Jayalalithaa treatment
-
జయ మృతిలో కుట్ర లేదు
► లండన్ డాక్టర్ రిచర్డ్ బీల్ ► వైద్యం ఖర్చు 5.5 కోట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిలో కుట్ర కోణం, రహస్యం ఏమీలేదని లండన్ వైద్యుడు రిచర్డ్ బీల్ స్పష్టం చేశారు. ఆమెపై విషప్రయోగం జరగలేదని, గుండెపోటుతోనే జయ మృతి చెందారని తేల్చిచెప్పారు. జయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడానికి అపోలో యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం, రిచర్డ్ బీల్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జయ మరణంపై ప్రజల్లో సందేహాలు నెలకొన్న దృష్ట్యా వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరడంతో ఇక్కడికి వచ్చానని బీల్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ బీల్తో పాటు అపోలో వైద్యుడు డాక్టర్ బాబు అబ్రహాం, ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాలు.. ♦ గతేడాది సెప్టెంబర్ 22న జయలలితను ఆస్పత్రికి తీసుకువచ్చినపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు. అయితే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నియంత్రించలేని స్థాయిలో డయాబెటిస్ ఉంది. ♦ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత మెరుగైన చికిత్స అందించాం. చికిత్స వివరాలను శశికళకు, ప్రభుత్వ పెద్దలకు వివరించాం. ఒక దశలో ట్రీట్మెంట్ కోసం లండన్ కు తీసుకెళ్లాలలనుకున్నాం.. కానీ ఆమె శరీరం అందుకు సహకరించలేదు. ♦ జయలలిత కాళ్లు తొలగించలేదు. ♦ బాగా కోలుకున్నారనుకున్న దశలో గుండెపోటు రావడంతో జయ కన్నుమూశారు. ఇది మేం ఊహించలేదు. ♦ భౌతికకాయం చెక్కు చెదరకుండా ఉండేందుకు డిసెంబర్ 5వ తేదీ రాత్రి 12.20 గంటలకు 5.5 లీటర్ల ప్రత్యేక ద్రవాన్ని ఆమె శరీరంలోకి పంపించాము. వీవీఐపీల భౌతికకాయాలకు ఇలా చేయడం సాధారణమే. ఎంజీఆర్ పార్థివదేహానికి కూడా చేశారు. ♦ చికిత్సకు అయిన రూ. 5.5 కోట్లను జయ కుటుంబీకులే చెల్లించారు. ♦ ఉప ఎన్నికల్లో బీ ఫారంలపై జయ వేలిముద్ర వేసినపుడు డాక్టర్ బాలాజీ, డాక్టర్ అబ్రహం సంతకం చేశారు. అపుడు ఆమె స్పృహలోనే ఉన్నారు. -
జయ మరణంపై సందేహాలకు వివరణ
-
జయలలిత మాట్లాడుతున్నారు!
-
జయలలిత మాట్లాడుతున్నారు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత మళ్లీ ఆమె హెల్త్ బులెటిన్ను వైద్యులు వెల్లడించారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రోజులు మాత్రం ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను గత నెల రోజులుగా కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. అమ్మ కూర్చున్నారని, మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దాంతో కొన్నాళ్ల తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరపడుతున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడుతున్నారు. ఎవరెవరు చూస్తున్నారంటే... క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల శాఖకు చెందిన సీనియర్ కన్సల్టెంట్లు, సీనియర్ ఎండోక్రినాలజిస్టు, అపోలో ఆస్పత్రికి చెందిన డయాబెటాలజిస్టు.. వీళ్లంతా కలిసి జయలలితకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యమాంబ బులెటిన్లో పేర్కొన్నారు. పౌష్టికాహారం, అత్యవసరమైన న్యూట్రియెంట్ ఇన్టేక్ విషయాలను డయెటరీ బృందానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్లు చూసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు.