breaking news
kaveri travels bus
-
మద్యం రాసిన మరణ శాసనం..
-
కొంపలు ముంచింది 'బెల్ట్షాపు మద్యమే'?
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రమాదం జరిగిన రోజు పోలీసులు, అధికారులు భావించినట్లు బస్సు.. బైకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి కారణం మద్యం మహమ్మారిగా తేలింది. బైకర్ శివ శంకర్ తన స్నేహితుడితో కలిసి బెల్ట్షాపులో పూటుగా మద్యం సేవించి బైక్ నడిపాడు. బస్సు ప్రమాదానికి 13 నిమిషాల ముందు బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడం, శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో పెను ప్రమాదం సంభవించి బస్సు దగ్ధమైంది. శివశంకర్తో పాటు బైక్ వెనుక కూర్చున్న అతని స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ప్రమాదానికి అసలు కారణం తేలింది. మొత్తం ప్రమాదాన్ని నిశితంగా విశ్లేషిస్తే.. ప్రభుత్వం నేషనల్ హైవే పక్కనే మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతివ్వడం, పల్లెల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్షాపుల్ని పెట్టించడమే కారణమని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశ వ్యాప్తంగా ప్రజల ఒళ్లు గగుర్పొడిచేలా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణం బెల్ట్ షాపులో మద్యం అని తేలింది. రాష్ట్రంలో 16 నెలలుగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ.. ఊరు, వాడ, గుడి, బడి, హైవే ఏదీ అనర్హం కాదన్నట్లు వెలిసిన మద్యం, బెల్ట్ షాపులు తప్పతాగి డ్రైవింగ్ చేసేందుకు ఉసిగొల్పుతున్నాయని స్పష్టమైంది. అర్ధరాత్రి పూట ఓ బెల్ట్ షాపులో పూటుగా మద్యం తాగి.. ఆపై పల్సర్ బైక్పై ప్రయాణిస్తూ వారు ప్రమాదానికి గురైందే కాక.. మరో 19 మంది నిండు ప్రాణాలు మంటగలవడానికి కారణం ప్రభుత్వ మద్యం పాలసీలోని విచ్చలవిడితనమేనని తేటతెల్లం చేసింది. ‘తప్పతాగి డ్రైవ్ చేసే వారు సూసైడ్ బాంబర్లు (ఆత్మాహుతి దళాలు).. టెర్రరిస్టులు.. ఉగ్రవాదుల కంటే ప్రమాదకం. వీరి వల్ల ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు. ఎన్నో కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసే డ్రైవింగ్ వల్ల ఇతరులకే ఎక్కువ హాని జరుగుతుంది’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల చెప్పిన మాటలను ప్రజలు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇలా విచ్చలవిడిగా వేళాపాళా లేకుండా ఎక్కడబడితే అక్కడ మద్యం దొరికేలా చేసిన ప్రభుత్వమే ఈ ప్రమాదంలో అసలు ముద్దాయని నెటిజన్లు అదే సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తుండటం వైరల్ అయ్యింది. 19 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి మద్యం మహమ్మారే కారణమని తెలుసుకుని ప్రజలంతా నివ్వెరపోతున్నారు. మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష్య నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 16 నెలలుగా ప్రభుత్వ పెద్దల స్వార్థానికి ఫలితం ఈ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తప్పతాగి బైక్పై ప్రయాణంకర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదం ఘటనలో అసలు నిజాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మహమ్మారే ఈ ప్రమాదానికి అసలు కారణమని నిగ్గు తేలింది. కర్నూలు వాసి శివశంకర్, తుగ్గలి మండలం రాంపల్లి వాసి చాకలి ఎర్రిస్వామి అలియాస్ నాని ఇద్దరూ శుక్రవారం రాత్రి నేషనల్ హైవే పక్కనే ఉన్న లక్ష్మీపురంలో మద్యం సేవించారు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించిన తర్వాత ఎర్రిస్వామిని రాంపల్లిలో వదిలేందుకు రాత్రి 2 గంటలకు పూర్తి మద్యం మత్తులో శివశంకర్ పల్సర్ బైక్లో బయలు దేరాడు. వారిద్దరూ లక్ష్మీపురం నుంచి బయలు దేరారని జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. పెట్రోల్ కోసం కియా షోరూం ఎదురుగా ఉన్న శివప్రసాద్ ఫ్యూయల్ స్టేషన్కు అర్ధరాత్రి 2.22 గంటలకు 6వ పంప్ వద్దకు వెళ్లి ఆపాడు. పెట్రోలు కోసం సిబ్బందిపై కేకలు వేశారు. ఒకటో పంపు వద్దకు రావాలని సిబ్బంది చెప్పడంతో బైక్ను ఒంటిచేత్తో రౌండ్లు తిప్పి వేగంగా నడిపాడు. అక్కడే కిందపడిపోవాల్సింది తృటిలో తప్పించుకున్నాడు. రూ.300 పెట్రోలు పోయించుకుని 2.26 గంటలకు వెళ్లిపోయాడు. పెట్రోలు బంకు నుంచి సరిగ్గా 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత బైక్ అదుపు తప్పడంతో కుడి వైపు డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎగిరిపడిన శివశంకర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎర్రిస్వామి డివైడర్ మధ్యలోని ఖాళీ స్థలంలో ఉన్న గడ్డిలో పడ్డాడు. దీంతో బతికిపోయాడు. వీరు లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపులో మద్యం తీసుకుని, అర్ధరాత్రి వరకూ తాగి ఆ తర్వాత బైక్లో బయలుదేరినట్లు తెలుస్తోంది.రోడ్డుపై పడిపోయిన బైక్ను ఢీకొట్టడంతోనే..శివశంకర్ బైక్ పై నుంచి కిందపడిపోయిన తర్వాత గుండెలపై ఒత్తి బతికించేందుకు ఎర్రిస్వామి యత్నించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శవాన్ని రోడ్డుకు ఎడమ వైపునకు లాగాడు. ఆ తర్వాత బైక్ను లాగేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సు వేగంగా వస్తూ రోడ్డుపై మనిషి ఉండటం చూసి డ్రైవర్ హారన్ కొట్టడంతో ఎర్రిస్వామి పక్కకు పరుగెత్తాడు. మనిషి పక్కకు వెళ్లిపోయాడని అదే వేగంతో బస్సు వచ్చింది. అయితే మనిషి ముందు బైక్ ఉందనే సంగతి డ్రైవర్ లక్ష్మయ్య గుర్తించలేకపోయాడు. దీంతో బైక్ను ఢీకొట్టాడు. దీంతో బస్సు కింద బైక్ ఇరుక్కుపోయి, రోడ్డుపై రాపిడికి గురై మంటలు చెలరేగడం, బైక్ పెట్రోల్ ట్యాంకు పగలడంతో భారీగా మంటలు వ్యాపించడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ విషయాలను ఎర్రిస్వామి పోలీసుల విచారణలో స్వయంగా వెల్లడించాడు.బైక్పై రెండో వ్యక్తి ఉన్నట్లు ఎలా తెలిసిందంటే..ప్రమాద స్థలి సమీపంలో రోడ్డుకు ఓ వైపు శివశంకర్ శవం, బస్సు కింద బైక్ ఉంది. డ్రైవర్ కూడా బైక్ను ఢీకొట్టానని చెప్పాడు. దీంతో హోం మంత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ వరకూ అందరూ ప్రమాదానికి ఇదే కారణమని నమ్మారు. అయితే పోలీసుల పరిశోదనలో అర్ధరాత్రి శివశంకర్ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలని యత్నించారు. అతడి ఆధార్ కార్డు ఆధారంగా తల్లి, సోదరుడిని గుర్తించి శివశంకర్ ఫోన్ నంబరు తెలుసుకుని కాల్ డేటా తీశారు. ఫోన్ చేస్తే శివశంకర్ ఫోన్ కూడా తుగ్గలి మండలం రాంపల్లిలో ఉంది. అది ఎర్రిస్వామి వద్ద ఉండటం గుర్తించారు. దీంతో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఘటన జరిగిన తీరును ఎర్రిస్వామి స్పష్టంగా వివరించాడు. బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లడం, కళ్లముందే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి దూకడం, ఆపై బస్సు తగలబడటం ఎర్రిస్వామి చూశాడు. ఘటన తర్వాత సీఐ అక్కడికి రావడం, ఫైర్ ఇంజన్ను రప్పించే ప్రయత్నాలు చేస్తుండటం. బస్సులో జనాలు అగ్నికి ఆహుతి అవ్వడం.. ఇదంతా తమ బైక్ వల్లే జరిగిందని, దీంతో తనకు ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని భయపడి అక్కడి నుండి పారిపోయాడు.అబద్ధాలతో పోలీసులను మభ్యపెట్టిన డ్రైవర్ లక్ష్మయ్య ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే లక్ష్మయ్య వాస్తవం చెబితే తన తప్పుతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తుందని పోలీసులకు అబద్ధాలు చెప్పాడు. తొలుత బైక్ వెళుతుంటే బస్సు ఢీకొట్టిందని, బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో రాపిడికి గురై మంటలు రేగి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆపై బైక్ తనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగిందని చెప్పాడు. చివరకు ఎర్రిస్వామిని విచారించిన తర్వాత తిరిగి డ్రైవర్ను విచారిస్తే అసలు నిజం ఒప్పుకున్నాడు. బైక్ రోడ్డుపై పడి ఉందని, తాను గుర్తించలేక ఢీకొట్టానని చెప్పాడు. లక్ష్మయ్య వాస్తవం ముందే చెప్పి ఉంటే ప్రమాదానికి అసలు కారణం మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన శివశంకరే కారణమని శుక్రవారమే తేలేది.ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రమాదంపై ఉలిందకొండ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబునాయుడుతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐల బృందం ఘటన స్థలాన్ని పరిశీలించింది. ఎర్రిస్వామి చెప్పింది నిజమేనా.. ఎక్కడ కిందపడ్డారు.. బస్సు ఎన్నిమీటర్లు బైక్తో దూసుకొచ్చింది.. అనే అంశాలను పరిశీలించి రికార్డు చేశారు. శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ లక్ష్మీపురంలో మద్యం సేవించి మద్యం మత్తులోనే నేషనల్హైవే పైకి వచ్చినట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు తేల్చారు. అలాగే బస్సు నిర్మాణం, ఫిట్నెస్ను ఎంవీఐలు నాగరాజు నాయక్, సుధాకర్రెడ్డిల బృందం పరిశీలించింది. గతుకుల హైవే కూడా పెను ప్రమాదాలకు కారణమే!ఎన్హెన్–44లో గుత్తి నుంచి డోన్, కర్నూలు వరకు రోడ్డు పూర్తి అధ్వానంగా ఉంది. భారీగా గుంతలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్యాచ్ వర్క్లు వేశారు. కొన్ని చోట్ల అలాగే ఉన్నాయి. కర్నూలు–డోన్ మధ్య భారీగా గుంతలు ఉన్నాయి. వర్షం వస్తే వీటిలో నీరు నిలబడి రోడ్డు కూడా కన్పించని పరిస్థితి. రాత్రి వేళల్లో బెంగళూరు–హైదరాబాద్కు బస్సులు, కార్లు, లారీలు వేల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. గుంతల రోడ్డులో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదానికి గురవుతున్నాయి. కొంతమంది వాహనదారులు రోడ్డు బాగోలేదని టోల్ ఫీజు చెల్లించమని గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎన్హెచ్ అధికారులు రోడ్డు బాగుపై దృష్టి సారించాలి. ఆదాయం కోసం సుప్రీంకోర్టునే సవాల్ చేసిన మద్యం వ్యాపారులునేషనల్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని 2016లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా మద్యం వ్యాపారులు తమ వ్యాపారానికి ఇబ్బంది వస్తుందని ఆందోళన చెందారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అండతో మద్యం వ్యాపారులు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేశారు. దీంతో తిరిగి సుప్రీం రివ్యూ చేసి 2017లో మరో తీర్పు ఇచ్చింది. నేషనల్ హైవే.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జిల్లా, మండల కేంద్రాల మీదుగా వెళుతుంటే అక్కడ మాత్రం మద్యం షాపులు పెట్టుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో నేషనల్ హైవేలు ఉంటే అక్కడ 220 మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టకూడదని చెప్పింది. దీంతో నేషనల్ హైవేలపై విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటయ్యాయి. నేషనల్ హైవేలకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో.. రోడ్డుపై మద్యం దుకాణం బోర్డు పెట్టి, సమీపంలో దుకాణం ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు మందు సేవించి హైవే ఎక్కుతున్నారు.