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?కిలారు రాజేష్, లోకేష్ల గుట్టు బయటపడుతుందని భయంజయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు. దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్గా, లిక్కర్ షాపులకు సెపరేట్గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్కి, తద్వారా లోకేష్కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా? -
పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువుల్లేవు
సాక్షి, అమరావతి: రైతులకు ఎరువుల లభ్యత, విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని.. సరఫరా కూడా కావడంలేదని టీడీపీ కూటమి ప్రభుత్వం సేకరించిన ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయంలో తేలింది. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులున్నాయని కూడా అందులో స్పష్టమైంది. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల మీద వ్యక్తమైన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎరువుల లభ్యతలేదని 39.1 శాతం మంది రైతులు.. విత్తనాలు సమయానికి సరఫరా జరగలేదని 37 శాతం మంది రైతులు కుండబద్దలు కొట్టారు. మహిళలపై హింస, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు జరుగుతున్నాయని 27.8 శాతం మంది చెప్పారు. తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం మంది.. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరగడంలేదని 38.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 46.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తంచేశారు. జీరో కరప్షన్ దిశగా పాలన..ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ శాఖలో ఎక్కడ, ఎవరు అవినీతికి పాల్పడినా సహించేదిలేదని.. జీరో కరప్షన్ దిశగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలన్నారు. అవినీతి రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని.. సమస్యలున్న చోట సంతృప్తిస్థాయి పెంచేలా చూడాలని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి.. వాటి పరిష్కారానికి కృషిచేయాలని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు, ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’ ద్వారా అందించాలన్నారు. మరోవైపు.. వికలాంగులు, వృద్ధులకు రేషన్ సరుకుల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచించాలన్నారు. చౌకధరల దుకాణాలను పెంచడం.. నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అలాగే, ఇసుకపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలన్నారు. -
ఎరువుల్లేవ్.. అంతా సమస్యల దరువే!
సాక్షి, అమరావతి : ఇది పక్కన చెప్పుకొన్న ఉదాహరణలోని గిరిజన రైతు సమస్యనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న వెత.. ప్రభుత్వ సేవలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఎరువుల సరఫరాపై ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత రాష్ట్రంలో ఎరువుల సరఫరా అధ్వాన్నంగా ఉందంటూ వారంతా తేల్చి చెప్పారు. సకాలంలో, సరైన సమయానికి అవసరానికి తగ్గట్టు లభ్యం కావడం లేదని స్పష్టం చేశారు. పైగా గతంలో ఎన్నడూలేని విధంగా పంపిణీలో కూడా అవినీతి చోటుచేసుకుంటోందని కుండబద్దలు కొట్టారు. కూటమి పాలనలో కష్టాలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి నప్పటి నుంచి ఎరువుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారా కూడా అరకొరగానే ఇస్తున్నారు. దీంతో సకాలంలో దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదివరకు తరహాలో మండల కేంద్రాలకు పరుగులు తీస్తూ సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంప్లెక్స్ మోత ఓపక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు రూ.100 నుంచి రూ.255 మేర పెంచడంతో అన్నదాతలు భారం మోయలేక తల్లడిల్లుతున్నారు. మరోపక్క కృత్రిమ కొరత సృష్టిస్తూ డీలర్లు అందినంత దోచుకుంటున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల బస్తాపై రూ.100–500 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ దోపిడీ కొనసాగుతూనే ఉంది.రైతు భరోసా లేదు.. అంతా బాదుడే పది ఎకరాల్లో కాఫీ, పసుపు, మిరియాలు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్తో పాటు వరి సాగు చేస్తుంటా. వరి మినహా మిగిలిన పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే పండిస్తా. వరికి కావాల్సిన ఎరువులు గతంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లోనే దొరికేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక సరఫరా నిలిపివేశారు. దీంతో 25 కి.మీ. దూరంలో ఉన్న చింతపల్లి, అక్కడ లేకపోతే 40 కి.మీ. దూరంలోని నర్సీపట్నం వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఎరువుల కట్ట కోసం రోజంతా వృథా అవడమే కాదు. చార్జీలకు రూ.500 పైగా ఖర్చవుతోంది. ఎమ్మార్పీపై బస్తాకు రూ.50 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నారు. అవసరం లేని పురుగు మందులు అంటగడుతున్నారు. ఎరువుల్లో నాణ్యత కూడా ఉండడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఏంటిది? అని అధికారులను అడిగితే మేమేం చేయగలం? అని అంటున్నారు. – బౌడు కుశలవుడు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ గిరిజన రైతు. ఎరువుల సరఫరాపై ఐవీఆర్ఎస్ సర్వేలో ‘ఎరువులు లేవు’ అని చెప్పిన రైతులు 41.2% జనవరిలో44% మార్చిలో74% అత్యధికంగాఏజెన్సీ జిల్లాల్లో56% శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో‘నాసిరకం’ అని చెప్పిన రైతులు 22.4% జనవరిలో34% మార్చిలో67% అత్యధికంగా ఏజెన్సీ జిల్లాల్లో 49% అనంతపురం జిల్లాలో48% కర్నూలు జిల్లాలోఎరువుల సరఫరా సందర్భంగా సహకార సంఘాలు,రైతు సేవా కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని చెప్పిన రైతులు 39% జనవరిలో37% మార్చిలో45% అత్యధికంగా పల్నాడు,కర్నూలు జిల్లాల్లోసరిపడాఎరువులు అందుబాటులోఉన్నాయా..?అన్ని జిల్లాల్లోనూ లేవు అని చెబుతున్న వారు 40- 44%అవసరమైనప్పుడు, కోరుకున్న ఎరువులు దొరకడం లేదు..41%ఎమ్మార్పికి మించి యూరియాకు వసూలు చేస్తున్నారు. 60%ఎరువులతో పాటు అవసరం లేని మందులను అంటగడుతున్నారు 60% -
ఒక్క ఫోన్ కాల్ తో ఎస్బీఐ పిన్ జనరేట్ చేసుకోండి
దేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పుడు ఎస్బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే 5 నిమిషాలలో ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పుడు ఎస్బీఐ టోల్ ఫ్రీ ఐవిఆర్ సిస్టమ్ ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేయాలి ఆ తరువాత కింద పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system. Don't hesitate to call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #debitcard pic.twitter.com/MhuJGcwMa2 — State Bank of India (@TheOfficialSBI) February 17, 2021 దశ 1: కాల్ చేసిన తరువాత PIN జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి దశ 2: ఎస్బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు చివరి తేదీ ఎంటర్ చేయాలి దశ 3: రిజిస్టర్ మొబైల్ నెంబర్కు లేదా మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది దశ 4: నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, దాన్ని రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి దశ 5: ఆ తరువాత ఐవీఆర్ లో మీ పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి -
కొడుకుకు ప్రేమతో..!
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో 77.05 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు 79.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 76.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ స్కూల్స్ 82.48 శాతం ఉత్తీర్ణత సాధించగా, గురుకుల పాఠశాలలు 92.99 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 87. 83 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ మొత్తం ఫలితాల్లో వరంగల్ జిల్లా 96.01శాతంతో అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ 54.06శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 1,491 స్కూల్స్ వంద శాతం ఫలితాలను సాధించగా, 28 స్కూల్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఖరారు చేసినట్లు కడియం పేర్కొన్నారు. టెన్త్ సప్లమెంటరీ పరీక్షల రాసే విద్యార్థులు మే 30వ తేదీలోగా రుసుము చెల్లించాల్సి ఉంది. టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి: -
నేడే టెన్త్ ఫలితాలు
-
నేడే టెన్త్ ఫలితాలు