నేషనల్ హైవే పక్కనే భారీగా మద్యం దుకాణాలు⇒ ఈ ఫొటోలోని ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్ హైదరాబాద్ – బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉంది. హైవేపై అటు, ఇటూ వెళ్లే వారికి కన్పించేలా బిల్డింగ్పై భాగంలో ఈగల్ బార్ అని రాశారు. నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులు ఇక్కడ ఆగి మద్యం సేవించి మద్యం మత్తులో స్టీరింగ్ పట్టుకుని హైవే ఎక్కుతున్నారు. ⇒ ఈ ఒక్క బెల్ట్ షాపు, బార్ మాత్రమే కాదు.. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని పుల్లూరు టోల్గేట్ నుంచి అనంతపురం జిల్లా సరిహద్దు పోతుదొడ్డి వరకు ఎన్హెచ్–44 పక్కన 10 మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. పుల్లూరు నుంచి పోతుదొడ్డి వరకూ 88 కిలోమీటర్లు ఉంది. ఈ 88 కిలోమీటర్ల మధ్యలోని పల్లెల్లో బెల్ట్షాపులు ఎన్ని ఉన్నాయో లెక్కేలేదు! పైగా పెద్ద పంచాయతీల్లో రెండు నుంచి నాలుగు వరకు బెల్ట్షాపులు కూడా ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పల్లెల్లో బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా వెలిసినా ఆబ్కారీ అధికారులు నిస్సహాయంగా ఉన్నారు. పైగా టీడీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు ఆదాయ మార్గాలకు అలవాటు పడి తూగుతున్నారు. దీంతో నేషనల్ హైవే పొడవునా విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే ఎన్హెచ్–44పై ఇలాంటి మద్యం దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉంటే ఏ స్థాయిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఇట్టే తెలుస్తోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్హెచ్–44 పక్కన ఉన్న మద్యం దుకాణాలునిరీక్షణ వైన్స్, పంచలింగాల త్రీపెగ్స్, శ్రీ చక్ర ఆస్పత్రి సమీపంలో, కర్నూలుజీవీఆర్ వైన్స్, చెన్నమ్మ సర్కిల్పీఆర్ వైన్స్, షరీన్ నగర్ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్సుంకులమ్మ వైన్స్, కృష్ణానగర్మధులోక్ వైన్స్, చిన్న టేకూరురేణుకా యల్లమ్మ వైన్స్, పెద్దటేకూరుమహేశ్ వైన్స్, ఉలిందకొండబాలాజీ వైన్స్, కంబాలపాడు సర్కిల్, డోన్మంజీర వైన్స్, కొత్తపల్లిఈ ఘటనతో ప్రభుత్వం మేల్కొంటుందా? బస్సు ప్రమాదానికి కారణమైంది లక్ష్మీపురంలోని ఓ బెల్ట్షాపు. ఎక్కడ బెల్ట్షాపులు ఉన్నా ఉపేక్షించమని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలోని ప్రతీ పల్లెలో విచ్చలవిడిగా బెల్ట్షాపులు వెలిశాయని తెలియదా? ఆంధ్రప్రదేశ్లో బెల్ట్షాపు లేని పల్లె లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుపై వెళ్లే వాహనదారుడు మందు కావాలంటే 10 నిమిషాల్లో మద్యం షాపు, బెల్ట్షాపు కన్పించే పరిస్థితి. దీంతోనే శివశంకర్ మద్యం తాగి బైక్ నడిపాడు.. అదుపు తప్పి చనిపోయాడు. తనతో పాటు మరో 19 మందిని బలితీసుకున్నాడు. నిజానికి బైకర్ సహా 20 మంది చావుకు అసలైన కారణం మద్యం.. బెల్ట్షాపు. ఈ రెండూ లేకపోతే బస్సు ప్రమాదం జరిగేది కాదు. 20 మంది చనిపోయేవారు కాదు. చనిపోయిన ఏడు రాష్ట్రాల్లోని వారి కుటుంబాలు ఈ రోజు హాయిగా నవ్వుతూ ఉండేవి. కేవలం ప్రభుత్వం, టీడీపీ నేతలు ఆదాయం కోసం విచ్చలవిడిగా నేషనల్ హైవేలపై మద్యం దుకాణాలు, పల్లెల్లో బెల్ట్షాపులు ఏర్పాటు చేయడంతో మందు బాబులకు సులువుగా మద్యం దొరుకుతోంది. ఫలితంగా తప్పతాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ వల్లనే అని స్పష్టమైంది. నేతల ఆదాయం కంటే, ప్రజల ప్రాణాలు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావించి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. -
బతుకులు బుగ్గి.. ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కితే పరలోకమే?