హాజరైన విద్యార్థులు 5.65 లక్షలు ⇒ ఇంటర్నెట్లో ఫలితాలు ⇒ ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ రూపంలోనూ తెలుసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు 5.65 లక్షలమంది విద్యార్థులు హాజయ్యారు. పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెట్టాక జరిగిన మొట్టమొదటి టెన్త్ పరీక్షా ఫలితాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. సీసీఈ విధానం మేరకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కులు ఇంటర్నల్స్ కాగా, 80 మార్కులకే రాతపరీక్షలను నిర్వహించారు. కరిక్యులర్ సబ్జెక్టులు, కో-కరిక్యులర్ అంశాల్లో వచ్చిన మార్కుల శాతాన్ని బట్టి గ్రేడింగ్ విధానం ద్వారా ఫలితాలను ఇస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల సగటును లెక్కించి సీజీపీఏ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్స్ యావరేజ్) పాయింట్లు ఇస్తారు. లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను ప్రభుత్వ వెబ్సైట్ల నుంచే కాకుండా కొన్ని ప్రైవేటు వెబ్సైట్ల నుంచి కూడా పొందేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ రకాల మొబైల్ ఆపరేటర్ల నుంచి కూడా ఎస్ఎంఎస్ల రూపంలోనూ, ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డర్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్సైట్లు www.sakshieducation.com www.aponline.gov.in www.bsetelangana.org www.results.cgg.gov.in ఎస్ఎంఎస్ల రూపంలో.. ఎయిర్సెల్/వొడాఫోన్/రిలయన్స్ 58888 ఐవీఆర్ఎస్ ద్వారా.. యూనినార్/ఎయిర్టెల్/ఎయిర్సెల్/వొడాఫోన్ 5333530 -
టీడీపీ అభిప్రాయ సేకరణ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, విభేదాల కారణంగా పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక క్లిష్టంగా తయారైంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేసి, చివరకు కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పూనుకుంది. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి, ఆ భిప్రాయాల ఆధారంగా జిల్లా అధ్యక్షుడలను ఎంపిక చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 16, 18 తేదీలలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగనున్నాయి. -
బాలికలే టాప్, ప్రధమ స్థానంలో 'తూర్పు'
హైదరాబాద్ : పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయిగా నిలిచారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 87.96 శాతం ఉత్తీర్ణులవగా, బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నిలవగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత రాగా, 5,784 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు నమోదు చేశాయి. -
పదో తరగతి ఫలితాల విడుదల
హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 88.62 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. యథావిధిగా విద్యార్థినులే ఉత్తీర్ణతలో పైచేయిగా నిలిచారు. ఉత్తీర్ణతలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తమ ఫలితాలను www.sakshieducation.comలో చూడవచ్చు. ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. అలాగే ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. www.bseap.org వెబ్సైట్తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్వర్క్లో 5333560కు ఫోన్చేసి తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్చేసి స్పేస్ ఇచ్చి రోల్నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్వర్క్ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలి. -
పదో తరగతి ఫలితాలు నేడే
-
పదో తరగతి ఫలితాలు నేడే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు గురువారం వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గవర్నర్ సలహాదారు ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు ప్రోటో టైప్ మెమోలను ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని తెలిపారు. www.bseap.org వెబ్సైట్తో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫలితాల కోసం యూనినార్ నెట్వర్క్లో 5333560కు ఫోన్చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి ఎస్ఎస్సీ అని టైప్చేసి స్పేస్ ఇచ్చి రోల్నంబర్ రాసి 53346 నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఇతర నెట్వర్క్ల నుంచి అయితే పైవిధంగా టైప్ చేసి 58888, 52070కు ఎస్ఎంఎస్ పంపించాలని సూచించారు. -
మీ అభ్యర్థి కేటీఆర్ అయితే రెండు నొక్కండి... చంద్రబాబు