-
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా?ఛార్జింగ్ చేస్తూండగా సెల్ఫోన్లో మంటలు చెలరేగడం.. కొన్ని సందర్భాల్లో పేలిపోవడం మనం చూస్తూంటాం. అయితే కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారు జరిగిన బస్సు దగ్ధం ఘటనకు కూడా సెల్ఫోన్లు పేలిపోవడం కారణమని తాజాగా అనుమానిస్తున్నారు. మరి.. కేవలం రవాణా చేస్తున్నంత మాత్రన సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా? అంటే అవును అంటున్నారు నిపుణులు. చాలా అరుదుగా జరిగేదైనప్పటికీ ప్యాకెట్లలో ఉంచిన సెల్ఫోన్లు పేలిపోయేందుకు చాలా కారణాలే ఉంటాయని విశ్లేషిస్తున్నారు.వీరు చెబుతున్న దాని ప్రకారం.. బ్యాటరీలు డ్యామేజ్ అయినా.. కొంత ఎత్తు నుంచి కిందపడ్డా.. బ్యాటరీలకు చిల్లులు పడ్డా ఫోన్లో షార్క్ సర్క్యూట్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇవి పేలిపోగలవు. విపరీతమైన వేడి కూడా ఫోన్లు పేలిపోయేందుకు కారణం కాగలవు. మండే ఎండలో తలుపులన్నీ బిగించి సెల్ఫోన్ను కారులో ఉంచినా. విడికి వాటిల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కరిగిపోతాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించవచ్చు. కొన్ని కొత్తఫోన్లలో బ్యాటరీల్లోనే లోపాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే టప్పుడు అనేక రకాల భద్రత పరీక్షలు నిర్వహిస్తూంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో లోపాలున్న బ్యాటరీలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తూంటాయి.పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది. -
దీపావళికి వచ్చి బయలుదేరి సంక్రాంతికి వస్తామన్నారు.. చివరికి
-
బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత రియాక్షన్
-
Travels Management: రాత్రి 3:30కి ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉంది
-
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు..! బయటపడ్డ CCTV ఫుటేజ్
-
కర్నూలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలు ఇవిగో..
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది. బస్సు ప్రయాణికుల జాబితా ఇదే.. అశ్విన్రెడ్డి(36),జి.ధాత్రి(27),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్రాజు(22)తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41)రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్రెడ్డి(24).ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు.. -
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుందిమృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాంఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్ను కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాలుగు రోజులు మృత్యువుతో పోరాడిన దీక్షిత..
పెందుర్తి: రాజమండ్రిలో బుధవారం జరిగిన కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈల్లా దీక్షిత(22) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సుజాతనగర్కు చెందిన దీక్షిత, మర్రిపాలెనికి చెందిన ఆమె బంధువు కల్యాణి ఇంటర్వ్యూ నిమి త్తం విశాఖ నుంచి హైదరాబాద్కు కావేరి ట్రావెల్స్ బస్లో ఈ నెల 22న బయలుదేరారు. రాజమండ్రి వద్దకు వెళ్లేసరికి బస్ బోల్తా పడడంతో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో గాయపడిన దీక్షితను నగరంలోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి చికిత్స నిమి త్తం తీసుకువచ్చారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దీక్షిత కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మరోవైపు ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా కావేరి ట్రావెల్స్ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోవడం పట్ల బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
రాళ్ల గుట్టను ఢీకొన్ని కావేరి ట్రావెల్స్ బస్సు..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రాళ్ల గుట్టను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బాధితులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. -
కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
3 కిలోల బంగారం బ్యాగు మాయం
సాక్షి, హైదరాబాద్: బస్సులో ప్రయాణిస్తుండగా మూడు కేజీల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఇద్దరు వ్యాపారులు బుధవారం ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ రఫిక్ మహ్మద్, ఎస్.కె.మహ్మద్పాషాలు అక్షయ తృతీయ సందర్భంగా శనివారం రాత్రి కావేరి ట్రావెల్స్ బస్సులో మూడు కేజీల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకుని నగరానికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఎల్బీనగర్ రింగురోడ్డు సమీపంలోకి రాగానే వీరి వెనుక సీటులో కూర్చున్న కొంతమంది ఒక్కసారిగా దిగి వెళ్లిపోయారు. బస్సు దిల్సుఖ్నగర్ సమీపానికి చేరేసరికి ఈ విషయం గమనించిన వ్యాపారులు బస్సు ఆపి పరిశీలించారు. బ్యాగు దొరక్కపోవడంతో అదే రోజు నెల్లూరులో కావేరి ట్రావెల్స్ వద్దకు వెళ్లి వారి వెనుక సీటులో కూర్చున్న వారి వివరాలు సేకరించగా బుక్ చేసిన వారి ఫోన్ నెంబర్లు స్విచ్చాఫ్ రావడంతో వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం నగరానికి వచ్చిన వారు ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్కు ఫిర్యాదు చేశారు.