ఉదయం పది గంటలు...పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ట్రిం గ్...ట్రింగ్ మంటూ ఫోన్ మోగింది. హైదరాబాద్ కోడ్తో ఉండడంతో ఎవ రా అని కార్యాలయంలోని ఓ నాయకుడు ఫోన్ ఎత్తితే టీడీపీ అధినేత చంద్రబాబు కార్యాలయం నుంచి... ఏం టా అని వింటే.. చీపురుపల్లి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేఏ నాయుడు కావాలనుకుంటే ఒకటి నొక్కండి... త్రిమూర్తులు రాజు (కేటీఆర్) కావాలనుకుంటే రెండు నొక్కండి... గద్దే బాబూరావు కావాలనుకుంటే మూడు, కిమిడి మృ ణాళిని కావాలంటే నాలుగు నొక్కాలంటూ వాయిస్ ద్వారా చెబుతున్నారు. ఓ వైపు అ సెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల కో సం సర్వే చేస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇ ప్పటివరకూ ఎమ్మెల్యే టిక్కెట్ కేటీఆర్కు ఇస్తారని అంతా భా వించారు. అయితే బీజేపీతో పొత్తు నేపథ్యంలో గజపతినగరం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. దీంతో అక్క డి టిక్కెట్ ఆశించిన కేఏ నాయుడును చీపురుపల్లి అభ్యర్థి గా పార్టీ అధిష్టానం పరిగణలోకి తీ సుకుంటున్న ట్టు తెలుస్తోంది. దీంతో స్థాని కంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు అ యోమయానికి గురికాగా, ఇంతవరకు నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీకి సేవలందించి, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న కేటీఆర్ పరిస్థితి మ రింత గందరగోళంగా మా రింది. కొంత కాలంగా ఆయన అభ్యర్థిత్వంపై అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీతో పొత్తు పుణ్యమాని కేటీఆర్కు మరోసారి చుక్కెదురు కా నుంది. ఈ నెల 12వ తేదీ నుంచి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండడంతో కేటీఆర్ నా మినేషన్ వేసేందుకు ముహూర్తం కూ డా పెట్టించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేఏ నాయు డు పేరుతో ఇంట్రాక్టివ్ వాయిస్ రె స్పాండ్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా మరో సర్వే నిర్వహిస్తుండడంతో కేటీఆర్ వర్గీయుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ పార్టీ అభివృద్ధి కోసం పడిన కష్టమంతా వృథానేనని ఆవేదన చెందుతున్నారు. అధినేత తీరు పై మండి పడుతున్నారు. -
కుప్పంలో బాబుకు ‘ఐవీఆర్ఎస్’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఇదో వినూత్న కార్యక్రమం.. ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) గురించి ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానికి మధ్యలోనే మంగళం పాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకోసం ఎంచుకున్న ఈ విధానం స్వయంగా తనకే షాకివ్వడంతో కంగుతిన్న చంద్రబాబు దానిని మధ్యలోనే అటకెక్కించారు. అభ్యర్థుల ఎంపికకోసం తలపెట్టిన ఈ ప్రయోగం స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో వికటించింది. టీడీపీ అధినేత వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఆయన ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల సెల్ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడినుంచి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో చెప్పాలంటూ.. సెల్ఫోన్ ఉన్నవారిని ఐవీఆర్ఎస్ ద్వారా సమాధానం పంపాల్సిందిగా కోరారు. అయితే ఇప్పటివరకు ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించిన సమాచారం మేరకు 40 శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా సమాధానం పంపినట్టు సమాచారం. దీంతో ఇదేదో విక టించేటట్లు ఉందన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఐవీఆర్ఎస్ గురించి మాట్లాడ టం ఆపేశారు. సాధారణంగా ఏదైనా ఆర్భాటంగా ప్రకటించడం.. దానిని మధ్యలోనే వదిలేయడం టీడీపీలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ కోవలోకి ఐవీఆర్ఎస్ చేరింది. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఈ విధానాన్ని దేశంలో ఇప్పటివరకు ఎవరూ చేయలేదంటూ దానిపై విస్తృత ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రచారం చేసుకున్నన్ని రోజులు కూడా దాన్ని కొనసాగించకుండా మధ్యలోనే నిలిపివేశారు. దీన్ని కొనసాగించినన్ని రోజులు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశిస్తున్న వారిపేర్లు కాకుండా వేరేవారి పేర్లు ఫోన్లో వినిపించాయి. దీంతో కార్యకర్తలు, నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తనదాకా వస్తేగానీ తెలియదన్నట్టు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఈ ప్రయోగం వికటించటంతో చంద్రబాబు ఐవీఆర్ఎస్ను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఐవీఆర్ఎస్ ప్రకటనలు ఆగిపోయాయి.